Royal Challengers Bangalore
-
ఈడెన్లో మెరుపులతో మొదలు
డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ కొత్త సీజన్ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్లో ఆడిన మ్యాచ్లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్తో రజత్ పాటీదార్ కెపె్టన్గా శుభారంభం చేశాడు. కోల్కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్లు), అంగ్కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రహానే, నరైన్ రెండో వికెట్కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగిపోయాడు. సుయాశ్ ఓవర్లో సిక్స్తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలుకోల్కాత నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్స్టోన్ 2–0–14–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్కు ముందు ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
నేటి నుంచి పరుగుల పండుగ
2008 మండు వేసవిలో ఐపీఎల్ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్ తన మెరుపు బ్యాటింగ్తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్లో ఉండే బ్యాటింగ్ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్. ఐపీఎల్లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్ 18వ పడిలోకి అడుగు పెడుతోంది. కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్ మ్యాచ్లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రేమించే లీగ్ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 300 దాటతారా! ఐపీఎల్లో ఇప్పటి వరకు టీమ్ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్రైజర్స్ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్లో 300 స్కోరు కూడా దాటవచ్చు.2008 నుంచి 2025 వరకు... ఐపీఎల్ తొలి సీజన్లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్తో ఉన్నా... 2016లో పంజాబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్లోనే కలగనుంది.ఆ ఒక్కటీ అడక్కు! ఐపీఎల్ రాగానే ఎమ్మెస్ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్లో బ్యాటర్గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.2025 లీగ్ వివరాలు» మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్లను ముల్లన్పూర్తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్లను జైపూర్తో పాటు గువాహటిలో ఆడుతుంది. » ఐపీఎల్ ప్రదర్శనను బట్టే 10 టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్ల చొప్పున (8 మ్యాచ్లు), మరో గ్రూప్లో ఒక జట్టుతో రెండు మ్యాచ్లు (2), మిగతా నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్లలో ఆడతాయి. » కొత్త సీజన్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్కు సంబంధించిన వైడ్లు, ఆఫ్ సైడ్ వైడ్లను తేల్చేందుకు కూడా డీఆర్ఎస్ సమయంలో ‘హాక్ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రాత్రి మ్యాచ్లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కెపె్టన్ బంతి మార్చమని కోరవచ్చు. » అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అజింక్య రహానే (కోల్కతా నైట్రైడర్స్), రజత్ పాటీదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆయా టీమ్లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్... గాయం నుంచి సామ్సన్ కోలుకోకపోవడంతో రాజస్తాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్లకు రియాన్ పరాగ్కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్గా అందరి దృష్టీ ఉంది.ఐపీఎల్ విజేతలు (2008 నుంచి 2024 వరకు)2008 రాజస్తాన్ రాయల్స్ 2009 డెక్కన్ చార్జర్స్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ 2012 కోల్కతా నైట్రైడర్స్ 2013 ముంబై ఇండియన్స్ 2014 కోల్కతా నైట్రైడర్స్ 2015 ముంబై ఇండియన్స్ 2016 సన్రైజర్స్ హైదరాబాద్ 2017 ముంబై ఇండియన్స్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ 2019 ముంబై ఇండియన్స్ 2020 ముంబై ఇండియన్స్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ 2022 గుజరాత్ టైటాన్స్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ 2024 కోల్కతా నైట్రైడర్స్ -
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... తన జెర్సీ నంబర్ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి! – సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్గా నిలిచిన ఆర్సీబీ... తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18వ సీజన్లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్ పాటీదార్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2021 నుంచి ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్ పాటీదార్ (రూ. 11 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. మ్యాక్స్వెల్, సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్సీబీ... స్వప్నిల్ సింగ్ను రూ. 50 లక్షలతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్ రాహుల్, చహల్, రిషబ్ పంత్ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు నెగ్గి ప్లేఆఫ్స్కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అతడే బలం... బలహీనత ఆర్సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్ రాణించిన మ్యాచ్ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్ ట్రోఫీ తాజా ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్కతా నైట్రైడర్స్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్... ఫార్మాట్తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్... హార్డ్ హిట్టర్ లివింగ్స్టోన్పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ, స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాపై కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ హెడ్కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్ కార్తీక్ మెంటార్గా వ్యవహరించనున్నాడు.బౌలర్లపైనే భారం... బ్యాటింగ్ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్ సిరాజ్ను వదిలేసుకున్న ఆర్సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్స్టర్ జోష్ హాజల్వుడ్, ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్ ఇన్గిడి పేస్ భారాన్ని మోయనున్నారు. స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, సుయశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్ బృందం ప్రదర్శనపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథెల్, హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, ఇన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, యశ్ దయాల్. అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్కు చేరిన చరిత్ర ఉన్న ఆర్సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంది. -
బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్ప్రీత్ సేన ఫైనల్కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్రేట్తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1. -
వోల్ కమాల్... బెంగళూరు ఢమాల్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రకెక్కిన పరుగుల పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు పోరాడి ఓడింది. డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్కు దూరమైంది. గెలిస్తే రేసులో నిలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 12 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తాజా ఫలితంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఢిల్లీ ఇదివరకే ప్లేఆఫ్స్ చేరింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. డబ్ల్యూపీఎల్లో ఇదే అత్యధిక స్కోరు కాగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వోల్ (56 బంతుల్లో 99 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. కిరణ్ నవ్గిరే (16 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ ఆట ఆడేసింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 2 వికెట్లు తీసింది. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (33 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్లు), స్నేహ్ రాణా (6 బంతుల్లో 26; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులతో యూపీ శిబిరాన్ని వణికించారు. సోఫీ ఎకిల్స్టోన్, దీప్తిశర్మ చెరో 3 వికెట్లు తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా యూపీ ప్లేయర్ తమ రెగ్యులర్ టీమ్ కిట్కు బదులుగా గులాబీ రంగు జెర్సీలను ధరించారు. జార్జియా ‘జిగేల్’ సొంత మైదానంలో ఆఖరి పోరులో బ్యాటింగ్కు దిగిన యూపీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, జార్జియా వోల్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. బంతిని అదేపనిగా బౌండరీని దాటించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పవర్ప్లేలో 67 పరుగులు రాబట్టింది. గ్రేస్ హారిస్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కావడంతో తొలి వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే కిరణ్ నవ్గిరే రావడంతో మరో మెరుపు భాగస్వామ్యం నమోదైంది. 9.3 ఓవర్లలోనే వారియర్స్ స్కోరు వందకు చేరుకుంది. 13వ ఓవర్లో కిరణ్ అవుట్ కావడంతో రెండో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా... మరోవైపు జార్జియా వోల్ కడదాకా అజేయంగా క్రీజులో నిలిచింది. పరుగు తేడాతో సెంచరీ భాగ్యాన్ని దక్కించుకోలేక పోయింది. ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో దీప్తి రనౌటైంది. రిచా ధనాధన్ షో వృథా మూడో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (4), మరుసటి ఓవర్లో మేఘన (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), పవర్ ప్లే తర్వాత ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 28; 6 ఫోర్లు), రాఘ్వి బిస్త్ (14), కనిక (8) ని్రష్కమించడంతో 107/5 స్కోరు వద్ద బెంగళూరు ఆశలు ఆడుగంటాయి. ఈ దశలో హిట్టర్ రిచా ఘోష్ అసాధారణ పోరాటం చేసింది. భారీ సిక్స్లు, చూడచక్కని బౌండరీలతో విజయంపై ఆశలు రేపింది. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకుంది. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో రిచా అవుటైంది. చార్లీ డీన్ (9), జార్జియా వేర్హామ్ (17) నిరాశపరిచారు. 4, 6, 6, 4, 6, అవుట్ 19వ ఓవర్లో స్నేహ్ రాణా మెరుపులు బెంగళూరులో ఆశలు రేపాయి. దీప్తి వేసిన ఈ ఓవర్లో కిమ్గార్త్ సింగిల్ తీసి స్నేహ్కు స్ట్రయిక్ ఇచ్చింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆమె 4, 6, 6, 4(నోబాల్), 6లతో చకచకా 26 పరుగులు చేసింది. 7 బంతుల్లో 15 పరుగుల సమీకరణం సులువనిపించింది. కానీ ఆఖరి బంతికి స్నేహ్ రాణా భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ వద్ద పూనమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యూపీ ఊపరి పీల్చుకుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ రనౌట్ 39; జార్జియా వోల్ నాటౌట్ 99; కిరణ్ (సి) పెర్రి (బి) వేర్హామ్ 46; చినెల్లీ హెన్రీ (సి) స్మృతి (బి) వేర్హామ్ 19; సోఫీ (బి) చార్లీడీన్ 13; దీప్తిశర్మ రనౌట్ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–77, 2–148, 3–191, 4–223, 5–225. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–42–0, రేణుక సింగ్ 3–0–42–0, చార్లీ డీన్ 4–0–47–1, ఎలీస్ పెర్రి 4–0–35–0, జార్జియా వేర్హామ్ 4–0–43–2, స్నేహ్ రాణా 1–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) వోల్ (బి) సోఫీ 27; స్మృతి మంధాన (సి) వోల్ (బి) హెన్రీ 4; ఎలిస్ పెర్రి (బి) అంజలి 28; రాఘ్వి బిస్త్ (సి) ఉమాఛెత్రి (బి) హెన్రీ 14; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) దీప్తిశర్మ 69; కనిక (బి) దీప్తి శర్మ 8; జార్జియా వేర్హమ్ (సి) సబ్–ఆరుశ్రీ (బి) సోఫీ 17; చార్లీ డీన్ (సి) కిరణ్ (బి) సోఫీ 9; కిమ్గార్త్ నాటౌట్ 3; స్నేహ్ రాణా (సి) పూనమ్ (బి) దీప్తిశర్మ 26; రేణుక రనౌట్ 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1–29, 2–43, 3–76, 4–80, 5–107, 6–171, 7–182, 8–183, 9–211, 10–213. బౌలింగ్: చినెల్లీ హెన్రీ 4–0–39–2, గ్రేస్ హారిస్ 1–0–22–0, సోఫి ఎకిల్స్టోన్ 4–0–25–3, క్రాంతి గౌడ్ 3–0–35–0, అంజలి శర్వాణి 3–0–40–1, దీప్తిశర్మ 4–0–50–3, జార్జియా వోల్ 0.3–0–2–0. -
‘ప్లే ఆఫ్స్’కు ఢిల్లీ క్యాపిటల్స్
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంత ప్రేక్షకుల్ని మళ్లీ నిరాశపర్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు గడ్డపై వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఓడింది. తద్వారా ఈ వేదికపై ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ పరాజయం చవిచూసిన స్మృతి మంధాన సేన ప్లేఆఫ్స్ రేసుకు దాదాపు దూరమైంది. మరో వైపు లీగ్లో ఐదో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. శనివారం జరిగిన పోరులో మెగ్లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ 9 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి (8) పేలవంగా ఆడి నిష్క్ర మించగా, ఎలైస్ పెరీ (47 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడింది. రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 33; 2 సిక్స్లు)తో కలిసి మూడో వికెట్కు 66 పరుగులు జోడించింది. ప్రత్యర్థి బౌలర్లలో శిఖా పాండే, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ మెగ్లానింగ్ (2) సింగిల్ డిజిట్కే అవుటవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (43 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా బెంగళూరు బౌలింగ్ను దంచేసింది. వన్డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ (38 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి వీరవిహారం చేసిన షఫాలీ అబేధ్యమైన రెండో వికెట్కు 146 పరుగులు జోడించింది. జెస్, షఫాలీ ఇద్దరు కూడా 30 బంతుల్లోనే ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి)లానింగ్ (బి) శిఖా 8; డానీవ్యాట్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ 21; పెర్రీ నాటౌట్ 60; రాఘ్వీ బిస్త్ (స్టంప్డ్) బ్రైస్ (బి) శ్రీచరణి 33; రిచాఘోష్ (సి) లానింగ్ (బి) శ్రీచరణి 5; కనిక (సి) షఫాలీ (బి) శిఖా 2; జార్జియా నాటౌట్ 12; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–9, 2–53, 3–119, 4–125, 5–128. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–18–1, శిఖా పాండే 4–0–24–2, జెస్ జొనాసెన్ 3–0–33–0, అనాబెల్ 4–0–27–0, శ్రీచరణి 4–0–28–2, మిన్నుమణి 1–0–14–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెర్రీ (బి) రేణుక 2; షఫాలీ నాటౌట్ 80; జెస్ జొనాసెన్ నాటౌట్ 61; ఎక్స్ట్రాలు 8; మొత్తం (15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 151. వికెట్ల పతనం: 1–5. బౌలింగ్: రేణుక 4–1–28–1, కిమ్గార్త్ 3–0–25–0, ఎలిస్ పెర్రీ 2–0–24–0, జార్జియా 3–0–21–0, స్నేహ్ రాణా 1.3–0–22–0, ఏక్తాబిస్త్ 1–0–15–0, రాఘ్వీ బిస్త్ 1–0–11–0. -
RCB Vs GG: మళ్లీ ఓడిన బెంగళూరు
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్లు ఆడి విజయాలు అందుకున్న ఆర్సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది. మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా...రాఘ్వీ బిస్త్ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), జార్జియా వేర్హామ్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్ లిచ్ఫీల్డ్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్ (4) విఫలం కాగా... ఎలైస్ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్నర్, లిచ్ఫీల్డ్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్ ఓవర్లో గార్డ్నర్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) హర్లీన్ (బి) తనూజ 10; డానీ వ్యాట్ (ఎల్బీ) (బి) డాటిన్ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్నర్ 0; రాఘ్వీ (రనౌట్) 22; కనిక (సి అండ్ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్హామ్ (నాటౌట్) 20; గార్త్ (సి) మూనీ (బి) డాటిన్ 14; స్నేహ్ రాణా (నాటౌట్) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్: డాటిన్ 4–0–31–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–22–1, కాశ్వీ గౌతమ్ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) వేర్హామ్ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్) రిచా (బి) రేణుక 11; హర్లీన్ (సి) పెరీ (బి) వేర్హామ్ 5; గార్డ్నర్ (సి అండ్ బి) వేర్హామ్ 58; లిచ్ఫీల్డ్ (నాటౌట్) 30; డాటిన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, కిమ్ గార్త్ 2–3.–0–19–0, స్నేహ్ రాణా 4–0–23–0, ప్రేమ రావత్ 1–0–19–0, వేర్హామ్ 3–0–26–2, ఎలైస్ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0. డబ్ల్యూపీఎల్లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
‘సూపర్’ సోఫీ...
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయానికి ఓవర్ దూరంలో ఉంది. 6 బంతుల్లో 18 పరుగులు యూపీ వారియర్స్కు క్లిష్టమైన సమీకరణం. కానీ సోఫీ ఎకిల్స్టోన్... ఓటమి అంచున ఉన్న యూపీ వారియర్స్కు ఊపిరి పోసింది. 0, 6, 6, 4, 1లతో 17 పరుగులు బాదింది. ఆఖరి బంతి క్రాంతి గౌడ్ ఆడగా... సోఫీ రనౌటైంది. అయితే 17 పరుగుల రాకతో స్కోరు సమమైంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో తొలి సూపర్ ఓవర్కు పిచ్ సిద్ధమైంది.ముందుగా ఆర్సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్లో యూపీ 8 పరుగులు చేసింది. 6 బంతుల్లో 9 పరుగులు ఆర్సీబీ హిట్టర్లు రిచా ఘోష్, స్మృతి మంధానలకు సులువు! కానీ సోఫీ స్పిన్ ఉచ్చుతో ఆర్సీబీ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేసింది. బౌండరీ కాదు కదా... కనీసం ఒక బంతికి రెండు పరుగులైనా ఇవ్వకుండా 0, 1, 0, 1, 1, 1లతో 4 పరుగులే ఇచ్చింది. అంతే సోఫీ ‘సూపర్’స్టార్ అయ్యింది. యూపీ విజేతగా నిలిచింది.సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎలీస్ పెరీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. డానీ వ్యాట్ హాగ్ (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించింది. హెన్రీ, దీప్తి శర్మ, తాలియా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం యూపీ వారియర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకిల్స్టోన్ (19 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు), దీప్తి శర్మ (13 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), శ్వేత (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) దంచేశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (బి) దీప్తిశర్మ 6; డానీ వ్యాట్ (సి) శ్వేత (బి) తాలియా 57; పెరీ (నాటౌట్) 90; రిచా (సి అండ్ బి) హెన్రీ 8; కనిక (రనౌట్) 5; వేర్హమ్ (రనౌట్) 7; కిమ్ గార్త్ (రనౌట్) 2; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లలో) 180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. బౌలింగ్: హెన్రీ 4–0–34–1, గ్రేస్ హారిస్ 1–0–11–0, దీప్తి శర్మ 4–0–42–1, సోఫీ 4–0–29–0, సైమా 1–0–8–0, క్రాంతి 3–0–26–0, తాలియా 3–0–30–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్గిరే (బి) రేణుక 24; వృందా (సి) స్మృతి (బి) రేణుక 14; దీప్తి (సి) రిచా (బి) స్నేహ్ రాణా 25; తాలియా (స్టంప్డ్) రిచా (బి) స్నేహ్ రాణా 0; శ్వేత (సి) రిచా (బి) పెరీ 31; గ్రేస్ (సి) స్నేహ్ రాణా (బి) కిమ్ 8; ఉమా (సి) వేర్హమ్ (బి) స్నేహ్ రాణా 14; హెన్రీ (బి) కిమ్ 8; సోఫీ (రనౌట్) 33; సైమా (రనౌట్) 14; క్రాంతి (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–30, 2–48, 3–50, 4–72, 5–93, 6–123, 7–123, 8–134, 9–161, 10–180. బౌలింగ్: రేణుక 4–0–36–2, కిమ్ గార్త్ 4–0–40–2, స్నేహ్ రాణా 3–0–27–3, ఎక్తాబిస్త్ 3–0–26–0, పెరీ 2–0–10–1, వేర్హమ్ 4–0–40–0. డబ్ల్యూపీఎల్లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో... -
వారియర్స్ X చాలెంజర్స్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్లో ఘనవిజయంతో సీజన్లో బోణీ కొట్టిన యూపీ వారియర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సోమవారం చిన్నస్వామి స్టేడియంలో తలపడుతుంది. సొంత అభిమానుల మద్దతు మధ్య జరుగనున్న పోరులో సత్తా చాటాలని స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ భావిస్తుంటే... గెలుపు జోరును కొనసాగించాలని యూపీ వారియర్స్ చూస్తోంది. తాజా సీజన్లో ఆర్సీబీ మూడు మ్యాచ్లాడి 2 విజయాలు, 1 పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ వారియర్స్ మూడు మ్యాచ్ల్లో ఒక విజయం, 2 పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. స్మృతి, డానీ వ్యాట్, ఎలీస్ పెర్రీ, రాఘవి బిస్త్, రిచా, కనిక, జార్జియాతో కూడిన ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్మృతి సూపర్ ఫామ్ ఆ జట్టుకు కలిసి రానుంది. స్మృతి ఆడిన గత 10 మ్యాచ్ల్లో (అంతర్జాతీయ, డబ్ల్యూపీఎల్ కలిపి) 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్లో రేణుక, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్ జోషిత కీలకం కానున్నారు. మరోవైపు దీప్తి శర్మ సారథ్యంలోని యూపీ వారియర్స్ జట్టులో నిలకడ లోపించింది. కెప్టెన్ దీప్తి శర్మతో పాటు కిరణ్ నవగిరె, వృందా దినేశ్, తాలియా మెక్గ్రాత్, శ్వేత సెహ్రావత్, గ్రేస్ హ్యారిస్, ఉమ ఛెత్రి కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది.గత మ్యాచ్లో భీకర హిట్టింగ్తో విజృంభించిన షినెల్ హెన్రీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో యువ మీడియం పేసర్ క్రాంతి గౌడ్తో పాటు స్పిన్నర్ గ్రేస్ హ్యారిస్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న బెంగళూరుపై పైచేయి సాధించాలంటే యూపీ వారియర్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిన అవసరముంది. -
అమన్జ్యోత్ మెరుపులు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్జ్యోత్ కౌర్ ఆల్రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. మొదట ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్జ్యోత్ 3–0–22–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0. -
భళా బెంగళూరు...
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–107, 2–133. బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0. -
IPL 2025: కోల్కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరిగే ఫైనల్తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు (7 లీగ్ మ్యాచ్లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో; మార్చి 30న సన్రైజర్స్ హైదరాబాద్తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్కతాలో జరగనున్నాయి. » లీగ్లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లోని ఒక జట్టు తమ గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించినా... మరో ఎండ్లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్లో మరో సిక్స్తో రిచా మ్యాచ్ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
ధనాధన్ సమరం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడనుంది.వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్కు వేళయింది. తొలి రెండు సీజన్లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్ను నిర్ణయిస్తారు. » బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. » పేలవ ఫామ్తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నారు. » గత రెండు పర్యాయాలు రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్తో క్యాపిటల్స్ బలంగా ఉంది. » తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు. » గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్లు నిర్వహించనున్నారు. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ను ఫైనల్కు చేర్చాడు. పాటిదార్కు రంజీల్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్రేట్తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరింది. -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్గా నిలిచిన దీపక్ చహర్కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
Eliminator: ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
-
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1. -
RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’
ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో... నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్ మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్ట్నర్ బౌలింగ్లో సిక్స్లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పటిదార్తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs CSK: చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్రేట్ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి. -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), మహిపాల్ సిక్స్లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్లో కొంత కష్టమైన క్యాచ్ను బెయిర్స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్లు) తొలి వికెట్కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X ఢిల్లీ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రైజింగ్కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్కు వెళ్లిపోయారు. దాంతో సన్రైజర్స్కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
IPL 2024 RCB vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం..ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్యాట్ కమ్మిన్స్(31), అభిషేక్ శర్మ(31) పర్వాలేదన్పించారు.ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..124 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. గ్రీన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్ కమ్మిన్స్(3) పరుగులతో ఉన్నారు.56 పరుగులకే 4 వికెట్లు..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో తొలుత మార్క్రమ్(7) ఔట్ కాగా.. తర్వాత క్లాసెన్(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.రెండో వికెట్ డౌన్..37 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యశ్దయాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 37/2. క్రీజులో మార్క్రమ్(3), నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్ హెడ్.. విల్ జాక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 207 పరుగులుటాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 179/518 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(27), కార్తీక్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్..ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జయ్దేవ్ ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 142/4మూడో వికెట్ డౌన్..పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 132/312 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 126/212 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), రజిత్ పాటిదార్(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్ జాక్స్.. మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 73/2. క్రీజులో విరాట్ కోహ్లి(34), పాటిదార్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 49/1. క్రీజులో విరాట్ కోహ్లి(23), విల్ జాక్స్(1) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్(15) పరుగులతో ఉన్నారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్లో సన్రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్తో 7.1 ఓవర్లోనే సన్రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్తో విరుచుకుపడిన క్లాసెన్కు ఫెర్గూసన్ చెక్పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్కూ సిక్స్లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్లు బాదడంతో పవర్ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్జాక్స్ (7) నాన్స్ట్రయిక్ ఎండ్లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్రైజర్స్ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్రైజర్స్ సవరించింది. ఓవరాల్గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్కతా X రాజస్తాన్ వేదిక: కోల్కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్ 4/4
జైపూర్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఐపీఎల్లో 8వ శతకం సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్’ చేపట్టిన ‘పింక్ ప్రామిస్’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. కోహ్లి శతక్కొట్టాడు కానీ... బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు. కానీ బ్యాటింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్ మ్యాక్స్వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) నిరాశపరిచారు. గ్రీన్ (5 నాటౌట్) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్కు ఆమడ దూరంలో నిలిచింది. బట్లర్, సామ్సన్ ధనాధన్ జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్కు కెప్టెన్ సంజూ సామ్సన్ జతవడంతో చేజింగ్ చాలా సులువుగా సాగింది. మయాంక్ డాగర్ వేసిన 6వ ఓవర్ను పూర్తిగా ఆడిన బట్లర్ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు. పవర్ప్లేలో రాయల్స్ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి. బట్లర్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది. సామ్సన్ను ఎట్టకేలకు సిరాజ్ అవుట్ చేయగా... 148 పరుగుల రెండో వికెట్కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (4), జురెల్ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్సర్తో సెంచరీని, మ్యాచ్ను ఒకేసారి పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 113; డుప్లెసిస్ (సి) బట్లర్ (బి) చహల్ 44; మ్యాక్స్వెల్ (బి) బర్గర్ 1; సౌరవ్ (సి) జైస్వాల్ (బి) చహల్ 9; గ్రీన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్: బౌల్ట్ 3–0–30–0, బర్గర్ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్ఖాన్ 4–0–46–0, చహల్ 4–0–34–2, పరాగ్ 1–0–10–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మ్యాక్స్వెల్ (బి) టాప్లీ 0; బట్లర్ నాటౌట్ 100; సామ్సన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69; పరాగ్ (సి) కోహ్లి (బి) యశ్ 4; జురెల్ (సి) కార్తీక్ (బి) టాప్లీ 2; హెట్మైర్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. బౌలింగ్: టాప్లీ 4–0–27–2, యశ్ దయాళ్ 4–0–37–1, సిరాజ్ 4–0–35–1, మయాంక్ 2–0–34–0, గ్రీన్ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0. ఐపీఎల్లో నేడు ముంబై X ఢిల్లీ వేదిక: ముంబై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి లక్నో X గుజరాత్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇదే సిక్స్తో తన సెంచరీ మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
మయాంక్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మయాంక్తోపాటు డికాక్, నికోలస్ పూరన్ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్లు), పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ మయాంక్ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. డికాక్, పూరన్ మెరుపులతో... లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్లు బాదాడు. దీంతో కెపె్టన్ కేఎల్ రాహుల్ (20; 2 సిక్స్లు) తక్కువే చేసినా... దేవదత్ పడిక్కల్ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ 5 సిక్స్లతో 33 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి అవుటవడంతోనే... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్ డు ప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్తో టచ్లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్వెల్ (0) పూరన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ (9) బౌల్డ్ కాగా.. అనూజ్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన లామ్రోర్ సిక్స్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్ (4) అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డాగర్ (బి) టాప్లీ 81; కేఎల్ రాహుల్ (సి) డాగర్ (బి) మ్యాక్స్వెల్ 20; పడిక్కల్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 6; స్టొయినిస్ (సి) డాగర్ (బి) మ్యాక్స్వెల్ 24; పూరన్ (నాటౌట్) 40; బదోని (సి) డుప్లెసిస్ (బి) యశ్ దయాళ్ 0; కృనాల్ పాండ్యా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. బౌలింగ్: రీస్ టాప్లీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–24–1, సిరాజ్ 4–0–47–1, మ్యాక్స్వెల్ 4–0–23–2, మయాంక్ డాగర్ 2–0–23–0, గ్రీన్ 2–0–25–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) పడిక్కల్ (బి) సిద్ధార్థ్ 22; డుప్లెసిస్ (రనౌట్) 19; పటిదార్ (సి) పడిక్కల్ (బి) మయాంక్ యాదవ్ 29; మ్యాక్స్వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ యాదవ్ 0; గ్రీన్ (బి) మయాంక్ యాదవ్ 9; అనూజ్ (సి) పడిక్కల్ (బి) స్టొయినిస్ 11; మహిపాల్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 33; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4; మయాంక్ డాగర్ (రనౌట్) 0; టాప్లీ (నాటౌట్) 3; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్: సిద్ధార్థ్ 3–0–21–1, కృనాల్ పాండ్యా 1–0–10–0, నవీనుల్ 3.4–0–25–2, మయాంక్ యాదవ్ 4–0–14–3, రవి బిష్ణోయ్ 3–0–33–0, యశ్ ఠాకూర్ 4–0–38–1, స్టొయినిస్ 1–0–9–1. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X కోల్కతా వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
వారెవ్వా మయాంక్.. టీమిండియాకు మరో శ్రీనాథ్ దొరికేశాడు
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ యవ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మరోసారి నిప్పులు చేరిగాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మయాంక్ యాదవ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మయాంక్ తన పేస్ బౌలింగ్తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్కు మాక్స్వెల్ లాంటి వరల్డ్క్లాస్ బ్యాటరే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. అదే విధంగా ఆర్సీబీ బ్యాటర్ గ్రీన్ను మయాంక్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్కు మరో జవగల్ శ్రీనాథ్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైటర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన మయాంక్ యాదవ్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే కచ్చితంగా అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 40 పరుగులు చేశాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(83) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి.. తన జట్టు మాత్రం 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కాగా కోహ్లి ఓటమి బాధలో ఉన్నప్పటికి మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లి కోల్కతా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి ఆటగాళ్లను కలిశాడు. యువ క్రికెటర్లకు విరాట్ విలువైన సూచనలు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్కు కోహ్లి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లి తన బ్యాట్ను రింకూకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రింకూ సింగ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తనకు బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు కోహ్లికి రింకూ ధన్యవాదాలు తెలియజేశాడు. "సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు భయ్యా.. అదేవిధంగా బ్యాట్ ఇచ్చినందుకు కూడా థాంక్స్" అంటూ ఇన్స్టా స్టోరీలో రింకూ రాసుకొచ్చాడు. చదవండి: IPL 2024: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Rinku Singh thanking Virat Kohli for the gift. 👌 - Kohli is always there for youngsters. pic.twitter.com/p23y7ZHFj8 — Johns. (@CricCrazyJohns) March 30, 2024 -
KKR Vs RCB: కోల్కతా లెక్క మార్చేసింది
బెంగళూరు: కోల్కతా ఓపెనర్లు నరైన్ (22 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాల్ట్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన బ్యాటింగ్ ముందు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (59 బంతుల్లో 83; 4 ఫోర్లు, 4 సిక్స్లు) క్లాసిక్ ఇన్నింగ్స్ చిన్నదిగా మారిపోయింది. దీంతో ఈ సీజన్లో తొలి సారి సొంతగడ్డపై ఆతిథ్య జట్టుకు చుక్కెదురైంది. కోల్కతా గత తొమ్మిది మ్యాచ్ల సంప్రదాయాన్ని ఈ మ్యాచ్తో మార్చేసింది. చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభం నుంచి కోహ్లి, ఆఖర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20; 3 సిక్స్లు) మెరిపించారు. అనంతరం కోల్కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు. కోహ్లి ఒక్కడే... తొలి బంతికే బౌండరీతో కోహ్లి బెంగళూరు ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే అవుటవుతున్నా... తన వీరోచిత ప్రదర్శనతో పరుగుల్ని వేగంగా పేర్చిన కోహ్లి పెద్ద భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. కెపె్టన్ డుప్లెసిస్ (8) రెండో ఓవర్లోనే అవుట్ కాగా, గ్రీన్ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ ( 19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎంతోసేపు నిలువలేదు. కోహ్లి ఒక్కడే నిలిచి ఇన్నింగ్స్ను ఆఖరి దాకా నడిపించాడు. తన మార్కు క్లాసిక్ షాట్లతో, తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో బెంగళూరు ప్రేక్షకుల్ని ఆద్యంతం కేరింతల్లో ముంచేశాడు. 36 బంతుల్లో విరాట్ అర్ధ సెంచరీ పూర్తయ్యింది. గత మ్యాచ్లో పేలవ బౌలింగ్లో ఒక్క వికెట్ తీయకుండా 53 పరుగులిచ్చిన మిచెల్ స్టార్క్ ఈ సారి కూడా వికెట్ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. ‘పవర్ ప్లే’లో 85/0 కోల్కతా ముందున్న లక్ష్యం కష్టమైంది. కానీ సులువుగా ఛేదించింది. ఓపెనర్లు సాల్ట్, నరైన్ల బ్యాటింగ్ సునామీ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్లు ఇద్దరూ దంచేసే పనిలో పడటంతో సిక్స్లైతే మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. సిరాజ్ తొలి ఓవర్లో సాల్ట్ రెండు సిక్స్లు, ఒక బౌండరీలతో ఉతికేశాడు. సునీల్ నరైన్... తానేం తక్కువ కాదని జోసెఫ్ మూడో ఓవర్లో 2 భారీ సిక్సర్లతో చాటుకున్నాడు. ఈ మెరుపుల మేనియాలో నైట్రైడర్స్ జట్టు కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను దాటేసింది. 6 ఓవర్లలో వికెటే కోల్పోకుండా 85 పరుగులు చేసింది. అంతలోనే చేయాల్సిన పరుగులు వందలోపే దిగొచ్చింది.ఏడో ఓవర్లో నరైన్ను డాగర్, ఎనిమిదో ఓవర్లో సాల్ట్ను వైశాక్ అవుట్ చేశారు. కానీ అప్పటికే స్కోరు 92/2. లక్ష్యంలో సగం పనైపోయింది. మిగతా సగాన్ని వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పూర్తి చేశారు. దీంతో 19 బంతులు మిగిలుండగానే నైట్రైడర్స్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 83; డుప్లెసిస్ (సి) స్టార్క్ (బి) హర్షిత్ 8; గ్రీన్ (బి) రసెల్ 33; మ్యాక్స్వెల్ (సి) రింకూసింగ్ (బి) నరైన్ 28; పటిదార్ (సి) రింకూసింగ్ (బి) రసెల్ 3; రావత్ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 3; దినేశ్ కార్తీక్ రనౌట్ 20; ఎక్స్ట్రాలు 4; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–17, 2–82, 3–124, 4–144, 5–151, 6–182. బౌలింగ్: స్టార్క్ 4–0–47–0, హర్షిత్ 4–0–39–2, అనుకూల్ 2–0–6–0, నరైన్ 4–0–40–1, రసెల్ 4–0–29–2, వరుణ్ 2–0–20–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) గ్రీన్ (బి) వైశాక్ 30; నరైన్ (బి) డాగర్ 47; వెంకటేశ్ (సి) కోహ్లి (బి) యశ్ దయాళ్ 50; శ్రేయస్ నాటౌట్ 39; రింకూ సింగ్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16.5 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–86, 2–92, 3–167. బౌలింగ్: సిరాజ్ 3–0–46–0, యశ్ దయాళ్ 4–0–46–1, జోసెఫ్ 2–0–34–0, మయాంక్ డాగర్ 2.5–0–23–1, వైశాక్ 4–0–23–1, వైశాక్ 1–0–7–0. ఐపీఎల్లో నేడు లక్నో X పంజాబ్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం The streak is broken! @KKRiders 💜 become the first team to register an away win in #TATAIPL 2024 👏👏 Scorecard ▶️https://t.co/CJLmcs7aNa#RCBvKKR pic.twitter.com/svxvtA409s — IndianPremierLeague (@IPL) March 29, 2024 -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్ కొత్త సీజన్ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్లోనే రచిన్ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్. చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... బెంగళూరు ఇన్నింగ్స్లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్ భాగస్వామ్యమే కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. అయితే ముస్తఫిజుర్ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ చక్కటి ఫీల్డింగ్కు డుప్లెసిస్ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్వెల్ (0) తొలి బంతికే అవుట్ కాగా, గ్రీన్ (18)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో రావత్ 2 సిక్స్లు, ఫోర్ కొట్టగా, కార్తీక్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో రుతురాజ్ (15) విఫలమైనా...ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే రచిన్ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్లు), డరైల్ మిచెల్ (18 బంతుల్లో 22; 2 సిక్స్లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్; 1 సిక్స్) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 21; డుప్లెసిస్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 35; పటిదార్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 0; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) చహర్ 0; గ్రీన్ (బి) ముస్తఫిజుర్ 18; రావత్ (రనౌట్) 48; కార్తీక్ (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–1, తుషార్ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–29–4, జడేజా 4–0–21–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) గ్రీన్ (బి) దయాళ్ 15; రచిన్ (సి) పటిదార్ (బి) కరణ్ 37; రహానే (సి) మ్యాక్స్వెల్ (బి) గ్రీన్ 27; మిచెల్ (సి) పటిదార్ (బి) గ్రీన్ 22; దూబే (నాటౌట్) 34; జడేజా (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110. బౌలింగ్: సిరాజ్ 4–0–38–0, యశ్ దయాళ్ 3–0–28–1, జోసెఫ్ 3.4–0–38–0, కరణ్ శర్మ 2–0–24–1, డాగర్ 2–0–6–0, గ్రీన్ 3–0–27–2, మ్యాక్స్వెల్ 1–0–7–0. అలరించిన ఆరంభ వేడుకలు తొలి మ్యాచ్కు ముందు చిదంబరం స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ఢిల్లీ వేదిక: ముల్లన్పూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్కతా X హైదరాబాద్ వేదిక: కోల్కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అటు ఫోర్... ఇటు సిక్సర్!
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ఆటగాడిగా మరో టైటిల్ విజయంలో భాగం అవుతాడా? ఇంకా తొలి ట్రోఫీ కోసమే ఎదురు చూస్తున్న కోహ్లికి ఈ సారైనా దానిని అందుకునే అదృష్టం ఉందా? సారథ్యం కోల్పోయిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తాతో ముంబైకి మరో విజయం అందిస్తాడా? చావుకు దగ్గరగా వెళ్లి వచ్చి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పంత్ కొత్త ఇన్నింగ్స్లో ఆటగాడిగా, నాయకుడిగా జట్టును నడిపించగలడా? ముంబై అభిమానుల ఆశలకు విరుద్ధంగా కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా తన ఆటతో, వ్యూహాలతో వారి మనసు గెలవగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలన్నీ రాబోయే రెండు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లభిస్తాయి. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తూ పూర్తి స్థాయి వినోదాన్ని అందించే వేసవి పండగకు సమయం వచ్చేసింది. చెన్నై వేదికగా నేడు ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్లతో టోర్నీ సిద్ధం కాగా... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్లకే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్ను ఆస్వాదించిన ఫ్యాన్స్ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చించడం ఖాయం. చెన్నై: మెగా టి20 టోర్నీ ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) ఉంటాయి. తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా... మే 26న ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేతగా నిలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించింది. దక్కన్ చార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్కు ముందు ప్రత్యేక ఆరం¿ోత్సవ వేడుకలు జరుగుతాయి. ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 17వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు... ♦ తాజా సీజన్లో పలు జట్లకు కొత్త కెపె్టన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్కు మార్క్రమ్ స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్కు పాండ్యా స్థానంలో శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్కతా జట్ల పగ్గాలు చేపట్టారు. మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజూ సామ్సన్ (రాజస్తాన్), డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్లాగే ఈసారి సారథులుగా కొనసాగనున్నారు. ♦ ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా... ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలిలో కాకుండా కొత్తగా ముల్లన్పూర్లో కట్టిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్గా మార్చుకుంది. ♦ ఈ సీజన్లో కొత్తగా రెండు నిబంధనలు వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతిస్తారు. చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది ఒక అదనపు బలంగా పనికొస్తుంది. ‘స్మార్ట్ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే అవకాశం ఉంటుంది. టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత సీజన్లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది. ♦ ఐపీఎల్ తర్వాత వెంటనే టి20 ప్రపంచకప్ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. ♦ ఐపీఎల్ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్ రూ. 24 కోట్ల 75 లక్షలకు, ప్యాట్ కమిన్స్ రూ.20 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయారు. ఈ నేపథ్యంలో తమ జట్లు కోల్కతా, హైదరాబాద్లను గెలిపించే విషయంలో వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం. ♦ గాయం కారణంగా లేదా వేలంలో అమ్ముడుపోకపోవడం వల్ల తాజా సీజన్కు దూరమైన కొందరు కీలక ఆటగాళ్లలో షమీ, మార్క్ వుడ్, ప్రసిధ్ కృష్ణ, జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, ఎన్గిడి, మదుషంక, స్టీవ్ స్మిత్, హాజల్వుడ్, బెన్ స్టోక్స్, జో రూట్, ఆడమ్ జంపా తదితరులు ఉన్నారు. -
విరాట్ కోహ్లి ప్రాక్టీస్..IPL2024లో బాదుడే బాదుడు (ఫొటోలు)
-
పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్ చేసింది. ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన వుమెన్ ప్రీమియర్ లీగ్-2024 చాంపియన్ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. Guard of Honour for our WPL Champions at Johnnie Walker presents RCB Unbox powered by @Kotak_Life and @Duroflex_world 🫡👏#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 pic.twitter.com/ikwL5Mx0E1 — Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024 ఇదిలా ఉంటే.. అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు. Virat Kohli speaking Kannada. - "THE NEW CHAPTER OF RCB" 👑pic.twitter.com/KQWk4Wdab8 — Johns. (@CricCrazyJohns) March 19, 2024 దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ లాంఛనం పూర్తి చేయలేకపోయింది. RCB is red Now kissed with blue We’re ready with our new armour To Play Bold for you! Presenting to you, Royal Challengers Bengaluru’s match livery of 2024! 🤩 How good is this, 12th Man Army? 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/2ySPpmhrsq — Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024 ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం?!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్ను వీడనున్నారా? ముంబైకి గుడ్బై చెప్పి యునైటెడ్ కింగ్డంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది. భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్మెషీన్ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్ను రివీల్ చేయలేదు విరుష్క. ఇక ఇటీవలే లండన్లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్లో.. ‘‘విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్ అవుతారనిపిస్తోంది. అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్కు వెళ్లివస్తారే తప్ప విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్లోనే ఉన్నట్లు సమాచారం! It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
Virat Kohli: ఇప్పటికీ అదే ఫీలింగ్.. 2 నెలల తర్వాత ఇలా!
Virat Kohli joins RCB camp for IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంతోషాల్లో మునిగితేలుతున్నారు. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా మరో వీడియోను వదిలింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. జట్టు ముఖచిత్రం, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బెంగళూరుకు చేరుకున్న దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. కాగా దాదాపు రెండు నెలల తర్వాత కింగ్ కోహ్లి రీఎంట్రీకి సిద్ధంకావడం విశేషం. సంతోషంగా ఉంది ‘‘ఇక్కడికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బెంగళూరులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అవే భావోద్వేగాలు.. అవే అనుభూతులు.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ పాత జీవితంలోకి తిరిగి వచ్చినట్లుంది. నా లాగే అభిమానులంతా కూడా ఆసక్తిగా.. ఆతురతగా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారనే అనుకుంటున్నా’’ అని విరాట్ కోహ్లి ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడాడు. కాగా ఆదివారం జరిగిన వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఆర్సీబీ జట్టు చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కప్ కొట్టాలన్న ఫ్రాంఛైజీ కల నెరవేరడంతో కోహ్లితో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు మస్త్ ఖుషీ అయ్యారు. కుటుంబంతో రెండు నెలలు ఈ క్రమంలో కోహ్లి.. వుమెన్టీమ్తో వీడియో కాల్లో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉంటే... వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్కు వెళ్లిన ఈ రన్మెషీన్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తమకు రెండో సంతానంగా.. ఫిబ్రవరి 15న కుమారుడు జన్మించాడని కోహ్లి దంపతులు తెలియజేశారు. చిన్నారికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సుమారు రెండు నెలలుగా కుటుంబానికే సమయం కేటాయించిన కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. 14 ఇన్నింగ్స్లో కలిపి 639 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది కోహ్లి అత్యధిక స్కోరు 101 నాటౌట్. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. చదవండి: Hardik Pandya: నా కెప్టెన్సీలో ఆడటానికి రోహిత్కు ఇబ్బంది ఎందుకు?.. నిజానికి.. It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్గా, కెప్టెన్గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్లో 10 మ్యాచ్లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది. -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
WPL 2024: కల నెరవేరిన వేళ.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్గా ఆర్సీబీ (ఫొటోలు)
-
WPL2024 విజేత బెంగళూరు
WPL2024లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీపై 8 దికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్లో ఫైనల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. స్కోర్లు ఢిల్లీ 113 ఆలౌట్, బెంగళూరు 115/2 -
WPL 2024 Final Updates: ఛాంపియన్స్గా ఆర్సీబీ..
►డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్లో సోఫీ డివైన్ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్ పెర్రీ (2) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీతో ఫైనల్.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్గా నిలిచింది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్ (3-0-14-3), శ్రేయాంక పాటిల్ (3-0-10-2), ఆశా శోభన (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్ (2) క్రీజ్లో ఉన్నారు. మాయ చేసిన సోఫీ మోలినెక్స్..ఒకే ఓవర్లో 3 వికెట్లు ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్ను (0), నాలుగో బంతికి అలైస్ క్యాప్సీ (0) పెవిలియన్కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 69/3గా ఉంది. లాన్నింగ్ (20), మారిజన్ కాప్ (3) క్రీజ్లో ఉన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 61/0గా ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఎడిషన్లోనూ ఫైనల్కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది. తుది జట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్కీపర్), శిఖా పాండే, మిన్ను మణి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్ -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్ఫామ్లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్ప్రీత్ వికెట్ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్జోత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ -
WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్లపై వరుస విజయాలతో టచ్లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆర్సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ను మినహాయించి ఓవరాల్గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది. హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ప్రీత్, అమెలియా కెర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. -
విరాట్ కోహ్లి బ్రేక్ తీసుకున్న ప్రతిసారీ జరిగేది ఇదే!
Virat Kohli- RCB- IPL 2024: టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి గురించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024లో ఈ రన్మెషీన్ పరుగుల వరద పారించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు.. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ ఆడాల్సి ఉండగా సెలవు తీసుకున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్కు వెళ్లిన కోహ్లి.. ఇంగ్లండ్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా ఎడిషన్తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ ఆర్సీబీ స్టార్ మైదానంలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్(టీ20) టోర్నీలో అఫ్గనిస్తాన్ మీద కోహ్లి కొట్టిన శతకం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అద్భుతమైన ఫామ్తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లిలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. తను ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తాడో అప్పుడు మరింత ప్రమాదకారిగా మారతాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. చాలా మంది ఆటగాళ్లు ఫామ్లో ఉండటానికి రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు విరుద్దం. ముందుగా చెప్పినట్లు బ్రేక్ తర్వాత.. తన ఆట తీరు ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లి ఫామ్ మీదనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయని మహ్మద్ కైఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య చెపాక్ వేదికగా ఈ ఈవెంట్కు తెరలేవనుంది. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి మరీ.. -
మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్తో సజన, హర్మన్ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పెరీ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. -
Virat Kohli: కోహ్లికి అక్కడ అంత సీన్ లేదు!
'Virat Kohli's greatness reduced...': అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ‘రన్మెషీన్’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సొంతం. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇప్పటి వరకు ఏడు సెంచరీలు బాదాడు. రాజ్కోట్, కోల్కతా, హైదరాబాద్లో ఒక్కోసారి శతక్కొట్టిన కోహ్లి.. సొంతమైదానం బెంగళూరులో ఏకంగా నాలుగుసార్లు సెంచరీ మార్కు అందుకున్నాడు. అయితే, చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం) స్టేడియంలో మాత్రం ఈ ఆర్సీబీ ప్లేయర్ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. అక్కడ అతడి రికార్డు గొప్పగా ఏమీలేదు స్పిన్కు అనుకూలించే ఈ పిచ్పై కోహ్లి బ్యాటింగ్ సగటు 30 కావడం గమనార్హం. ఇక ఇదే వేదికపై ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ ఈ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెపాక్లో ఓవరాల్గా విరాట్ ప్రదర్శన గమనిస్తే.. అతడి బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీలేదని తేలిపోయింది. నిజం చెప్పాలంటే ఇది కఠినమైన పిచ్. టెన్నిస్ బాల్ మాదిరి బౌన్స్ అయ్యే బాల్ను ఎదుర్కోవడం బ్యాటర్లకు.. ముఖ్యంగా ఓపెనర్లకు కత్తిమీద సాము లాంటిదే. మరోవైపు సీఎస్కేలో రవీంద్ర జడేజా మాదిరి స్టంప్ టూ స్టంప్ బౌల్ చేసే గొప్ప స్పిన్నర్ ఉన్నాడు. అక్కడ చిన్నస్వామి మాదిరి సీన్ ఉండదు బంతి తిరగడం మొదలుపెడితే అతడిని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. అయితే, కోహ్లి గనుక పూర్తిస్థాయిలో సిద్ధమై.. 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాలని పట్టుదలగా నిలబడితే కచ్చితంగా బౌలర్లకు చుక్కలు చూపించగలడు. కానీ చిన్నస్వామి(బెంగళూరు) స్టేడియం మాదిరి.. ఇక్కడ మాత్రం సెంచరీలు బాదడం సులువు కాదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా కోహ్లి 2016 మాదిరి ఈసారి కూడా విజృంభిస్తేనే ఆర్సీబీ ముందుక వెళ్లగలదని.. వాళ్లు కప్ కొడతారో లేదో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో కోహ్లి ఆల్టైమ్ రికార్డు.. అయినా 2019లో 16 మ్యాచ్లలో కలిపి కోహ్లి ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి. ఒక ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అయితే, ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్కు వెళ్లినా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ IPL 2024: విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు -
IPL 2024: విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు
‘‘నాకు ఐపీఎల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆటగాళ్లు దేశాలకు అతీతంగా సహోదర భావంతో మెలుగుతారు. జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు.. ప్రత్యర్థి జట్టులో మనకెంతో కాలంగా తెలిసిన ప్లేయర్లు.. ఇక్కడ మనతో కలిసి ఆడతారు. నిజానికి నేను మాత్రమే కాదు నాలాగా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ను అమితంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం ఇదే. సహచర ఆటగాళ్లే కాదు.. అభిమానులు పంచే ప్రేమ.. వారితో అనుబంధం ఈ లీగ్ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి’’ అని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైనప్పటి నుంచి కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ అంటే కోహ్లి.. కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ఫ్రాంఛైజీతో ముడిపడిపోయాడీ రన్మెషీన్. 2013 నుంచి కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే, ఐపీఎల్- 2021 తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక గత కొంతకాలంగా వివరాట్ కోహ్లి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని.. చిన్నారికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు కోహ్లి. అయితే, ఐపీఎల్-2024 ఆరంభం నాటికి అతడు తిరిగి వస్తాడా లేదా అన్న సందేహాల నడుమ స్టార్ స్పోర్ట్స్ షో కోహ్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసింది. ఇందులో కోహ్లి ఐపీఎల్ ప్రాముఖ్యం గురించి చెబుతూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో ఆడుతున్నప్పుడు ఒకరకంగా శత్రువులుగా ఉండే ఆటగాళ్లు ఇక్కడ మిత్రులుగా మారిపోయి సహోదరభావంతో మెలగడం బాగుంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య జరుగనుంది. We all nod in agreement when the king speaks! 🫡@imVkohli sheds light on why #IPL is a valuable opportunity for aspiring youngsters worldwide! Will he be the defining factor for #RCB in this #IPLOnStar?#IPL2024 - Starts 22nd March! 😉#AjabRangOnStar #BetterTogether pic.twitter.com/Ijm9G8vzBz — Star Sports (@StarSportsIndia) March 8, 2024 -
టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్కూ గుడ్బై? అదే విధంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు కూడా డీకే గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గానూ మెరుగ్గా రాణించిన దినేశ్ కార్తిక్ ఖాతాలో ఒకే ఒక సెంచరీ(టెస్టుల్లో) ఉంది. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ చెన్నై ప్లేయర్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్లో 242 మ్యాచ్లు ఆడిన డీకే.. 4516 పరుగులు సాధించాడు. 133 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. 2008 నుంచి ఇప్పటి దాకా ఇక 2008లో ఈ టీ20 లీగ్ మొదలైన నాటి ప్రతి ఎడిషన్లోనూ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఇప్పటి వరకు ఆరు ఫ్రాంఛైజీలకు దినేశ్ కార్తిక్ ప్రాతినిథ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్(కెప్టెన్గానూ)లకు ఆడిన డీకే.. గత రెండు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్గా అదరగొట్టిన దినేశ్ కార్తిక్.. ఆ ఏడాది అనూహ్యంగా టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మెగా టోర్నీలో విఫలమైన అతడు మళ్లీ భారత జట్టులో స్థానం పొందలేకపోయాడు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం! అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం తమిళనాడు తరఫున బరిలోకి దిగుతూనే ఉన్నాడు 38 ఏళ్ల దినేశ్ కార్తిక్. కామెంటేటర్గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 తర్వాత ఐపీఎల్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్కూ స్వస్తి పలికి.. కేవలం డొమెస్టిక్ క్రికెట్ మీద దృష్టి సారించాలని డీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రచురించింది. చదవండి: సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్! -
గుజరాత్ బోణీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన గుజరాత్ ఐదో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (45 బంతుల్లో 76; 13 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 86 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్కు వీరిద్దరు 13 ఓవర్లలో 140 పరుగులు జోడించారు. లౌరా అవుటయ్యాక వచ్చిన ఫోబీ లిచ్ఫీల్డ్ (18; 1 ఫోర్), యాష్లీ గార్డ్నర్ (0), హేమలత (1), వేద కృష్ణమూర్తి (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన (24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఎలీస్ పెరీ (24; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (23; 1 ఫోర్, 2 సిక్స్లు), రిచా ఘోష్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వేర్హమ్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ముంబై ఇండియన్స్ జోరు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ దూకుడు ముందు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలవలేకపోయింది. ఫలితంగా స్మృతి సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టోర్నీలో మూడో మ్యాచ్ నెగ్గిన ముంబై ఈ మూడింటినీ ఛేదనలోనే గెలుచుకోవడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితం కాగా...ముంబై 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. అనారోగ్యంనుంచి కోలుకోని కారణంగా ముంబై కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్లో కూడా ఆడలేదు. బెంగళూరు ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు ముగిసే సరికే ఓపెనర్లు స్మృతి మంధాన (9), ఎస్.మేఘన (11), సోఫీ డివైన్ (9) వెనుదిరిగారు. రిచా ఘోష్ (7), సోఫీ మోలినెక్స్ (12) కూడా విఫలం కావడంతో స్కోరు 71/5 వద్ద నిలిచింది. ఈ దశలో ఎలైస్ పెరీ (38 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) జట్టును ఆదుకుంది. పెరీ, జార్జ్ వేర్హామ్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆరో వికెట్కు 40 బంతుల్లో 52 పరుగులు జోడించడంతో ఆర్సీబీ కాస్త గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది. ఒక్క సిక్సర్ కూడా లేకుండా బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రకర్, నాట్ సివర్ బ్రంట్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప ఛేదనను ముంబై దూకుడుగా మొదలు పెట్టింది. యస్తిక భాటియా (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హేలీ మాథ్యూస్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 23 బంతుల్లో 45 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (25 బంతుల్లో 27; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా కెర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) ధాటైన ఆట ముంబై పనిని సులువు చేసింది. పూజ వస్త్రకర్ (8 నాటౌట్)తో కలిసి కెర్ వేగంగా మ్యాచ్ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు)తో తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
బెంగళూరును గెలిపించిన శోభన
బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్ను శోభన తన అద్భుత బౌలింగ్తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు. యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది. -
ధోని సేనకు చెపాక్ ఇకపై కంచుకోట కాబోదు: సీఎస్కే మాజీ స్టార్
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్-2024 సీజన్కు తెరలేవనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా మార్చి 22న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక సీఎస్కే- ఆర్సీబీ మధ్య పోటీ అంటే అభిమానులకు పండుగలాంటిదని చెప్పవచ్చు. ఓవైపు మహేంద్ర సింగ్ ధోని.. మరోవైపు విరాట్ కోహ్లి.. వీరిద్దరు భాగమైన జట్లు ప్రత్యర్థులుగా పోటీపడుతుంటే చూడటానికి ఫ్యాన్స్ మరింత ఆసక్తికగా తిలకిస్తారు. ఈసారి తొలి మ్యాచ్లోనే అభిమానులకు ఆ మజాను అందించేందుకు సిద్ధమయ్యారు ఐపీఎల్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆర్సీబీ తొలి మ్యాచ్లో చెపాక్లో ఆడబోతుండటం శుభపరిణామం. ఎందుకంటే.. చెన్నై పిచ్లు క్రమక్రమంగా మారుతున్నాయి. ఇక ముందు చెపాక్ సీఎస్కేకు కంచుకోటగా ఉండబోదు. గతేడాది చెన్నై చాంపియన్గా అవతరించినప్పటికీ.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ చేతిలో సొంతగడ్డపై ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు. అయితే, స్పిన్ అనుకూల పిచ్ల కారణంగా ఈసారి కూడా సీఎస్కే పేపర్ మీద పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, ఆర్సీబీ కూడా చెన్నై పిచ్పై సత్తా చాటగలిగిన జట్టే’’ అని జియో సినిమా షోలో అభినవ్ ముకుంద్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 320 పరుగులు చేశాడు అభినవ్. ఇక తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్లో చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 19 పరుగులే చేశాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్-17 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య రీఎంట్రీలో దారుణం.. బౌల్ట్ బౌలింగ్లో చితక్కొట్టిన ట్రవిస్ హెడ్ -
చెన్నై X బెంగళూరు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2024కు అధికారికంగా నగారా మోగింది. మార్చి 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ రెండు దశల్లో ఐపీఎల్ను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే తొలి దశలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 మధ్య జరిగే 21 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. లీగ్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగిలిన 53 మ్యాచ్ల తేదీలు, వేదికలను బోర్డు ప్రకటిస్తుంది. గత రెండు సీజన్ల తరహాలోనే 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతీ టీమ్ లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది. టోర్నీ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్లో నాలుగు తేదీల్లో ఒకేరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఈ 17 రోజుల్లో ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు గరిష్టంగా ఐదేసి మ్యాచ్ల చొప్పున ఆడతాయి. అందుకే విశాఖలో... ఆంధ్ర క్రికెట్ అభిమానులకు ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు చూసే అవకాశం దక్కుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ రెండు ‘హోమ్’ మ్యాచ్లను వైజాగ్లో ఆడాలని నిర్ణయించుకుంది. క్యాపిటల్స్ సొంత వేదిక ఫిరోజ్షా కోట్లా మైదానం మార్చి 17న జరిగే డబ్ల్యూపీఎల్ ఫైనల్ సహా మొత్తం 11 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. దాంతో ఐపీఎల్కు ముందు గ్రౌండ్ సన్నద్ధతకు తగినంత సమయం లభించడం లేదు. ఈ కారణంగా క్యాపిటల్స్ తమ వేదికను వైజాగ్కు మార్చింది. విశాఖలో వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 13 ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఆఖరి సారిగా 2019 లీగ్లో ఎలిమినేటర్, క్వాలిఫయింగ్–2 మ్యాచ్లు ఇక్కడే జరిగాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా తమ హోమ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు మొహాలి ఈ టీమ్ సొంత గ్రౌండ్గా ఉండగా... చండీగఢ్ శివార్ల లో ముల్లన్పూర్లో కొత్తగా నిరి్మంచిన స్టేడియంలో ఇకపై తమ హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. -
IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ
IPL 2024 Schedule Released: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. మొత్తంగా 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను గురువారం ప్రకటించారు. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం ఆనవాయితీ. ఆ తేదీల్లో డబుల్ మ్యాచ్లు అయితే, ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్కే- గుజరాత్ టైటాన్స్కు బదులు.. సీఎస్కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఐపీఎల్-2024 తొలి 17 రోజుల షెడ్యూల్ ►మార్చి 22- సీఎస్కే- ఆర్సీబీ- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కేకేఆర్- సన్రైజర్స్- కోల్కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్- లక్నో సూపర్ జెయింట్స్- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్- చెన్నై ►మార్చి 27- సన్రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో Photo Credit: Star Sports X వేదికలు చెన్నై, మొహాలి, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోం గ్రౌండ్గా ఉండనుంది. ఇక మధ్యాహ్నం 3.30, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. 🚨 𝗦𝗧𝗢𝗣 𝗧𝗛𝗘 𝗣𝗥𝗘𝗦𝗦 - TATA #IPL2024 Schedule is HERE! 🤩 Get ready for the thrill, excitement and fun to begin! Save this post so you don't have to search for it again 🔍 It's #CSKvRCB, @msdhoni 🆚 @imVkohli in the opener! Who's your pick ? 👀#IPLSchedule #IPLonStar pic.twitter.com/oNLx116Uzi — Star Sports (@StarSportsIndia) February 22, 2024 మ్యాచ్లన్నీ భారత్లోనే కాగా ఐపీఎల్–2024 పూర్తిగా భారత్లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు దీంతో తెర పడింది. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం. తేదీల విషయంపై మేం ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. ముందుగా 15 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆపై తర్వాతి తేదీలను ప్రకటిస్తాం. అయితే అన్ని మ్యాచ్లు భారత్లోనే జరగడం ఖాయం’ అని ధూమల్ స్పష్టం చేశారు. అయితే, గురువారం తొలి 17 రోజుల మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడం గమనార్హం. అప్పట్లో ఆ దేశాల్లో నిర్వహణ కాగా ఐపీఎల్ ప్రారంభమైన తర్వాతి ఎన్నికల సమయంలో 2009లో టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్లు భారత్లో, మరికొన్ని యూఏఈలో నిర్వహించారు. అయితే 2019లో మాత్రం మొత్తం టోర్నీ ఇక్కడే జరిగింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత కొద్ది రోజుల్లోనే టి20 ప్రపంచ కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. కళ్లన్నీ వారిద్దరిపైనే ఐపీఎల్ 17వ ఎడిషన్లో ప్రధానంగా టీమిండియా స్టార్లు హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్పైనే ఎక్కువ ఫోకస్ కానున్నారు. గుజరాత్ టైటాన్స్ను ఆరంభ సీజన్లోనే విజేతగా.. తదుపరి రన్నరప్గా నిలిపిన ఆల్రౌండర్ పాండ్యా.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీని వీడాడు. ముంబై ఇండియన్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్గా నియమితుడయ్యాడు. మరోవైపు.. 2022, డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ ఈ సీజన్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
కోహ్లికి ఏమైంది?.. అభిమానుల్లో అలజడి రేపిన ఆర్సీబీ పోస్ట్
విరాట్ కోహ్లికి ఏమైంది? ఈ రన్ మెషీన్ మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడు? కోహ్లి ఆటకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి? అతడి కుటుంబంలో అంతా బాగానే ఉంది కదా?.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఇది. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కోహ్లి మెరుపులు చూడాలని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ ఢిల్లీ బ్యాటర్.. సెలవును పొడిగిస్తూ ఆఖరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు సంబంధించిన జట్టును ప్రకటిస్తూ.. కోహ్లి అందుబాటులో ఉండటం లేదని శనివారం ధ్రువీకరించింది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి సెలక్షన్కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుంది. అతడికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటుంది’’ అని ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారిగా కోహ్లి లేకుండానే టెస్టు సిరీస్ ఆడుతున్నట్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘‘విరాట్ కోహ్లి లేకుండా 13 ఏళ్లలో ఇదే మొదటి టెస్టు సిరీస్. దేశం మొత్తం నీకు అండగా ఉంది. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా నీకోసం నీ సింహాసనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కింగ్’’ అని ఆర్సీబీ తమ ప్రధాన ఆటగాడు కోహ్లిని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కోహ్లి అభిమానులు మరింత కంగారుపడుతున్నారు. ‘‘కోహ్లికి అంత కష్టం ఏమొచ్చింది? ఎవరైనా అసలు కారణం చెప్పండి.. కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడని మొన్ననే డివిలియర్స్ చెప్పాడు. ఆ తర్వాత అదంతా అబద్ధమంటూ మాట మార్చాడు. నిజానికి అనుష్క గర్భవతిగా ఉన్న సమాచారాన్ని ధ్రువీకరించేలా పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయినా.. దీనిపై విరుష్క జోడీ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా వామికకు తోబుట్టువు రాబోతున్న మాట నిజమే అయితే, అంతా సవ్యంగా జరగాలి. బుజ్జాయి ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి రావాలి’’ అని ఫ్యాన్స్ కోహ్లి కోసం ప్రార్థిస్తున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, స్పీడ్గన్ డేల్ స్టెయిన్ సైతం.. ‘‘కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని కోహ్లికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. నిజానికి.. తండ్రి చనిపోయిన బాధను దిగమింగి రంజీ మ్యాచ్ ఆడిన అంకిత భావం కోహ్లిది. అలాంటిది ఇపుడు ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉంటున్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. The first Test series in 13 years without Virat Kohli. 🥺 The nation is with you, and your seat remains reserved whenever you’re ready to return, King. 👑❤️🔥#PlayBold #INDvENG #TeamIndia @imVkohli pic.twitter.com/fxOgLIlhWL — Royal Challengers Bangalore (@RCBTweets) February 10, 2024 -
ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలని కలగన్నట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ తనకు అవకాశాలు కూడా ఇచ్చిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆ మరుసటి ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్గా, వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించి సిరీస్ గెలిపించాడు. తదుపరి టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చాలా కాలం పాటు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నాడు. అయితే, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్కు నాయకుడిగా ఎంపికయ్యాడు. అయితే, గత రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్ చేరగలిగింది కానీ.. ఫైనల్ వరకు కూడా రాలేకపోయింది. ఐపీఎల్-2024లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్జీ క్రికెట్కు కేఎల్ రాహుల్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘ నేను యువకుడిగా ఉన్న సమయంలో నా ప్రతిభను నిరూపించుకునేందుకు ఆర్సీబీ నాకు అవకాశాలు ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నాకు.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచే ఆర్సీబీకి ఆడాలనే కోరిక ఉండేది. అందుకు తగ్గట్లుగానే కొన్నేళ్లపాటు ఆ జట్టుకు ఆడే అవకాశం లభించింది. ఆర్సీబీ ఎల్లప్పుడూ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ కూడా ఐపీఎల్లో ఇంత వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదన్న విషయం తెలిసిందే. ఇక ఆర్సీబీ తరఫున మొత్తంగా 19 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్.. 417 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్-2016 సీజన్లో అత్యుత్తమంగా 397 పరుగులతో రాణించిన రాహుల్.. జట్టును ఫైనల్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా ఈఏడాది ఐపీఎల్ ఎడిషన్లో గాయం కారణంగా రాహుల్ మధ్యలోనే లక్నోను వీడగా.. కృనాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ ప్రకటన.. సర్ఫరాజ్కు మరోసారి మొండిచేయి -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్ను నాలుగు మ్యాచ్ల పాటు నిషేధించారు. బీబీఎల్లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్కు ముందు పిచ్పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
IPL 2024: ఆర్సీబీ తుది జట్టు ఇలా..?
ఐపీఎల్ 2024 సీజన్ వేలం నిన్న ముగియడంతో అన్ని ఫ్రాంచైజీల అభిమానులు తమ తమ తుది జట్లు ఇలా ఉంటే బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈసారి వేలంలో అన్ని జట్లు ఆచితూచి వ్యవహరించి సమతూకమే లక్ష్యంగా కొనుగోళ్లు జరిపాయని అన్ని జట్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అన్ని జట్లు ఇదివరకే ఉన్న సభ్యులకు అనుగుణంగా కొత్త వారిని తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాంచైజీల లెక్కలు సఫలీకృతమవుతాయే లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం సీజన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నారు. మా జట్టులో పలాన వాళ్లు ఉంటారు.. వీళ్లు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సోషల్మీడియా మొత్తం అభిమానుల అంచనా జట్లచే నిండిపోయింది. కొత్త జట్టుతో ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఫ్రాంచైజీ అభిమాని సంకలు గుద్దుకుంటున్నాడు. ప్రతిసారి ఈసారి కప్ మాదే అని గగ్గోలు పెట్టే ఆర్సీబీ అభిమానులు సైతం వచ్చే సీజన్ కోసం తమ అంచనా జట్లను ప్రకటిస్తున్నారు. మెజార్టీ శాతం ఆర్సీబీ అభిమానుల ప్రకారం తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల కోటాలో డుప్లెసిస్, మ్యాక్స్వెల్, కెమారూన్ గ్రీన్, అల్జరీ జోసఫ్ ఉంటున్నారు. దేశీయ ఆటగాళ్ల కోటాలో విరాట్ కోహ్లి, మొహమ్మద్ సిరాజ్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రార్, రజత్ పాటిదార్ ఉంటున్నారు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): విరాట్ కోహ్లి (బ్యాటర్), ఫాఫ్ డుప్లెసిస్ (బ్యాటర్/కెప్టెన్), రజత్ పాటిదార్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), కెమారూన్ గ్రీన్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్), దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్/బ్యాటర్), మహిపాల్ లోమ్రార్ (బ్యాటర్/లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), కర్ణ్ శర్మ (లెగ్ స్పిన్నర్), అల్జరీ జోసఫ్ (పేస్ బౌలర్), మొహమ్మద్ సిరాజ్ (పేసర్), యశ్ దయాల్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) -
రూ. 17.5 కోట్లు: ఐపీఎల్కు దూరంగా ఉండు.. అప్పుడే మేటి క్రికెటర్గా!
మేటి టెస్టు క్రికెటర్గా ఎదగాలంటే కామెరాన్ గ్రీన్ కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు కొన్నాళ్లు దూరంగా ఉండాలని సూచించాడు. సంప్రదాయ క్రికెట్పై మరింతగా దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసీస్ యువ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను గతేడాది ఐపీఎల్ వేలంలో ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ పేస్ ఆల్రౌండర్ కోసం ఏకంగా.. రికార్డు స్థాయిలో 17. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే, ఐపీఎల్-2023 సీజన్ మొత్తంలో అతడు 16 మ్యాచ్లాడి 452 పరుగలు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ గ్రీన్ను ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాడిన్.. కామెరాన్ గ్రీన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఫాస్ట్బౌలర్లు కమిన్స్, హాజిల్వుడ్, స్టార్క్.. ఐపీఎల్కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నవాళ్లే. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ కూడా అదే పనిచేస్తే బాగుంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉందనుకుంటే.. అతడు టెస్టు క్రికెట్ కోసం ఐపీఎల్ను త్యాగం చేయాల్సి ఉంటుంది’’ అని ఫాక్స్ క్రికెట్తో హాడిన్ వ్యాఖ్యానించాడు. గ్రీన్కు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని.. ఆస్ట్రేలియా తరఫున మేటి క్రికెటర్గా ఎదగాలంటే ఇలాంటివి తప్పవని బ్రాడ్ హాడిన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి ఆరోసారి చాంపియన్గా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ఆడిన తుది జట్టులో కామెరాన్ గ్రీన్కు స్థానం దక్కలేదు. -
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో.. హెడ్కోచ్గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సేవలు అందించిన మైక్ హసన్కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్
Disappointed to be leaving RCB: ‘‘గత నాలుగు సీజన్లలో మూడుసార్లు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్నకు చేరుకున్నాం. కానీ.. అభిమానులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు నేనూ.. మేమంతా కోరుకున్నట్లుగా.. ట్రోఫీ గెలవలేకపోయాం. ఆర్సీబీని వీడటం నిరాశకు గురిచేసినా.. ఇక్కడ నేనెన్నో మధురజ్ఞాపకాలు మూటగట్టుకోగలిగాను. గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఆర్సీబీకి, జట్టు కొత్త కోచింగ్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్. ఇక అద్భుతమైన ఆర్సీబీ అభిమానుల గురించి చెప్పేదేముంది? మీ అందరి అంతులేని ఆదరాభిమానాలకు, ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు.. సొంత ఇంట్లో ఉన్న భావన కల్పించినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పనిచేసిన మైక్ హసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాధగా ఉంది.. ఆర్సీబీని వీడటం బాధగా ఉందని.. శాయశక్తులా కృషి చేసినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా కొత్త సిబ్బంది మార్గదర్శనంలో ఆర్సీబీ మరింత ముందుకు వెళ్లాలని మైక్ హసన్ ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్సీబీ కీలక నిర్ణయాలు మైక్ హసన్ను ఉద్వాసన పలకడంతో పాటు హెడ్కోచ్ సంజయ్ బంగర్పై వేటు వేసింది. కొత్త కోచ్గా ఆండీ ఫ్లవర్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్కప్ కప్ విన్నింగ్ కోచ్ ఫ్లవర్కు స్వాగతం పలుకుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో బంధం ముగిసిన నేపథ్యంలో.. న్యూజిలాండ్కు చెందిన 48 ఏళ్ల మైక్ హసన్ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ మాత్రం చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో పదహారో ఎడిషన్ను ముగించింది. చదవండి: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు View this post on Instagram A post shared by Mike Hesson (@hesson_mike) We thank 𝐌𝐢𝐤𝐞 𝐇𝐞𝐬𝐬𝐨𝐧 and 𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐫 for their commendable work during the stints as 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿 𝗼𝗳 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 and 𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 of RCB. 🙌#PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0 — Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 -
టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు.. నా ధ్యేయం అదే!
I am not thinking about an India call-up: టీమిండియాలో చోటు కోసం తాను ఎదురుచూడటం లేదని, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణించడమే ధ్యేయమని ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ అన్నాడు. దేశీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల అనూజ్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్లో కలిపి 91 పరుగులు చేయగలిగాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఈ మేరకు రన్స్ రాబట్టాడు. ఉత్తమంగా ఆడొచ్చు ఇక తాజాగా స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూజ్ రావత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాలి. ఈ టీ20 టోర్నీలో మెరుగైన ప్రదర్శన వల్ల ఐపీఎల్లో మరింత ఉత్తమంగా ఆడే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ సీనియర్ జట్టు నుంచి తనను తప్పించడంపై అనూజ్ ఈ సందర్భంగా స్పందించాడు. ఆలస్యంగానైనా ‘‘ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనపుడు మానసికంగా మరింత దృఢంగా ఉండాలి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు. తిరిగి జట్టులో చేరే రోజు కోసం ఓపికగా ఎదురుచూడాలి. ఐపీఎల్ కూడా ఉంది. అక్కడ బాగా ఆడితే మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయి. మా రాజ్కుమార్ సర్ ప్రతిసారి ఓ మాట చెబుతారు. మన ఆట తీరు బాగుంటే కాస్త ఆలస్యంగానైనా అవకాశాలు దక్కుతాయి. నేను అండర్-14, అండర్-16 జట్లకు ఆడేటపుడు షార్ట్లిస్ట్లో ఉండేవాడిని. కానీ తుదిజట్టులో మాత్రం నా పేరు ఉండేది కాదు. కానీ నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. కఠినంగా శ్రమించి అండర్-19 స్థాయిలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాను’’ అని అనూజ్ రావత్ చెప్పుకొచ్చాడు. కాగా అనూజ్ రావత్ ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 220 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్క్లాస్ డెబ్యూ మ్యాచ్లో అసోం మీద 71 పరుగులు సాధించాడు అనూజ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడి సగటు 40. చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు! ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. -
IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల..
IPL 2023 RCB Vs LSG: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఆర్సీబీతో మ్యాచ్లో తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా హెల్మెట్ విసిరి ఉండాల్సింది కాదన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని.. ఏదేమైనా అలా అతి చేయడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి చిన్నస్వామి స్టేడియంలో ఈ దృశ్యాన్ని చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలు కాగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక బీసీసీఐ సైతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించింది. మొదటి తప్పిదం కాబట్టి ఈసారికి వదిలేస్తున్నామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. నా ప్రవర్తన వల్ల.. ఆ ఘటన తర్వాత తాను ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాడు. ‘‘హెల్మెట్ విసరడం కాస్త ఓవర్ అయ్యింది. ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నిజానికి గెలిచామన్న సంతోషంలో నేనలా చేశానే తప్ప ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే! కానీ మైదానం వీడిన తర్వాతే నేనేం చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నాను. అలా ఎందుకు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది’’ అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్నకు చేరుకున్న లక్నో.. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
నిరాశ కలిగింది! మనం తలెత్తుకునే ఉండాలి: కోహ్లి పోస్ట్కు గిల్ రిప్లై.. వైరల్
IPL 2023- RCB- Virat Kohli: ‘‘సీజన్లో కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. నిరాశ కలిగించే విషయమే. కానీ మనం తలెత్తుకోవాలి. ఈ ప్రయాణంలో అడుగడుగునా.. మాకు అన్ని విధాలా అండగా నిలిచిన విశ్వసనీయమైన మద్దతుదారులకు, అభిమానులకు రుణపడి ఉంటాం’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. 12th మ్యాన్ ఆర్మీకి, మేనేజ్మెంట్, కోచ్లకు ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ నోట్ షేర్ చేశాడు. ఐపీఎల్-2023లో లీగ్ దశలోనే ఆర్సీబీ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది బెంగళూరు జట్టు. భంగపాటు తప్పలేదు ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాట్ ఝులిపించినా ఫలితం లేకుండా పోయింది. అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించిన కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన కారణంగా ఆర్సీబీ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. కోహ్లి పోస్ట్కు బదులిచ్చిన గిల్ ఈసారైనా కప్ మనదే అని ఆశలు పెంచుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్కు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులను ఉద్దేశించి మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశాడు. వచ్చే సీజన్లో మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తామని పేర్కొన్నాడు. PC: Virat Kohli ఇక ఇందుకు స్పందించిన శుబ్మన్ గిల్.. ‘‘కింగ్’’ అన్నట్లు ఎమోజీలతో కోహ్లికి బదులిచ్చాడు. కాగా గిల్ కారణంగానే ఆర్సీబీ ఓడిందని కొంతమంది ఫ్యాన్స్ అతడిని, అతడి సోదరిని దారుణంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కోహ్లి ట్వీట్కు గిల్ బదులిచ్చిన తీరు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సీజన్లో బ్యాటర్గా కోహ్లి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆడిన 14 ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా 639 పరుగులు చేశాడు. కేజీఎఫ్ రాణించినా ఇక ఆఖరి రెండు మ్యాచ్లలో కోహ్లి వరుస శతకాలు సాధించాడు విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్పై 100 పరుగులు చేసిన కింగ్.. గుజరాత్ టైటాన్స్పై 101 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు. అదే విధంగా ఈ ఎడిషన్లో కోహ్లి సాధించిన అర్ధ శతకాల సంఖ్య 6. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్తో లీగ్ దశ ముగిసేనాటికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. 14 ఇన్నింగ్స్లలో కలిపి 730 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతడి అత్యధిక స్కోరు 84. కారణమెవరు? ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లితో పాటు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సైతం ఈసారి మెరుగైన ప్రదర్శన చేశాడు. 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. ఇలా ‘కేజీఎఫ్’ రూపంలో పటిష్టమైన బ్యాటర్లు దొరికినా.. బౌలింగ్ వైఫల్యాలు, కీలక సమయంలో ఆటగాళ్ల తప్పిదాలు ఆర్సీబీ ఓటములకు కారణమయ్యాయి. దీంతో మరోసారి నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం కోహ్లి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అభిమానులను మరింతగా బాధించాయి. చదవండి: పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్! A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn — Virat Kohli (@imVkohli) May 23, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
IPL 2023- RCB Knocked Out: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. పదిహేనేళ్లుగా కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్తో తప్పక గెలవాల్సి ఆదివారం నాటి మ్యాచ్లో మెరుగైన స్కోరు సాధించినా.. శుబ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసి అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. చాంపియన్గా నిలుస్తారని ఆశపడితే టాప్-4కి కూడా చేరకపోవడంతో ఆర్సీబీపై విమర్శలు కూడా వచ్చాయి. మాది అత్యుత్తమ జట్టు కాదు ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమణ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్ను ఇక్కడితోనే ముగించడం పట్ల బాధగా ఉంది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. ఆ అర్హత మాకు లేదు నిజాయితీగా చెప్పాలంటే.. మా ప్రదర్శనను పరిశీలిస్తే మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హులం కాదు. కాకపోతే మాకంటూ కొన్ని గొప్ప విజయాలు ఉండటం నిజంగా మా అదృష్టం. కానీ జట్టుగా మా ప్రదర్శన చూస్తే సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అర్హత మాత్రం మాకు లేదు’’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. తమ వైఫల్యాల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ డుప్లెపిస్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆటగాడిగా, కెప్టెన్గా రాణించినా కాగా గతేడాది విరాట్ కోహ్లి నుంచి ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్.. బ్యాటర్గా, సారథిగా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2022లో 468 పరుగులు సాధించాడు. అదే విధంగా జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ఇక ఈసారి ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించి 730 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. మరోవైపు.. కోహ్లి సైతం బ్యాట్ ఝులిపించి 639 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం విశేషం. కానీ.. ఆర్సీబీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో డుప్లెసిస్కు, అతడి బృందానికి నిరాశ తప్పలేదు. చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా.. IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ RCB v GT Game Day Review Captain Faf, players and the coaches reflect on the #IPL2023 season and send in their gratitude and regards to the 12th Man Army, after match that brought an end to our campaign this year.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/8Vst2kRZLV — Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023 -
నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా..
IPL 2023 RCB Vs GT: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్, అతడి సోదరి షానిల్ గిల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. షానిల్ను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్రత్యర్థి జట్టు ఓడిపోయినందుకు అతడి సోదరిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆర్సీబీ ఓడిపోవడంతో కాగా ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో మెరిసినా.. లక్ష్య ఛేదనలో గిల్ శతకంతో రాణించి గుజరాత్ను గెలిపించాడు. దీంతో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ‘దురభిమానులు’ శుబ్మన్ గిల్తో పాటు అతడి సోదరి షానిల్ను కూడా టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ఆగ్రహం.. ఇది నిజంగా సిగ్గుచేటు ఈ విషయంపై స్పందించిన స్వాతి మలివాల్.. గిల్, షానిల్లపై వస్తున్న ట్రోల్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లు చూసిన ఓ మ్యాచ్లో తమకిష్టమైన జట్టు ఓడిపోయిందని శుబ్మన్ గిల్ సోదరిని అబ్యూజ్ చేయడం నిజంగా సిగ్గుచేటు. చర్యలు తీసుకుంటాం గతంలో విరాట్ కోహ్లి కూతురి పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఇలాంటివి చూస్తూ ఊరుకోదు. గిల్ సోదరిని కించపరిచేలా మాట్లాడిన వాళ్లపై తప్పక చర్యలు తీసుకుంటాం’’ అని ట్విటర్ వేదిగా పేర్కొన్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫైయర్-1లో సీఎస్కేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో శుబ్మన్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు సెంచరీలు సాధించిన ఈ యువ ఓపెనర్.. ఇప్పటి వరకు 14 మ్యాచ్లలో కలిపి 680 పరుగులు చేశాడు. చదవండి: IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ IPL 2023 CSK Vs GT Probable Playing XI: ‘ఫైనల్’కు ముందెవరు? Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 Extremely shameful to see trollers abusing #ShubhmanGill’s sister just because the team they follow lost a match. Previously we had initiated action against people abusing #ViratKohli daughter. DCW will take action against all those who have abused Gill’s sister as well. This… pic.twitter.com/eteGtGgPVm — Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2023 -
ఢిల్లీ క్యాపిటల్స్కు కోహ్లి! అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
IPL 2023- RCB- Virat Kohli: ఒక్క టైటిల్.. ఒకే ఒక్క ట్రోఫీ.. అంటూ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గత పదిహేనేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ప్రతి ఎడిషన్ ఆరంభం నుంచే ‘‘ఈసారి కప్ మనదే’’ అంటూ సందడి చేసే ఫ్యాన్స్కు ఎప్పటిలాగే ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. ముఖ్యంగా ఈసారి విరాట్ కోహ్లి వింటేజ్ కింగ్ను గుర్తు చేస్తూ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లపైనే ఆధారపడి ఈ మ్యాచ్లో కోహ్లి చేసిన అజేయ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. ‘కేజీఎఫ్’(కోహ్లి, గ్లెన్, ఫాఫ్) రూపంలో తమకు లభించిన ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ప్రతిసారీ ఆధారపడటం.. బౌలింగ్లోనూ సిరాజ్ మినహా మిగతా వాళ్లు మరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కోహ్లికి ఆర్సీబీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతున్న కింగ్.. నేటికీ బంధం కొనసాగిస్తున్నాడు. కెప్టెన్గానూ సేవలు అందించాడు. ఆర్సీబీ ముఖచిత్రంగా మారాడు. బ్యాటర్గా తనపై భారం పడితే జట్టుకు నష్టం చేకూరుతుందేమోనన్న ఆలోచనతో గతేడాది సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ ఒక్క లోటు అయితే, క్యాష్ రిచ్ లీగ్లో ఎన్ని రికార్డులు సాధించినా.. శతకాల వీరుడిగా పేరొందినా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్గా నిలవలేదన్న లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తాజా సీజన్లోనూ అదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీకి మారాల్సిన సమయం వచ్చేసింది! గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘ విరాట్ రాజధాని నగరానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా పరోక్షంగా సూచన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు మారితేనైనా రాత మారుతుందేమోనని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అయితే, ఢిల్లీ అభిమానులకు పీటర్సన్ ట్వీట్ విపరీతంగా నచ్చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘అసలేం మాట్లాడుతున్నావు. కోహ్లి లేని ఆర్సీబీని ఊహించను కూడా ఊహించలేం. పోయి పోయి ఢిల్లీకి మారాలా? నీ ట్వీట్కు అర్థం ఏమిటి? ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడు. లేదంటే తనకిష్టమైన ధోని సారథ్యంలోని సీఎస్కేకు ఆడతాడు. అంతేగానీ.. నీ చెత్త సలహాలు ఎవరికీ అవసరం లేదు’’ అంటూ పీటర్సన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్బేస్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్ను ముగించింది. చదవండి: ముంబై కోసమే గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్ #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. Time for VIRAT to make the move to the capital city…! #IPL — Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023 -
IPL 2023: గొప్పగా అనిపిస్తోంది.. అయినా వాళ్లకేం తెలుసు?: విరాట్ కోహ్లి
IPL 2023 RCB- Virat Kohli: ‘‘చాలా మంది నా టీ20 క్రికెట్ గురించి ఏదేదో మాట్లాడారు. సరిగ్గా ఆడటం లేదని విమర్శించారు. కానీ నాకెప్పుడూ నా ఆట తీరుపై ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రస్తుతం నేను టీ20లలో అత్యుత్తమంగా ఆడుతున్నాను. నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నేను టీ20 క్రికెట్ ఇలాగే ఆడతాను. గ్యాప్స్ మధ్య బౌండరీలు బాదుతూ.. పరిస్థితి నాకు అనుకూలంగా మారినపుడు మరింత స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడుతూ ఉంటాను’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. రికార్డులు బద్దలు ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఎడిషన్లో వరుసగా రెండు సెంచరీలు బాది.. క్యాష్ రిచ్లీగ్లో ఓవరాల్గా ఏడు శతకాలతో రికార్డులు బద్దలు కొట్టాడు. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సెంచరీ చేసి జట్టును గెలిపించడంతో కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లకేం తెలుసు? ఇదిలా ఉంటే.. కోహ్లి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రవిశాస్త్రితో మాట్లాడుతూ తనను విమర్శిస్తున్న వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘నాకు గొప్పగా అనిపిస్తోంది. టీ20 క్రికెట్ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. చాలా మంది స్ట్రైక్రేటు గురించి మాట్లాడుతూ ఉంటారు. గతంలో చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టును గెలిపించడం కోసం ఆడటం గొప్పగా అనిపిస్తుంది. నేను మొదటి నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. నా బ్యాటింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా ఎన్ని పరుగులంటే? కాగా ఈ మ్యాచ్లో రన్మెషీన్.. 61 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కోహ్లి శతకం(100)తో మెరిసిన విషయం తెలిసిందే. గుజరాత్తో మ్యాచ్లో బాదిన సెంచరీ ఈ సీజన్లో కోహ్లికి రెండోది. ఇక ఐపీఎల్-2023లో కింగ్ కోహ్లి మొత్తంగా 639 పరుగులు సాధించి ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు: ►టాస్- గుజరాత్- బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 197/5 (20) ►గుజరాత్ స్కోరు: 198/4 (19.1) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు.. టోర్నీ నుంచి ఆర్సీబీ అవుట్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 104 పరుగులు). చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. -
#Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి..
IPL 2023- RCB Vs GT- Virat Kohli- Shubman Gill: ఒకరిపై అభిమానం హద్దులు దాటి.. మరొకరిపై ద్వేషంగా మారితే.. అటువంటి వాళ్లను ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి తాము దైవంగా భావించే వ్యక్తులు కూడా ఇష్టపడరు. దిగజారుడు వ్యాఖ్యలతో ఎదుటివాళ్లను కించపరిస్తే అస్సలు సహించరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు నెటిజన్లు. అభిమానం ఉండాలి గానీ.. అది ఎదుటివాళ్ల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడింది. కోహ్లి సెంచరీ వృథా.. ఆర్సీబీ అవుట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 197 పరుగులు స్కోరు చేసింది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీ(101) కారణంగా గుజరాత్కు 198 పరుగుల భారీ లక్ష్యం విధించగలిగింది. టార్గెట్ ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గిల్ సిక్సర్ల వర్షం 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడి 104 పరుగులు సాధించాడు. కోహ్లి మాదిరే ఈ సీజన్లో రెండో శతకం నమోదు చేశాడు. గిల్ అజేయ సెంచరీతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మరోవైపు.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కావడం ఫ్యాన్స్ మదిని మెలిపెట్టింది. ఈసారైనా ట్రోఫీ గెలుస్తారనుకుంటే.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటూ ఉసూరుమన్నారు. గిల్తో పాటు అతడి సోదరిని కూడా దారుణంగా ఈ నేపథ్యంలో కొంతమంది ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్తో పాటు అతడి సోదరి షానిల్ గిల్ను కూడా సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. గిల్కు ఏదైనా అపాయం జరగాలని కొంతమంది కోరుకుంటుండగా.. షానిల్ను ఉద్దేశించి మరికొందరు రాయలేని పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. కుటుంబంతో శుబ్మన్ గిల్ వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదు! కోహ్లి ఫ్యాన్స్ అసలే కాదు! అయితే, ఆర్సీబీ ‘అభిమానులం’దరూ అలాగే చేస్తున్నారనుకుంటే పొరపాటే! నిజమైన ఫ్యాన్స్ మాత్రం.. ‘‘కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయిందన్న బాధ ఉంది. నిజానికి.. శుబ్మన్ ఆడిన తీరును కూడా మేము ఆస్వాదించాం. ఆర్సీబీ ఓడినంత మాత్రాన గిల్ను, అతడి సోదరిని విమర్శించే వాళ్లు నిజమైన అభిమానులు అనిపించుకోరు. కాస్త సంయమనం పాటించండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా గతంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచినందుకు కోహ్లిని సైతం ఇలాగే కొంతమంది దారుణంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి అయితే ఏకంగా కోహ్లి చిన్నారి కూతురు వామికను ఉద్దేశించి అత్యాచార బెదిరింపులకు పాల్పడి జైలు పాలయ్యాడు. కాస్తైనా సిగ్గుపడండి! తాజాగా గిల్, అతడి సోదరిపై ట్రోల్స్ వస్తున్న తరుణంలో.. మ్యాచ్ అనంతరం కోహ్లి.. గిల్ను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇద్దరూ హీరోలే. ఆటలో గెలుపోటములు సహజం. మీరెందుకు అనవసరంగా కొట్టుకుంటారు. కోహ్లి, గిల్ ఇద్దరూ రేపు టీమిండియాకు కలిసే ఆడతారు కదా! పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్లు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కాస్తైనా సిగ్గుపడండి’’ అంటూ ట్రోలర్స్కు గడ్డి పెడుతున్నారు. చదవండి: IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
బెంగళూరు ఖేల్ఖతం
బెంగళూరు: కోహ్లి తన జట్టు గెలిచేందుకు చేయాల్సిందంతా చేశాడు. కానీ బెంగళూరు చెత్త బౌలింగ్, అడ్డూఅదుపు లేని ఎక్స్ట్రాలు అతని శ్రమను నీరుగార్చింది. దీంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచింది. ఈ ఓటమితో బెంగళూరు ప్లే ఆఫ్ దశకు అర్హత పొందలేకపోయింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. కోహ్లి (61 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తర్వాత గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 104 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో గుజరాత్ను గెలిపించాడు. విజయ్ శంకర్ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 123 పరుగులు జోడించారు. ఆఖరి దాకా కోహ్లినే... మొన్న హైదరాబాద్ ఆటనే కోహ్లి బెంగళూరులో రిపీట్ చేశాడు. ఓపెనింగ్లో డుప్లెసిస్ (19 బంతు ల్లో 28; 5 ఫోర్లు)తో మంచి ఆరంభం ఇచ్చాడు. డుప్లెసిస్ అవుటయ్యాక మ్యాక్స్వెల్ (11), మహిపాల్ (1) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీకి కోహ్లినే పెద్దదిక్కయి నడిపించాడు. బ్రేస్వెల్ (16బంతుల్లో 26; 5 ఫోర్లు) అండతో కోహ్లి మళ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న బ్రేస్వెల్ను షమీ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేయగా, దినేశ్ కార్తీక్ (0) నిరుత్సాహపరిచాడు. అనూజ్ రావత్ (15 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో కోహ్లి 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 101; డుప్లెసిస్ (సి) తెవాటియా (బి) నూర్ అహ్మద్ 28; మ్యాక్స్వెల్ (బి) రషీద్ 11; మహిపాల్ (స్టంప్డ్) సాహా (బి) నూర్ అహ్మద్ 1; బ్రేస్వెల్ (సి అండ్ బి) షమీ 26; కార్తీక్ (సి) సాహా (బి) యశ్ 0; అనూజ్ (నాటౌట్ ) 23; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–67, 2–80, 3–85, 4–132, 5–133. బౌలింగ్: షమీ 4–0–39–1, యశ్ 4–0–39–1, రషీద్ 4–0–24–1, నూర్ 4–0–39–2, మోహిత్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) పార్నెల్ (బి) సిరాజ్ 12; గిల్ (నాటౌట్) 104; విజయ్ (సి) కోహ్లి (బి) వైశాక్ 53; షనక (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) హర్షల్ 0; మిల్లర్ (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) సిరాజ్ 6; తెవాటియా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–25, 2–148, 3–150, 4–171. బౌలింగ్: సిరాజ్ 4–0–32–2, పార్నెల్ 3.1–0–42–0, వైశాక్ 4–0– 40–1, హిమాన్షు 3–0–28–0, హర్షల్ 4–0–29–1, బ్రేస్వెల్ 1–0–16–0. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మే 23: క్వాలిఫయర్–1 గుజరాత్ టైటాన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 24: ఎలిమినేటర్ లక్నో సూపర్ జెయింట్స్ VS ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 26: క్వాలిఫయర్–2 క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు VS ఎలిమినేటర్ విజేత వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి మే 28: ఫైనల్ క్వాలిఫయర్–1 విజేత VS క్వాలిఫయర్–2 విజేత వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి -
ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!
IPL 2023- SRH Vs RCB: ఐపీఎల్-2023 బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పిచ్చి షోలతో మహిళా యాంకర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. క్రికెట్, క్రికెటర్ల గురించి మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఆట గురించి కాకుండా అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ప్రశ్నలు అడగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ- సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. బీసీసీఐ బాస్ కోడలు సహా ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ‘‘హాట్ ఆర్ నాట్’’ పేరిట స్టార్ స్పోర్ట్స్లో ఓ షో నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ సహా మరో ముగ్గురు యాంకర్లు ఈ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్తో కలిసి సురేన్ సుందరం నిర్వహించిన ఈ షోలో పురుష క్రికెటర్ల అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ఎవరు హాట్గా ఉన్నారో చెప్పాలంటూ అడిగారు. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ తదితరులు షర్టు లేకుండా నీళ్లలో ఉన్న ఫొటోలు స్క్రీన్ మీద చూపించారు. ఇది క్రికెట్ షోనా? సిగ్గుండాలి! మయంతి సహా మిగిలిన ముగ్గురు యాంకర్లు ఆ ఫొటోలు చూసేందుకు అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఇది క్రికెట్ షోనా? లేదంటే మరేదైనానా? స్టార్ స్పోర్ట్స్' రోజురోజుకీ దిగజారి పోతోంది. షో నడిపించడానికి ఇంతకంటే మంచి కంటెంటే దొరకలేదా?’’ అని ఏకిపారేస్తున్నారు. ‘‘సీనియర్, ఓ బిడ్డకు తల్లి అయిన మయంతి లాంటి సీనియర్లకు కూర్చో బెట్టి ఇలాంటి ఫొటోలు చూపిస్తూ ఆ క్వశ్చన్లు అడగటానికి సిగ్గు లేదా?’’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 104 పరుగులు చేయగా.. ఆర్సీబీ స్టార్ కోహ్లి 100 పరుగులు సాధించాడు. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga — I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023 Star with their 'Hot or Not' segment in today's pre-match show clearly embarrassed themselves. Imagine asking a senior anchor and married woman like Mayanti Langer to pick sides for a junior fellow like Shubman Gill. She was clearly uncomfortable. #NotDone#IPL2023 — Subhayan Chakraborty (@CricSubhayan) May 18, 2023 -
అద్భుతం... స్పిన్ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు.. మాస్టర్క్లాస్! ఎవరికీ సాధ్యం కాని రీతిలో
IPl 2023 SRH vs RCB- Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్.. ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకునే క్లాస్ ప్లేయర్. ఈ సీజన్లో ఈ మిడిలార్డర్ ఇప్పటి వరకు చేసిన మొత్తం పరుగులు 430. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సెంచరీతో చెలరేగి ఈ మేరకు స్కోరు సాధించాడు. మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ప్రొటిస్ బ్యాటర్. ఇక ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓడినప్పటికీ క్లాసెన్ తన అద్భుత సెంచరీతో అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో జట్టు మెరుగైన స్కోరు సాధించేలా ఒంటరి పోరాటం చేయడం అలవాటు చేసుకున్న అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం క్లాసెన్ అద్భుత బ్యాటింగ్ ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. ఏ విదేశీ ప్లేయర్కు సాధ్యం కాని రీతిలో ‘‘క్లాసెన్ బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఏ విదేశీ ప్లేయర్ కూడా తనలా ఇండియన్ పిచ్లపై స్పిన్నర్లను అటాక్ చేయడం నేను చూడలేదు. విదేశీ ఆటగాళ్లనే కాదు ఈ టోర్నీలో ఆడుతున్న ప్రతి ఒక్క బ్యాటర్కు కూడా స్పిన్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో తన మాస్టర్క్లాస్తో నిరూపించాడు. గత మూడు మ్యాచ్లలో అతడి బ్యాటింగ్ ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా క్లాసెన్లా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడుతూనే దూకుడు కూడా ప్రదర్శిస్తాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా.. హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్ను కొనియాడాడు. కాగా ఐపీఎల్-2023లో సన్రైజర్స్ తరఫున నిలకడైన ఆట తీరు కనబరుస్తున్న ఏకైక ఆటగాడు అంటే క్లాసెన్ ఒక్కడే! ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో తొలి సెంచరీ సాధించి శతక లోటు కూడా తీర్చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్ Klaasen mowa khundal khundal ke maarre 💯 Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR — JioCinema (@JioCinema) May 18, 2023 -
కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: సింహంతో ఆట.. పులి వేట ఎప్పుడూ ప్రమాదకరమే! అలాగే విరాట్ విశ్వరూపం ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బాల్ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే! ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాడు. ముఖ్యంగా సన్రైజర్స్ పేసర్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లి బాదిన భారీ సిక్సర్(103 మీటర్లు) హైలైట్గా నిలిచింది. అరంగేట్రం చేసిన నితీశ్రెడ్డి ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఆంధ్ర ప్లేయర్ బౌలింగ్లో కోహ్లి తొమ్మిదో ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. కోహ్లి అద్భుతమైన షాట్కు ప్రేక్షకులే కాదు కోహ్లి ఓపెనింగ్ పార్ట్నర్ డుప్లెసిస్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కోహ్లి భారీ సిక్సర్.. డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్ కోహ్లి ఈ మేరకు భారీ షాట్ బాదగానే.. ‘‘వావ్.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లు డుప్లెసిస్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 71 పరుగులు చేశాడు. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసింది. సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్నకు చేరువైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ఆర్సీబీ ఇక ఆర్సీబీతో మ్యాచ్తో అరంగేట్రం చేసిన నితీశ్కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 19 పరుగులు ఇచ్చాడు ఈ యువ పేసర్. ఉప్పల్ మ్యాచ్లో విజయంతో బెంగళూరు జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా.. ఓటమిపాలైన సన్రైజర్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్కరమ్ The Beauty (& the Beast) of #TATAIPL 😎#SRHvRCB #IPLonJioCinema #Kohli https://t.co/qfCZLvS2f6 pic.twitter.com/Ju0rBsfEIA — JioCinema (@JioCinema) May 18, 2023 ICYMI! A treat for the #RCB fans right here in Hyderabad.@imVkohli goes big with a maximum.#TATAIPL #SRHvRCB pic.twitter.com/KbojxpdFvG — IndianPremierLeague (@IPL) May 18, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRHvsRCB : కింగ్ కోహ్లితో అట్లుంటది మరి.. హైదరాబాద్ అంటే పూనకాలే (ఫొటోలు)
-
కోహ్లి సూపర్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కోహ్లి కొడితే కొండ కూడా పిండి కావాలి. ఉప్పల్లో గురువారం సరిగ్గా అదే జరిగింది. ఛేజింగ్లో కోహ్లి ఉప్పెనల్లే చెలరేగడంతో బెంగళూరు 8 వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ను సులువుగా ఓడించింది. మొదట సన్రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ను క్లాసెన్ (51 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతా తానై మెరిపించాడు. హైదరాబాద్ అంతపెద్ద స్కోరు చేస్తే సొంతగడ్డపై సిరాజ్ (4–0–17–1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (63 బంతుల్లో 100; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఆరో సెంచరీ నమోదు చేయగా... డుప్లెసిస్ (47 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా ఆడుకున్నాడు. ఈ శతకంతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా క్రిస్ గేల్ (6 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. అంతేకాకుండా ఒకే జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. అతనొక్కడే... హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ (11), రాహుల్ త్రిపాఠి (15) నిరాశపరిచారు. వీరిద్దరిని బ్రేస్వెల్ ఒకే ఓవర్లో పడగొట్టేశాడు. వాళ్లు చేసింది తక్కువే అయినా ఆ ప్రభావం ఇన్నింగ్స్పై పడకుండా క్లాసెన్ దూకుడుగా నడిపించాడు. కెప్టెన్ మార్క్రమ్ (20 బంతుల్లో 18) అండతో సన్రైజర్స్ స్కోరును అదే పనిగా పెంచాడు. ఈ క్రమంలో బౌండరీలు సిక్సర్లు అవలీలగా బాదేశాడు. క్లాసెన్ వీరబాదుడుతో బలమైన భాగస్వామ్యం వేగంగా నమోదైంది. మార్క్రమ్ను బౌల్డ్ చేసి షహబాజ్ 76 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పలికినా... క్లాసెన్ బ్యాటింగ్ జోరు, పరుగుల హోరేం తగ్గనేలేదు. 49 బంతుల్లోనే శతక్కొట్టేశాడు. ఎట్టకేలకు 19వ ఓవర్లో అతని విధ్వంసానికి హర్షల్ తెరదించాడు. చకచకా లక్ష్యం వైపు... లక్ష్యం కష్టమైందే... మ్యాచ్ ఆర్సీబీకి కీలకమైంది. అందుకే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఛేదనకు తగ్గట్లే అడుగులు వేశారు. చకచకా పరుగులు చేశారు. బౌండరీలతో స్కోరుబోర్డును పరుగెత్తించి... సిక్సర్లతో స్టేడియాన్ని హుషారెత్తించారు. ప్రేక్షకులంతా సొంతజట్టు కంటే బెంగళూరు జట్టుకే జై కొట్టడంతో రెట్టించిన ఉత్సాహంతో ఓపెనింగ్ జోడీ చెలరేగిపోయింది. ఇద్దరు కూడా కలసికట్టుగా చితగ్గొట్టేయడంతో పవర్ప్లేలో ఆర్సీబీ 64/0 స్కోరు చేసింది. 11.1 ఓవర్లలో వంద పరుగుల్ని ఏ కష్టం లేకుండా దాటింది. లక్ష్యతీరానికి చేరాక ఓపెనర్లిద్దరు అవుటైనప్పటికీ మ్యాక్స్వెల్ (5 నాటౌట్), బ్రేస్వెల్ (4 నాటౌట్) డ్రామా లేకుండా ముగించారు. ఉప్పల్లో ఊపేశాడు... ముందుగా డుప్లెసిస్ (34 బంతుల్లో) ఫిఫ్టీ చేస్తే తర్వాతి ఓవర్లోనే కోహ్లి 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అర్ధసెంచరీ అయ్యాక కోహ్లి ఆట మరో లెవెల్కు చేరింది. ఛేదనలో మొనగాడిగా పేరున్న కోహ్లి తన పాత ‘విరాట్రూపం’ చూపించాడు. డ్రైవ్, కట్, హుక్ ఇలా కచ్చితత్వంతో కూడిన షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారడంతో కొండంత లక్ష్యం ఐస్ముక్కలా కరిగిపోయింది. మరో 27 బంతుల్లోనే కింగ్ కోహ్లి 50 నుంచి 100 పరుగులకు చేరుకున్నాడు. భువీ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లి డీప్ మిడ్వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్తో స్టేడియం ఊగిపోయింది. డగౌట్లోని సహచరులే కాదు... గ్యాలరీలోని ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో సవ్వడి చేశారు. అతని అసాధారణ ఇన్నింగ్స్కు ముగ్దులైన ప్రత్యర్థులు సైతం హ్యాట్సాఫ్ చెప్పారు. మరుసటి బంతికి అతను అవుటై నిష్క్రమిస్తుంటే స్టేడియం హోరెత్తింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మహిపాల్ (బి) బ్రేస్వెల్ 11; త్రిపాఠి (సి) హర్షల్ (బి) బ్రేస్వెల్ 15; మార్క్రమ్ (బి) షహబాజ్ 18; క్లాసెన్ (బి) హర్షల్ 104; బ్రూక్ (నాటౌట్) 27; ఫిలిప్స్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–28, 3–104, 4–178. 5–186. బౌలింగ్: సిరాజ్ 4–0–17–1, పార్నెల్ 4–0–35–0, బ్రేస్వెల్ 2–0–13–2, షహబాజ్ 3–0–38–1, హర్షల్ 4–0–37–1, కరణ్ శర్మ 3–0–45–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) భువనేశ్వర్ 100; డుప్లెసిస్ (సి) త్రిపాఠి (బి) నటరాజన్ 71; మ్యాక్స్వెల్ (నాటౌట్) 5; బ్రేస్వెల్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో 2 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–172, 2–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, అభిషేక్ శర్మ 3–0–28–0, నటరాజన్ 4–0–34–1, త్యాగి 1.2–0–21–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–19–0, మయాంక్ డాగర్ 4–0–25–0, ఫిలిప్స్ 1–0–10–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ VS రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
సన్రైజర్స్తో కీలక మ్యాచ్..! బౌలింగ్ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్’ వీడియో వైరల్
IPL 2023- SRH Vs RCH- Virat Kohli: ఐపీఎల్-2023 ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో గెలిచేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ భారమంతా కే.జీ.ఎఫ్. (కోహ్లి, గ్లెన్, ఫాఫ్)పై ఉన్న నేపథ్యంలో వీరు ప్రాక్టీసు చేస్తున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. హోరాహోరీ పోరులో కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఆరింట గెలిచి 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. చెన్నై, లక్నో, ముంబై, ఆర్సీబీ మధ్య మిగతా మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ ఉంది. రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న రాజస్తాన్ సైతం ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఓడిస్తేనే ఆర్సీబీ రేసులో ఉంటుంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే! ‘కే.జీ.ఎఫ్.’ ఏం చేస్తుందో మరి! ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లి.. మాక్సీ, ఫాఫ్నకు బౌలింగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో డుప్లెసిస్ ఇప్పటి వరకు 631 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. కోహ్లి 438, మాక్సీ 384 పరుగులు చేశారు. సన్రైజర్స్తో మ్యాచ్- ఆర్సీబీ తుది జట్టు (అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్, అనుజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. చదవండి: చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ -
వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..
IPL 2023 RR vs RCB: ‘‘ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ మరీ చెత్తగా ఉంది. మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ప్రత్యర్థిని 171 పరుగులకు కట్టడి చేశారు. ఇలాంటి పిచ్ మీద ఈ టార్గెట్ సులువుగానే ఛేదించవచ్చు. అయితే, పవర్ ప్లేలోనే మా వాళ్లు తడబడ్డారు. పరుగులు రాబట్టాలన్న తొందరలో వికెట్లు పారేసుకున్నారు’’ అని రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర అన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 59 పరుగులకే ఆలౌట్ అయి 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సంజూ శాంసన్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పుడే ఆట ముగిసిపోయింది ఈ నేపథ్యంలో సంగక్కర మాట్లాడుతూ.. ‘‘భాగస్వామ్యాలు నమోదు చేయాలని మా వాళ్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ.. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అప్పుడే మా ఆట దాదాపుగా ముగిసిపోయింది. సంజూ తరచుగా ఈరోజు ఆడినటువంటి షాట్ ఆడుతూ ఉంటాడు. కానీ అన్నిసార్లూ రోజులు మనవి కావు. అతడు దూకుడైన ఆటగాడు. జట్టును గెలిపించాలనే తపనతో ఆడతాడు. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పవర్ ప్లేలో సగం వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. వాళ్లు అవుట్ చేయలేదు.. మా అంతట మేమే నిజానికి ఆర్సీబీ బౌలర్లు మమ్మల్ని అవుట్ చేసినట్లు అనిపించలేదు. మాకు మేమే అవుటైనట్లు కనిపించింది. ఈ ఓటమి ఎవరో ఒకరు బాధ్యులు కారు. బ్యాటింగ్ విభాగం మొత్తం ఈరోజు విఫలమైంది’’ అని విచారం వ్యక్తం చేశాడు. తదుపరి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తామని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో వచ్చిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 పూర్తిగా విఫలమయ్యారు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
IPL 2023: బెంగళూరు... ఇంకా ఉంది
జైపూర్: ఇప్పుడు అందరి కళ్లు ప్లే ఆఫ్స్పైనే! ఏడు మ్యాచ్ల్లో గెలిచిన జట్టు కూడా ముందుకెళ్లడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కనీసం ఏడు మ్యాచ్ల్లో గెలిచిన జట్లు గుజరాత్ (8), చెన్నై (7), ముంబై (7) మూడున్నాయి. కాబట్టి ఇకపై ఈ సీజన్లో కసిదీరా గెలవడం కంటే కూడా రన్రేట్తో గెలిచిన జట్లే ముందంజ వేస్తాయి. అందుకేనేమో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసాధారణ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో సజీవంగా ఉంది. రాజస్తాన్ రాయల్స్ను వారి సొంతగడ్డపై 112 పరుగుల భారీ తేడాతో ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (18; 1 ఫోర్) నిరాశపరచగా... కెపె్టన్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. చివర్లో అనూజ్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంతో ఆర్సీబీ 170 పైచిలుకు స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో రాజస్తాన్ ‘ప్లే ఆఫ్’ చేరే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. హెట్మైర్ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్! ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వేన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. నలుగురు డకౌట్’... 172 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), బట్లర్ (0) సహా అశ్విన్ (0), ఆసిఫ్ (0) ఖాతానే తెరువలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లు పార్నెల్, బ్రేస్వెల్, కరణ్ శర్మ మూకుమ్మడి దాడికి క్రీజులో నిలిచేందుకే ఆపసోపాలు పడ్డారు. హెట్మైర్ కొట్టిన 4 సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి కానీ జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. 2017లో ఆర్సీబీ స్కోరు 49 ముందు వరుసలో ఉంటే... తర్వాత రెండు స్కోర్లు రాజస్తాన్వే. 2009లో 58కే కుప్పకూలిన రాయల్స్ ఇప్పుడు ఒక పరుగు ఎక్కువ చేసింది అంతే! స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆసిఫ్ 18; డుప్లెసిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆసిఫ్ 55; మ్యాక్స్వెల్ (బి) సందీప్ శర్మ 54; మహిపాల్ (సి) ధ్రువ్ జురెల్ (బి) జంపా 1; దినేశ్ కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; బ్రేస్వెల్ (నాటౌట్) 9; అనూజ్ రావత్ (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–50, 2–119, 3–120, 4–120, 5–137. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–34–1, ఆడమ్ జంపా 4–0–25–2, యజువేంద్ర చహల్ 4–0–37–0, అశ్విన్ 4–0–33–0, ఆసిఫ్ 4–0–42–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) విరాట్ కోహ్లి (బి) సిరాజ్ 0; బట్లర్ (సి) సిరాజ్ (బి) పార్నెల్ 0; సంజూ సామ్సన్ (సి) అనూజ్ (బి) పార్నెల్ 4; జో రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పార్నెల్ 10; దేవ్దత్ పడిక్కల్ (సి) సిరాజ్ (బి) బ్రేస్వెల్ 4; హెట్మైర్ (సి) బ్రేస్వెల్ (బి) మ్యాక్స్వెల్ 35; ధ్రువ్ జురెల్ (సి) మహిపాల్ (బి) బ్రేస్వెల్ 1; అశ్విన్ (రనౌట్) 0; ఆడమ్ జంపా (బి) కరణ్ శర్మ 2; సందీప్ శర్మ (నాటౌట్) 0; ఆసిఫ్ (సి) విరాట్ కోహ్లి (బి) కరణ్ శర్మ 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 59. వికెట్ల పతనం: 1–1, 2–6, 3–7, 4–20, 5–28, 6–31, 7–50, 8–59, 9–59, 10–59. బౌలింగ్: సిరాజ్ 2–0–10–1, వేన్ పార్నెల్ 3–0–10–3, బ్రేస్వెల్ 3–0–16–2, కరణ్ శర్మ 1.3–0–19–2, మ్యాక్స్వెల్ 1–0–3–1. -
బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.. ఇందుకు నా దగ్గర సమాధానం లేదు: సంజూ
IPL 2023 RR vs RCB: ‘‘టాపార్డర్లో ముగ్గురం బాగానే స్కోర్ చేస్తామనుకున్నాం. పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలనుకున్నాం. కానీ ఈరోజు అది సాధ్యపడలేదు. నిజానికి టోర్నీ ఆరంభం నుంచి జైశ్వాల్, జోస్ అద్భుతంగా ఆడుతున్నారు. కానీ ఈరోజు ఈ పిచ్పై ఇలా జరిగిపోయింది. ఈ మ్యాచ్లో గెలుపునకు ఆర్సీబీ బౌలర్లకే క్రెడిట్ ఇవ్వాలి. ఆద్యంతం అద్బుతమైన ఎనర్జీతో.. గెలవాలన్న కసితో బౌల్ చేశారు. ఒకవేళ మేము పవర్ప్లేలో మంచిగా స్కోర్ చేసి ఉంటే.. లక్ష్యాన్ని ఛేదించగలిగే వాళ్లవేమో! సమష్టి వైఫల్యం కానీ మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదు. మా బ్యాటింగ్ వైఫల్యానికి కారణమేమిటన్న ప్రశ్నకు నా దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు. ఐపీఎల్ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంచనాలు తారుమారు అవడం సహజం. ఈసారి లీగ్ దశలో ఎలాంటి సరదా ఘటనలు జరిగాయో చూశాం. ఈ పరాజయం కారణంగా మేము కుంగిపోము. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ప్రస్తుతం మా దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్పైనే ఉంది. మేము మరింత స్ట్రాంగ్గా ఉండాల్సిన తరుణం. ఈ ఓటమికి ఎవరో ఒకరు కారణం కాదు.. ఇది జట్టు సమష్టి వైఫల్యం’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో రాజస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సొంతమైదనాంలో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన సంజూ శాంసన్ సేనకు 172 పరుగుల లక్ష్యం విధించింది ఆర్సీబీ. ఈ క్రమంలో టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ ఆర్సీబీ బౌలర్ల సమష్టి ప్రదర్శన కారణంగా 10.3 ఓవర్లలోనే రాజస్తాన్ కథ ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో వచ్చిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 స్కోరు చేశారు. దీంతో 112 పరుగుల భారీ తేడాతో రాజస్తాన్ ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: రోహిత్ శర్మతో పోటాపోటీ.. నువ్వు మారవా? ఫ్యాన్స్ ఫైర్ 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
59 పరుగులకే ఆలౌట్.. రాజస్తాన్ చెత్త రికార్డు! ఐపీఎల్ చరిత్రలో..
IPL 2023 RR vs RCB- Wayne Parnell: ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. సంజూ శాంసన్ సేనను 59 పరుగులకే కట్టడి చేసి 112 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతమైదానంలో రాజస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి ఆ జట్టుపై ఆధిపత్యాన్ని చాటుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోహ్లి విఫలమైనా జైపూర్ వేదికగా ఆదివారం (మే 14) జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 18 పరుగులకు పరిమితం కావడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అర్ధ శతకాలతో రాణించి అయితే, ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్(55 పరుగులు)తో జట్టును ఆదుకోగా... వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ అతడికి సహకారం అందించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మహిపాల్ లామ్రోర్(1), దినేశ్ కార్తిక్ (0) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లోనే 29 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. ఆరంభంలోనే కోలుకోలేని షాకులు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ను ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్. గత మ్యాచ్ హీరో యశస్వి జైశ్వాల్ను డకౌట్ చేశాడు. సిరాజ్ ఆర్సీబీ వికెట్ల ఖాతా తెరవగా.. మరో ఫాస్ట్బౌలర్ వేన్ పార్నెల్ జోష్ను కొనసాగించాడు. జోస్ బట్లర్ను డకౌట్ చేసిన అతడు.. సంజూ శాంసన్ను కూడా పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక బ్రేస్వెల్, కర్ణ్ శర్మ కూడా విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. చెత్త రికార్డు.. మూడోసారి తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడోసారి అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా 2017లో కేకేఆర్తో మ్యాచ్లో 49(కోల్కతాలో), 2009లో ఆర్సీబీ చేతిలో 58 పరుగుల తేడా(కేప్టౌన్)తో రాజస్తాన్ చిత్తైంది. తాజాగా జైపూర్ మ్యాచ్లో 59 పరుగులకే కథ ముగించింది. ఆర్సీబీ బౌలర్లు అదుర్స్ ఇక రాజస్తాన్ తర్వాత అత్యల్ప స్కోరుకు అవుటైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది. 2017లో ఢిల్లీలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ 66 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా రాజస్తాన్తో తాజా మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీ మిగతా బౌలర్లలో సిరాజ్, మాక్సీ ఒక్కో వికెట్ తీయగా.. బ్రేస్వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: సీఎస్కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను.. 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
రోహిత్ శర్మతో పోటాపోటీ.. నువ్వు మారవా? ఫ్యాన్స్ ఫైర్
IPL 2023 RR vs RCB: రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ విఫలమయ్యాడు. డకౌట్గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ ఆదివారం (మే 14) రాజస్తాన్తో తలపడుతోంది. జైపూర్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరు అర్ధ శతకాలతో ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి(18) మరోసారి నిరాశపరచగా, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ సైతం హాఫ్ సెంచరీ(33 బంతుల్లో 54 పరుగులు)తో రాణించాడు. కాగా పదిహేనో ఐదో బంతికి రాజస్తాన్ బౌలర్ కేఎం ఆసిఫ్ డుప్లెసిస్ను పెవిలియన్కు పంపగా.. మహిపాల్ లామ్రోర్ క్రీజులోకి వచ్చాడు. తుస్సుమన్న డీకే ఈ క్రమంలో పదహారో ఓవర్ మొదటి బంతికే ఆడం జంపా అతడిని అవుట్ చేశాడు. కేవలం ఒక్కే పరుగు చేసి ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన లామ్రోర్ స్థానంలో డీకే వచ్చాడు. ఆ మరుసటి బంతికే జంపా దినేశ్ కార్తిక్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎల్బీడబ్ల్యూ అయిన డీకే డకౌట్గా వెనుదిరిగాడు. అప్పటికి ఆర్సీబీ స్కోరు 120 పరుగులు మాత్రమే! ఈ క్రమంలో మాక్సీ బ్యాట్ ఝులిపించడం.. అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ 171 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్తో మ్యాచ్లో డకౌట్ కావడం ద్వారా మరోసారి చెత్త రికార్డు నమోదు చేశాడు. చెత్త రికార్డు.. డక్ల వీరులు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి చరిత్రకెక్కాడు. వీరిద్దరు ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 16 డక్లు నమోదు చేశారు. 15 డకౌట్లతో మన్దీప్ సింగ్, సునిల్ నరైన్ వీరి తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో డీకే ఆట తీరుపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ‘‘ఇకనైనా మారు డీకే! అప్పుడేమో ఫినిషర్గా అదరగొట్టావు.. ఇప్పుడేమో డకౌట్లలో రోహిత్తో పోటీ పడుతున్నావు. రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నావు’’ అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కాగా గతేడాది ఫినిషర్గా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే.. ప్రస్తుత ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన 11 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగులు 140. అత్యధిక స్కోరు 30. ఈ గణాంకాలను బట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు Most ducks in IPL History 16- Dinesh Karthik 16- Rohit Sharma Tough Competition between them 🤩#IPL2O23 #RRvRCB pic.twitter.com/6deEKumtMj — 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) May 14, 2023 -
సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను..
Virat Kohli- Mohammed Siraj: ‘‘విరాట్ భయ్యా రాత్రి 11 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆరోజు సెంచరీ చేశానా.. లేదంటే సున్నా స్కోరుకే పరిమితమయ్యానా అన్న విషయంతో భయ్యాకు సంబంధం ఉండదు. ముందు రోజు ఎలా ఉన్నా మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కల్లా ఎంతో ఉత్సాహంగా పలకరిస్తాడు. యథావిథిగా జిమ్లో కలుస్తాడు కోహ్లి భయ్యా సెట్ చేసిన ఫిట్నెస్ ప్రమాణాలు వేరే లెవల్ అంతే! క్రికెటర్గా ఇంత సాధించినప్పటికీ.. ఆయన అస్సలు రిలాక్స్ కాడు. మరింత మెరుగ్గా ముందుకు సాగాలనే ఎల్లవేళలా తాపత్రయపడుతుంటాడు. భయ్యాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’’ అంటూ టీమిండియా స్టార్ పేసర్, ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆర్సీబీకి మారిన తర్వాతే టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ భయ్యా తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. కాగా సన్రైజర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ సిరాజ్.. ఆర్సీబీకి మారిన తర్వాత అతడి దశ తిరిగింది. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన సిరాజ్ 2017లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2019లో వన్డేల్లో, 2020లో టెస్టుల్లో అడుగుపెట్టిన అతడు ప్రస్తుతం టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. నా పెద్దన్న టీమిండియా క్రికెటర్గా సిరాజ్ ఈస్థాయికి ఎదగడంలో కోహ్లిది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఇక తనను ఇంతగా ప్రోత్సహించిన కోహ్లిని పెద్దన్నగా భావించే సిరాజ్ మియా బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఆటగాడిగా కోహ్లి పరుగుల దాహం తీరనిదంటూ ప్రశంసలు కురిపించాడు. ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి జిమ్లో నిరంతరం శ్రమిస్తాడని.. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడని చెప్పుకొచ్చాడు. కాగా సిరాజ్ టెస్టు అరంగేట్రం చేసే సమయానికి అతడి తండ్రి కన్నుమూసిన విషయం విదితమే. టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్కు తండ్రి మరణించాడనే పిడుగులాంటి వార్త తెలిసింది. అయినప్పటికీ, తండ్రి కలను నెరవేర్చాలనే సంకల్పంతో బాధను దిగమింగుకుని.. ఆసీస్ గడ్డపై అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అప్పుడు ఏడ్చేశాను ‘‘జాతీయ గీతం ఆలపించేటపుడు నేను ఏడ్చేశాను. నా టెస్టు అరంగేట్రం అద్బుతంగా జరిగింది. టెస్టు క్రికెట్ ఆడితేనే ఆటగాడిగా నీకు గౌరవం దక్కుతుందని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఒకవేళ ఆయన బతికి ఉంటే.. తన కలను నెరవేర్చినందుకు నన్ను చూసి గర్వపడేవారు. ఆయన భౌతికంగా మాకు దూరమైనా.. ఆయన దీవెనలు నాకెప్పుడూ ఉంటాయి’’ అని సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లి, సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నారు. వీరిద్దరు జూన్లో జరుగబోయే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టుకు ఎంపికయ్యారు. చదవండి: WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్గా అతడే! ద్రవిడ్తో కలిసి వాళ్లంతా.. లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! -
ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్తాన్ ఆలౌట్.. బెంగళూరు ఘన విజయం
Rajasthan Royals vs Royal Challengers Bangalore Updates: ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 59 పరుగులకే సంజూ శాంసన్ సేనను కట్టడి చేసి 112 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సొంతమైదానంలో రాజస్తాన్ను మట్టికరిపించి రన్రేటు భారీగా పెంచుకుని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్ తొలి వికెట్ తీసి ఖాతా వెరవగా.. పార్నెల్ మూడు వికెట్లతో చెలరేగాడు. మైకేల్ బ్రేస్వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. మాక్సీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. హెట్మెయిర్ ఇన్నింగ్స్కు తెర 9.5: ఆర్సీబీతో మ్యాచ్లో కాస్తో కూస్తో నిలకడగా ఆడుతున్న హెట్మెయిర్ కూడా అవుటయ్యాడు. మాక్స్వెల్ బౌలింగ్లో స్వీప్షాట్కు యత్నించి బంతిని గాల్లోకి లేపిన హిట్టర్ హెట్మెయిర్(19 బంతుల్లో 35 పరుగులు) బ్రేస్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు 59/8 (9.5) వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 7.6: కర్ణ్ శర్మ బౌలింగ్లో హెట్మెయిర్, అశ్విన్ సమన్వయలోపం కారణంగా రనౌట్ సంభవించింది. అశూ డకౌట్గా వెనుదిరిగాడు హెట్మెయిర్ (32), ఆడం జంపా క్రీజులో ఉన్నారు. స్కోరు: 50-7(8) పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్ 6.6: బ్రేస్వెల్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ అవుట్. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్. స్కోరు: 31-6(7) 5.3: ఆర్సీబీ బౌలర్ పార్నెల్ మరోసారి రాజస్తాన్ను దెబ్బకొట్టాడు. బట్లర్, సంజూ వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతడు.. జో రూట్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ నేపథ్యంలో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 28 పరుగులు (28/5 (6)) చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 4.2: బ్రేస్వెల్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన పడిక్కల్. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. జో రూట్, షిమ్రన్ హెట్మెయిర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 26/4 (4.5) మూడో వికెట్ డౌన్ 1.4: పార్నెల్ బౌలింగ్లో అనూజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంజూ శాంసన్(4). మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్. 1.2: పార్నెల్ బౌలింగ్లో జోస్ బట్లర్ డకౌట్. సంజూ శాంసన్, జో రూట్ క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ స్కోరు: 7/2 (1.3) యశస్వి డకౌట్ రాజస్తాన్కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను పెవిలియన్కు పంపాడు. సిరాజ్ బౌలింగ్ల కోహ్లికి క్యాచ్ ఇచ్చిన యశస్వి డకౌట్గా వెనుదిరిగాడు. ఆర్సీబీ స్కోరెంతంటే జైపూర్లో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి (18) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ డుప్లెసిస్(55), వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(54) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17.3: సందీప్ శర్మ బౌలింగ్లో హాఫ్ సెంచరీ హీరో మాక్స్వెల్(54) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ. ►వరుస క్రమంలో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. జంపా బౌలింగ్లో దినేష్ కార్తీక్ డకౌట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 123/4 మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 120 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మహిపాల్ లోమ్రోర్.. జంపా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 119 పరుగులు వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. కేఎం ఆసిఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 98/1 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(44), మ్యాక్స్వెల్(33) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 78/1 10 ఓవర్లు ముగిసే ఆర్సీబీ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(37), మ్యాక్స్వెల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 50 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఆసీఫ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 34/0 5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(15), డుప్లెసిస్(18) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 12/0 టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), డుప్లెసిస్(3) పరుగులతో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ ఐపీఎల్-2023లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఒకే మార్పు చేసింది. తుది జట్లు: ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ రాజస్తాన్ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, కేఎం ఆసిఫ్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా -
నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ
IPL 2023- KKR Star Suyash Sharma: ‘‘గతేడాది నేను అండర్-19 ట్రయల్స్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాను. కానీ సెలక్ట్ కాలేకపోయాను. ట్రయల్స్లో ఎంపికైన వాళ్ల జాబితాను మధ్యరాత్రి 12. 30- ఒంటి గంట మధ్య విడుదల చేశారు. కానీ అప్పటికే నేను నిద్రపోయాను. తెల్లవారి మూడు గంటలకు నిద్రలేచిన తర్వాత లిస్టు చూశాను. ఆ తర్వాత రెండు గంటల పాటు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను’’ అంటూ కోల్కతా నైట్ రైడర్స్ యువ స్పిన్నర్ సూయశ్ శర్మ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. రూ. 20 లక్షలతో న్యూఢిల్లీలో జన్మించిన.. పందొమిదేళ్ల సూయశ్ శర్మ దేశవాళీ క్రికెట్లో ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఏ ట్రోఫీ టోర్నీలో మాత్రమే ఆడాడు. ఈ ఈవెంట్లో మొత్తంగా 5 మ్యాచ్లు ఆడి కేవలం రెండు వికెట్లే పడగొట్టిన సూయశ్ ఐపీఎల్-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్ కనీస ధర రూ. 20 లక్షలకు అతడిని కొనుగోలు చేసిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ మణికట్టు స్పిన్నర్ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా దింపినందుకు మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుని పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆర్సీబీపై విజయంలో తన వంత పాత్ర పోషించి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. గుండు చేసుకున్నా ఇక ఇప్పటి వరకు ఐపీఎల్-2023లో 9 మ్యాచ్లు ఆడిన సూయశ్ 10 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. బ్లాక్ హెడ్బ్యాండ్తో కనిపించే యువ స్పిన్నర్ ఎంత ప్రయత్నించినా అండర్-19 ట్రయల్స్లో సెలక్ట్ కాలేకపోయానంటూ తాజా ఐపీఎల్ ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు. ‘‘వాళ్లు నన్ను బౌలింగ్ చేయమని చెప్పారు. కానీ నేను అక్కడకు వెళ్లగానే నన్ను అసలు పట్టించుకోలేదు. సెలక్ట్ చేయలేదు. నేను ఏడుస్తూ ఇంటికొచ్చాను. వెంటనే నా తల మొత్తం షేవ్ చేసుకున్నా(గుండు చేసుకున్నా). ఎంతో ఆశగా వెళ్లిన నేను తీవ్ర నిరాశకు లోనయ్యాను. నాకే ఎందుకిలా? ఎంత ప్రయత్నించినా నాకే ఎందుకిలా జరుగుతోందనంటూ వెక్కి వెక్కి ఏడ్చాను’’ అని సూయశ్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ చేదు అనుభవం నుంచి త్వరగానే కోలుకున్నానన్న సూయశ్.. తన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టానని.. ఏదో ఒకరోజు ఇంటి నుంచే తన సెలక్షన్ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానన్నాడు. ఐపీఎల్-2023 మినీ వేలం రూపంలో తన కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా ఎన్నో అవమానాల తర్వాత తన కెరీర్లో ఆర్సీబీ వంటి పటిష్ట జట్టుతో తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడిన సూయశ్.. తనదైన ముద్ర వేయగలిగాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్తో గురువారం నాటి మ్యాచ్లో సూయశ్ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. చదవండి: షాపులో పనిచేసి.. కష్టాలకోర్చి.. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూ!; జై షా ట్వీట్ వైరల్ రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ 🗣Suyash Sharma: "I shaved my head after I wasn't picked for the U-19. The list came out at 12:30 AM and I woke up at 3:00 AM and got to know about it. I cried for the next two hours. Then I decided that I will improve my skills and one day they will pick me from my house." pic.twitter.com/vAdkWjsaJW — KnightRidersXtra (@KRxtra) May 11, 2023 Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై నమ్మకం ఉంచారు: కోహ్లి భావోద్వేగ పోస్ట్
Virat Kohli On Mentor Who Inspired Him To Don India Jersey: ‘‘కొంత మందికి ఎల్లప్పుడూ ఆటే ప్రాధాన్యం. నేను ఆట మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి నాపై నమ్మకం ఉంచిన వాళ్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకోవడం ముఖ్యం. నేను ఎల్లప్పుడూ రాజ్కుమార్ సర్కు రుణపడి ఉంటాను. ఆయన నాకు కేవలం కోచ్ మాత్రమే కాదు.. నాకు మార్గదర్శనం చేసిన మెంటార్ కూడా! నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎల్లవేళలా ఆయన నాకు మద్దతుగా నిలిచారు. క్రికెటర్ కావాలనే పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై ఆయన నమ్మకం ఉంచారు. ఆయన ప్రోత్సాహమే 15 ఏళ్ల క్రితం నేను ఇండియన్ జెర్సీ వేసుకునే దిశగా ముందడుగు వేసేందుకు ఊతం ఇచ్చింది. నా కలను మీ కలగా భావించారు. ఎన్నెన్నో సలహాలు, సూచనలు, బ్యాటింగ్లో మెళకువలు.. డీలా పడినపుడు వెన్నుతట్టి ప్రోత్సహించడం.. ఇన్ని చేసిన మీకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి థాంక్యూ నోట్ షేర్ చేశాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన కోహ్లి.. ఆయన పట్ల కృతజ్ఞతా భావం చాటుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఓ బ్రాండ్ ప్రమోషన్ సందర్భంగా తన కోచ్ స్టోరీ ఇది అంటూ ఈ మేరకు రన్మెషీన్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది. ఓనమాలు నేర్పిన గురువు కాగా కోహ్లికి క్రికెట్లో ఓనమాలు నేర్పిన గురువు రాజ్కుమార్. అతడి ప్రోత్సాహంతో తన కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసిన విరాట్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్త్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. టీమిండియా ముఖచిత్రంగా మారి జట్టును ముందుండి నడిపించి బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. 2008లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికే 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం సమకాలీనుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రికార్డుల రారాజు ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించి రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇప్పటికే కెరీర్లో శిఖరాగ్రస్థాయికి చేరుకున్న కోహ్లి.. అందుకు బీజం పడిన చోటును, తను జీరోగా ఉన్న సమయంలో వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువును ఎన్నడూ మరువలేదు. సందర్భానుసారం రాజ్కుమార్కు ధన్యవాదాలు తెలుపుకొంటూనే ఉన్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన రాజ్కుమార్ కాళ్లకు నమస్కరించి సముచిత గౌరవం ఇచ్చాడు. తాజాగా మరో పోస్టుతో కృతజ్ఞతలు తెలుపుకొంటూ తన మనసులో ఆయన స్థానం గురించి చెప్పుకొచ్చాడు. చదవండి: ధోనిని అలా చూడలేకపోయా.. నా హృదయం ముక్కలైంది! వైరల్ వీడియో MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం!
IPL 2023 MI vs RCB: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడి ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు. స్కై ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని.. బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ఐపీఎల్-2023లో భాగంగా ముంబైతో ఆర్సీబీ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. ఉఫ్మని ఊదేసిన ముంబై ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో ముంబై 16.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు నష్టపోయి.. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇలా విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డ సూర్య ముంబైకి మర్చిపోలేని విజయం అందించాడు. కనీసం 20 పరుగులు చేసి ఉంటే ఇక మెరుగైన స్కోరు నమోదు చేసిప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ.. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. తాము మరో 20 పరుగులు స్కోర్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముంబై పటిష్ట జట్టు. అందులోనూ వారి సొంతమైదానం. మేము 20 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ముంబైలాంటి జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నిజానికి ఆఖరి ఐదు ఓవర్లలో మేము సరిగా ఆడలేకపోయాం. 200 అనేది మెరుగైన స్కోరు అని చెప్పగలం. డుప్లెసిస్, సూర్య (PC: IPL) అతడు అద్భుతం మనకు మనం సర్దిచెప్పుకోవడానికి మాత్రమే అలా అనుకోవాల్సి ఉంటుంది! నిజానికి వాళ్లు మొదటి ఆరు ఓవర్ల(62/2)ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా స్కై(సూర్య) బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతడిని ఆపడం ఎవరితరం కాలేదు. ఇక సిరాజ్ ఐపీఎల్ ఆరంభం నుంచి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్యాటర్లు కూడా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. పవర్ప్లేలో కనీసం 60 పరుగులు రాబడితేనే పోటీలో నిలవగలం’’ అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ పేసర్లు సిరాజ్, హర్షల్ పటేల్ పూర్తిగా తేలిపోయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆర్సీబీ తరఫున 1000 పరుగులు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఫాఫ్.. 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. ఆర్సీబీ తరఫు 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా గతేడాది బెంగళూరు సారథిగా పగ్గాలు చేపట్టిన ఫాఫ్ బ్యాటర్గానూ, కెప్టెన్గానూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి కేవలం ఒకే పరుగుకు పరిమితం కావడం కూడా ప్రభావం చూపింది. చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! Faf Du Plessis in IPL 2023: - 73(43) vs MI - 23(12) vs KKR - 79*(46) vs LSG - 22(16) vs DC - 62(33) vs CSK - 84(56) vs PBKS - 62(39) vs RR - 17(7) vs KKR - 44(40) vs LSG - 45(32) vs DC - 65(41) vs MI Captain, Leader, Legend, Faf. pic.twitter.com/KXXoHlc6pA — Johns. (@CricCrazyJohns) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
నీతో నీకే పోటీ.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్! ట్రోఫీ గెలవకపోయినా..
IPL 2023- MI Vs RCB: ఐపీఎల్-2023లో వరుస పరాజయాలతో ఢీలా పడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ.. తాజాగా ముంబైలోనూ పరాభవాన్ని మూటగట్టుకుంది. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ విజయంతో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకురాగా.. వరుస ఓటముల నేపథ్యంలో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. వీటిలో భారీ తేడాతో గెలుపొందితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే.. ‘‘ఈ సాలా కప్ నామ్దే’’ అని గంపెడాశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి నిరాశతప్పదు. నిజానికి ఆర్సీబీ ఆరంభంలో బాగానే ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణించడం కలిసి వచ్చింది. వీరికి తోడు మాక్స్వెల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో వరుస విజయాలు సాధించింది. అప్పుడు హాఫ్ సెంచరీ చేసినా కానీ.. ప్రస్తుతం.. ముఖ్యంగా గత రెండు మ్యాచ్లలో సీన్ రివర్స్ అయింది. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి 55, డుప్లెసిస్ 45 పరుగులు సాధించగా.. మాక్సీ డకౌట్ అయ్యాడు. మరో బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ అర్థ శతకం సాధించడంతో 181 పరుగులు చేయగలిగిన ఆర్సీబీ.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఓటమిని అంగీకరించకతప్పలేదు. ఇప్పుడు పూర్తిగా వైఫల్యం ఇక ముంబైతో మ్యాచ్లో కోహ్లి 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే పరిమితం కావడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ డుప్లెసిస్ (65), మాక్సీ(68) రాణించడంతో 199 పరుగులు సాధించగలిగింది. కానీ మరోసారి బౌలర్లు చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్ను కూడా ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆసక్తిర పోస్టుతో ముందుకు వచ్చాడు. ముంబైతో మ్యాచ్లో తన వైఫల్యం, ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో.. ‘‘ఒత్తిళ్లను అధిగమించి నీతో నువ్వే పోరాడాలి. వాస్తవంలోనూ నీతో నీకే అసలైన పోటీ ఉంటుంది’’ అంటై లైట్ కింద కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు. కోహ్లి వర్సెస్ కోహ్లి అంతే ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘నువ్వు నిజమైన హీరోవి. కప్ గెలిచినా.. గెలవకపోయినా నా మనస్సులో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. నీలో ప్రయత్నలోపం లేదు. జట్టును గెలిపించేందుకు నీ వంతు కృషి చేస్తున్నావు’’ అని పేర్కొంటున్నారు. ఇక మరికొందరేమో.. కోహ్లిని లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ కవ్విస్తూ పెట్టిన పోస్టులను ఉద్దేశిస్తూ.. భలే కౌంటర్ ఇచ్చాడని.. ఈ ప్రపంచంలో కోహ్లికి కోహ్లితోనే పోటీ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్!
IPL 2023- MI Vs RCB- #Naveen-ul-Haq- Virat Kohli: అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్- ఉల్- హక్ మరోసారి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని కవ్వించాడు. వరుస ఇన్స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘చిల్లర వేషాలు మానుకోకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. మా కింగ్తో పెట్టుకుంటే నీకు దబిడి దిబిడే’’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోహ్లి వర్సెస్ నవీన్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- నవీన్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపొందిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో కూడా నవీన్ కోహ్లితో అనుచితంగా ప్రవర్తించాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు. అగ్నికి ఆజ్యం పోసిన గంభీర్ ఇంతలో లక్నో మెంటార్ గంభీర్ జోక్యం చేసుకోవడం.. గొడవ మరింత పెద్దదికావడం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ కోహ్లి, గంభీర్ల మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించడంతో పాటు నవీన్కు కూడా ఫీజులో 50 శాతం తగ్గిస్తూ జరిమానా విధించింది. అయితే, ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా కూడా వార్కి దిగారు. పరస్పరం విమర్శించుకుంటూ పోస్టులతో హల్చల్ చేశారు. తాజాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కోహ్లి నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన విషయం తెలిసిందే. కోహ్లి అవుట్ కాగానే అలా ఈ నేపథ్యంలో మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫొటోను పంచుకున్న నవీన్.. మ్యాంగోస్ తియ్యగా ఉన్నాయంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి విఫలమైనప్పటికీ ఆర్సీబీ 199 పరుగులు స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో ఇలా ఈ నేపథ్యంలో సూర్యకుమార్- వధేరా ఆర్సీబీ ఓటమిని ఖరారు చేసే క్రమంలో వాళ్లిద్దరు ఒకరికొకరు అభినందించుకుంటున్న ఫొటోను షేర్ చేసిన నవీన్.. ‘‘రౌండ్ 2.. ఇంత తియ్యటి మామిడి పండ్లను నేను ఎప్పుడూ తినలేదు.. సూపర్’’ అంటూ మరోసారి కోహ్లి ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడు. దీంతో కింగ్ కోహ్లి అభిమానులు అతడిపై విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్లోనే లేకుండా పోతావ్ ‘‘ఎక్స్ట్రాలు చేస్తే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్.. జాగ్రత్త. నువ్వెంత.. నీ అనుభవం ఎంత? ముందు నీ ఆట గురించి నువ్వు చూసుకో.. తర్వాత ఇతరులపై రాళ్లు వేద్దువు గానీ’’ 23 ఏళ్ల నవీన్కు అని చురకలు అంటిస్తున్నారు. కాగా నవీన్కు మైదానంలో సీనియర్లతో గొడవపడటం ఇదేమీ కొత్తకాదు. మహ్మద్ ఆమిర్, షాహిద్ ఆఫ్రిది వంటి ముదుర్లతో కూడా పేచీలు పెట్టుకున్న ‘ఘనత’ అతడిది!! ఇప్పటి వరకు ఇద్దరు కాగా ఐపీఎల్-2023లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్లో కలిపి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇక నవీన్ విషయానికొస్తే.. ఈ సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన అతడు.. 4 ఇన్నింగ్స్లో 6.12 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ Naveen ul haq's insta story after Kohli got out for 1(4)😭😭😭😭 pic.twitter.com/RIw4Y5yISe — ` Frustrated CSKian (@kurkureter) May 9, 2023 WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్
IPL 2023- MI Vs RCB- Virat Kohli- Suryakumar Yadav: ఐపీఎల్-2023 ఆరంభంలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డారు. బెంగళూరు జట్టు విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్య తన విశ్వరూపం ప్రదర్శించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అసలైన టీ20 స్టార్ ఐపీఎల్లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్లో ఒకటిగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్ను ప్లే ఆఫ్ రేసులో ముందుకు తీసుకువచ్చాడు. దీంతో సూర్య ఆట తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలైన టీ20 స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ను కొనియాడుతున్నారు ఫ్యాన్స్. సూర్యను హత్తుకున్న కోహ్లి ఇదిలా ఉంటే.. సూర్య అద్భుత ఇన్నింగ్స్కు అభిమానులే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారనడంలో అతిశయోక్తి కాదు. ఇక ఆర్సీబీ ఓపెనర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సూర్య ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతడిని అభినందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విజయ్ కుమార్ వైశాక్ బౌలింగ్లో అవుటై పెవిలియన్కు వెళ్తున్న సమయంలో సూర్యను హత్తుకున్న కోహ్లి.. అతడి వెన్నుతట్టి శుభాభినందనలు తెలిపాడు. కాలం మారుతుంది.. మనసులు గెలుచుకుంది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరి మధ్య జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. ‘‘కాలం మారుతుంది.. ఏదేమైనా సూర్య పట్ల కోహ్లి ఆత్మీయత నిజంగా మా మనసులు గెలుచుకుంది’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2020 సందర్భంగా కీలక మ్యాచ్లో ఆర్సీబీని ముంబై ఓడించడంలో సూర్య ప్రధాన పాత్ర పోషించాడు. అప్పుడలా.. ఇప్పుడిలా నాటి మ్యాచ్లో ఆ గెలుపుతో ఆ ఏడాది ముంబై ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, దూకుడుగా ఆడుతున్న సూర్య దగ్గరకు వచ్చిన కోహ్లి అతడిని కవ్వించే ప్రయత్నం చేయగా.. సూర్య మిన్నకుండిపోయాడు. ఇక ఆ తర్వాత సూర్య టీమిండియాలోకి రావడం.. ఇద్దరూ కలిసి తమ అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందించడం తెలిసిందే. తాజా వీడియో నేపథ్యంలో ఫ్యాన్స్ మరోసారి గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మంగళవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో కోహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్కైనా వెనుకాడటం లేదు: రోహిత్ శర్మ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! Virat Kohli appreciated Suryakumar Yadav's madness at Wankhede. A lovely moment! pic.twitter.com/YsczOW5STq — Mufaddal Vohra (@mufaddal_vohra) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!
IPL 2023- MI Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చెత్త బౌలర్ను ఎక్కడా చూడలేదని.. వచ్చే ఏడాదైనా అతడిని వదిలించుకోవాలని ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. బంగారం కోసం వెదుకుతూ.. వజ్రం లాంటి యజువేంద్ర చహల్ను వదులుకున్నారంటూ చురకలు అంటిస్తున్నారు. ఈసారి కూడా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని.. ఇలాంటి బౌలర్ను ఆడిస్తే మూల్యం చెల్లించక తప్పదంటూ పెద్ద ఎత్తున హర్షల్ను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి విఫలం ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు మొత్తంగా 11 ఇన్నింగ్స్ ఆడిన ఈ గుజరాతీ బౌలర్ 388 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.94. ఇక ముంబై ఇండియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో హర్షల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై చేతిలో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దూకుడు నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. హర్షల్ ఒక్కడే కాదు హర్షల్ ఒక్కడే కాదు మహ్మద్ సిరాజ్(3 ఓవర్లలో 31 పరుగులు, 0 వికెట్) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. వనిందు హసరంగా రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. విజయ్ కుమార్ వైశాక్ సైతం చెత్తగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా ఆర్సీబీ బౌలర్ల నాసికరం బౌలింగ్ కారణంగా ముంబై 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లను సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్న ఫ్యాన్స్.. ముఖ్యంగా హర్షల్ పటేల్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్కైనా వెనుకాడటం లేదు: రోహిత్ శర్మ Next sala cup namde without harshal patel in team @RCBTweets #MIvRCB pic.twitter.com/KwuzRXFdTS — Mr.littleboy (@chitti_babu__) May 9, 2023 1 like = 1 slap to Harshal Patel 1 retweet = 10 slap to Harshal Patel pic.twitter.com/Ptd15eUV0z — SUPRVIRAT (@ishantraj51) May 9, 2023 Harshal Patel#MIvsRCB #RCBvsMI pic.twitter.com/rF524cSO4f — Bhushan Kamble (@Vibewithbhusshh) May 9, 2023 WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్కైనా వెనుకాడటం లేదు: రోహిత్ శర్మ
IPL 2023 MI Vs RCB: ‘‘పిచ్ బాగుంది. ఇలాంటి చోట కాస్త మెరుగ్గా ఆడినా పరుగులు రాబట్టవచ్చు. ఆ నలుగురు అద్భుతంగా ఆడారు’’ అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్లో దాదాపు అన్ని జట్లు గెలిచేందుకు ఎంతటి రిస్క్కైనా వెనకాడటం లేదని, భారీ టార్గెట్ల ఛేదనే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు. కోహ్లి విఫలం ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో జేసన్ బెహ్రెన్డార్ఫ్ ఆరంభంలోనే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(1) వికెట్ తీసి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (41 బంతుల్లో 65 పరుగులు) చెలరేగడంతో ఆర్సీబీ కోలుకుంది. డుప్లెసిస్కు తోడు గ్లెన్ మాక్స్వెల్(33 బంతుల్లో 68 పరుగులు) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో దినేశ్ కార్తిక్ (18 బంతుల్లో 30) మెరుగ్గా రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 199 పరుగులు చేసింది. ఇషాన్ తుపాన్.. సూర్య సునామీ ఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి రోహిత్ శర్మ ఆరంభంలోనే అవుట్ కావడంతో షాక్ తగిలినట్లయింది. అయితే, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(21 బంతుల్లో 42 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్కు తోడు.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 83 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. వధేరా ఊచకోత వీరితో పాటు నేహల్ వధేరా మెరుపులు మెరిపించడం(34 బంతుల్లో 52, నాటౌట్)తో 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారంటూ తమ బ్యాటర్లు ఇషాన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్య, వధేరాలను అభినందించాడు. అతడి నైపుణ్యాల గురించి తెలుసు అదే విధంగా తమ పేసర్ ఆకాశ్ మధ్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆకాశ్ గతేడాది కూడా మాతో పాటే ఉన్నాడు. అతడి నైపుణ్యాల గురించి మాకు తెలుసు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని భావించాం. దేశవాళీ క్రికెట్లో ఉత్తరాఖండ్ను ముందుండి నడిపించే ఆకాశ్.. ఈరోజు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. జట్టుకు ఏం కావాలో ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఆటకు తగ్గ ప్రతిఫలం ఇక ఆర్సీబీని 200 లోపు స్కోరుకు కట్టడి చేశామన్న రోహిత్.. అసలు ఈ పిచ్పై ఏది మెరుగైన స్కోరో అంచనా వేయలేకపోయామన్నాడు. ఈ సీజన్లో 200 పైచిలుకు టార్గెట్లు ఛేజ్ చేసేందుకు జట్లు వెనకాడటం లేదని.. అందుకోసం బ్యాటర్లు తమ ప్రత్యేక నైపుణ్యాలను బయటకు తీసి అద్భుతంగా రాణిస్తున్నారంటూ కొనియాడాడు. గెలుపు రూపంలో ఆటకు తగ్గ ప్రతిఫలం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: నాసిరకం బౌలింగ్.. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి అతిపెద్ద విజయం WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సూర్య’ ప్రతాపం.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 83
ముంబై: ఐపీఎల్లో మళ్లీ బంతి బలయ్యింది. బ్యాట్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓవర్కు 10 పైచిలుకు రన్రేట్ కూడా దిగొ చ్చింది. ముందు బెంగళూరు అదరగొడితే... తర్వాత ముంబై అంత పెద్ద లక్ష్యాన్ని చెదరగొట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (41 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచేశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ముంబై 16.3 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 200 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 83; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుతో అదరగొట్టేశాడు. నేహల్ వధేరా (34 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. క్యాచ్ మిస్ చేయడంతో... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వధేరా క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన డుప్లెసిస్ తర్వాత ఉతికి ఆరేశాడు. దీంతో ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ కోహ్లి (1), అనూజ్ రావత్ (6) అవుటైనా ఆ ప్రభావం కనిపించలేదు. మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ఉప్పెనతో పరుగుల ప్రవాహం బెంగళూరును కదంతొక్కించింది. ధాటిగా ఆడి ప్రత్యర్థుల్ని పరిగెత్తించారు.. బౌండరీలతో... వీలైతే సిక్సర్లతో స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. 2.2 ఓవర్ నుంచి 12.3 ఓవర్ దాకా బ్యాటింగ్ జోరే స్టేడియం మొత్తాన్ని హోరెత్తించింది. తర్వాత వచ్చిన మ్యాక్స్వెలే ముందుగా (25 బంతుల్లో) ఫిఫ్టీ చేసుకోగా, కెపె్టన్ డుప్లెసిస్ (30 బంతుల్లో) ఆ తర్వాత అర్ధసెంచరీ చేశాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 61 బంతుల్లోనే 120 పరుగుల్ని జతచేశారు. ఎట్టకేలకు మ్యాక్స్వెల్ను అవుట్ చేసిన బెహ్రెన్డార్ఫ్ ముంబై శిబిరాన్ని హమ్మయ్య అనిపించాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే మహిపాల్ (1), డుప్లెసిస్ కూడా పెవిలియన్ చేరగా వేగం తగ్గింది. దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ (12 నాటౌట్), హసరంగ (12 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయారు. ముంబై... డబుల్ వేగంతో! కొండను కరిగించేందుకు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అదే తీరున ఆడి బెంగళూరు శిబిరాన్ని వణికించాడు. దీంతో ఆర్సీబీ (5.2) కంటే వేగంగా ముంబై 4.3 ఓవర్లలోనే 50 స్కోరు చేసింది. ఐదో ఓవర్ వేసిన హసరంగ ... ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ (7)లను అవుట్ చేసి బెంగళూరును ఆనందంలో ముంచాడు. అయితే ఈ ఆనందం మాత్రం కాసేపే నిలిచింది. ఆ తర్వాత ఓవర్ నుంచే బాదడంలో స్పెషలిస్టు సూర్యకుమార్ దూకుడు మొదలైంది. వధేరా కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం కరిగిపోయింది. దీంతో 10.1వ ఓవర్లో ముంబై స్కోరు 100కి చేరితే అక్కడ్నుంచి మరో 20 బంతుల్లోనే (13.3వ ఓవర్లో) 150 పరుగుల్ని వాయువేగంతో అందుకుంది. ఈ క్రమంలో సూర్య 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్కు కలిసొచ్చే పిచ్పై పేలవమైన బౌలింగ్తో బెంగళూరు ఏమీ చేయలేకపోయింది. సూర్యకుమారే కాదు... వధేరా కూడా మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లను బాదేశారు. వైశాక్, హర్షల్ వేసిన చెత్త బంతుల్ని సూర్య సులువుగా చితగ్గొట్టెశాడు. సూర్య, డేవిడ్ (0) వరుస బంతుల్లో అవుటైనప్పటికీ విజయం ముంగిట నిలిచిన ముంబైని సిక్సర్తో వధేరా గెలిపించడంతోపాటు అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బెహ్రెన్డార్ఫ్ 1; డుప్లెసిస్ (సి) సబ్–విష్ణు (బి) గ్రీన్ 65; అనూజ్ (సి) గ్రీన్ (బి) బెహ్రెన్డార్ఫ్ 6; మ్యాక్స్వెల్ (సి) వధేరా (బి) బెహ్రెన్డార్ఫ్ 68; మహిపాల్ (బి) కార్తికేయ 1; దినేశ్ కార్తీక్ (సి) వధేరా (బి) జోర్డాన్ 30; కేదార్ జాదవ్ (నాటౌట్) 12; హసరంగ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–136, 4–143, 5–146, 6–185. బౌలింగ్: బెహ్రెన్డార్ఫ్ 4–0–36–3, పీయూష్ చావ్లా 4–0–41–0, గ్రీన్ 2–0–15–1, జోర్డాన్ 4–0–48–1, కార్తికేయ 4–0–35–1, ఆకాశ్ 2–0–23–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) అనూజ్ (బి) హసరంగ 42; రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 7; సూర్యకుమార్ (సి) కేదార్ (బి) వైశాక్ 83; నేహల్ వధేరా (నాటౌట్) 52; టిమ్ డేవిడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) వైశాక్ 0; గ్రీన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 14; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–51, 2–52, 3–192, 4–192. బౌలింగ్: సిరాజ్ 3–0–31–0, హాజల్వుడ్ 3–0–32–0, హసరంగ 4–0–53–2, వైశాక్ 3–0–37–2, హర్షల్ పటేల్ 3.3–0–41–0. ఐపీఎల్లో నేడు చెన్నై vs ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: ఢిల్లీ ధనాధన్
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఆట ఈ మ్యాచ్ ముందువరకు తీసికట్టుగానే ఉంది. గెలిచిన మ్యాచ్లలో కూడా అంతంతమాత్రం పడుతూ లేస్తూ సాగిన ఆటతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. అయితే శనివారం కానీ బెంగళూరుపై దంచిన తీరు, లక్ష్యఛేదనలో దూకుడు మాత్రం ఈ సీజన్లో మేటి మ్యాచ్లలో ఒకటిగా నిలిపింది. మెరుపుల విందు పంచిన ఈ మ్యాచ్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంస రచనతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (46 బంతుల్లో 55; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మ్యాక్స్వెల్ (0) డకౌటైనా... మహిపాల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. తర్వాత ఢిల్లీ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిల్ సాల్ట్ ఉప్పెనకు వార్నర్ (14 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్‡్ష (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రోసో (22 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) కలిసి క్యాపిటల్స్ను గెలిపించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఖలీల్ (బి) ముకేశ్ 55; డుప్లెసిస్ (సి) అక్షర్ (బి) మార్‡్ష 45; మ్యాక్స్వెల్ (సి) సాల్ట్ (బి) మార్‡్ష 0; మహిపాల్ నాటౌట్ 54; దినేశ్ కార్తీక్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 11; రావత్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–137, 4–172. బౌలింగ్: ఖలీల్ 4–0–45–1, అక్షర్ 3–0–17–0, ఇషాంత్ 3–0–29–0, ముకేశ్ 3–0–30–1, మార్‡్ష 3–0–21–2, కుల్దీప్ 4–0–37–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) హాజల్వుడ్ 22; సాల్ట్ (బి) కరణ్ శర్మ 87; మార్‡్ష (సి) మహిపాల్ (బి) హర్షల్ 26; రోసో నాటౌట్ 35; అక్షర్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–60, 2–119, 3–171. బౌలింగ్: సిరాజ్ 2–0–28–0, మ్యాక్స్వెల్ 1.4–0–14–0, హాజల్వుడ్ 3–0–29–1, హసరంగ 4–0–32–0, కరణ్శర్మ 3–0–33–1, మహిపాల్ 1–0–13–0, హర్షల్ 2–0–32–1. సిరాజ్ వర్సెస్ సాల్ట్ బెంగళూరు గత మ్యాచ్లో కోహ్లి–గంభీర్–నవీన్ ఘటన వివాదం రేపగా...ఇప్పుడు సి రాజ్ కూడా మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిపై దూషణలకు దిగాడు. సిరాజ్ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 6, 4 కొట్టగా తర్వాతి షార్ట్ పిచ్ బంతిని అంపైర్ వైడ్గా ప్రకటించాడు. దాంతో సిరాజ్ దూసుకుపోయి సాల్ట్ను ఏదో అన్నాడు. వార్నర్ వారించే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. కెప్టె న్ డుప్లెసిస్ పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. 7000: ఐపీఎల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. -
DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
IPL 2023 DC Vs RCB: ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. అరున్ జైట్లీ స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తాజా ఎడిషన్లో తొలి ముఖాముఖి పోరులో ఆర్సీబీ.. ఢిల్లీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. అప్పుడు హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అర్ధ శతకం(50)తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ను ఢిల్లీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. గుజరాత్ను ఓడించి మరోవైపు.. ఆర్సీబీ సైతం లక్నో సూపర్ జెయింట్స్పై ప్రతీకార మ్యాచ్లో 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇలా లో స్కోరింగ్ మ్యాచ్లలో అటు ఆర్సీబీ.. ఇటు ఢిల్లీ విజయం సాధించాయి. ఇదే జోష్లో ముఖాముఖి పోరుకు సై అంటున్నాయి. దాదాతో జగడం ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి- ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన ఘటన క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. దాదా బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలోనే కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం.. ఈ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న సమయంలో కోహ్లి.. గంగూలీకి షేక్హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో తాజా మ్యాచ్లో ఎలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రసవత్తర పోరు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో గోల్డెన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో మనం విరాట్ కోహ్లి వర్సెస్ వార్నర్ వార్ చూడొచ్చు. అదే విధంగా అన్రిచ్ నోర్జేను ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. విరాట్ సెంచరీ కొట్టు ఇక అన్నింటికంటే ఆసక్తికరమైంది ఏమిటంటే.. విరాట్ ఈ మ్యాచ్లో సెంచరీ కొడితే చూడాలని ఉంది. శతకం సాధించడమే దాదాకు అతడు ఇచ్చే నిజమైన కానుక. విరాట్.. నువ్వు నీ లాగే ఉండు.. ఆర్సీబీ కోసం ఈ మ్యాచ్ను గెలిపించు’’ అంటూ శ్రీశాంత్ కింగ్ ఫ్యాన్స్ను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్లలో కలిపి 364 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82(నాటౌట్). చదవండి: బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా! ఆర్సీబీకి డీకే, రాజస్థాన్కు పరాగ్, సన్రైజర్స్కు మయాంక్.. మరి ఢిల్లీకి..? '@ImVKohli getting a 100 will be a great tribute to Dada', @sreesanth_36 anticipates a great #RivalryWeek clash between @DelhiCapitals & @RCBTweets! Tune-in to #DCvRCB at #IPLonStar Today | Pre-show at 7 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/CxzBgDh6vr — Star Sports (@StarSportsIndia) May 6, 2023 -
బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా!
IPL 2023- LSG Vs RCB- #ViratGambhirFight: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ మధ్య గొడవ జరిగి రోజులు గడుస్తున్నా.. ఈ వివాదానికి సంబంధించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రత్యక్ష సాక్షి ఇటీవలే కొన్ని విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కోహ్లి మాట జారడంతో గంభీర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఆ మాట అనడంతో ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ తాజా కథనంలో.. గంభీర్కు కోపం తెప్పించిన మాటేమిటో వెల్లడించింది. అదే విధంగా గొడవ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి జరిమానా విధించిన నేపథ్యంలో కోహ్లి బీసీసీఐకి ఓ సందేశం పంపాడని పేర్కొంది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఫ్రీ హిట్ నేపథ్యంలో.. లక్నో టెయిలెండర్ నవీన్-ఉల్-హక్తో గొడవ.. ఆ తర్వాత కోహ్లి జోక్యం.. అటుపై మ్యాచ్ తర్వాత లక్నో ఓపెనర్ కైలీ మేయర్స్తో కోహ్లి మాట్లాడుతుండగా.. గంభీర్ మధ్యలోకి రావడం వంటి పరిణామాల క్రమంలో వివాదం ముదిరింది. బ్లడీ అసలు నువ్వేంటి? ఈ నేపథ్యంలో కోహ్లి.. మేయర్స్తో మాట్లాడుతుండగా.. గంభీర్ అతడిని కోహ్లి నుంచి విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో.. ‘‘బ్లడీ.. F***. నేను అతడికి సెండాఫ్ ఇస్తుంటే మధ్యలో నువ్వేంటి’’ అని విరాట్ అన్న మాట గంభీర్ చెవిన పడటంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడని దైనిక్ జాగరణ్ కథనంలో పేర్కొంది. బీసీసీఐ అధికారులకు కోహ్లి మెసేజ్ అదే విధంగా మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 100 శాతం కోత విధించడంపై విచారం వ్యక్తం చేసిన కోహ్లిహ్లి.. ‘‘నేనసలు నవీన్ ఉల్ హక్ని గానీ.. గంభీర్ని గానీ అసలు ఏమీ అనలేదు’’ అని కొంతమంది అధికారులకు మెసేజ్ చేసినట్లు తెలిపింది. తన తప్పేమీ లేకపోయినా ఫైన్ విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. నవీన్పైకి బంతి విసరాలని తాను సిరాజ్కు చెప్పలేదని.. బౌన్సర్స్ వేయాలని మాత్రమే సూచించినట్లు కోహ్లి పేర్కొన్నట్లు తెలిపింది. కాగా ఈ వార్తలపై స్పందించిన కింగ్ ఫ్యాన్స్.. గంభీర్ కావాలనే గొడవను పెద్దది చేసి రచ్చ చేశాడని.. ఇందులో కోహ్లి తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. గంభీర్ అభిమానులు మాత్రం.. ‘‘చేసిందంతా చేశావు.. టీవీలో అందరూ చూశారు. అయినా.. మళ్లీ ఇప్పుడిలా మెసేజ్లు పెడతావా?’’ అని కోహ్లి తీరుపై మండిపడుతున్నారు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లి -
Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు!
IPL 2023 LSG Vs RCB: విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదానికి కేంద్ర బిందువైన నవీన్ ఉల్ హక్ తీరుపై కింగ్ అభిమానులు మండిపడుతూనే ఉన్నారు. ఎదుటి వాళ్లను కవ్వించినపుడు.. మనం కూడా వాటిని స్వీకరించే గుణం కలిగి ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. షాహిద్ ఆఫ్రిది, మహ్మద్ అమీర్లాంటి వాళ్లతో పెట్టుకున్నా.. ఇపుడు కోహ్లితో గొడవపడితే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోషల్ మీడియా వేదికగా కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా నవీన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు వారికి మరింత కోపం తెప్పిస్తున్నాయి. ‘‘నీకు ఒక రూల్.. ఇతరులకు మరో రూల్ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకో’’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్- నవీన్ మధ్య వాగ్వాదం జరుగగా.. కోహ్లి జోక్యంతో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. నవీన్తో మొదలైన వివాదం కోహ్లి- గంభీర్ వాగ్వాదం పెట్టుకునేంత వరకు సాగింది. కోహ్లికి సారీ చెప్పి కలిసిపోవాలని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పినా నవీన్ ససేమిరా అన్నాడు. ఇక మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా కూడా కోహ్లితో నవీన్ పరోక్ష పోరుకు దిగడం విశేషం. కోహ్లి తన్ ఇన్స్టా పోస్టులో.. ‘‘పైకి కనబడేదంతా నిజం కాదు’’ అన్న అర్థంలో కోట్ షేర్ చేయగా.. నవీన్ సైతం.. ‘‘నువ్వు ఏదైతే పొందేందుకు అర్హుడివో నీకు అదే దక్కుతుంది’’ అంటూ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను ఇక తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు నవీన్కు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ‘‘నేను ఇక్కడికి ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను. ఎవరెవరి చేతనో తిట్టించుకోవడానికి కాదు’’ అని కాస్త పొగరుగానే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఫ్యాన్స్.. ‘‘అందరూ ఆడటానికే వస్తారు. నీ సీనియర్ రషీద్ ఖాన్ ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఇలాంటి వివాదాల జోలికి పోలేదు. వికెట్ తీసినపుడు నువ్వెంతలా సెలబ్రేట్ చేసుకుంటావో.. ఎదుటి వాళ్ల సంబరాలను చూసి కూడా కాస్త ఓర్వడం నేర్చుకో’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ నవీన్ ఉల్ హక్? ఆఫ్గనిస్తాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ 2021లో ఐర్లాండ్పై ఆఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడిన నవీన్ 14 వికెట్లు తీశాడు.అఫ్గన్ తరఫున 27 టీ20లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాదే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2023 మినీవేలంలో 23 ఏళ్ల నవీన్ను రూ.50లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో నవీన్ 7 వికెట్లు సాధించాడు. కోహ్లితో గొడవ నేపథ్యంలో గత రెండ్రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చదవండి: ధోని కాదు.. డీకే కూడా కాలేడు! ఇలాంటివి సహజం.. మా వల్లే ఒత్తిడిలో కూరుకుపోయి! కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి Full video mil gyi match ki..#LSGvsRCB #gautamgambhir #ViratGambhirFight #VIRATKOHLI #naveenulhaq #KohliGambhir pic.twitter.com/DVO8S1zCvA — Sipu 🇮🇳 (@shishpal10np) May 3, 2023 -
కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి
IPL 2023 LSG Vs RCB- #ViratGambhirFight: ‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత మేయర్స్, విరాట్ పక్క పక్కనే నడుస్తూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్లినట్లు టీవీలో కనిపించింది. తమ పట్ల పదే పదే ఎందుకు అభ్యంతకరంగా ప్రవర్తించావంటూ మేయర్స్.. కోహ్లిని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి.. నువ్వెందుకు నావైపు చూస్తూ ఉన్నావు అని కౌంటర్ ఇచ్చాడు. అంతకంటే ముందు అమిత్ మిశ్రా.. విరాట్ కోహ్లి.. నవీన్ ఉల్ హక్ను పదే పదే తమను టీజ్ చేస్తున్నాడంటూ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. ఈ పరిణామాలన్నిటినీ గౌతం గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించాడు. అందుకే మేయర్స్ను వెనక్కి లాగి.. కోహ్లితో మాట్లాడవద్దని చెప్పాడు. అప్పుడు విరాట్ వెంటనే మాట వదిలేశాడు. ఆ తర్వాత ఇరువర్గాలు పరిణతి లేకుండా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే’’ అంటూ విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదం గురించి నాటి మ్యాచ్లో పరిస్థితులను దగ్గరగా చూసిన ప్రత్యక్షసాక్షి ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దిగజారుడు ప్రవర్తన ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. సొంతమైదానంలో లక్నోను ఓడించి చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు ముఖ్యంగా విరాట్ కోహ్లి లక్నో బ్యాటింగ్ సమయంలో దూకుడుగా వ్యవహరించడం.. తర్వాత గంభీర్తో గొడవ వివాదానికి దారితీసింది. సస్పెండ్ చేస్తేనే దీంతో కొంతమంది కోహ్లికి, మరికొంత మంది గంభీర్కు మద్దతుగా నిలుస్తుండగా.. గావస్కర్ వంటి దిగ్గజాలు.. జెంటిల్మన్ గేమ్కు మచ్చ తెచ్చిన వీరిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాద సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు వార్తా సంస్థ పీటీతో ముచ్చటిస్తూ అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్లే కోహ్లి- గంభీర్ ఎదురుపడిన తర్వాత.. ‘‘కోహ్లిని పిలిచి గౌతం.. ఏంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘‘నేను మిమ్మల్నేమీ అనలేదే! అయినా మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’’ అని విరాట్ ప్రశ్నించాడు. అదుపులో పెట్టుకుంటే మంచిది కోహ్లి మాటలకు గౌతం స్పందిస్తూ.. ‘‘నువ్వు మా జట్టు ఆటగాళ్లను తిడుతున్నావంటే నా కుటుంబంలోని వ్యక్తిని తిట్టినట్లే’’ అని పేర్కొన్నాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా.. అవునా.. అయితే, మీ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోండి అని జవాబిచ్చాడు. తోటి ప్లేయర్లు గొడవ పడుతున్న వీరిద్దరినీ విడదీసే క్రమంలో.. గంభీర్ చివర్లో.. ‘‘అయితే, ఇప్పుడు నేను నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలంటావు!’’ అంటూ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు’’ అని సదరు వ్యక్తి కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన వాడివేడి సంభాషణ గురించి తెలిపారు. చదవండి: అత్యుత్తమ గణాంకాలు.. షమీపై సంచలన ఆరోపణలు! అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్
Virat Kohli's Savage Response- Sweet Win vs LSG: ‘‘ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే.. తిరిగి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాలేని పక్షంలో ఎదుటివాళ్లకు ఏదో ఒకటి ఇవ్వాలనే సాహసం చేయకూడదు’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. రచ్చ రచ్చ ఐపీఎల్-2023లో లక్నో వేదికగా కేఎల్ రాహుల్ సేనతో ఆర్సీబీ పోరు నేపథ్యంలో నవీన్ ఉల్ హక్, గంభీర్లతో కోహ్లికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో గత మ్యాచ్లో గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ను ఉద్దేశించి చేసిన సైగకు బదులుగా.. కోహ్లి ప్రేమను పంచాలంటూ తమ కెప్టెన్ డుప్లెసిస్కు ముద్దులు విసిరాడు. తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ ఆద్యంతం దూకుడు ప్రదర్శించాడు. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోను ఓడించడంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. వాళ్లు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారో తెలిసింది ఇందులో కోహ్లి మాట్లాడిన మాటలు హైలైట్గా నిలిచాయి. ‘‘ఇక్కడ మేము విజయం సాధించడం అత్యంత ముఖ్యమైనది. అలాంటి సమయంలో మా సొంత మైదానంలో కంటే కూడా ఇక్కడే(లక్నో) ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభించడం విశేషం. మధుర విజయం ఈ అనుభూతి ఎంతో బాగుంది. జట్టుగా మనల్ని వాళ్లు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వాళ్లు మనకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. నిజంగా ఇది మర్చిపోలేని మధుర విజయం. మనం సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పట్టుదలగా నిలబడి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించిన తీరు అద్భుతం. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మనం సఫలమయ్యాం’’ అని కోహ్లి స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు. కోహ్లి అత్యుత్తమ వర్షన్ చూశాం కదా! అదే సమయంలో గంభీర్, నవీన్లతో గొడవకు దారి తీసిన పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పనిలో పనిగా గట్టి కౌంటర్ కూడా ఇచ్చిపడేశాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘విరాట్లోని అత్యుత్తమ వర్షన్ని చూశాం కదా? అవునా కాదా? నా పని కేవలం మైదానంలో అందరితో కామ్గా డీల్ చేయడమే. ఏదేమైనా మన కర్తవ్యాన్ని మనం పూర్తిం చేశాం’’ అంటూ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: టెస్టుల్లో నంబర్వన్గా టీమిండియా నేపాల్ సంచలనం.. ఇండియా, పాకిస్తాన్లతో కలిసి! ఇంతకీ టోర్నీ సంగతేంటి? LSG v RCB, Game Day Dressing Room Reactions King Kohli reacts to the win, Faf explains the crucial partnership and how Virat’s aggression helps the team, Karn and Hazlewood talk about their performances, before the team sang the victory song. Watch Game Day for more…#PlayBold pic.twitter.com/Jr0kCzYoIa — Royal Challengers Bangalore (@RCBTweets) May 2, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గొప్ప క్రికెటర్లే కావొచ్చు.. కానీ మరీ ఎక్కువైంది! కోహ్లిని చూసి ఏం నేర్చుకుంటారు?
IPL 2023- LSG Vs RCB- Kohli Vs Gambhir: ‘‘అసలు కోహ్లికి అంత కోపమెందుకొచ్చింది? గౌతం అంత సీరియస్ ఎందుకయ్యాడు? మ్యాచ్ జరుగుతున్నపుడు.. ఏం జరిగిందన్నది కాదు.. మ్యాచ్ తర్వాత అసలైన గందరగోళం చోటుచేసుకుంది. నా దృష్టిలో ఇలాంటి ప్రవర్తన అస్సలు సరికాదు. నిజమే.. లక్నోపై ప్రతీకారం తీర్చుకునే సమయం. గత మ్యాచ్లో కేవలం ఒక్క వికెట్ తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదంతా బాగుంది. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం అవాంఛనీయం. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకే కాదు చాలా మందికి ఇలాగే అనిపించి ఉంటుంది. గొడవపడ్డ వాళ్లిద్దరూ గొప్ప క్రికెటర్లు. విరాట్ కోహ్లి.. అతడు యూత్ ఐకాన్. చాలా మంది అతడిని చూసి.. అతడి లాగే ఎదగాలని కోరుకుంటారు. కానీ ప్రతిసారి ఇలా గొడవపడితే... వాళ్లు కోహ్లి నుంచి ఏం నేర్చుకుంటారు. నేను కోహ్లిలాంటి ఆటగాడిని కావాలి గానీ.. అలాంటి **** అవకూడదు అని అనుకుంటున్నారు. నేను పూర్తి చేయలేకపోయిన ఆ మాటలేంటో మీకు తెలుసనే అనుకుంటున్నా. కోహ్లి ఇలా.. గంభీరేమో అలా ఇక గౌతం విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియంలో అతడు అలా చేయకుండా ఉండాల్సింది. ఇద్దరూ గతంలో ఇలా దూకుడుగా ప్రవర్తించిన వాళ్లే. కానీ ఈసారైనా కనీసం సంయమనం పాటించాల్సింది. ఎందుకో నాకైతే వాళ్లు మరీ శ్రుతిమించినట్లు అనిపించింది’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. కోహ్లి- గంభీర్ తీరును విమర్శించారు. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు సొంత మైదానంలో అన్నీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కెప్టెన్ రాహుల్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 19.5 ఓవర్లలో 108 పరుగులకే సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. 18 పరుగుల తేడాతో ఆర్సీబీని విజయం వరించింది. చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. భావోద్వేగాలు నియంత్రించుకోలేక పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయారు. ఇక ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్ గౌతం గంభీర్- కోహ్లి, కోహ్లి- నవీన్ ఉల్ హక్ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కోహ్లి- గంభీర్ గొడవకు కారణమేంటో వాళ్లు చెప్తే తప్ప తెలియదని.. ఏదేమైనా ఇద్దరూ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని పేర్కొన్నాడు. ఇలా గొడవలకు దిగే వాళ్లను చూసి యువ క్రికెటర్లు ఏం నేర్చుకుంటారంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పేనని అభిప్రాయపడ్డాడు. చదవండి: LSG Vs RCB: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్ సంజూ చీట్ చేయలేదు.. కొంచెం చూసి మాట్లాడండి! రోహిత్ది క్లియర్ ఔట్ The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG Vs RCB: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్
IPL 2023- Kohli Vs Gambhir: ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం నాటి మ్యాచ్ ప్రేక్షకులకు మజాను అందించింది. నువ్వా- నేనా అంటూ హోరాహోరీగా సాగిన పోరులో సొంతమైదానంలో తమకు ఎదురైన పరాభవానికి ఆర్సీబీ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో డుప్లెసిస్ బృందం 18 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది. 126 పరుగులకే ఆర్సీబీ కథ ముగియడంతో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్కు ఊహించని షాకిచ్చింది. సమష్టి ప్రదర్శనతో.. సూపర్జెయింట్స్పై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ కోల్పోవడంతో ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సహా మిగతా ఆటగాళ్లంతా తమదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కోహ్లి దూకుడు మామూలుగా లేదు ఇక ఒక్కో వికెట్ పడటం, అద్బుత ఫీల్డింగ్తో రనౌట్ల రూపంలో ప్రత్యర్థిని దెబ్బకొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో రన్మెషీన్ కోహ్లి సంతోషం అంబరాన్నింటింది. చిన్నస్వామి స్టేడియంలో లక్నో గెలుపు తర్వాత ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ను ఉద్దేశించి చేసిన సైగలకు.. కౌంటర్ ఇచ్చాడు కోహ్లి. షాకిచ్చిన బీసీసీఐ మ్యాచ్ ఆద్యంతం ఫుల్ ఎనర్జీతో దూకుడుగా కనిపిస్తూ.. ముద్దులు విసురుతూ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్తో వివాదం, మ్యాచ్ అనంతరం గంభీర్తో వాగ్వాదం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుచిత ప్రవర్తన కారణంగా కోహ్లి, గంభీర్లకు.. బీసీసీఐ భారీ జరిమానా రూపంలో పనిష్మెంట్ ఇచ్చింది. చూసేదంతా నిజం కాదు ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్స్టా పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ‘‘మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే. అదే నిజం కాదు. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు. మన దృక్కోణానికి సంబంధించింది మాత్రమే’’ అనే అర్థం ఉన్న కోట్ను కోహ్లి షేర్ చేశాడు. గంభీర్తో వివాదం అనంతరం విరాట్ ఈ మేరకు పోస్ట్ పెట్టడం గమనార్హం. కాగా నవీన్, గంభీర్తో కోహ్లి వివాదం నేపథ్యంలో కింగ్ అభిమానులు అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొంత మంది మాత్రం కోహ్లి అతి తగ్గించుకుంటే మంచిదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోహ్లి ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇస్తూ మండిపడుతున్నారు. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ఇంకా జట్టులో అవసరమా? తీసిపడేయండి IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా! Who the F**k is the naveen ul haq? Disrespecting thE KING #Kohli dont forget poor afghani your country plays cricket bcoz of bCci bloddy beggars!! #RCBVSLSG #gambhir #kohli #naveenulhaq pic.twitter.com/6yklJ750Q2 — Puneet Singh Deol (@PuneetDeol777) May 1, 2023 The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లక్నో ‘సూపర్’ ఫ్లాప్
లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ చెత్తగా ఆడి చిత్తుగా ఓడింది. బెంగళూరు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని తమ సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి లక్నో గడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 18 పరుగులతో బెంగళూరు గెలుపొందింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డుప్లెసిస్ (40 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు జట్టు తరఫున ఓపెనర్లవే పరుగులు... ఆ తర్వాత కష్టాలే! కోహ్లి (30 బంతుల్లో 31; 4 ఫోర్లు), కెపె్టన్ డుప్లెసిస్ ఆడినంత వరకు స్కోరుబోర్డు నడించింది. పవర్ప్లేలో 42 పరుగులే అయినా వికెట్ను కాపాడుకుంది. అయితే రవి బిష్ణోయ్ కోహ్లిని స్టంపౌట్ చేయడంతో 61 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (16) మినహా ఇంకెవరూ పట్టుమని పది పరుగులైనా చేయలేదు. లక్నో కళ్లముందున్న లక్ష్యం చిన్నది. కానీ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును పవర్ప్లేలోనే ‘ఫ్లాప్’ చేసింది. మేయర్స్ (0), కృనాల్ (14), బదోని (4), దీపక్ హుడా (1)లను బెంగళూరు బౌలర్లు సిరాజ్, మ్యాక్స్వెల్, హాజల్వుడ్, హసరంగ తలా ఓ దెబ్బ తీశారు. 5.1 ఓవర్లలో 27/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు), మిశ్రా (30 బంతుల్లో 19; 2 ఫోర్లు) చేసిన పరుగులు లక్నోను కష్టంగా 100 దాటించాయే తప్ప లక్ష్యాన్ని చేర్చలేదు. ఫీల్డింగ్ సమయంలో కెపె్టన్ కేఎల్ రాహుల్ (0 నాటౌట్) తొడ కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్ చేయలేదు. 11వ స్థానంలో వచ్చి నాటౌట్గా నిలిచాడంతే! స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 31; డుప్లెసిస్ (సి) కృనాల్ (బి) మిశ్రా 44; అనూజ్ (సి) మేయర్స్ (బి) గౌతమ్ 9; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 4; ప్రభుదేశాయ్ (సి) గౌతమ్ (బి) మిశ్రా 6; దినేశ్ కార్తీక్ (రనౌట్) 16; మహిపాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 3; హసరంగ (నాటౌట్) 8; కరణ్ శర్మ (సి) గౌతమ్ (బి) నవీనుల్ 2; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–62, 2–75, 3–80, 4–90, 5–109, 6–114, 7–117, 8–121, 9–121. బౌలింగ్: కృనాల్ పాండ్యా 4–0–21–0, స్టొయినిస్ 1–0–11–0, నవీనుల్ హఖ్ 4–0–30–3, రవి బిష్ణోయ్ 4–0–21–2, అమిత్ మిశ్రా 3–0–21–2, యశ్ 2–0–12–0, గౌతమ్ 2–0–10–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 0; బదోని (సి) కోహ్లి (బి) హాజల్వుడ్ 4; కృనాల్ (సి) కోహ్లి (బి) మ్యాక్స్వెల్ 14; హుడా (స్టంప్డ్) కార్తీక్ (బి) హసరంగ 1; స్టొయినిస్ (సి) ప్రభుదేశాయ్ (బి) కరణ్ శర్మ 13; పూరన్ (సి) మహిపాల్ (బి) కరణ్ శర్మ 9; గౌతమ్ (రనౌట్) 23; బిష్ణోయ్ (రనౌట్) 5; మిశ్రా (సి) కార్తీక్ (బి) హర్షల్ 19; నవీనుల్ (సి) కార్తీక్ (బి) హాజల్వుడ్ 13; రాహుల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆటౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–21, 4–27, 5–38, 6–65, 7–66, 8–77, 9–103, 10–108. బౌలింగ్: సిరాజ్ 3–0–24–1, హాజల్వుడ్ 3–0–15–2, మ్యాక్స్వెల్ 1–0–3–1, హసరంగ 4–0–20–1, కరణ్ శర్మ 4–0–20–2, హర్షల్ పటేల్ 3.5–0–20–1, మహిపాల్ 1–0–4–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ VS ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
కనీసం ఒక్క మ్యాచ్లోనైనా నిరూపించుకున్నాడా? మరీ దారుణంగా.. ఇప్పటికైనా
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు. అప్పుడు అదుర్స్. .. గత సీజన్లో ఆర్సీబీ ఫినిషర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో సాధించినవి కేవలం 83 పరుగులు. ఇప్పుడేమో తుస్ ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది. కేజీఎఫ్పైనే భారం ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి. వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా గత మ్యాచ్లో సొంతమైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. చదవండి: Viral: మిస్టర్ కూల్కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి! MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నా సర్వస్వం నువ్వే’’ అంటూ అందమైన ఫొటోలతో విషెస్ తెలిపాడు. కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్కు జంటగా ‘‘రబ్ నే బనాదీ జోడీ’’ సినిమాతో తెరంగేట్రం చేసింది అనుష్క. అనతికాలంలోనే బీ-టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. 2013లో ఓ కమర్షియల్ యాడ్ సందర్భంగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసింది. ఈ క్రమంలో ప్రేమలో పడిన విరుష్క.. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలో 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్తో ఒక్కటైంది. వీరికి 2021లో కూతురు వామిక జన్మించింది. దేవుడే కలిపాడు.. జోడీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. క్రికెటర్గా కోహ్లి, నటిగా అనుష్క తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు. కోహ్లి మ్యాచ్ ఆడిన ప్రతిసారి అనుష్క స్టేడియానికి వచ్చి అతడిని ఉత్సాహపరుస్తుంది. కోహ్లి సైతం భార్య షూటింగ్లతో బిజీగా ఉన్నపుడు ఆమెకు తగిన స్పేస్ ఇస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా విహారయాత్రలకు తీసుకువెళ్తూ ఉంటాడని వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడవుతూ ఉంటుంది. నీ చేయి వీడను ఈ క్రమంలో మే 1న అనుష్క శర్మ 35వ పుట్టినరోజును పురస్కరించుకుని కోహ్లి ఆత్మీయ ట్వీట్ చేశాడు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చేయి వీడను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను. నీతోపాటు నీకున్న అలవాట్లను కూడా అంతే ప్రేమిస్తాను. నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అనుష్కపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలను కోహ్లి పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను ఉద్దేశించి కోహ్లి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. దంచి కొడుతున్న కోహ్లి ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నాడు. అనూహ్య పరిస్థితుల్లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు కోహ్లి. ఇక బ్యాటర్గానూ అదరగొడుతున్న ఈ రన్మెషీన్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో కలిపి 333 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఆసియా కప్ రద్దు? పాక్కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? Love you through thick, thin and all your cute madness ♾️. Happy birthday my everything ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/AQRMkfxrUg — Virat Kohli (@imVkohli) May 1, 2023 -
కోల్కతా గెలుపు బాట...
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం కోల్కతా నైట్రైడర్స్కు మరోసారి కలిసొచ్చిం ది. నాలుగు వరుస పరాజయాలతో డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిం ది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిన కోల్కతా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన గత 11 మ్యాచ్ల్లో ఏడుసార్లు నెగ్గిన కోల్కతా ఈసారీ తమ ఆధిపత్యాన్ని చాటుకొని 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు సాధించింది. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టారు. చివర్లో రింకూ సింగ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వీస్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్స్లు) మెరిశారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. డుప్లెసిస్ (17; 1 ఫోర్, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ (5; 1 ఫోర్) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కోహ్లి (37 బంతుల్లో 54; 6 ఫోర్లు), మహిపాల్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి (3/27), సుయశ్ శర్మ (2/30), రసెల్ (2/29) బెంగళూరును దెబ్బ కొట్టారు. ధనాధన్ ఆరంభం... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఓపెనర్లు జేసన్ రాయ్, జగదీశన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్.. షహబాజ్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్లతో అలరించాడు. తొమ్మిది ఓవర్లకు 82/0తో దూసుకుపోతున్న కోల్కతాకు వైశాక్ బ్రేక్ వేశాడు. పదో ఓవర్లో జగదీశన్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), జేసన్ రాయ్లను వైశాక్ అవుట్ చేశాడు. రెండు క్యాచ్లు వదిలేసి... ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా కోల్కతా అదే దూకుడు కొనసాగించింది. కోల్కతాకు బెంగళూరు ఫీల్డర్ల నిర్లక్ష్యం కూడా కలిసొచ్చిం ది. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 5 వద్ద సిరాజ్.. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 19 వద్ద హర్షల్ పటేల్ క్యాచ్లు జారవిడిచారు. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రాణా కదంతొక్కాడు. హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లోని చివరి రెండు బంతులను సిక్స్లుగా మలిచిన రాణా... వైశాక్ వేసిన 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో 4,4,6తో మెరిశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 167/2తో నిలిచింది. అయితే 18వ ఓవర్లో హసరంగ స్పిన్కు నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు) పెవిలియన్ చేరారు. ఈ ఓవర్లో హసరంగ 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రింకూ సింగ్ 6,4,4 కొట్టగా... ఐదో బంతికి రసెల్ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వీస్ రెండు సిక్స్లు కొట్టడంతో కోల్కతా స్కోరు 200కు చేరింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) వైశాక్ 56; జగదీశన్ (సి) విల్లీ (బి) వైశాక్ 27; వెంకటేశ్ అయ్యర్ (సి) మ్యాక్స్వెల్ (బి) హసరంగ 31; నితీశ్ రాణా (సి) వైశాక్ (బి) హసరంగ 48; రసెల్ (బి) సిరాజ్ 1; రింకూ సింగ్ (నాటౌట్) 18; డేవిడ్ వీస్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–83, 2–88, 3–168, 4–169, 5–185. బౌలింగ్: సిరాజ్ 4–0–33–1, విల్లీ 3–0–31–0, హసరంగ 4–0–24–2, షహబాజ్ అహ్మద్ 1–0–25–0, వైశాక్ 4–0–41–2, హర్షల్ పటేల్ 4–0–44–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) రసెల్ 54; డుప్లెసిస్ (సి) రింకూ సింగ్ (బి) సుయశ్ శర్మ 17; షహబాజ్ అహ్మద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుయశ్ శర్మ 2; మ్యాక్స్వెల్ (సి) నితీశ్ రాణా (బి) వరుణ్ 5; మహిపాల్ (సి) రసెల్ (బి) వరుణ్ 34; దినేశ్ కార్తీక్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 22; ప్రభుదేశాయ్ (రనౌట్) 10; హసరంగ (సి) అనుకూల్ రాయ్ (సబ్) (బి) రసెల్ 5; విల్లీ (నాటౌట్) 11; వైశాక్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–31, 2–51, 3–58, 4–113, 5–115, 6–137, 7–152, 8–154. బౌలింగ్: వైభవ్ అరోరా 2–0–22–0, ఉమేశ్ యాదవ్ 1–0–19–0, సుయశ్ శర్మ 4–0–30–2, వరుణ్ చక్రవర్తి 4–0–27–3, రసెల్ 4–0–29–2, సునీల్ నరైన్ 4–0–41–0, నితీశ్ రాణా 1–0–8–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023 RCB Vs KKR: ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 21 పరుగులతో విజయాన్ని అందుకుంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 54 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 34, దినేశ్ కార్తిక్ 22 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ, ఆండ్రీ రసెల్లు చెరో రెండు వికెట్లు తీశారు. 16 ఓవర్లలో ఆర్సీబీ 145/6 16 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 15, హసరంగా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 24 బంతుల్లో 56 పరుగులు చేయాలి. కోహ్లి ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ విరాట్ కోహ్లి(54) రసెల్ బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కోహ్లి ఫిఫ్టీ.. ఆర్సీబీ 106/3 కేకేఆర్తో మ్యాచ్లో 33 బంతుల్లో కోహ్లి అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. లామ్రోర్ 28 పరుగులతో కోహ్లికి సహకరిస్తున్నాడు. 8 ఓవర్లలో ఆర్సీబీ 72/3 8 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కోహ్లి 41, మహిపాల్ లామ్రోర్ ఏడు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకముందు షాబాజ్ అహ్మద్, మ్యాక్స్వెల్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. డుప్లెసిస్(18) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 201 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ డుప్లెసిస్(17) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. Photo Credit : IPL Website రాణించిన జేసన్ రాయ్, నితీశ్ రానా.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే? ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. నితీశ్ రానా 48, వెంకటేశ్అయ్యర్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్(10 బంతుల్లో 18 నాటౌట్), డేవిడ్ వీస్(3 బంతుల్లో 12 నాటౌట్) సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 200 మార్క్ అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ వైశాక్లు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website 14 ఓవర్లలో కేకేఆర్ 126/2 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 20, నితీశ్ రానా 18 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website జేసన్ రాయ్(56) క్లీన్బౌల్డ్.. కేకేఆర్ 105/2 ఆర్సీబీతో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన జేసన్ రాయ్ విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 14, నితీశ్ రానా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన జగదీషన్(27 పరుగులు) డేవిడ్ విల్లేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రాయ్ 55 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website దంచి కొడుతున్న జేసన్ రాయ్.. కేకేఆర్ 6 ఓవర్లలో 66/0 ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 20 బంతుల్లోనే 48 పరుగులు చేసిన రాయ్ ఖాతాలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం 36వ మ్యాచ్లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ, కేకేఆర్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్ (వికెట్కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి The Roar for King Kohli is huge 🔥pic.twitter.com/azZZvMdp3j — Johns. (@CricCrazyJohns) April 26, 2023 కోహ్లి స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు కేకేఆర్ వరుస ఓటములతో డీలా పడింది. ఆర్సీబీపై విజయంతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. తొలి అంచె పోటీల్లో కేకేఆర్.. ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్లు ఐపీఎల్లో 31 సార్లు తలపడగా.. ఆర్సీబీ 17 సార్లు గెలుపొందగా.. కేకేఆర్ 14 సార్లు విజయాలు అందుకుంది. -
మహిపాల్ను దూషించిన సిరాజ్! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్!
IPL 2023 RCB Vs RR- Mohammed Siraj- Mahipal Lomror: తన బౌలింగ్లో బ్యాటర్లు చితక్కొట్టినా.. మిస్ ఫీల్డింగ్ కారణంగా కీలక సమయంలో తన ఓవర్లో ప్రత్యర్థి ఎక్కువ పరుగులు రాబట్టినా.. సదరు బౌలర్కు ఫ్రస్టేషన్ ఏ రేంజ్లో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఆదివారం ఇదే పరిస్థితి ఎదురైంది. ఆర్సీబీ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఆటగాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. ఈ క్రమంలో 19వ ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి.. సిరాజ్కు బంతినిచ్చాడు. అప్పటికి రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నారు. ఆ ఓవర్లో సిరాజ్ మొదటి బంతికి అశ్విన్ ఒక పరుగు తీశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో ధ్రువ్ మొదట 2, అనంతరం ఒక పరుగు రాబట్టాడు. తర్వాత అశ్విన్ ఒక రన్ తీయగా.. ధ్రువ్ జురెల్ మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. కోపంతో స్టంప్స్ను తన్ని ఇక ఆఖరి బాల్కు ధ్రువ్ జురెల్- అశ్విన్ కలిసి రెండు పరుగులు పూర్తి చేశారు. ఇది సిరాజ్ కోపానికి కారణమైంది. లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్సీబీ ఆటగాడు మహిపాల్ లామ్రోర్ వేగంగా కదలకపోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లు సిరాజ్ కోపంతో ఊగిపోయాడు. స్టంప్స్ను తంతూ లామ్రోర్ను దూషించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా సిరాజ్ను విమర్శించారు కొంతమంది నెటిజన్లు. ఈ నేపథ్యంలో సిరాజ్.. లామ్రోర్కు క్షమాపణ చెప్పిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక యూట్యూబ్ చానెల్లో షేర్ చేయగా తాజాగా నెట్టింట వైరల్గా మారింది. రెండుసార్లు సారీ చెప్పాను ‘‘నాకు అప్పుడు బాగా కోపం వచ్చింది. సారీ.. ఇప్పటికే అతడికి రెండుసార్లు క్షమాపణ చెప్పాను. నిజానికి నా కోపమంతా మైదానం వరకే పరిమితం. ఆఫ్ ఫీల్డ్లో సరదాగా ఉంటా. మ్యాచ్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది’’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. మరేం పర్లేదు భాయ్ ఇందుకు బదులుగా.. ‘‘మరేం పర్లేదు సిరాజ్ భాయ్. కీలక మ్యాచ్లలో కీలక సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని క్రీడాస్ఫూర్తిని చాటాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంతమైదానంలో ఆర్సీబీ.. రాజస్తాన్ రాయల్స్ మీద 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. జోస్ బట్లర్ రూపంలో కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ప్రేమ విషయం పేరెంట్స్కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా? జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి
IPL 2023 RCB Vs RR: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కీలక వికెట్ తీసి మంచి బ్రేక్ అందించాడని కొనియాడాడు. గతంలో తానెప్పుడూ సిరాజ్ నుంచి ఇలాంటి ప్రదర్శన చూడలేదంటూ సిరాజ్ ఆట తీరును ప్రశంసించాడు. కోహ్లి డకౌట్.. కానీ వాళ్లిద్దరూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆర్సీబీ ఆదివారం తలపడింది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లి డకౌట్ కాగా.. ఫాఫ్ డుప్లెసిస్(62), గ్లెన్ మాక్స్వెల్ (77) అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఈ మేర స్కోరు సాధ్యమైంది. కీలక వికెట్ కూల్చి టార్గెట్ ఛేదనలో భాగంగా రాజస్తాన్కు ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ను డకౌట్ చేసి ఆర్సీబీకి శుభారంభం అందించాడు. ఇక హర్షల్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగగా.. డేవిడ్ విల్లే ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన సంజూ శాంసన్ బృందం 182 పరుగులకే పరిమితమైంది. దీంతో ఏడు పరుగుల తేడాతో కోహ్లి సేన గెలుపొందింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ అద్భుతంగా ఆడాడు. ఆరంభంలోనే జోస్ బట్లర్ వికెట్ పడగొట్టాడు. గతంలో కంటే ఇప్పుడు మరెంతో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బంతితోనూ రాణిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో.. పట్టుదలతో ఆడుతున్నాడు. హర్షల్ వల్లే పర్పుల్ క్యాప్ పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. బౌలింగ్ విభాగానికి నాయకుడిగా ఎదగగలడు’’ అని సిరాజ్ను ప్రశంసించాడు. అదే విధంగా హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని.. ఈరోజు కూడా అదే పనిచేశాడంటూ అతడికి క్రెడిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. జోష్ హాజిల్వుడ్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కోహ్లి సంకేతాలు ఇచ్చాడు. టాప్లో సిరాజ్ ఇక రాజస్తాన్తో మ్యాచ్లో 160 పరుగుల స్కోరుకే పరిమితమవుతామని భావించానని.. అయితే, ఫాఫ్, మాక్సీ కారణంగానే 180 పరుగులకు పైగా స్కోరు చేశామని కోహ్లి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్తో మ్యాచ్లో 4 ఓవర్ల కోటాలో సిరాజ్ 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో 13 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్నకు చేరుకున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. ఏడింటిలో నాలుగు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: వాళ్లంతా వేస్ట్, రహానేనే బెస్ట్.. టీమిండియాకు ఎంపిక చేయండి..! #HBD Sachin: సచిన్ క్రికెట్కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! A successful last over ✅ THAT delivery to dismiss Jos Buttler 💥 Fielding brilliance in crunch situations 💪🏻 Bowling heroes from Bengaluru sum up @RCBTweets' special day at Home 👌🏻👌🏻 - By @RajalArora Full Interview 🎥🔽 #TATAIPL | #RCBvRR https://t.co/G9fuW9rBvg pic.twitter.com/qnJUCTg3P7 — IndianPremierLeague (@IPL) April 24, 2023 -
భళా బెంగళూరు
వీకెండ్ మ్యాచ్లు ‘ఎండ్’దాకా వచ్చి అమాంతం ఉత్కంఠ రేపుతున్నాయి. బెంగళూరు, రాజస్తాన్లు కూడా ఆఖరిదాకా పోరాడాయి. కానీ హర్షల్ పటేల్ తొలి మూడుబంతులు రాయల్ చాలెంజర్స్ శిబిరాన్ని డీలా పరిస్తే... తర్వాతి మూడు బంతులు విజయానికి ఊపిరి పోశాయి. బెంగళూరు: ఐపీఎల్లో విరాట్ కోహ్లి జట్టు గర్జిస్తోంది. బ్యాటింగ్లో మెరుపులకు బౌలింగ్లో నిప్పులు చెరిగే బంతులు జతవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 7 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. గత మ్యాచ్ ఫార్ములాతోనే రెగ్యులర్ కెపె్టన్ డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ‘ఇంపాక్ట్’ చూపాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన శైలి ధాటి కొనసాగించాడు. బౌల్ట్, సందీప్ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత గెలుపు తీరందాకా వచ్చి న రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓడింది. డుప్లెసిస్కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చి న బౌలర్ హర్షల్ పటేల్ (3/32) బెంగళూరు జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇద్దరి తీరు దంచికొట్టుడే! ఆర్సీబీ ఇన్నింగ్స్ను నడిపించింది... మెరిపించింది... మురిపించింది ఇద్దరే! ఓపెనర్ డుప్లెసిస్, మిడిలార్డర్లో మ్యాక్స్వెల్ కలిసి మెలిసి దంచేశారు. జట్టు ఖాతా తెరువకముందే కెప్టెన్గా కోహ్లి (0) డకౌటైతే... డుప్లెసిస్ ‘ఇంపాక్ట్’కు మ్యాక్సీ డబుల్ డోసు ఇచ్చాడు. వన్డౌన్లో దిగిన షహబాజ్ (2) కూడా నిరాపరిచిన బెంగళూరు ఇన్నింగ్స్ 12 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత 11 ఓవర్ల పైచిలుకు వరకు కూడా వారిద్దరి ప్రతాపమే స్కోరును హోరెత్తించింది. మ్యాక్సీ 27 బంతుల్లో ఫిఫ్టీ కొడితే, డుప్లెసిస్ 31 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 127 పరుగులు జతచేశారు. ఆ తర్వాత వచ్చి నవారెవరూ పెద్దగా ఆడలేదు. కాసేపైన నిలువలేదు. పడిక్కల్ రాణించినా... అశ్విన్ వణికించినా... భారీలక్ష్యం ముందుంటే ‘హిట్టర్’ బట్లర్ (0) సిరాజ్ బౌలింగ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. యశస్వి, ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ లక్ష్యానికి తగ్గ జోరుతో స్కోరును పెంచారు. పడిక్కల్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేసుకున్నాక... జట్టు స్కోరు వందకు ముందు అతను, వంద పరుగుల తర్వాత యశస్వి అవుటయ్యారు. అయితే సంజూ సామ్సన్ (15 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ జురెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన ఆటతో పోటీ ఆఖరిదాకా వచ్చి ంది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. అశ్విన్ (12) తొలి మూడు బంతుల్లో 4, 2, 4తో 10 పరుగులతో వణికించాడు. అయితే తర్వాతి మూడు బంతుల్లో హర్షల్... అశ్విన్ వికెట్, 1, 1తో ముగించడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 0; డుప్లెసిస్ (రనౌట్) 62; షహబాజ్ (సి) యశస్వి (బి) బౌల్ట్ 2; మ్యాక్స్వెల్ (సి) హోల్డర్ (బి) అశ్విన్ 77; మహిపాల్ (సి) పడిక్కల్ (బి) చహల్ 8; దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 16; సుయశ్ ప్రభుదేశాయ్ (రనౌట్) 0; హసరంగ (రనౌట్) 6; విల్లీ (నాటౌట్) 4; వైశాక్ (సి) హెట్మైర్ (బి) సందీప్ శర్మ 0; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–12, 3–139, 4–156, 5–163, 6–163, 7–180, 8–184, 9–184. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–2, సందీప్ శర్మ 4–0–49–2, అశ్విన్ 4–0–36–1, చహల్ 4–0–28–1, హోల్డర్ 4–0–32–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) కోహ్లి (బి) హర్షల్ పటేల్ 47; జోస్ బట్లర్ (బి) సిరాజ్ 0; దేవ్దత్ పడిక్కల్ (సి) కోహ్లి (బి) విల్లీ 52; సంజూ సామ్సన్ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 22; హెట్మైర్ (రనౌట్) 3; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 34; అశ్విన్ (సి) ప్రభుదేశాయ్ (బి) హర్షల్ పటేల్ 12; అబ్దుల్ బాసిత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–108, 4–125, 5–155, 6–180. బౌలింగ్: సిరాజ్ 4–0–39–1, విల్లీ 4–0–26–1, వైశాక్ 2–0–24–0, మ్యాక్స్వెల్ 2–0–25–0, హర్షల్ పటేల్ 4–0–32–3, హసరంగ 4–0–32–0. -
మిమ్మల్ని చివరిగా ఒక్కసారైనా కలవాలనుకున్నా.. కానీ: సిరాజ్ భావోద్వేగం
Mohammed Siraj Dedicates POTM To Late Hyderabad Cricketer: ‘‘ప్రియమైన అజీం సర్. నాకు, నాలాంటి ఎంతో మందికి మీరు అందించిన ప్రోత్సాహం గురించి నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మీ మనసు ఎంతో మంచిది. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు. తోచిన సహాయం చేస్తారు. నాకు మిమ్మల్ని పరిచయం చేసినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ మీ కడచూపునకు నోచుకోలేకపోయాను. ఈనాటి ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను మీకు అంకితం ఇస్తున్నాను’’ అంటూ హైదరాబాదీ స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. చివరిగా ఒక్కసారైనా అజీం సర్ను కలవాలనుకున్నానని.. అయితే, అంతకంటే ముందే ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నాలుగు వికెట్లతో మెరిసి ఐపీఎల్-2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ ఆర్సీబీ స్టార్.. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పంజాబ్ ఓపెనర్ అథర్వ టైడే(4), పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్(2), హర్ప్రీత్ బ్రార్(13), నాథన్ ఎల్లిస్ (1)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అదే విధంగా హర్ప్రీత్ సింగ్ భాటియాను రనౌట్ చేశాడు. ఇలా మొహాలీ మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు దక్కిన అవార్డును.. ఇటీవల మరణించిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీంకు అంకితమిచ్చాడు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కోచ్గా, సెలక్టర్గా 62 ఏళ్ల అబ్దుల్ అజీం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 80,90 దశకాల్లో హైదరాబాద్ జట్టు తరఫున మేటి ఓపెనర్గా ఎదిగిన ఆయన మొత్తంగా తన కెరీర్లో 73 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 4644 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత అజీం హైదరాబాద్ కోచ్గా, సెలక్టర్గా పని చేశారు. చదవండి: సర్జరీ సక్సెస్... టీమిండియాకు గుడ్న్యూస్! మెగా టోర్నీకి అందుబాటులోకి! ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్! 𝘽𝙖𝙘𝙠 𝙩𝙤 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙬𝙖𝙮𝙨 😎@RCBTweets clinch a 24-run victory over #PBKS in Mohali 🙌🙌 Scorecard ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/RGFwXXz5eC — IndianPremierLeague (@IPL) April 20, 2023 Dear Azeem Sir, m going to alwz appreciate what you have done for me & many others like me. You were so generous, kind & helpful, cant thank god enough to make me meet you. Wish I had gotten one last chance to meet u but nevertheless I’d like to dedicate today’s POTM award to you pic.twitter.com/XIp08EnybF — Mohammed Siraj (@mdsirajofficial) April 20, 2023 -
సిరాజ్ సూపర్ షో...
సిరాజ్ గెలిపించిన మ్యాచ్ ఇది! నిప్పులు చెరిగే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్తో పంజాబ్ కింగ్స్పై స్పీడ్స్టర్ పంజా విసిరాడు. పంజాబ్ కుదురుకోకుండా దెబ్బ మీద దెబ్బ వేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఈ సీజన్లో మూడో విజయాన్ని సాధించింది. మొహాలీ: మెరుపులతో డుప్లెసిస్, కోహ్లి బెంగళూరును నడిపిస్తే... బౌలింగ్తో గెలిపించిన ఘనత మాత్రం సిరాజ్దే! దీంతో ఐపీఎల్లో గురువారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దిగిన రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఈ మ్యాచ్లో సారథ్యం వహించిన విరాట్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. హర్ప్రీత్ బ్రార్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్సిమ్రన్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్ శర్మ (27 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సిరాజ్ (4/21) కీలకమైన వికెట్లు తీశాడు. డుప్లెసిస్ ధనాధన్ ‘ఇంపాక్ట్’ కోహ్లి, డుప్లెసిస్ల ఓపెనింగ్ మైదానంలోని ప్రేక్షకుల్ని మెరుపులతో మురిపించింది. దూసుకొచ్చే బంతిని కాచుకొని, గతి తప్పిన బంతిని బౌండరీలవైపు శిక్షిస్తూ బెంగళూరు ఇన్నింగ్స్ను ఏకంగా 16 ఓవర్ల పాటు నడిపించారు. 137 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ముందుగా డుప్లెసిస్ 31 బంతుల్లో, తర్వాత కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పరుగుల పంజా ‘కింగ్స్’ను ఉక్కిరిబిక్కిరి చేయగా, స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు హిట్టర్ మ్యాక్స్వెల్ (0) అవుటవడంతో 200 మార్క్ను దాటకుండా పంజాబ్ అడ్డుకుంది. అనంతరం కష్టపడితే ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను సిరాజ్ తన తొలి ఓవర్ నుంచే కష్టాలపాలు చేశాడు. అథర్వ (4)ను ఎల్బీగా అవుట్ చేశాడు. సిక్స్, ఫోర్ కొట్టి జోరు మీదున్న హర్ప్రీత్ సింగ్ (13)ను డైరెక్ట్ హిట్తో రనౌట్ చేశాడు. ప్రభ్సిమ్రన్ రాణింపు తర్వాత జితేశ్ శర్మ మెరుపులతో లక్ష్యం దిశగా సాగుతుంటే మళ్లీ సిరాజ్ నిప్పులు చెరిగాడు. హర్ప్రీత్ బ్రార్ (13), ఎలిస్ (1)లను క్లీన్బౌల్డ్ చేసి పరాజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జితేశ్ శర్మ (బి) హర్ప్రీత్ 59; డుప్లెసిస్ (సి) స్యామ్ కరన్ (బి) ఎలిస్ 84; మ్యాక్స్వెల్ (సి) అథర్వ (బి) హర్ప్రీత్ 0; దినేశ్ కార్తీక్ (సి) అథర్వ (బి) అర్షదీప్ 7; మహిపాల్ (నాటౌట్) 7; షహబాజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–137, 2–137, 3–151, 4–163. బౌలింగ్: అర్షదీప్ సింగ్ 4–0–34–1, హర్ప్రీత్ 3–0–31–2, ఎలిస్ 4–0–41–1, స్యామ్ కరన్ 4–0–27–0, రాహుల్ చహర్ 4–0–24–0, లివింగ్స్టోన్ 1–0–9–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; ప్రభ్సిమ్రన్ (బి) పార్నెల్ 46; షార్ట్ (బి) హసరంగ 8; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; హర్ప్రీత్ సింగ్ (రనౌట్) 13; స్యామ్ కరన్ (రనౌట్) 10; జితేశ్ శర్మ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 41; షారుఖ్ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) హసరంగ 7; హర్ప్రీత్ బ్రార్ (బి) సిరాజ్ 13; ఎలిస్ (బి) సిరాజ్ 0; అర్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–4, 2–20, 3–27, 4–43, 5–76, 6–97, 7–106, 8–147, 9–149, 10–150. బౌలింగ్: సిరాజ్ 4–0–21–4, పార్నెల్ 3–0–32–1, హసరంగ 4–0–39–2, వైశాక్ 3–0–29–0, మ్యాక్స్వెల్ 1–0–5–0, హర్షల్ పటేల్ 3.2–0–22–1. -
IPL: ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం అంటూనే కోహ్లి షాకింగ్ కామెంట్స్
Virat Kohli- RCB: టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కీలక ప్లేయర్గా.. అటుపై కెప్టెన్గా ఎదిగి.. ఆర్సీబీ అంటే కోహ్లి... కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ముడిపడిపోయాడు. అలాంటి కోహ్లి పేరు లేని ఆర్సీబీని ఊహించడం కష్టం. 2013- 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించనప్పటికీ .. జట్టు అభిమానులను అలరించడంలో మాత్రం విఫలం కాలేదు. తనదైన శైలిలో దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్.. రోజురోజుకీ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తాజా వెల్లడించిన ఓ విషయం నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీబీతో అనుబంధాన్ని చెబుతూనే.. ఆరంభంలో తాను వేరే ఫ్రాంఛైజీకి మారాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు.. జియో సినిమా షోలో రాబిన్ ఊతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీతో నా ప్రయాణం అద్భుతం. ఫ్రాంఛైజీ అంటే నాకు అమితమైన గౌరవం. ఎందుకంటే జట్టులో చేరిన తొలి మూడేళ్లలో వాళ్లు నన్ను చాలా బాగా సపోర్టు చేశారు. రిటెన్షన్ జరిగిన ప్రతిసారీ.. ‘‘మేము నిన్ను రిటైన్ చేసుకోబోతున్నాం’’ అని చెప్పేవారు. అప్పుడు.. నేను వాళ్లకు చెప్పిన మాట ఒకటే.. ‘‘టాపార్డర్లో ఆడాలనుకుంటున్నా. టీమిండియాకు ఆడేపుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా.. ఇక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నా’’ అని విజ్ఞప్తి చేశా. అందుకు వాళ్లు సరేనన్నారు. నాపై నమ్మకం ఉంచారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఆర్సీబీతో పాటే నా అంతర్జాతీయ కెరీర్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నాకు వాళ్లు ఎంతో విలువ ఇస్తారు. నా మాట పట్టించుకోలేదు పేరైతే చెప్పను గానీ.. ఓ ఫ్రాంఛైజీతో అప్పట్లో నేను సంప్రదింపులు జరిపాను. కానీ వాళ్లు కనీసం నేను చెబుతున్నానో కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అప్పట్లో నేను 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు వాళ్లతో మాట్లాడాను. ‘‘ఒకవేళ నేను మీ జట్టులోకి వస్తే టాపార్డర్లో ఆడిస్తారా లేదంటే వేరే ప్లేస్లోనా’’.. అని అడిగాను. వాళ్లు పట్టించుకోనేలేదు. అయితే, 2011లో నేను టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న తరుణంలో అదే ఫ్రాంఛైజీ వాళ్లు నా దగ్గరికి వచ్చారు. ‘ప్లీజ్.. వేలంలోకి రాగలరా?’’ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను కచ్చితంగా నో అని చెప్పేశాను. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన ఆర్సీబీతోనే ఉంటానని చెప్పాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లిని వద్దన్న ఫ్రాంఛైజీ ఉందా? ఇందుకు స్పందించిన ఊతప్ప.. కోహ్లి వస్తానంటే పట్టించుకోని ఫ్రాంఛైజీ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బదులుగా.. ‘‘అవును.. నిజం. వాళ్లు అప్పట్లో నా అభ్యర్థనను నిర్మొహమాటంగా కాదన్నారు. అదే మంచిదైంది’’ అని కోహ్లి.. ఊతప్పతో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో ఆర్బీసీ స్టార్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో 220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. చదవండి: ఎట్టకేలకు టెండుల్కర్ అంటూ సచిన్ ఉద్వేగ ట్వీట్! నీ మనసు బంగారం షారుఖ్! SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! అతడెవరో కాదు..
IPL 2023- RCB- Siraj: ఐపీఎల్లో మరోసారి ఫిక్సింగ్ కలకలం సంచలనం రేపుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్, హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్కు ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన విషయాలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిరాజ్ గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)తో తనకు వచ్చిన కాల్ గురించి సిరాజ్ వెల్లడించినట్లు పేర్కొంది. అయితే, సిరాజ్ను సంప్రదించింది బుకీ కాదని, హైదరాబాద్కు చెందిన ఓ డ్రైవర్ అని, ఈ విషయంలో బీసీసీఐ వెంటనే చర్యలు చేపట్టినట్లు సదరు కథనం వెల్లడించింది. అతడు బుకీ కాదు ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు.. ‘‘సిరాజ్ను సంప్రదించింది బుకీ కాదు. బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్ డ్రైవర్ . బెట్టింగ్లో అతడు చాలా మేర డబ్బు పోగొట్టుకున్నాడు.ఈ క్రమంలో అతడు సిరాజ్ను సంప్రదించి ఆర్సీబీ అంతర్గత విషయాలు అడిగాడు. ఈ విషయాన్ని వెంటనే సిరాజ్ బీసీసీఐ ఏసీయూకి తెలిపాడు. వెంటనే దర్యాప్తు సంస్థలు ఆ వ్యక్తిని పట్టుకున్నాయి’’ అని పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. కాగా గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడి కెరీర్ను నాశనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదేం బుద్ధి ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాయి. కాగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపే ఐపీఎల్ మ్యాచ్ల మీద తాజా సీజన్లో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సిరాజ్ ఫిర్యాదుతో బెట్టింగ్ రాయుడి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో క్రికెట్ ప్రేమికులు.. ‘‘మ్యాచ్లు ఆస్వాదించాలి గానీ.. బెట్టింగ్లతో ఎందుకు అనసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత ఇదిలో ఇలా వేరేవాళ్లను కూడా ఇరికించాలని చూస్తారు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అతడి తండ్రి ఆటో నడిపేవారు. కొడుకు ఆకాంక్షలకు అనుగుణంగా అతడు క్రికెటర్ కావడంలో సహాయపడిన ఆయన.. సిరాజ్ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరేవేళ ఆ సంతోషాన్ని చూడకుండానే కన్నుమూశారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ కీలక బౌలర్ అయిన సిరాజ్ ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు తీశాడు. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! -
IPL 2023: కోహ్లి మ్యాచ్ ఫీజులో కోత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లిపై జరిమానా విధించారు. సోమవారం చెన్నైతో జరిగిన పోరులో ప్రత్యర్థి బ్యాటర్ శివమ్ దూబే అవుటైనపుడు కోహ్లి సంబరం అతిగా అనిపించడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. కోహ్లి తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు. నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవెల్ 1 అతిక్రమణలో రిఫరీదే తుది నిర్ణయం అవుతుంది. -
హ్యాట్సాఫ్.. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం! 38 ఏళ్ల వయసులో.. నొప్పిని భరిస్తూనే..
IPL 2023 RCB Vs CSK- Faf du Plessis: చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు. టాప్లో డుప్లెసిస్ తద్వారా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో కలిపి 259 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆరెంజ్ క్యాప్ అందుకుని టాప్లో కొనసాగుతున్నాడు. కాగా డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పంటిబిగువన నొప్పిని భరిస్తూనే డెత్ ఓవర్లలో సీఎస్కే బౌలర్లు రాణించడంతో సొంతమైదానంలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డుప్లెసిస్ ఫిజియోలు వచ్చి అతడి పొట్ట చుట్టూ కట్టుకట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నొప్పిని పంటిబిగువన భరిస్తూనే కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించేందుకు కృషి చేశాడంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరేం పర్లేదు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. ‘‘మ్యాచ్ ఆరంభంలో డైవింగ్ చేస్తున్న సమయంలో పక్కటెముకలకు దెబ్బ తలిగింది. నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. బ్యాటింగ్ చేయగలనా లేదోనన్న భయం వేసింది. కానీ అంత బాగానే జరిగింది’’ అని పేర్కొన్నాడు. డీకే ఫినిష్ చేస్తాడనుకున్నా సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని.. ఏదేమైనా దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దినేశ్ కార్తిక్(14 బంతుల్లో 28 పరుగులు) మ్యాచ్ ఫినిష్ చేస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాసలై పోయానని విచారం వ్యక్తం చేశాడు. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం కాగా 38 ఏళ్ల సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ గతేడాది ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన అతడు.. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి కెప్టెన్గా తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్-2022లో 16 ఇన్నింగ్స్లో కలిపి 468 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆర్సీబీ తరఫున టాప్ బ్యాటర్గా నిలిచాడు. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నా ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్గా అద్భుతంగా రాణిస్తున్న డుప్లెసిస్ ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం అని అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని తిలక్ ఇంట్లో సచిన్, రోహిత్, సూర్య సందడి.. ఫొటోలు వైరల్! ఎన్నటికీ మరువం! .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 #DuPlessis Only respect 🥺🙌 He has played in pain.#RCBvsCSK pic.twitter.com/ezLtgiycl9 — ✨️ ❤ Kohli Fan Girl ❤ ✨️ (@kohlifangirl178) April 17, 2023 -
Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!
IPL 2023- RCB Vs CSK: టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లికి ఊహించని షాక్ తగిలింది. ఈ రన్మెషీన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోహ్లికి జరిమానా ఈ మేరకు.. ‘ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లికి ఫైన్ విధిస్తున్నాం. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెడుతున్నాం. మిస్టర్ కోహ్లి ఐపీఎల్ కోడ్లోని ఆర్టికల్ 2.2లోని లెవల్ 1 నిబంధన ఉల్లంఘించారు’’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కాగా కోహ్లికి ఏ ఘటన కారణంగా జరిమానా విధించారన్న విషయం వెల్లడించనప్పటికీ.. సీఎస్కే బ్యాటర్ శివం దూబే అవుటైన సమయంలో కోహ్లి వ్యవహరించి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే ఫైన్ వేశారా? 26 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన దూబే పార్నెల్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే కోహ్లి సెలబ్రేషన్స్ కాస్త శ్రుతిమించినట్లు అనిపించింది. మరీ దూకుడుగా వ్యవహరించిన కారణంగానే ఈ ఆర్సీబీ స్టార్కు ఫైన్ పడినట్లు తెలుస్తోంది. కాగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో సీఎస్కే ఆర్సీబీ మీద 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్లో బెంగళూరు ఓపెనర్ కోహ్లి 4 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. సీఎస్కే యువ పేసర్ ఆకాశ్ సింగ్ బౌలింగ్లో కోహ్లి బౌల్డ్ అయ్యాడు. చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్ రహానే అద్భుత విన్యాసం.. వీడియో వైరల్! ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే.. .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రహానే అద్భుత విన్యాసం.. వీడియో వైరల్! ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే..
IPL 2023- RCB Vs CSK: అజింక్య రహానే.. టీమిండియా వెటరన్ బ్యాటర్ ఐపీఎల్-2023లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్తోనే సమాధానమిస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రహానే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి సత్తా చాటాడు. దంచికొట్టి.. ప్రశంసలు అందుకుంటూ 34 ఏళ్ల వయసులో 19 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కెప్టెన్ ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పదహారో ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి రహానే చేసిన పరుగులు 129. అత్యధిక స్కోరు 61. ఆర్సీబీతో మ్యాచ్లో రహానే ఇలా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో సోమవారం ఆడిన మూడో మ్యాచ్లో రహానే 20 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లతో పాటు 2 సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్ సంగతి ఇలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో రహానే అద్భుత ఫీల్డింగ్తో మెరిసిన తీరు హైలైట్గా నిలిచింది. మాక్సీ సిక్స్ అనుకున్నాడు.. కానీ ఆర్సీబీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. సిక్స్ ఖాయమనుకున్న దశలో రహానే అద్భుతం చేశాడు. ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే బంతిని క్యాచ్ పట్టిన రహానే బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని వెంటనే బౌండరీ ఇవతలకు విసిరేసి ఐదు పరుగులు సేవ్ చేశాడు. రహానే సూపర్మాన్ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో చెన్నె 8 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ మీద గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్లలో రాణించిన సీఎస్కే యువ పేసర్ పతిరణ సహా ఐదు పరుగులు సేవ్ చేసిన రహానేపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రహానేను టీమిండియా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలని.. రహానే ఆట ఇలాగే కొనసాగితే అతడి రీఎంట్రీ ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని Ajink-waah🤩 Rahane's 🔝effort on the boundary saves a certain maximum!#RCBvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/8Q5YzN4nF5 — JioCinema (@JioCinema) April 17, 2023 Thou shall not pass, says Ajinkya Rahane#RCBvCSK | #IPL2023 pic.twitter.com/BY1YbbhD0a — Sportstar (@sportstarweb) April 17, 2023 -
వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని
IPL 2023 RCB Vs CSK- Dhoni Comments: ‘‘బెంగళూరు వికెట్పై ఆడటం ఎంతో బాగుంటుంది. ఆరంభంలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే తిరుగుండదు. సరైన సమయం కోసం వేచి చూశాం. ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో వేగం పెంచాం. దూబే హిట్టింగ్ ఆడటంలో దిట్ట. అయితే, తను ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. స్పిన్నర్లను మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటూ హిట్టింగ్ ఆడగలడు. నిజానికి తన విషయంలో మేము ముందు నుంచే కొన్ని ప్రణాళికలు రచించాం. కానీ.. గాయం బారిన పడిన కారణంగా పూర్తిస్థాయిలో వాటిని అమలు చేయలేకపోయాం. ఆత్మవిశ్వాసం ముఖ్యం అయితే, తనపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మిడిల్ ఓవర్స్లో పరుగులు సాధించగలడు. ఈ విషయంలో మాకంటే కూడా తనపై తనకు ఎక్కువ నమ్మకం ఉండాలి. అతడి ప్రతిభ, నైపుణ్యాలపై మాకెలాంటి సందేహం లేదు. కానీ ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత వ్యక్తిగత ప్రదర్శన బాగుండాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మెరుపు అర్ధ శతకంతో మెరిసిన శివం దూబే ఆట తీరును ప్రశంసిస్తూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. కాన్వే, దుబే దంచికొట్టారు కాగా ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం ఆర్సీబీ- సీఎస్కే చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. సొంతమైదానంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 83(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) పరుగులతో అదరగొట్టగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. ఫాఫ్, మాక్సీ సూపర్ ఇన్నింగ్స్ మరో ఓపెనర్, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులతో ఆకట్టుకోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి కావాల్సిన మేర సహకారం అందకపోవడంతో ఆర్సీబీ విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని సేన చేతిలో ఓటమి పాలైంది. వాళ్లిద్దరు ఇంకాసేపు ఉంటే మేము ఓడిపోయేవాళ్లం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ఫాఫ్, మాక్సీ ఆట తీరును కొనియాడాడు. వాళ్లిద్దరూ ఇంకాసేపు క్రీజులో ఉంటే గనుక 18వ ఓవర్లోనే ఆర్సీబీ విజయం సాధించేదని పేర్కొన్నాడు. అయితే, తమ యువ బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. డ్వేన్ బ్రావో మార్గదర్శనంలో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తున్నారని పేర్కొన్నాడు. పతిరణ సూపర్ హిట్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టమని.. అయితే యువ బౌలర్లు మాత్రం ఎంతో సులువుగా పని పూర్తి చేస్తున్నారంటూ ధోని ప్రశంసించాడు. కాగా ఆర్సీబీ గెలవాలంటే విజయ సమీకరణం 18 బంతుల్లో 35 పరుగులు ఉన్న వేళ ధోని బంతిని పతిరణ, తుషార్ దేశ్పాండేలకు ఇచ్చాడు. 18వ ఓవర్లో పతిరణ కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వగా.. తుషార్ 19 ఓవరల్లో 12 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి రెండు బంతుల్లో ఆర్సీబీకి 11 పరుగులు అవసరమైన వేళ పతిరణ.. తొలుత రెండు పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి ప్రభుదేశాయ్ను అవుట్ చేసి చెన్నై గెలుపును ఖరారు చేశాడు. చదవండి: దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్! బౌలర్కు మాత్రం!వీడియో వైరల్ .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 -
బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్సీబీ
బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్ కింగ్స్దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్లు), డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. సమష్టి ప్రదర్శన... సిరాజ్ తొలి ఓవర్లోనే రుతురాజ్ (3) అవుట్ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, సిరాజ్ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్ బాదాడు. వైశాక్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), మొయిన్ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది. శతక భాగస్వామ్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్ క్యాచ్ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్ ఓవర్లో మ్యాక్స్వెల్ 2 సిక్స్లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 23 బంతుల్లో, మ్యాక్స్వెల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నారు. 12వ ఓవర్ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్ను కాపాడుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3; కాన్వే (బి) హర్షల్ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52; రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాక్ 14; అలీ (నాటౌట్) 19; జడేజా (సి) (సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్వెల్ 10; ధోని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, పార్నెల్ 4–0–48–1, వైశాక్ 4–0–62–1, మ్యాక్స్వెల్ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్ పటేల్ 3.2–0–36–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) ఆకాశ్ 6; డుప్లెసిస్ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 0; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 12; కార్తీక్ (సి) తీక్షణ (బి) తుషార్ 28; ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్ (సి) దూబే (బి) తుషార్ 2; హసరంగ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3–0–35–1, తుషార్ దేశ్పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్ అలీ 1–0–13–1. -
RCB vs CSK: డుప్లెసిస్, మాక్సీ మెరుపులు వృధా.. పోరాడి ఓడిన ఆర్సీబీ
IPL 2023 RCB Vs CSK Live Updates: డుప్లెసిస్, మాక్సీ మెరుపులు వృధా.. పోరాడి ఓడిన ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. 10 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కే వైపే నిలిచింది. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరాన రెండు, మొయిన్ అలీ, థీక్షణ తలా వికెట్ సాధించారు. ►192 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 17 బంతుల్లో 35 పరుగులు కావాలి. క్రీజులో పార్నల్, ప్రభ్దేశాయ్ ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్ 159 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన డుప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్లో.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. మాక్స్వెల్ ఔట్.. ఎట్టకేలకు సీఎస్కే వికెట్ సాధించింది. 142 పరుగులు వద్ద గ్లెన్ మాక్స్వెల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన మాక్స్వెల్..థీక్షణ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆర్సీబీ ధాటిగా ఆడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్(48), మాక్స్వెల్(34) స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లోమ్రోర్.. దేశ్పాండే బౌలింగ్లో గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఆకాష్ సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. Photo Credit : IPL Website కాన్వే, దుబే విధ్వంసం.. ఆర్సీబీ టార్గెట్ 227 పరుగులు ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, పార్నల్, వైశ్యాఖ్,హర్షల్ పటేల్, హసరంగా, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 178 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన శివమ్ దుబే.. పార్నల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి మొయిన్ అలీ వచ్చాడు. Photo Credit : IPL Website మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 170 పరుగులు వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 83 పరుగులు చేసిన కాన్వే.. హర్షల్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. Photo Credit : IPL Website 14 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 146/2 సీఎస్కే భారీ స్కోర్ దిశగా వెళ్తుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(72), దుబే(32) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 90 పరుగులు వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రహానే.. హాసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. Photo Credit : IPL Website 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 53/1 టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో రహానే(28), గైక్వాడ్(22) పరుగులతో ఉన్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. గైక్వాడ్ ఔట్ 16 పరుగులు వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గైక్వాడ్.. సిరాజ్ బౌలింగ్లో పార్నల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. Photo Credit : IPL Website 2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 16/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్(3), కాన్వే(11) ఉన్నారు. ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. Photo Credit : IPL Website ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్సీబీ బరిలోకి దిగింది. సీఎస్కే మాత్రం తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన మగాల స్థానంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరణ వచ్చాడు. అదే విధంగ ఆకాష్ సింగ్ స్థానంలో రాయుడుకు చోటు దక్కింది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, వైషాక్ విజయ్ కుమార్, మహ్మద్ సిరాజ్ -
RCB VS CSK: భారీ రికార్డులపై కన్నేసిన ధోని, కోహ్లి
ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 17) మరో రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. త్రీ టైమ్ ఫైనలిస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపనుంది. ఈ మ్యాచ్లో క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లిలు భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి ఈ మ్యాచ్లో మరో 21 పరుగులు చేస్తే, శిఖర్ ధవన్ తర్వాత ఐపీఎల్లో చెన్నైపై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ మ్యాచ్లో ధోని మరో 2 పరుగులు చేస్తే, ఆర్సీబీపై అత్యధిక పరుగులు (840) సాధించిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతానికి ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ (839) పేరిట ఉంది. కాగా, ప్రస్తుత ఎడిషన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో చెన్నై, ఆర్సీబీ చెరి 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లతో సమానంగా 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ..
IPL 2023 RCB Vs DC- Sehwag Slams Ricky Ponting: ‘‘ఒక జట్టు గెలిస్తే క్రెడిట్ కోచ్కి ఇస్తారు. మరి ఓడిపోయినప్పుడు జవాబుదారీగా ఉండాల్సింది కూడా వాళ్లే కదా! గతంలో అన్నట్లుగా ఇప్పుడు అదే మాట చెప్తున్నా.. రిక్కీ పాంటింగ్ కోచ్గా అద్భుతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్కు తీసుకువెళ్లాడు. గత కొన్నేళ్లుగా వాళ్లు ప్రతి సీజన్లో దాదాపు ప్లే ఆఫ్స్ చేరుకుంటున్నారు. వీటన్నింటికీ క్రెడిట్ తీసుకుంటున్న రిక్కీ పాంటింగ్.. ఓటములకు కూడా బాధ్యత వహించాలి. ఇదేమైనా టీమిండియా అనుకున్నావా ఇదేమీ టీమిండియా కాదు.. గెలిచినప్పుడు క్రెడిట్ మాదే అని చెప్పుకొంటూ.. ఓడినపుడు మాత్రం ఇంకెవరినో నిందిస్తూ బాధ్యులను చేయడానికి! నిజానికి ఐపీఎల్లో కోచ్ పాత్ర సున్నా. ఆటగాళ్లకు తమపై తాము విశ్వాసం కోల్పోకుండా ప్రతి మేనేజ్మెంట్ అన్ని రకాలుగా అండగా నిలవాలి. అయితే, జట్టు మెరుగైన ప్రదర్శన చేసినపుడు మాత్రమే కోచ్కు విలువ వస్తుంది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా లోపాలు తెలుసుకుని.. వాటిని సరిచేసుకుంటేనే ముందుకు సాగే అవకాశం ఉంటుంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పాంటింగ్ అసలేం చేస్తున్నాడు? ఢిల్లీ కోచ్ రిక్కీ పాంటింగ్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించాడు. గెలిచినపుడు క్రెడిట్ తీసుకోవడం కాదని.. వరుస ఓటములకు బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023లో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల సంఖ్య ఐదుకు చేరింది. తాజా ఎడిషన్లో ఇంతవరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టుగా వార్నర్ బృందం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆడిన ఐదింటిలో ఐదు ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. లోపాలు సవరించుకోవాలి ఈ నేపథ్యంలో ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ ఓటమి అనంతరం క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ వీరూ భాయ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరుస పరాజయాలకు కోచ్ రిక్కీ పాంటింగ్ను బాధ్యుడిని చేయాలని పేర్కొన్నాడు. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గమనించి.. పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. లేదంటే చెత్త రికార్డులతో ఇంటిబాట పట్టక తప్పదని హెచ్చరించాడు. చదవండి: గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. సెంచరీతో చెలరేగిన బాబర్.. ఎవరికీ అందనంత ఎత్తులో! Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..
IPL 2023 RCB Vs DC: ఐపీఎల్-2023 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్కు అస్సలు కలిసి రావడం లేదు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ బ్యాటర్గా పర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా మాత్రం విజయవంతం కాలేకపోతున్నాడు. ఐదో‘సారీ’ వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలైన ఢిల్లీ.. బెంగళూరులో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్లోనూ పాత కథే పునరావృతం చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ బృందం చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలై తమ ఓటముల సంఖ్యను ఐదుకు పెంచుకుంది. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. స్థాయి మరింత పెరిగిందేమో! కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఢిల్లీ హెడ్కోచ్గా ఉండగా.. భారత మాజీ స్టార్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఆర్సీబీతో ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి గంగూలీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఢిల్లీ ఓటమికి చేరువవుతున్న తరుణంలో కామెంట్రీ చేస్తూ.. ‘‘బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ఈ పదవితో తన స్థాయి మరింత పెరిగింది అనుకుంటున్నాడేమో!’’ అని వ్యాఖ్యానించాడు. డైరెక్టర్ పదవి పేరుకే పెద్దది కానీ.. అధికారం ప్రదర్శించే వీలు ఉండదన్న అర్థంలో సెటైర్ వేశాడు. శుభ పరిణామం కాదు అదే విధంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటములకు కారణాలు విశ్లేషించుకోవాలని.. పాంటింగ్, వార్నర్వంటి దిగ్గజాలు ఉన్నా ఒక్క విజయం కూడా సాధించకపోవడం ఏమిటని రవిశాస్త్రి ప్రశ్నించాడు. స్వల్ప తేడాతో ఓడినా పర్వాలేదని.. కానీ కనీస పోరాటం లేకుండా ప్రత్యర్థి చేతిలో చిత్తు కావడం మంచి పరిణామం కాదని విమర్శించాడు. భలే చెప్పావు రవి భాయ్! ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గంగూలీ వైపు సీరియస్గా చూసిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘భలే చెప్పావు రవి భాయ్. కోహ్లిని అవమానకరరీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన దాదాకు ఇప్పుడు పెద్ద పదవే దక్కింది. దానితో పాటే గౌరవం కూడా’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి, రవిశాస్త్రిల మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: 38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా! IPL 2023: మా ఓటమికి కారణం అదే..! అవునా.. ఓర్వలేకే చెత్త కామెంట్లు! Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 -
IPL 2023: అటు విరాట్... ఇటు వైశాక్...
సీజన్లో నాలుగు ఐపీఎల్ మ్యాచ్లలో మూడో అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లి జోరు...తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే మూడు కీలక వికెట్లతో సత్తా చాటిన కొత్త పేస్ బౌలర్ విజయ్ కుమార్ వైశాక్...అండగా సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వెరసి చిన్నస్వామి మైదానంలో రాయల్ చాలెంజర్స్ విజయంతో మెరిసింది... వరుసగా రెండు ఓటముల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది... మరో వైపు గెలుపు బోణీ చేసే దారి తెలియక గందరగోళంలో ఉన్న ఢిల్లీపై మరో దెబ్బ పడింది. ఎప్పటిలాగే పేలవ బ్యాటింగ్తో తిప్పలు పడుతున్న ఆ జట్టు మరో ఓటమిని ఆహ్వానించింది. 2 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్ ఆపై కోలుకోలేక సీజన్లో వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంపాలైంది. బెంగళూరు: గత మ్యాచ్లో అనూహ్యంగా చివరి బంతికి లక్నో చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెంటనే కోలుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. విజయ్ కుమార్ వైశాక్ (3/20) కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు. శుభారంభం... కోహ్లి, డుప్లెసిస్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆర్సీబీకి శుభారంభం అందించారు. వీరిద్దరు 28 బంతుల్లో 42 పరుగులు జోడించిన అనంతరం కెపె్టన్ వెనుదిరిగాడు. 36 పరుగుల వద్ద కుల్దీప్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి ముస్తఫిజుర్ ఓవర్లో 4, 6తో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహిపాల్ లోమ్రోర్ (18 బంతుల్లో 26; 2 సిక్స్లు) కూడా ఆకట్టుకోగా, కోహ్లి అవుటయ్యాక వచి్చన మ్యాక్స్వెల్ (14 బంతుల్లో 24; 3 సిక్స్లు) లలిత్ ఓవర్లో రెండు సిక్స్లతో ధాటిని ప్రదర్శించాడు. ఒక దశలో ఆర్సీబీ స్కోరు 117/2. అయితే ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో 12 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. పాండే మినహా... తొలి 3 ఓవర్లలోనే ఢిల్లీ రాత తేలిపోయింది. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ చొప్పున ఆ జట్టు కోల్పోయింది. పృథ్వీ షా (0) రనౌట్ కాగా, మార్ష్ (0), ధుల్ (1) వెంటవెంటనే అవుటయ్యాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కాస్త ధాటిని పెంచిన డేవిడ్ వార్నర్ (19) కూడా ఎక్కువ సేపు నిలబడలకేపోవడంతో పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 32/4కు చేరింది. ఆ తర్వాత మనీశ్ పాండే కాస్త ఆదుకునే ప్రయత్నం చేశాడు. హసరంగ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాది 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన పాండే అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే అవుట్తో ఢిల్లీ ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ధుల్ (బి) లలిత్ 50; డుప్లెసిస్ (సి) అమాన్ (బి) మార్ష్ 22; లోమ్రోర్ (సి) పొరేల్ (బి) మార్ష్ 26; మ్యాక్స్వెల్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 24; హర్షల్ (సి) పొరేల్ (బి) అక్షర్ 6; షహబాజ్ (నాటౌట్) 20; కార్తీక్ (సి) లలిత్ (బి) కుల్దీప్ 0; రావత్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–42, 2–89, 3–117, 4–132, 5–132, 6–132. బౌలింగ్: నోర్జే 4–0–31–0, అక్షర్ 3–0–25–1, ముస్తఫిజుర్ 3–0–41–0, మార్ష్ 2–0–18–2, లలిత్ 4–0–29–1, కుల్దీప్ 4–1–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) కోహ్లి (బి) వైశాక్ 19; పృథ్వీ షా (రనౌట్) 0; మార్ష్ (సి) కోహ్లి (బి) పార్నెల్ 0; ధుల్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; మనీశ్ పాండే (ఎల్బీ) (బి) హసరంగ 50; పొరేల్ (సి) పార్నెల్ (బి) హర్షల్ 5; అక్షర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 21; అమాన్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 18; లలిత్ (సి) మ్యాక్స్వెల్ (బి) వైశాక్ 4; నోర్జే (నాటౌట్) 23; కుల్దీప్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–2, 4–30, 5–53, 6–80, 7–98, 8–110, 9–128. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2, పార్నెల్ 4–0–28–1, వైశాక్ 4–0–20–3, షహబాజ్ 1–0–11–0, హసరంగ 3–0–37–1, హర్షల్ 4–0–32–1. -
IPL 2023: దినేశ్ కార్తిక్ డకౌట్.. ఇంకోసారి ఇలా చేస్తే! ధోని ఫ్యాన్స్ ఫైర్
IPL 2023- Royal Challengers Bangalore vs Delhi Capitals: టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గతేడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడి విలువైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. అనేక సందర్భాల్లో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. అప్పుడలా ఐపీఎల్-2022 సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లలో కలిపి 330 పరుగులు సాధించిన డీకే.. జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను మాజీ సారథి, టీమిండియా అత్యుత్తమ ఫినిషర్తో మహేంద్ర సింగ్ ధోనితో పోలుస్తూ కామెంట్లు చేశారు. ఇప్పుడిలా ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లోనూ గత ఎడిషన్ మాదిరే మెరుపులు మెరిపిస్తాడని భావించిన అభిమానులకు మాత్రం పూర్తి నిరాశను మిగిల్చాడు దినేశ్ కార్తిక్. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్లు ఆడిన డీకే చేసిన మొత్తం పరుగులు 10(0, 9, 1, 0). ఢిల్లీ క్యాపిటల్స్తో సొంతమైదానంలో మ్యాచ్లో డీకే మరోసారి డకౌట్ కావడంతో అతడిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో శనివారం నాటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో లలిత్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ధోని ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే ఈ నేపథ్యంలో డీకే వరుస వైఫల్యాలను ఎండగడుతూ నెట్టింట భారీ ఎత్తున అతడిపై ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘అంచనాలు అందుకోలేకపోతున్నావు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సార్లు డకౌట్ అయింది నువ్వే. వెళ్లి కామెంట్రీ చెప్పుకో పో! అయినా చాలా మంది డీకేను ధోనితో పోల్చారు కదా!దయచేసి ఇప్పటికైనా అలా చేయడం మానేయండి. లేదంటే అలాంటి వాళ్లను జైళ్లో పడేయాలి. ధోని వరస్ట్ సిట్యుయేషన్ కూడా డీకే బెస్ట్ కంటే మెరుగ్గానే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి’’ అని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ డకౌట్తో డీకే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు(15) అవుటైన బ్యాటర్గా మన్దీప్ సింగ్తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. చదవండి: చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్ టీమిండియాకు శుభవార్త.. వరల్డ్కప్ టోర్నీకి ముందు బిగ్బూస్ట్! బీసీసీఐ కీలక ప్రకటన Dinesh Karthik in IPL2023 So far 0(3) 9(8) 1(1)* 0(1) Those who compare me with Dhoni should be jailed. pic.twitter.com/lowdzlkoTz — ` (@kurkureter) April 15, 2023 Most ducks in IPL 15 - Dinesh Karthik 14 - Rohit Sharma pic.twitter.com/jyBJAdtX8D — ` (@rahulmsd_91) April 15, 2023 15th duck for Dinesh Karthik in IPL, equal with Mandeep Singh for most ducks in IPL history. Most ducks in IPL: 15 - Mandeep 15 - Dinesh Karthik 14 - Rohit 14 - Narine #RCBvDC #TATAIPL2023 — Bharath Seervi (@SeerviBharath) April 15, 2023 Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 -
చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్
IPL 2023- RCB Vs DC- Prithvi Shaw- Anuj Rawat: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా అతడిని ట్రోల్ చేస్తూ మండిపడుతున్నారు. ‘‘అసలు నీ ఆట తీరు ఎలా ఉందో చూసుకుంటున్నావా? మొన్నటిదాకా అలా.. ఈసారేమో మళ్లీ ఇలా డకౌట్’’ అంటూ మీమ్స్తో రచ్చ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పృథ్వీ షా నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 12, 7, 0, 15. అనూజ్ సంచలన ఫీల్డింగ్ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు ఈ యువ ఓపెనర్. ఢిల్లీ ఇన్నింగ్స్లో తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో నాలుగో బంతికి షా పరుగుకు యత్నించాడు. కానీ.. మైదానంలో పాదరసంలా కదిలిన ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ ఏమాత్రం పొరపాటు చేయకుండా బాల్ను అందుకుని వికెట్లకు గిరాటేశాడు. సంచలన ఫీల్డింగ్తో ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ పృథ్వీ షాను రనౌట్ చేశాడు. క్రీజులో అడుగుపెట్టేందుకు పరిగెత్తురావడంలో జాప్యం చేసిన పృథ్వీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. దీంతో ఢిల్లీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఇకనైనా తప్పించండి ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై మండిపడుతున్నారు అభిమానులు. ‘‘నీకేమైంది పృథ్వీ షా.. ఇదేం చెత్త ఆట. షాట్ల ఎంపిక విషయంలో పొరపాట్లు. ఇప్పుడేమో రనౌట్గా వెనుదిరిగడం. ఇందుకేనా నీకు ఓపెనర్గా అవకాశాలు ఇస్తోంది ఢిల్లీ మేనేజ్మెంట్. ఇకనైనా అతడిని తప్పించి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వండి’’ అని మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. పృథ్వీ షా రనౌట్.. వీడియో వైరల్ ఇక ఇంకొంతమంది నెటిజన్లేమో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చిన అనూజ్ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా రనౌట్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వీరిద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. వరల్డ్కప్ టోర్నీకి ముందు బిగ్బూస్ట్! బీసీసీఐ కీలక ప్రకటన Talk about creating an 𝙄𝙈𝙋𝘼𝘾𝙏! Anuj Rawat gets the opposition impact player Prithvi Shaw out with a terrific direct-hit 🎯#TATAIPL | #RCBvDC pic.twitter.com/Nd8pNum9mo — IndianPremierLeague (@IPL) April 15, 2023 Prithvi Shaw😢 pic.twitter.com/WjneYYvJrJ — Pulkit🇮🇳 (@pulkit5Dx) April 15, 2023 Prithvi Shaw every match in IPL2023#RCBvsDC #DCvRCB pic.twitter.com/XgS9nd4gGr — The Dude (@PuntingDude) April 15, 2023 -
IPL 2023: అది కూడా ముఖ్యమే: కోహ్లి కౌంటర్; అతడిని ఉద్దేశించే..
IPL 2023- RCB- Virat Kohli: టీ20 ఫార్మాట్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటం కూడా ముఖ్యమేనని టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. క్రీజులో ఉన్న బ్యాటర్కు మాత్రమే అక్కడి పరిస్థితులు అర్థమవుతాయని.. అందుకు తగ్గట్లే అతడు బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. కానీ.. బయట నుంచి చూసే వ్యక్తులు మాత్రం కావాలనే నెమ్మదిగా ఆడుతున్నారనుకుంటారంటూ తనను విమర్శించిన వాళ్లకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆర్సీబీ చివరి బంతికి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓపెనర్ విరాట్ కోహ్లి పవర్ ప్లేలో దూకుడుగా ఆడి 42 పరుగులు(25 బంతుల్లో) రాబట్టిన కోహ్లి.. అర్ధ శతకం పూర్తి చేయడానికి మరో 10 బంతులు తీసుకున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసమే అంటూ ఈ నేపథ్యంలో కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమండ్ డౌల్ కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి నెమ్మదిగా ఆడాడంటూ ఆడిపోసుకున్నాడు. ఈ క్రమంలో రాబిన్ ఊతప్ప ఇంటర్వ్యూలో భాగంగా జియోసినిమాతో మాట్లాడిన కోహ్లి తాను పవర్ప్లే తర్వాత ఎందుకు నెమ్మదిగా ఆడానో వివరించాడు. ఆ తర్వాతే దూకుడు ప్రదర్శించే వీలుంటుంది ‘‘యాంకర్ రోల్ అత్యంత ముఖ్యమైంది. ఈ విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కొంతమంది మాత్రం తాము ఆ పరిస్థితుల్లో అక్కడ లేము కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్లు ప్రవర్తిస్తారు. బయట నుంచి ఆటను చూసే దృక్పథం వేరుగా ఉంటుంది. పవర్ ప్లే తర్వాత.. ‘ఏంటీ.. ఇప్పటిదాకా దూకుడు ప్రదర్శించి అకస్మాత్తుగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ డిఫెన్స్ ఆడుతున్నారు’’ అని కామెంట్ చేస్తారు. నిజానికి పవర్ ప్లేలో అత్యుత్తమ బౌలర్లే బరిలోకి దిగుతారు. తొలి రెండు ఓవర్లలో వారి బౌలింగ్ను అంచనా వేసి.. కుదురుకున్న తర్వాత దూకుడు ప్రదర్శించే వీలు ఉంటుంది. గట్టి కౌంటర్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటారే తప్ప కావాలని ఎవరూ నెమ్మదిగా ఆడరు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. దీంతో సైమన్ డౌల్కు కింగ్ పరోక్షంగా గట్టి కౌంటరే ఇచ్చాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. కీలక సమయంలో వికెట్ పడకుండా ఉండేందుకు డిఫెన్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేసుకోవడంలో తప్పేంటని సైమన్ డౌల్కు చురకలు అంటిస్తున్నారు. చదవండి: IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు! ఇంగ్లండ్ హెడ్ కోచ్కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్! -
RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ గెలుపు
Royal Challengers Bangalore vs Delhi Capitals Updates: ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ గెలుపు సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐపీఎల్-2023లో రెండో విజయం నమోదు చేసింది. కోహ్లి అర్ధ శతకం ఐపీఎల్-2023లో భాగంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం అందించారు. కోహ్లి అర్ధ శతకంతో మెరువగా.. డుప్లెసిస్ 22 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ 26, గ్లెన్ మాక్స్వెల్ 24 పరుగులు చేశారు. హర్షల్ పటేల్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా.. షాబాజ్ అహ్మద్ (12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఇక దినేశ్ కార్తిక్ డకౌట్గా వెనుదిరగగా.. అనూజ్రావత్ 22 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్షల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒకటి, లలిత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆదుకున్న మనీశ్ పాండే.. కానీ ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని మనీశ్ పాండే అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్(21), అన్రిచ్ నోర్జే(23 నాటౌట్) మాత్రమే 20 పరుగుల మార్కు అందుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు. విజయ్కుమార్ వైషాక్ అరంగేట్రంలోనే అదుర్స్ ఇదిలా ఉంటే.. ఆర్సీబీ అరంగేట్ర బౌలర్ విజయ్కుమార్ వైషాక్ 3 వికెట్లతో చెలరేగడం విశేషం. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్లలో సిరాజ్కు రెండు, పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్లకు ఒక్కో వికెట్ దక్కాయి. 17.3: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ సిరాజ్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అమన్ హకీం ఖాన్(18). 15.5: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో లలిత్ యాదవ్(4) అవుట్. స్కోరు: 110/8 (15.5) అర్ధ శతక హీరో అవుట్ 13.6: హసరంగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మనీష్ పాండే(50). ఫలితంగా ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ. స్కోరు: 98/7 (14) ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 12.2: విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అక్షర్ పటేల్(21). స్కోరు: 81/6 (12.3) 12 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 76/5 9 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 53-5 8.5: హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్(5) అవుట్. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 32-4 5.4: విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆదిలోనే ఢిల్లీకి ఊహించని షాక్.. మూడో వికెట్ డౌన్(2/3 (2.2)) 2.2: సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన యశ్ ధుల్(1). మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్. వార్నర్, మనీశ్ పాండే క్రీజులో ఉన్నారు. ఢిల్లీ స్కోరు: 2/2 (2) వార్నర్, యశ్ ధుల్ ఒక్కో పరుగుతో క్రీజులో ఉన్నారు. 1.4: రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ పార్నెల్ బౌలింగ్లో మిచెల్ మార్షెల్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ 0.4: రనౌట్గా వెనుదిరిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్లు వార్నర్, షా పరుగుకు యత్నించగా అనూజ్ రావత్ పాదరసంలా కదిలి.. బంతిని వికెట్లకు గిరాటేశాడు. దీంతో షా రనౌట్ కాగా.. అతడి రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. స్కోరు: 1-1. ఆర్సీబీ స్కోరు: 174/6 (20) 18 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 154-6 అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. 14.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో దినేశ్ కార్తిక్ డకౌట్. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 14.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మాక్స్వెల్ అవుట్. ఆర్సీబీ స్కోరు: 132/5 (14.1) నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 13.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్షల్ పటేల్ అవుట్. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 12.3: మిచెల్ మార్ష్ బౌలింగ్లో వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్కు క్యాచ్ ఇచ్చి మహిపాల్ లామ్రోర్(26(18) [6s-2])అవుట్. మాక్స్వెల్, హర్షల్ పటేల్ క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 110/2 మహిపాల్ (20), గ్లెన్ మాక్స్వెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 10.1: అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి అవుట్ లలిత్ యాదవ్ బౌలింగ్లో యశ్ ధుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లి (50(34) [4s-6 6s-1]) 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 70/1 50 పరుగుల మార్కు అందుకున్న ఆర్సీబీ 7 ఓవర్లలో స్కోరు: 54-1 పవర్ప్లేలో ఆర్సీబీ ఇలా: 47/1 (6) ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 43/1 (5) కోహ్లి (19) ,మహిపాల్ (1) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 4.4: మిచెల్ మార్ష్ బౌలింగ్లో డుప్లెసిస్(22(16)) అవుట్. అమన్ హకీం ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బెంగళూరు కెప్టెన్. మూడో ఓవర్లో ఇలా: 26-0 2.3: ముస్తాఫిజుర్ బౌలింగ్లో మరో ఫోర్ కొట్టిన డుప్లెసిస్ 2.2: ముస్తాఫిజుర్ బౌలింగ్లో బౌండరీ బాదిన డుప్లెసిస్ రెండో ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 16/0 (2) కోహ్లి 12, డుప్లెసిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా ఐదు పరుగులు మాత్రమే ఇచ్చిన అక్షర్ పటేల్. ►తొలి ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 11-0 0.3: మరోసారి బౌండరీతో మెరిసిన కోహ్లి 0.2: నోర్జే బౌలింగ్లో ఫోర్ బాదిన కోహ్లి ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులో జరుగుతున్న శనివారం నాటి మ్యాచ్లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్ రాగా.. స్పిన్నర్ వనిందు హాసరంగా ఆర్సీబీ జట్టులోకి చేరాడు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లో విజయం సాధించగా.. ఢిల్లీ ఇంకా ఖాతా తెరవలేదు. తుదిజట్లు(Playing XI) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్కుమార్ వైషాక్. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్. -
Virat Kohli: వామికాతో ఫొటో షేర్ చేసిన కోహ్లి! క్షణాల్లోనే..
Virat Kohli- Vamika: బిజీ బిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్పూల్లో తన చిన్నారి కూతురితో సేద తీరుతున్న ఫొటోను మంగళవారం పంచుకున్నాడు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫొటో క్షణాల్లోనే వైరల్గా మారింది. కాగా ఐపీఎల్-2023లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. తప్పని ఓటమి సొంత మైదానంలో ఆడిన ఈ మ్యాచ్లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే, హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆఖరికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయం ఖరారైంది. దీంతో డుప్లెసిస్ బృందానికి రాహుల్ సేన చేతిలో ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సెలబ్రిటీ ఇమేజ్కు దూరం ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మ్యాచ్ ముగించుకున్న కోహ్లి తనకు దొరికిన కాస్త విరామం కూతురితో గడిపాడు. కాగా 2017లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు జనవరి 2021లో కూతురు వామిక జన్మించింది. అయితే, విరుష్క జంట మాత్రం ఇంతవరకు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు చూపించలేదు. తమ కూతురిని సెలబ్రిటీ ఇమేజ్కు ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కోహ్లి- అనుష్క అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన పూర్తి రూపాన్ని చూపించనప్పటికీ ఆమెతో గడిపిన అద్భుత క్షణాలను ఇలా కెమెరాలో బంధిస్తూ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. చదవండి: అప్పుడేమో నోరు మూయాలన్నాడు! తర్వాత కోహ్లితో ఇలా.. గంభీర్ ఫొటో వైరల్ ❤️ pic.twitter.com/veANraaUBC — Virat Kohli (@imVkohli) April 11, 2023 -
అప్పుడేమో నోరు మూయాలన్నాడు! తర్వాత కోహ్లితో ఇలా.. గంభీర్ ఫొటో వైరల్
Gautam Gambhir Hugs Virat Kohli Photo Viral: హైడ్రామాలు.. ఓవైపు పట్టరాని సంతోషంతో గెంతులు.. మరోవైపు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన అభిమానులు.. దాచుకోలేని భావోద్వేగాలు.. ఆటలో.. ముఖ్యంగా టీ20 లాంటి పొట్టి ఫార్మాట్ క్రికెట్లో.. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతమవడం సహజం. ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరి బంతికి ఫలితం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో ఆర్సీబీని ఓడించింది. కోహ్లి, డుప్లెసిస్ అదరగొట్టారు బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. ఈ భాగస్వామ్యంలో ముందుగా కోహ్లి చెలరేగిపోయాడు. అవేశ్ ఖాన్ తొలి రెండు ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన కోహ్లి, వుడ్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరగా, 35 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. ఈ క్రమంలో మరో భారీ షాట్కు ప్రయత్నించి మిశ్రా బౌలింగ్లో కోహ్లి అవుట్ కావడంతో తొలి వికెట్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ కూడా చాలా కాలం తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరో ఎండ్లో డుప్లెసిస్ కూడా ధాటిని పెంచాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు కొట్టిన ఆర్సీబీ కెప్టెన్ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అనంతరం జోరును కొనసాగిస్తూ ఉనాద్కట్ ఓవర్లో డుప్లెసిస్ 2 సిక్స్లు ఒక ఫోర్ కొట్టగా, ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై అవేశ్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో మ్యాక్స్వెల్ పండుగ చేసుకున్నాడు. 24 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 75 పరుగులు చేయగా...జట్టు ఇన్నింగ్స్లో మొత్తం 12 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ విఫలం... లక్నో ఛేదన పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే మేయర్స్ (0)ను సిరాజ్ బౌల్డ్ చేయగా, పార్నెల్ ఒకే ఓవర్లో దీపక్ హుడా (9), కృనాల్ పాండ్యా (0)లను వెనక్కి పంపాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్లో స్టొయినిస్ మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. ఓడిపోతామనుకున్న సమయంలో హర్షల్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 కొట్టిన స్టొయినిస్, కరణ్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆపై షహబాజ్ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు కొట్టి 25 బంతుల్లోనే స్టొయినిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టొయినిస్తో పాటు రాహుల్ నాలుగు బంతుల వ్యవధిలో అవుట్ కావడంతో లక్నో గెలుపు అవకాశాలు క్షీణించాయి. కానీ ఆఖర్లో ఒకే ఒక్క పరుగుతో.. అయితే పూరన్ అద్భుత ప్రదర్శన జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. కరణ్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన పూరన్, హర్షల్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. పార్నెల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, 6 బాదిన అతను 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. గెలుపు కోసం లక్నో 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించడం చివర్లో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయతీరాలకు చేరింది. గంభీర్ చర్య వైరల్.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ లక్నోకు ఆర్సీబీపై ఇదే తొలి విజయం కావడంతో ఆ జట్టు సంతోషాల్లో మునిగిపోయింది. క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి కొట్టి మరీ సెలబ్రేట్ చేసుకోగా.. ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేసిన అనంతరం లక్నో మెంటార్ గౌతం గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ను నోరు మూయాలన్నట్లు సైగ చేశాడు. దీంతో అతడిపై విమర్శలు గుప్పిస్తూ ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. తదుపరి మ్యాచ్లో కోహ్లి మీకు సరైన సమాధానం ఇస్తాడంటూ కామెంట్లు చేశారు. అయితే, ఇందుకు కౌంటర్ అన్నట్లుగా లక్నో సూపర్ జెయింట్స్ ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేసింది. కోహ్లిని హగ్ చేసుకున్న గంభీర్ ‘‘ఇది ఐపీఎల్ యార్.. ఇక్కడ కేవలం ప్రేమానురాగాలకే తావుంది’’ అంటూ కోహ్లిని గంభీర్ ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. వారిద్దరు ముచ్చటించుకుంటున్న దృశ్యం పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోపై స్పందిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు దొరికిన ఇద్దరు ఆణిముత్యాల్లాంటి బ్యాటర్లు, దిగ్గజ ఆటగాళ్లు అంటూ కొనియాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఆటగాళ్ల మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉండిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: ఓవరాక్షన్కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్కు ఊహించని షాక్! అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 Ye IPL hai mere yaar, bas ishq mohabbat pyaar 💙❤️@GautamGambhir | @imVkohli | #RCBvLSG | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/Kqnwbh5ICz — Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: ఓవరాక్షన్కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్కు ఊహించని షాక్!
IPL 2023- Avesh Khan Throws Helmet To Celebrate: ఓటమి తప్పదనుకున్న వేళ అనూహ్యంగా విజయం వరిస్తే.. ఆనందంతో ఎగిరి గంతులేయడంలో తప్పులేదు. కానీ శ్రుతిమించి హద్దులు దాటితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. టీమిండియా పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్కు ఇలాంటి హెచ్చరికనే జారీ చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. చెలరేగిన కోహ్లి, డుప్లెసిస్ ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్కు కోహ్లితో 96 పరుగులు (69 బంతుల్లో) జోడించిన డుప్లెసిస్, రెండో వికెట్కు మ్యాక్స్వెల్తో 115 పరుగులు (50 బంతుల్లో) జత చేశాడు. పూరన్ మ్యాచ్ను లాగేసుకున్నాడు అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు సాధించి గెలిచింది. స్టొయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడగా, ఆయుష్ బదోని (24 బంతుల్లో 30; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. ఆఖర్లో బై రూపంలో వచ్చిన పరుగు లక్నో గెలుపును ఖరారు చేసింది. వైల్డ్ సెలబ్రేషన్.. ఓవరాక్షన్ వద్దు ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ అయితే మరీ దూకుడుగా ప్రవర్తించాడు. హెల్మెట్ నేలకేసి కొట్టి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ అతడికి చురకలు అంటిస్తున్నారు. ఆవేశ్ ఖాన్కు మందలింపు తాజాగా.. ఐపీఎల్ నిర్వాహకులు సైతం మితిమీరి ప్రవర్తించిన ఆవేశ్ ఖాన్ను మందలిస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ లక్నో సూపర్ జెయింట్స్ ఆవేశ్ ఖాన్ను మందలింపుగా ఈ ప్రకటన. మిస్టర్ ఆవేశ్ ఐపీఎల్ కోడ్లోని 2.2 నిబంధనను అతిక్రమించాడు’’ అని పేర్కొన్నారు. మొదటి తప్పిదం కావున మందలింపుతో సరిపెడుతున్నట్లు వెల్లడించారు. చదవండి: IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్.. భారీ జరిమానా ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే!
Royal Challengers Bangalore vs Lucknow Super Giants: డ్రామా... డ్రామా... హైడ్రామా... ఐపీఎల్లో వరుసగా రెండో రోజు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్... చిన్నస్వామి మైదానంలో అనేక మలుపులు తిరుగుతూ, అనూహ్య ప్రదర్శనలు చూపించిన పోరు ఒక పెద్ద అద్భుతంగా ముగిసింది. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు బాదడంతో సొంత మైదానంలో బెంగళూరు 212 పరుగులతో నిశ్చింతగా నిలిచింది... 23 పరుగులకే 3 లక్నో వికెట్లు తీసిన తర్వాత ఇక ఫలితం ఏకపక్షమే అనిపించింది. ఈ దశలో ముందుగా స్టొయినిస్ చెలరేగాడు... అయినా సరే 105/5 వద్ద బెంగళూరుదే పైచేయి. 53 బంతుల్లో 108 పరుగులు అసాధ్యంగా అనిపించింది! అయితే నికోలస్ పూరన్ ఒంటిచేత్తో అంతా మార్చేశాడు. తాను ఆడిన 19 బంతుల్లోనే మ్యాచ్ను లాగేసుకున్నాడు. చివర్లో ఉత్కంఠ పెరిగినా సూపర్ జెయింట్స్ గెలుపు గీతను దాటి సంబరాలు చేసుకుంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయఢంకా మోగించింది. పట్టరాని సంతోషంలో గంభీర్ ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ చర్య నెట్టింట వైరల్గా మారింది. ఆఖరి బంతికి అనూహ్య విజయం దక్కడంతో గంభీర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆర్సీబీపై తొలి విజయం.. నోరు మూయండి అంటూ.. ఐపీఎల్లో తొలిసారి ఆర్సీబీపై అదీ వారి సొంతమైదానంలో లక్నో విజయం సాధించడంతో ఈ టీమిండియా మాజీ ఓపెనర్ ఆనందం కట్టలు తెంచుకుంది. దీంతో.. ఆర్సీబీని ఉత్సాహపరుస్తున్న ఆ జట్టు ఫ్యాన్స్ను ఉద్దేశించి.. ‘‘ఇక ఆపండి’’ అన్నట్లు.. నోటిపై వేలును ఉంచి సైగ చేశాడు. గంభీర్పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు స్పందించిన ఆర్సీబీ ఫ్యాన్స్.. ‘‘గంభీర్ నీ స్థాయికి తగినట్లు కాస్త హుందాగా ప్రవర్తించు. ఒక్క విజయం అది కూడా ఆఖరి బంతికి బై రూపంలో పరుగు వచ్చినందుకు గెలవడం.. కోహ్లి రిప్లై కోసం ఎదురుచూడు దానికి ఇలాంటి ఎక్స్ప్రెషన్.. ఏంటో ఈ వేషాలు. తదుపరి మ్యాచ్లో మా కోహ్లి ఇచ్చే రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉండు’’ అని కౌంటర్ ఇస్తున్నారు. అయితే, గంభీర్ అభిమానులు మాత్రం.. ‘‘ఇందులో మాకైతే ఎలాంటి తప్పు కనిపించడం లేదు. విన్నింగ్స్ సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి’’ అంటూ అతడికి అండగా నిలుస్తున్నారు. కాగా మళ్లీ లక్నో వేదికగా ఆర్సీబీ- సూపర్ జెయింట్స్ మే 1న తలపడనున్నాయి. చదవండి: RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్.. భారీ జరిమానా RCB Vs LSG: కనీసం బంతిని టచ్ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్ పనికిరాదు! Gautam Gambhir to RCB Fans !! 🔥 pic.twitter.com/2zzGEuFRHr — Tanay Vasu (@tanayvasu) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్.. భారీ జరిమానా
Royal Challengers Bangalore vs Lucknow Super Giants: ఓటమి బాధలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు 12 లక్షల జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు అతడికి నిర్వాహకులు ఫైన్ విధించారు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. పూరన్ దెబ్బ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి పూరన్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆఖరి బాల్కు బై రూపంలో పరుగు రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ జయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. బెంగళూరు జట్టుకు ఇప్పటికే ఆన్ఫీల్డ్ పెనాల్టీ పడిన విషయం తెలిసిందే. అప్పటికే పెనాల్టీ స్లో ఓవర్ రేటు కారణంగా ఆఖరి ఓవర్లో ఎక్స్ట్రా ఫీల్డర్ను ఇన్సైడ్ సర్కిల్లో ఉంచడం వల్ల డీప్ బౌండరీలో కేవలం నలుగురినే ప్లేస్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆర్సీబీ కెప్టెన్కు జరిమానా విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా జరిమానా విధించాం. ఈ సీజన్లో ఆర్సీబీది తొలి తప్పిదం అయిన కారణంగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు 12 లక్షల రూపాయలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. చదవండి: RCB Vs LSG: కనీసం బంతిని టచ్ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్ పనికిరాదు! అయ్యో హర్షల్.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగి ఉంటేనా! వీడియో వైరల్ 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
RCB Vs LSG: రెండుసార్లు ఆర్సీబీదే పైచేయి.. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో
IPL 2023 RCB Vs LSG: ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. సొంతమైదానంలో రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్లో తమ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో తలపడింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది గెలుపుతో సీజన్ను ఆరంభించింది. అయితే, కోల్కతా నైట్రైడర్స్తో ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ 81 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్లో రాణించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి(ముంబైపై 49 బంతుల్లో 82 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (ముంబైపై 43 బంతుల్లో 73 పరుగులు) కోల్కతాలో విఫలమయ్యారు. వీరితో పాటు డేవిడ్ విల్లే (20 పరుగులు) మాత్రమే ఇరవై పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. మరోవైపు.. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్.. రెండో మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. ఆర్సీబీతో లక్నో ఢీ అయితే, సొంతమైదానంలో సన్రైజర్స్తో మ్యాచ్లో విజయం సాధించి తిరిగి గెలుపు బాటపట్టింది. ఈ నేపథ్యంలో రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో, రెండింట ఒక విజయంతో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ సోమవారం బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. రెండుసార్లు ఆర్సీబీదే పైచేయి కాగా బెంగళూరు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి వర్ష సూచనైతే లేదు. అదే విధంగా బ్యాటర్లకు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్లో కూడా మెరుగైన స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ- లక్నో రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. రెండుసార్లు బెంగళూరు జట్టే విజయం సాధించింది. ఈ మ్యాచ్తో ఆర్సీబీకి ప్రొటిస్ ఆల్రౌండర్ వేన్ పార్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరమైన లక్నో బౌలర్ మార్క్ వుడ్ ఆర్సీబీతో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆవేశ్ ఖాన్ సైతం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ వర్సెస్ లక్నో తుది జట్ల అంచనా: ఆర్సీబీ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, అనూజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, మైకేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. లక్నో కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్/జయదేవ్ ఉనాద్కట్, మార్క్ వుడ్, రవి బిష్ణోయి. ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు!