Royal Challengers Bangalore
-
అమన్జ్యోత్ మెరుపులు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్జ్యోత్ కౌర్ ఆల్రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. మొదట ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్జ్యోత్ 3–0–22–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0. -
భళా బెంగళూరు...
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–107, 2–133. బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0. -
IPL 2025: కోల్కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరిగే ఫైనల్తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు (7 లీగ్ మ్యాచ్లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో; మార్చి 30న సన్రైజర్స్ హైదరాబాద్తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్కతాలో జరగనున్నాయి. » లీగ్లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లోని ఒక జట్టు తమ గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించినా... మరో ఎండ్లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్లో మరో సిక్స్తో రిచా మ్యాచ్ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
ధనాధన్ సమరం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడనుంది.వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్కు వేళయింది. తొలి రెండు సీజన్లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్ను నిర్ణయిస్తారు. » బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. » పేలవ ఫామ్తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నారు. » గత రెండు పర్యాయాలు రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్తో క్యాపిటల్స్ బలంగా ఉంది. » తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు. » గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్లు నిర్వహించనున్నారు. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ను ఫైనల్కు చేర్చాడు. పాటిదార్కు రంజీల్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్రేట్తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరింది. -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్గా నిలిచిన దీపక్ చహర్కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
Eliminator: ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
-
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1. -
RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’
ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో... నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్ మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్ట్నర్ బౌలింగ్లో సిక్స్లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పటిదార్తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs CSK: చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్రేట్ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి. -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), మహిపాల్ సిక్స్లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్లో కొంత కష్టమైన క్యాచ్ను బెయిర్స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్లు) తొలి వికెట్కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X ఢిల్లీ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రైజింగ్కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్కు వెళ్లిపోయారు. దాంతో సన్రైజర్స్కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
IPL 2024 RCB vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం..ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్యాట్ కమ్మిన్స్(31), అభిషేక్ శర్మ(31) పర్వాలేదన్పించారు.ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..124 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. గ్రీన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్ కమ్మిన్స్(3) పరుగులతో ఉన్నారు.56 పరుగులకే 4 వికెట్లు..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో తొలుత మార్క్రమ్(7) ఔట్ కాగా.. తర్వాత క్లాసెన్(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.రెండో వికెట్ డౌన్..37 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యశ్దయాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 37/2. క్రీజులో మార్క్రమ్(3), నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్ హెడ్.. విల్ జాక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 207 పరుగులుటాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 179/518 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(27), కార్తీక్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్..ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జయ్దేవ్ ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 142/4మూడో వికెట్ డౌన్..పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 132/312 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 126/212 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), రజిత్ పాటిదార్(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్ జాక్స్.. మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 73/2. క్రీజులో విరాట్ కోహ్లి(34), పాటిదార్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 49/1. క్రీజులో విరాట్ కోహ్లి(23), విల్ జాక్స్(1) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్(15) పరుగులతో ఉన్నారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్లో సన్రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్తో 7.1 ఓవర్లోనే సన్రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్తో విరుచుకుపడిన క్లాసెన్కు ఫెర్గూసన్ చెక్పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్కూ సిక్స్లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్లు బాదడంతో పవర్ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్జాక్స్ (7) నాన్స్ట్రయిక్ ఎండ్లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్రైజర్స్ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్రైజర్స్ సవరించింది. ఓవరాల్గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్కతా X రాజస్తాన్ వేదిక: కోల్కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్ 4/4
జైపూర్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఐపీఎల్లో 8వ శతకం సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్’ చేపట్టిన ‘పింక్ ప్రామిస్’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. కోహ్లి శతక్కొట్టాడు కానీ... బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు. కానీ బ్యాటింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్ మ్యాక్స్వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) నిరాశపరిచారు. గ్రీన్ (5 నాటౌట్) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్కు ఆమడ దూరంలో నిలిచింది. బట్లర్, సామ్సన్ ధనాధన్ జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్కు కెప్టెన్ సంజూ సామ్సన్ జతవడంతో చేజింగ్ చాలా సులువుగా సాగింది. మయాంక్ డాగర్ వేసిన 6వ ఓవర్ను పూర్తిగా ఆడిన బట్లర్ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు. పవర్ప్లేలో రాయల్స్ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి. బట్లర్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది. సామ్సన్ను ఎట్టకేలకు సిరాజ్ అవుట్ చేయగా... 148 పరుగుల రెండో వికెట్కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (4), జురెల్ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్సర్తో సెంచరీని, మ్యాచ్ను ఒకేసారి పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 113; డుప్లెసిస్ (సి) బట్లర్ (బి) చహల్ 44; మ్యాక్స్వెల్ (బి) బర్గర్ 1; సౌరవ్ (సి) జైస్వాల్ (బి) చహల్ 9; గ్రీన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్: బౌల్ట్ 3–0–30–0, బర్గర్ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్ఖాన్ 4–0–46–0, చహల్ 4–0–34–2, పరాగ్ 1–0–10–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మ్యాక్స్వెల్ (బి) టాప్లీ 0; బట్లర్ నాటౌట్ 100; సామ్సన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69; పరాగ్ (సి) కోహ్లి (బి) యశ్ 4; జురెల్ (సి) కార్తీక్ (బి) టాప్లీ 2; హెట్మైర్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. బౌలింగ్: టాప్లీ 4–0–27–2, యశ్ దయాళ్ 4–0–37–1, సిరాజ్ 4–0–35–1, మయాంక్ 2–0–34–0, గ్రీన్ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0. ఐపీఎల్లో నేడు ముంబై X ఢిల్లీ వేదిక: ముంబై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి లక్నో X గుజరాత్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇదే సిక్స్తో తన సెంచరీ మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
మయాంక్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మయాంక్తోపాటు డికాక్, నికోలస్ పూరన్ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్లు), పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ మయాంక్ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. డికాక్, పూరన్ మెరుపులతో... లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్లు బాదాడు. దీంతో కెపె్టన్ కేఎల్ రాహుల్ (20; 2 సిక్స్లు) తక్కువే చేసినా... దేవదత్ పడిక్కల్ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ 5 సిక్స్లతో 33 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి అవుటవడంతోనే... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్ డు ప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్తో టచ్లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్వెల్ (0) పూరన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ (9) బౌల్డ్ కాగా.. అనూజ్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన లామ్రోర్ సిక్స్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్ (4) అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డాగర్ (బి) టాప్లీ 81; కేఎల్ రాహుల్ (సి) డాగర్ (బి) మ్యాక్స్వెల్ 20; పడిక్కల్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 6; స్టొయినిస్ (సి) డాగర్ (బి) మ్యాక్స్వెల్ 24; పూరన్ (నాటౌట్) 40; బదోని (సి) డుప్లెసిస్ (బి) యశ్ దయాళ్ 0; కృనాల్ పాండ్యా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. బౌలింగ్: రీస్ టాప్లీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–24–1, సిరాజ్ 4–0–47–1, మ్యాక్స్వెల్ 4–0–23–2, మయాంక్ డాగర్ 2–0–23–0, గ్రీన్ 2–0–25–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) పడిక్కల్ (బి) సిద్ధార్థ్ 22; డుప్లెసిస్ (రనౌట్) 19; పటిదార్ (సి) పడిక్కల్ (బి) మయాంక్ యాదవ్ 29; మ్యాక్స్వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ యాదవ్ 0; గ్రీన్ (బి) మయాంక్ యాదవ్ 9; అనూజ్ (సి) పడిక్కల్ (బి) స్టొయినిస్ 11; మహిపాల్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 33; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4; మయాంక్ డాగర్ (రనౌట్) 0; టాప్లీ (నాటౌట్) 3; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్: సిద్ధార్థ్ 3–0–21–1, కృనాల్ పాండ్యా 1–0–10–0, నవీనుల్ 3.4–0–25–2, మయాంక్ యాదవ్ 4–0–14–3, రవి బిష్ణోయ్ 3–0–33–0, యశ్ ఠాకూర్ 4–0–38–1, స్టొయినిస్ 1–0–9–1. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X కోల్కతా వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
వారెవ్వా మయాంక్.. టీమిండియాకు మరో శ్రీనాథ్ దొరికేశాడు
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ యవ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మరోసారి నిప్పులు చేరిగాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మయాంక్ యాదవ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మయాంక్ తన పేస్ బౌలింగ్తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్కు మాక్స్వెల్ లాంటి వరల్డ్క్లాస్ బ్యాటరే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. అదే విధంగా ఆర్సీబీ బ్యాటర్ గ్రీన్ను మయాంక్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్కు మరో జవగల్ శ్రీనాథ్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైటర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన మయాంక్ యాదవ్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే కచ్చితంగా అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 40 పరుగులు చేశాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(83) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి.. తన జట్టు మాత్రం 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కాగా కోహ్లి ఓటమి బాధలో ఉన్నప్పటికి మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లి కోల్కతా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి ఆటగాళ్లను కలిశాడు. యువ క్రికెటర్లకు విరాట్ విలువైన సూచనలు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్కు కోహ్లి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లి తన బ్యాట్ను రింకూకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రింకూ సింగ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తనకు బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు కోహ్లికి రింకూ ధన్యవాదాలు తెలియజేశాడు. "సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు భయ్యా.. అదేవిధంగా బ్యాట్ ఇచ్చినందుకు కూడా థాంక్స్" అంటూ ఇన్స్టా స్టోరీలో రింకూ రాసుకొచ్చాడు. చదవండి: IPL 2024: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Rinku Singh thanking Virat Kohli for the gift. 👌 - Kohli is always there for youngsters. pic.twitter.com/p23y7ZHFj8 — Johns. (@CricCrazyJohns) March 30, 2024 -
KKR Vs RCB: కోల్కతా లెక్క మార్చేసింది
బెంగళూరు: కోల్కతా ఓపెనర్లు నరైన్ (22 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాల్ట్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన బ్యాటింగ్ ముందు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (59 బంతుల్లో 83; 4 ఫోర్లు, 4 సిక్స్లు) క్లాసిక్ ఇన్నింగ్స్ చిన్నదిగా మారిపోయింది. దీంతో ఈ సీజన్లో తొలి సారి సొంతగడ్డపై ఆతిథ్య జట్టుకు చుక్కెదురైంది. కోల్కతా గత తొమ్మిది మ్యాచ్ల సంప్రదాయాన్ని ఈ మ్యాచ్తో మార్చేసింది. చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభం నుంచి కోహ్లి, ఆఖర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20; 3 సిక్స్లు) మెరిపించారు. అనంతరం కోల్కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు. కోహ్లి ఒక్కడే... తొలి బంతికే బౌండరీతో కోహ్లి బెంగళూరు ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే అవుటవుతున్నా... తన వీరోచిత ప్రదర్శనతో పరుగుల్ని వేగంగా పేర్చిన కోహ్లి పెద్ద భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. కెపె్టన్ డుప్లెసిస్ (8) రెండో ఓవర్లోనే అవుట్ కాగా, గ్రీన్ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ ( 19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎంతోసేపు నిలువలేదు. కోహ్లి ఒక్కడే నిలిచి ఇన్నింగ్స్ను ఆఖరి దాకా నడిపించాడు. తన మార్కు క్లాసిక్ షాట్లతో, తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో బెంగళూరు ప్రేక్షకుల్ని ఆద్యంతం కేరింతల్లో ముంచేశాడు. 36 బంతుల్లో విరాట్ అర్ధ సెంచరీ పూర్తయ్యింది. గత మ్యాచ్లో పేలవ బౌలింగ్లో ఒక్క వికెట్ తీయకుండా 53 పరుగులిచ్చిన మిచెల్ స్టార్క్ ఈ సారి కూడా వికెట్ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. ‘పవర్ ప్లే’లో 85/0 కోల్కతా ముందున్న లక్ష్యం కష్టమైంది. కానీ సులువుగా ఛేదించింది. ఓపెనర్లు సాల్ట్, నరైన్ల బ్యాటింగ్ సునామీ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్లు ఇద్దరూ దంచేసే పనిలో పడటంతో సిక్స్లైతే మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. సిరాజ్ తొలి ఓవర్లో సాల్ట్ రెండు సిక్స్లు, ఒక బౌండరీలతో ఉతికేశాడు. సునీల్ నరైన్... తానేం తక్కువ కాదని జోసెఫ్ మూడో ఓవర్లో 2 భారీ సిక్సర్లతో చాటుకున్నాడు. ఈ మెరుపుల మేనియాలో నైట్రైడర్స్ జట్టు కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను దాటేసింది. 6 ఓవర్లలో వికెటే కోల్పోకుండా 85 పరుగులు చేసింది. అంతలోనే చేయాల్సిన పరుగులు వందలోపే దిగొచ్చింది.ఏడో ఓవర్లో నరైన్ను డాగర్, ఎనిమిదో ఓవర్లో సాల్ట్ను వైశాక్ అవుట్ చేశారు. కానీ అప్పటికే స్కోరు 92/2. లక్ష్యంలో సగం పనైపోయింది. మిగతా సగాన్ని వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పూర్తి చేశారు. దీంతో 19 బంతులు మిగిలుండగానే నైట్రైడర్స్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 83; డుప్లెసిస్ (సి) స్టార్క్ (బి) హర్షిత్ 8; గ్రీన్ (బి) రసెల్ 33; మ్యాక్స్వెల్ (సి) రింకూసింగ్ (బి) నరైన్ 28; పటిదార్ (సి) రింకూసింగ్ (బి) రసెల్ 3; రావత్ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 3; దినేశ్ కార్తీక్ రనౌట్ 20; ఎక్స్ట్రాలు 4; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–17, 2–82, 3–124, 4–144, 5–151, 6–182. బౌలింగ్: స్టార్క్ 4–0–47–0, హర్షిత్ 4–0–39–2, అనుకూల్ 2–0–6–0, నరైన్ 4–0–40–1, రసెల్ 4–0–29–2, వరుణ్ 2–0–20–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) గ్రీన్ (బి) వైశాక్ 30; నరైన్ (బి) డాగర్ 47; వెంకటేశ్ (సి) కోహ్లి (బి) యశ్ దయాళ్ 50; శ్రేయస్ నాటౌట్ 39; రింకూ సింగ్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16.5 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–86, 2–92, 3–167. బౌలింగ్: సిరాజ్ 3–0–46–0, యశ్ దయాళ్ 4–0–46–1, జోసెఫ్ 2–0–34–0, మయాంక్ డాగర్ 2.5–0–23–1, వైశాక్ 4–0–23–1, వైశాక్ 1–0–7–0. ఐపీఎల్లో నేడు లక్నో X పంజాబ్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం The streak is broken! @KKRiders 💜 become the first team to register an away win in #TATAIPL 2024 👏👏 Scorecard ▶️https://t.co/CJLmcs7aNa#RCBvKKR pic.twitter.com/svxvtA409s — IndianPremierLeague (@IPL) March 29, 2024 -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్ కొత్త సీజన్ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్లోనే రచిన్ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్. చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... బెంగళూరు ఇన్నింగ్స్లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్ భాగస్వామ్యమే కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. అయితే ముస్తఫిజుర్ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ చక్కటి ఫీల్డింగ్కు డుప్లెసిస్ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్వెల్ (0) తొలి బంతికే అవుట్ కాగా, గ్రీన్ (18)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో రావత్ 2 సిక్స్లు, ఫోర్ కొట్టగా, కార్తీక్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో రుతురాజ్ (15) విఫలమైనా...ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే రచిన్ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్లు), డరైల్ మిచెల్ (18 బంతుల్లో 22; 2 సిక్స్లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్; 1 సిక్స్) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 21; డుప్లెసిస్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 35; పటిదార్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 0; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) చహర్ 0; గ్రీన్ (బి) ముస్తఫిజుర్ 18; రావత్ (రనౌట్) 48; కార్తీక్ (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–1, తుషార్ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–29–4, జడేజా 4–0–21–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) గ్రీన్ (బి) దయాళ్ 15; రచిన్ (సి) పటిదార్ (బి) కరణ్ 37; రహానే (సి) మ్యాక్స్వెల్ (బి) గ్రీన్ 27; మిచెల్ (సి) పటిదార్ (బి) గ్రీన్ 22; దూబే (నాటౌట్) 34; జడేజా (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110. బౌలింగ్: సిరాజ్ 4–0–38–0, యశ్ దయాళ్ 3–0–28–1, జోసెఫ్ 3.4–0–38–0, కరణ్ శర్మ 2–0–24–1, డాగర్ 2–0–6–0, గ్రీన్ 3–0–27–2, మ్యాక్స్వెల్ 1–0–7–0. అలరించిన ఆరంభ వేడుకలు తొలి మ్యాచ్కు ముందు చిదంబరం స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ఢిల్లీ వేదిక: ముల్లన్పూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్కతా X హైదరాబాద్ వేదిక: కోల్కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అటు ఫోర్... ఇటు సిక్సర్!
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ఆటగాడిగా మరో టైటిల్ విజయంలో భాగం అవుతాడా? ఇంకా తొలి ట్రోఫీ కోసమే ఎదురు చూస్తున్న కోహ్లికి ఈ సారైనా దానిని అందుకునే అదృష్టం ఉందా? సారథ్యం కోల్పోయిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తాతో ముంబైకి మరో విజయం అందిస్తాడా? చావుకు దగ్గరగా వెళ్లి వచ్చి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పంత్ కొత్త ఇన్నింగ్స్లో ఆటగాడిగా, నాయకుడిగా జట్టును నడిపించగలడా? ముంబై అభిమానుల ఆశలకు విరుద్ధంగా కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా తన ఆటతో, వ్యూహాలతో వారి మనసు గెలవగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలన్నీ రాబోయే రెండు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లభిస్తాయి. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తూ పూర్తి స్థాయి వినోదాన్ని అందించే వేసవి పండగకు సమయం వచ్చేసింది. చెన్నై వేదికగా నేడు ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్లతో టోర్నీ సిద్ధం కాగా... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్లకే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్ను ఆస్వాదించిన ఫ్యాన్స్ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చించడం ఖాయం. చెన్నై: మెగా టి20 టోర్నీ ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) ఉంటాయి. తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా... మే 26న ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేతగా నిలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించింది. దక్కన్ చార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్కు ముందు ప్రత్యేక ఆరం¿ోత్సవ వేడుకలు జరుగుతాయి. ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 17వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు... ♦ తాజా సీజన్లో పలు జట్లకు కొత్త కెపె్టన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్కు మార్క్రమ్ స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్కు పాండ్యా స్థానంలో శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్కతా జట్ల పగ్గాలు చేపట్టారు. మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజూ సామ్సన్ (రాజస్తాన్), డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్లాగే ఈసారి సారథులుగా కొనసాగనున్నారు. ♦ ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా... ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలిలో కాకుండా కొత్తగా ముల్లన్పూర్లో కట్టిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్గా మార్చుకుంది. ♦ ఈ సీజన్లో కొత్తగా రెండు నిబంధనలు వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతిస్తారు. చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది ఒక అదనపు బలంగా పనికొస్తుంది. ‘స్మార్ట్ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే అవకాశం ఉంటుంది. టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత సీజన్లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది. ♦ ఐపీఎల్ తర్వాత వెంటనే టి20 ప్రపంచకప్ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. ♦ ఐపీఎల్ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్ రూ. 24 కోట్ల 75 లక్షలకు, ప్యాట్ కమిన్స్ రూ.20 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయారు. ఈ నేపథ్యంలో తమ జట్లు కోల్కతా, హైదరాబాద్లను గెలిపించే విషయంలో వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం. ♦ గాయం కారణంగా లేదా వేలంలో అమ్ముడుపోకపోవడం వల్ల తాజా సీజన్కు దూరమైన కొందరు కీలక ఆటగాళ్లలో షమీ, మార్క్ వుడ్, ప్రసిధ్ కృష్ణ, జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, ఎన్గిడి, మదుషంక, స్టీవ్ స్మిత్, హాజల్వుడ్, బెన్ స్టోక్స్, జో రూట్, ఆడమ్ జంపా తదితరులు ఉన్నారు. -
విరాట్ కోహ్లి ప్రాక్టీస్..IPL2024లో బాదుడే బాదుడు (ఫొటోలు)
-
పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్ చేసింది. ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన వుమెన్ ప్రీమియర్ లీగ్-2024 చాంపియన్ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. Guard of Honour for our WPL Champions at Johnnie Walker presents RCB Unbox powered by @Kotak_Life and @Duroflex_world 🫡👏#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 pic.twitter.com/ikwL5Mx0E1 — Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024 ఇదిలా ఉంటే.. అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు. Virat Kohli speaking Kannada. - "THE NEW CHAPTER OF RCB" 👑pic.twitter.com/KQWk4Wdab8 — Johns. (@CricCrazyJohns) March 19, 2024 దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ లాంఛనం పూర్తి చేయలేకపోయింది. RCB is red Now kissed with blue We’re ready with our new armour To Play Bold for you! Presenting to you, Royal Challengers Bengaluru’s match livery of 2024! 🤩 How good is this, 12th Man Army? 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/2ySPpmhrsq — Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024 ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం?!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్ను వీడనున్నారా? ముంబైకి గుడ్బై చెప్పి యునైటెడ్ కింగ్డంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది. భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్మెషీన్ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్ను రివీల్ చేయలేదు విరుష్క. ఇక ఇటీవలే లండన్లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్లో.. ‘‘విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్ అవుతారనిపిస్తోంది. అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్కు వెళ్లివస్తారే తప్ప విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్లోనే ఉన్నట్లు సమాచారం! It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
Virat Kohli: ఇప్పటికీ అదే ఫీలింగ్.. 2 నెలల తర్వాత ఇలా!
Virat Kohli joins RCB camp for IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంతోషాల్లో మునిగితేలుతున్నారు. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా మరో వీడియోను వదిలింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. జట్టు ముఖచిత్రం, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బెంగళూరుకు చేరుకున్న దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. కాగా దాదాపు రెండు నెలల తర్వాత కింగ్ కోహ్లి రీఎంట్రీకి సిద్ధంకావడం విశేషం. సంతోషంగా ఉంది ‘‘ఇక్కడికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బెంగళూరులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అవే భావోద్వేగాలు.. అవే అనుభూతులు.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ పాత జీవితంలోకి తిరిగి వచ్చినట్లుంది. నా లాగే అభిమానులంతా కూడా ఆసక్తిగా.. ఆతురతగా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారనే అనుకుంటున్నా’’ అని విరాట్ కోహ్లి ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడాడు. కాగా ఆదివారం జరిగిన వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఆర్సీబీ జట్టు చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కప్ కొట్టాలన్న ఫ్రాంఛైజీ కల నెరవేరడంతో కోహ్లితో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు మస్త్ ఖుషీ అయ్యారు. కుటుంబంతో రెండు నెలలు ఈ క్రమంలో కోహ్లి.. వుమెన్టీమ్తో వీడియో కాల్లో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉంటే... వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్కు వెళ్లిన ఈ రన్మెషీన్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తమకు రెండో సంతానంగా.. ఫిబ్రవరి 15న కుమారుడు జన్మించాడని కోహ్లి దంపతులు తెలియజేశారు. చిన్నారికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సుమారు రెండు నెలలుగా కుటుంబానికే సమయం కేటాయించిన కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. 14 ఇన్నింగ్స్లో కలిపి 639 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది కోహ్లి అత్యధిక స్కోరు 101 నాటౌట్. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. చదవండి: Hardik Pandya: నా కెప్టెన్సీలో ఆడటానికి రోహిత్కు ఇబ్బంది ఎందుకు?.. నిజానికి.. It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్గా, కెప్టెన్గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్లో 10 మ్యాచ్లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది. -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
WPL 2024: కల నెరవేరిన వేళ.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్గా ఆర్సీబీ (ఫొటోలు)
-
WPL2024 విజేత బెంగళూరు
WPL2024లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీపై 8 దికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్లో ఫైనల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. స్కోర్లు ఢిల్లీ 113 ఆలౌట్, బెంగళూరు 115/2 -
WPL 2024 Final Updates: ఛాంపియన్స్గా ఆర్సీబీ..
►డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్లో సోఫీ డివైన్ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్ పెర్రీ (2) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీతో ఫైనల్.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్గా నిలిచింది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్ (3-0-14-3), శ్రేయాంక పాటిల్ (3-0-10-2), ఆశా శోభన (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్ (2) క్రీజ్లో ఉన్నారు. మాయ చేసిన సోఫీ మోలినెక్స్..ఒకే ఓవర్లో 3 వికెట్లు ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్ను (0), నాలుగో బంతికి అలైస్ క్యాప్సీ (0) పెవిలియన్కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 69/3గా ఉంది. లాన్నింగ్ (20), మారిజన్ కాప్ (3) క్రీజ్లో ఉన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 61/0గా ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఎడిషన్లోనూ ఫైనల్కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది. తుది జట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్కీపర్), శిఖా పాండే, మిన్ను మణి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్ -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్ఫామ్లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్ప్రీత్ వికెట్ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్జోత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ -
WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్లపై వరుస విజయాలతో టచ్లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆర్సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ను మినహాయించి ఓవరాల్గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది. హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ప్రీత్, అమెలియా కెర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. -
విరాట్ కోహ్లి బ్రేక్ తీసుకున్న ప్రతిసారీ జరిగేది ఇదే!
Virat Kohli- RCB- IPL 2024: టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి గురించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024లో ఈ రన్మెషీన్ పరుగుల వరద పారించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు.. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ ఆడాల్సి ఉండగా సెలవు తీసుకున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్కు వెళ్లిన కోహ్లి.. ఇంగ్లండ్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా ఎడిషన్తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ ఆర్సీబీ స్టార్ మైదానంలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్(టీ20) టోర్నీలో అఫ్గనిస్తాన్ మీద కోహ్లి కొట్టిన శతకం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అద్భుతమైన ఫామ్తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లిలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. తను ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తాడో అప్పుడు మరింత ప్రమాదకారిగా మారతాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. చాలా మంది ఆటగాళ్లు ఫామ్లో ఉండటానికి రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు విరుద్దం. ముందుగా చెప్పినట్లు బ్రేక్ తర్వాత.. తన ఆట తీరు ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లి ఫామ్ మీదనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయని మహ్మద్ కైఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య చెపాక్ వేదికగా ఈ ఈవెంట్కు తెరలేవనుంది. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి మరీ.. -
మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్తో సజన, హర్మన్ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పెరీ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. -
Virat Kohli: కోహ్లికి అక్కడ అంత సీన్ లేదు!
'Virat Kohli's greatness reduced...': అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ‘రన్మెషీన్’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సొంతం. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇప్పటి వరకు ఏడు సెంచరీలు బాదాడు. రాజ్కోట్, కోల్కతా, హైదరాబాద్లో ఒక్కోసారి శతక్కొట్టిన కోహ్లి.. సొంతమైదానం బెంగళూరులో ఏకంగా నాలుగుసార్లు సెంచరీ మార్కు అందుకున్నాడు. అయితే, చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం) స్టేడియంలో మాత్రం ఈ ఆర్సీబీ ప్లేయర్ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. అక్కడ అతడి రికార్డు గొప్పగా ఏమీలేదు స్పిన్కు అనుకూలించే ఈ పిచ్పై కోహ్లి బ్యాటింగ్ సగటు 30 కావడం గమనార్హం. ఇక ఇదే వేదికపై ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ ఈ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెపాక్లో ఓవరాల్గా విరాట్ ప్రదర్శన గమనిస్తే.. అతడి బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీలేదని తేలిపోయింది. నిజం చెప్పాలంటే ఇది కఠినమైన పిచ్. టెన్నిస్ బాల్ మాదిరి బౌన్స్ అయ్యే బాల్ను ఎదుర్కోవడం బ్యాటర్లకు.. ముఖ్యంగా ఓపెనర్లకు కత్తిమీద సాము లాంటిదే. మరోవైపు సీఎస్కేలో రవీంద్ర జడేజా మాదిరి స్టంప్ టూ స్టంప్ బౌల్ చేసే గొప్ప స్పిన్నర్ ఉన్నాడు. అక్కడ చిన్నస్వామి మాదిరి సీన్ ఉండదు బంతి తిరగడం మొదలుపెడితే అతడిని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. అయితే, కోహ్లి గనుక పూర్తిస్థాయిలో సిద్ధమై.. 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాలని పట్టుదలగా నిలబడితే కచ్చితంగా బౌలర్లకు చుక్కలు చూపించగలడు. కానీ చిన్నస్వామి(బెంగళూరు) స్టేడియం మాదిరి.. ఇక్కడ మాత్రం సెంచరీలు బాదడం సులువు కాదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా కోహ్లి 2016 మాదిరి ఈసారి కూడా విజృంభిస్తేనే ఆర్సీబీ ముందుక వెళ్లగలదని.. వాళ్లు కప్ కొడతారో లేదో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో కోహ్లి ఆల్టైమ్ రికార్డు.. అయినా 2019లో 16 మ్యాచ్లలో కలిపి కోహ్లి ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి. ఒక ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అయితే, ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్కు వెళ్లినా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ IPL 2024: విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు -
IPL 2024: విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు
‘‘నాకు ఐపీఎల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆటగాళ్లు దేశాలకు అతీతంగా సహోదర భావంతో మెలుగుతారు. జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు.. ప్రత్యర్థి జట్టులో మనకెంతో కాలంగా తెలిసిన ప్లేయర్లు.. ఇక్కడ మనతో కలిసి ఆడతారు. నిజానికి నేను మాత్రమే కాదు నాలాగా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ను అమితంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం ఇదే. సహచర ఆటగాళ్లే కాదు.. అభిమానులు పంచే ప్రేమ.. వారితో అనుబంధం ఈ లీగ్ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి’’ అని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైనప్పటి నుంచి కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ అంటే కోహ్లి.. కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ఫ్రాంఛైజీతో ముడిపడిపోయాడీ రన్మెషీన్. 2013 నుంచి కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే, ఐపీఎల్- 2021 తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక గత కొంతకాలంగా వివరాట్ కోహ్లి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని.. చిన్నారికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు కోహ్లి. అయితే, ఐపీఎల్-2024 ఆరంభం నాటికి అతడు తిరిగి వస్తాడా లేదా అన్న సందేహాల నడుమ స్టార్ స్పోర్ట్స్ షో కోహ్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసింది. ఇందులో కోహ్లి ఐపీఎల్ ప్రాముఖ్యం గురించి చెబుతూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో ఆడుతున్నప్పుడు ఒకరకంగా శత్రువులుగా ఉండే ఆటగాళ్లు ఇక్కడ మిత్రులుగా మారిపోయి సహోదరభావంతో మెలగడం బాగుంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య జరుగనుంది. We all nod in agreement when the king speaks! 🫡@imVkohli sheds light on why #IPL is a valuable opportunity for aspiring youngsters worldwide! Will he be the defining factor for #RCB in this #IPLOnStar?#IPL2024 - Starts 22nd March! 😉#AjabRangOnStar #BetterTogether pic.twitter.com/Ijm9G8vzBz — Star Sports (@StarSportsIndia) March 8, 2024 -
టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్కూ గుడ్బై? అదే విధంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు కూడా డీకే గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గానూ మెరుగ్గా రాణించిన దినేశ్ కార్తిక్ ఖాతాలో ఒకే ఒక సెంచరీ(టెస్టుల్లో) ఉంది. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ చెన్నై ప్లేయర్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్లో 242 మ్యాచ్లు ఆడిన డీకే.. 4516 పరుగులు సాధించాడు. 133 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. 2008 నుంచి ఇప్పటి దాకా ఇక 2008లో ఈ టీ20 లీగ్ మొదలైన నాటి ప్రతి ఎడిషన్లోనూ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఇప్పటి వరకు ఆరు ఫ్రాంఛైజీలకు దినేశ్ కార్తిక్ ప్రాతినిథ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్(కెప్టెన్గానూ)లకు ఆడిన డీకే.. గత రెండు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్గా అదరగొట్టిన దినేశ్ కార్తిక్.. ఆ ఏడాది అనూహ్యంగా టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మెగా టోర్నీలో విఫలమైన అతడు మళ్లీ భారత జట్టులో స్థానం పొందలేకపోయాడు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం! అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం తమిళనాడు తరఫున బరిలోకి దిగుతూనే ఉన్నాడు 38 ఏళ్ల దినేశ్ కార్తిక్. కామెంటేటర్గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 తర్వాత ఐపీఎల్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్కూ స్వస్తి పలికి.. కేవలం డొమెస్టిక్ క్రికెట్ మీద దృష్టి సారించాలని డీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రచురించింది. చదవండి: సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్! -
గుజరాత్ బోణీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన గుజరాత్ ఐదో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (45 బంతుల్లో 76; 13 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 86 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్కు వీరిద్దరు 13 ఓవర్లలో 140 పరుగులు జోడించారు. లౌరా అవుటయ్యాక వచ్చిన ఫోబీ లిచ్ఫీల్డ్ (18; 1 ఫోర్), యాష్లీ గార్డ్నర్ (0), హేమలత (1), వేద కృష్ణమూర్తి (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన (24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఎలీస్ పెరీ (24; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (23; 1 ఫోర్, 2 సిక్స్లు), రిచా ఘోష్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వేర్హమ్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ముంబై ఇండియన్స్ జోరు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ దూకుడు ముందు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలవలేకపోయింది. ఫలితంగా స్మృతి సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టోర్నీలో మూడో మ్యాచ్ నెగ్గిన ముంబై ఈ మూడింటినీ ఛేదనలోనే గెలుచుకోవడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితం కాగా...ముంబై 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. అనారోగ్యంనుంచి కోలుకోని కారణంగా ముంబై కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్లో కూడా ఆడలేదు. బెంగళూరు ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు ముగిసే సరికే ఓపెనర్లు స్మృతి మంధాన (9), ఎస్.మేఘన (11), సోఫీ డివైన్ (9) వెనుదిరిగారు. రిచా ఘోష్ (7), సోఫీ మోలినెక్స్ (12) కూడా విఫలం కావడంతో స్కోరు 71/5 వద్ద నిలిచింది. ఈ దశలో ఎలైస్ పెరీ (38 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) జట్టును ఆదుకుంది. పెరీ, జార్జ్ వేర్హామ్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆరో వికెట్కు 40 బంతుల్లో 52 పరుగులు జోడించడంతో ఆర్సీబీ కాస్త గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది. ఒక్క సిక్సర్ కూడా లేకుండా బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రకర్, నాట్ సివర్ బ్రంట్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప ఛేదనను ముంబై దూకుడుగా మొదలు పెట్టింది. యస్తిక భాటియా (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హేలీ మాథ్యూస్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 23 బంతుల్లో 45 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (25 బంతుల్లో 27; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా కెర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) ధాటైన ఆట ముంబై పనిని సులువు చేసింది. పూజ వస్త్రకర్ (8 నాటౌట్)తో కలిసి కెర్ వేగంగా మ్యాచ్ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు)తో తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
బెంగళూరును గెలిపించిన శోభన
బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్ను శోభన తన అద్భుత బౌలింగ్తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు. యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది. -
ధోని సేనకు చెపాక్ ఇకపై కంచుకోట కాబోదు: సీఎస్కే మాజీ స్టార్
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్-2024 సీజన్కు తెరలేవనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా మార్చి 22న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక సీఎస్కే- ఆర్సీబీ మధ్య పోటీ అంటే అభిమానులకు పండుగలాంటిదని చెప్పవచ్చు. ఓవైపు మహేంద్ర సింగ్ ధోని.. మరోవైపు విరాట్ కోహ్లి.. వీరిద్దరు భాగమైన జట్లు ప్రత్యర్థులుగా పోటీపడుతుంటే చూడటానికి ఫ్యాన్స్ మరింత ఆసక్తికగా తిలకిస్తారు. ఈసారి తొలి మ్యాచ్లోనే అభిమానులకు ఆ మజాను అందించేందుకు సిద్ధమయ్యారు ఐపీఎల్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆర్సీబీ తొలి మ్యాచ్లో చెపాక్లో ఆడబోతుండటం శుభపరిణామం. ఎందుకంటే.. చెన్నై పిచ్లు క్రమక్రమంగా మారుతున్నాయి. ఇక ముందు చెపాక్ సీఎస్కేకు కంచుకోటగా ఉండబోదు. గతేడాది చెన్నై చాంపియన్గా అవతరించినప్పటికీ.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ చేతిలో సొంతగడ్డపై ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు. అయితే, స్పిన్ అనుకూల పిచ్ల కారణంగా ఈసారి కూడా సీఎస్కే పేపర్ మీద పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, ఆర్సీబీ కూడా చెన్నై పిచ్పై సత్తా చాటగలిగిన జట్టే’’ అని జియో సినిమా షోలో అభినవ్ ముకుంద్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 320 పరుగులు చేశాడు అభినవ్. ఇక తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్లో చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 19 పరుగులే చేశాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్-17 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య రీఎంట్రీలో దారుణం.. బౌల్ట్ బౌలింగ్లో చితక్కొట్టిన ట్రవిస్ హెడ్ -
చెన్నై X బెంగళూరు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2024కు అధికారికంగా నగారా మోగింది. మార్చి 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ రెండు దశల్లో ఐపీఎల్ను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే తొలి దశలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 మధ్య జరిగే 21 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. లీగ్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగిలిన 53 మ్యాచ్ల తేదీలు, వేదికలను బోర్డు ప్రకటిస్తుంది. గత రెండు సీజన్ల తరహాలోనే 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతీ టీమ్ లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది. టోర్నీ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్లో నాలుగు తేదీల్లో ఒకేరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఈ 17 రోజుల్లో ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు గరిష్టంగా ఐదేసి మ్యాచ్ల చొప్పున ఆడతాయి. అందుకే విశాఖలో... ఆంధ్ర క్రికెట్ అభిమానులకు ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు చూసే అవకాశం దక్కుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ రెండు ‘హోమ్’ మ్యాచ్లను వైజాగ్లో ఆడాలని నిర్ణయించుకుంది. క్యాపిటల్స్ సొంత వేదిక ఫిరోజ్షా కోట్లా మైదానం మార్చి 17న జరిగే డబ్ల్యూపీఎల్ ఫైనల్ సహా మొత్తం 11 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. దాంతో ఐపీఎల్కు ముందు గ్రౌండ్ సన్నద్ధతకు తగినంత సమయం లభించడం లేదు. ఈ కారణంగా క్యాపిటల్స్ తమ వేదికను వైజాగ్కు మార్చింది. విశాఖలో వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 13 ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఆఖరి సారిగా 2019 లీగ్లో ఎలిమినేటర్, క్వాలిఫయింగ్–2 మ్యాచ్లు ఇక్కడే జరిగాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా తమ హోమ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు మొహాలి ఈ టీమ్ సొంత గ్రౌండ్గా ఉండగా... చండీగఢ్ శివార్ల లో ముల్లన్పూర్లో కొత్తగా నిరి్మంచిన స్టేడియంలో ఇకపై తమ హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. -
IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ
IPL 2024 Schedule Released: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. మొత్తంగా 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను గురువారం ప్రకటించారు. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం ఆనవాయితీ. ఆ తేదీల్లో డబుల్ మ్యాచ్లు అయితే, ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్కే- గుజరాత్ టైటాన్స్కు బదులు.. సీఎస్కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఐపీఎల్-2024 తొలి 17 రోజుల షెడ్యూల్ ►మార్చి 22- సీఎస్కే- ఆర్సీబీ- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కేకేఆర్- సన్రైజర్స్- కోల్కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్- లక్నో సూపర్ జెయింట్స్- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్- చెన్నై ►మార్చి 27- సన్రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో Photo Credit: Star Sports X వేదికలు చెన్నై, మొహాలి, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోం గ్రౌండ్గా ఉండనుంది. ఇక మధ్యాహ్నం 3.30, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. 🚨 𝗦𝗧𝗢𝗣 𝗧𝗛𝗘 𝗣𝗥𝗘𝗦𝗦 - TATA #IPL2024 Schedule is HERE! 🤩 Get ready for the thrill, excitement and fun to begin! Save this post so you don't have to search for it again 🔍 It's #CSKvRCB, @msdhoni 🆚 @imVkohli in the opener! Who's your pick ? 👀#IPLSchedule #IPLonStar pic.twitter.com/oNLx116Uzi — Star Sports (@StarSportsIndia) February 22, 2024 మ్యాచ్లన్నీ భారత్లోనే కాగా ఐపీఎల్–2024 పూర్తిగా భారత్లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు దీంతో తెర పడింది. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం. తేదీల విషయంపై మేం ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. ముందుగా 15 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆపై తర్వాతి తేదీలను ప్రకటిస్తాం. అయితే అన్ని మ్యాచ్లు భారత్లోనే జరగడం ఖాయం’ అని ధూమల్ స్పష్టం చేశారు. అయితే, గురువారం తొలి 17 రోజుల మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడం గమనార్హం. అప్పట్లో ఆ దేశాల్లో నిర్వహణ కాగా ఐపీఎల్ ప్రారంభమైన తర్వాతి ఎన్నికల సమయంలో 2009లో టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్లు భారత్లో, మరికొన్ని యూఏఈలో నిర్వహించారు. అయితే 2019లో మాత్రం మొత్తం టోర్నీ ఇక్కడే జరిగింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత కొద్ది రోజుల్లోనే టి20 ప్రపంచ కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. కళ్లన్నీ వారిద్దరిపైనే ఐపీఎల్ 17వ ఎడిషన్లో ప్రధానంగా టీమిండియా స్టార్లు హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్పైనే ఎక్కువ ఫోకస్ కానున్నారు. గుజరాత్ టైటాన్స్ను ఆరంభ సీజన్లోనే విజేతగా.. తదుపరి రన్నరప్గా నిలిపిన ఆల్రౌండర్ పాండ్యా.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీని వీడాడు. ముంబై ఇండియన్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్గా నియమితుడయ్యాడు. మరోవైపు.. 2022, డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ ఈ సీజన్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
కోహ్లికి ఏమైంది?.. అభిమానుల్లో అలజడి రేపిన ఆర్సీబీ పోస్ట్
విరాట్ కోహ్లికి ఏమైంది? ఈ రన్ మెషీన్ మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడు? కోహ్లి ఆటకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి? అతడి కుటుంబంలో అంతా బాగానే ఉంది కదా?.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఇది. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కోహ్లి మెరుపులు చూడాలని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ ఢిల్లీ బ్యాటర్.. సెలవును పొడిగిస్తూ ఆఖరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు సంబంధించిన జట్టును ప్రకటిస్తూ.. కోహ్లి అందుబాటులో ఉండటం లేదని శనివారం ధ్రువీకరించింది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి సెలక్షన్కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుంది. అతడికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటుంది’’ అని ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారిగా కోహ్లి లేకుండానే టెస్టు సిరీస్ ఆడుతున్నట్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘‘విరాట్ కోహ్లి లేకుండా 13 ఏళ్లలో ఇదే మొదటి టెస్టు సిరీస్. దేశం మొత్తం నీకు అండగా ఉంది. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా నీకోసం నీ సింహాసనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కింగ్’’ అని ఆర్సీబీ తమ ప్రధాన ఆటగాడు కోహ్లిని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కోహ్లి అభిమానులు మరింత కంగారుపడుతున్నారు. ‘‘కోహ్లికి అంత కష్టం ఏమొచ్చింది? ఎవరైనా అసలు కారణం చెప్పండి.. కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడని మొన్ననే డివిలియర్స్ చెప్పాడు. ఆ తర్వాత అదంతా అబద్ధమంటూ మాట మార్చాడు. నిజానికి అనుష్క గర్భవతిగా ఉన్న సమాచారాన్ని ధ్రువీకరించేలా పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయినా.. దీనిపై విరుష్క జోడీ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా వామికకు తోబుట్టువు రాబోతున్న మాట నిజమే అయితే, అంతా సవ్యంగా జరగాలి. బుజ్జాయి ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి రావాలి’’ అని ఫ్యాన్స్ కోహ్లి కోసం ప్రార్థిస్తున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, స్పీడ్గన్ డేల్ స్టెయిన్ సైతం.. ‘‘కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని కోహ్లికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. నిజానికి.. తండ్రి చనిపోయిన బాధను దిగమింగి రంజీ మ్యాచ్ ఆడిన అంకిత భావం కోహ్లిది. అలాంటిది ఇపుడు ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉంటున్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. The first Test series in 13 years without Virat Kohli. 🥺 The nation is with you, and your seat remains reserved whenever you’re ready to return, King. 👑❤️🔥#PlayBold #INDvENG #TeamIndia @imVkohli pic.twitter.com/fxOgLIlhWL — Royal Challengers Bangalore (@RCBTweets) February 10, 2024 -
ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలని కలగన్నట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ తనకు అవకాశాలు కూడా ఇచ్చిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆ మరుసటి ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్గా, వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించి సిరీస్ గెలిపించాడు. తదుపరి టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చాలా కాలం పాటు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నాడు. అయితే, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్కు నాయకుడిగా ఎంపికయ్యాడు. అయితే, గత రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్ చేరగలిగింది కానీ.. ఫైనల్ వరకు కూడా రాలేకపోయింది. ఐపీఎల్-2024లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్జీ క్రికెట్కు కేఎల్ రాహుల్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘ నేను యువకుడిగా ఉన్న సమయంలో నా ప్రతిభను నిరూపించుకునేందుకు ఆర్సీబీ నాకు అవకాశాలు ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నాకు.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచే ఆర్సీబీకి ఆడాలనే కోరిక ఉండేది. అందుకు తగ్గట్లుగానే కొన్నేళ్లపాటు ఆ జట్టుకు ఆడే అవకాశం లభించింది. ఆర్సీబీ ఎల్లప్పుడూ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ కూడా ఐపీఎల్లో ఇంత వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదన్న విషయం తెలిసిందే. ఇక ఆర్సీబీ తరఫున మొత్తంగా 19 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్.. 417 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్-2016 సీజన్లో అత్యుత్తమంగా 397 పరుగులతో రాణించిన రాహుల్.. జట్టును ఫైనల్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా ఈఏడాది ఐపీఎల్ ఎడిషన్లో గాయం కారణంగా రాహుల్ మధ్యలోనే లక్నోను వీడగా.. కృనాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ ప్రకటన.. సర్ఫరాజ్కు మరోసారి మొండిచేయి -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్ను నాలుగు మ్యాచ్ల పాటు నిషేధించారు. బీబీఎల్లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్కు ముందు పిచ్పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
IPL 2024: ఆర్సీబీ తుది జట్టు ఇలా..?
ఐపీఎల్ 2024 సీజన్ వేలం నిన్న ముగియడంతో అన్ని ఫ్రాంచైజీల అభిమానులు తమ తమ తుది జట్లు ఇలా ఉంటే బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈసారి వేలంలో అన్ని జట్లు ఆచితూచి వ్యవహరించి సమతూకమే లక్ష్యంగా కొనుగోళ్లు జరిపాయని అన్ని జట్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అన్ని జట్లు ఇదివరకే ఉన్న సభ్యులకు అనుగుణంగా కొత్త వారిని తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాంచైజీల లెక్కలు సఫలీకృతమవుతాయే లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం సీజన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నారు. మా జట్టులో పలాన వాళ్లు ఉంటారు.. వీళ్లు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సోషల్మీడియా మొత్తం అభిమానుల అంచనా జట్లచే నిండిపోయింది. కొత్త జట్టుతో ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఫ్రాంచైజీ అభిమాని సంకలు గుద్దుకుంటున్నాడు. ప్రతిసారి ఈసారి కప్ మాదే అని గగ్గోలు పెట్టే ఆర్సీబీ అభిమానులు సైతం వచ్చే సీజన్ కోసం తమ అంచనా జట్లను ప్రకటిస్తున్నారు. మెజార్టీ శాతం ఆర్సీబీ అభిమానుల ప్రకారం తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల కోటాలో డుప్లెసిస్, మ్యాక్స్వెల్, కెమారూన్ గ్రీన్, అల్జరీ జోసఫ్ ఉంటున్నారు. దేశీయ ఆటగాళ్ల కోటాలో విరాట్ కోహ్లి, మొహమ్మద్ సిరాజ్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రార్, రజత్ పాటిదార్ ఉంటున్నారు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): విరాట్ కోహ్లి (బ్యాటర్), ఫాఫ్ డుప్లెసిస్ (బ్యాటర్/కెప్టెన్), రజత్ పాటిదార్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), కెమారూన్ గ్రీన్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్), దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్/బ్యాటర్), మహిపాల్ లోమ్రార్ (బ్యాటర్/లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), కర్ణ్ శర్మ (లెగ్ స్పిన్నర్), అల్జరీ జోసఫ్ (పేస్ బౌలర్), మొహమ్మద్ సిరాజ్ (పేసర్), యశ్ దయాల్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) -
రూ. 17.5 కోట్లు: ఐపీఎల్కు దూరంగా ఉండు.. అప్పుడే మేటి క్రికెటర్గా!
మేటి టెస్టు క్రికెటర్గా ఎదగాలంటే కామెరాన్ గ్రీన్ కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు కొన్నాళ్లు దూరంగా ఉండాలని సూచించాడు. సంప్రదాయ క్రికెట్పై మరింతగా దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసీస్ యువ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను గతేడాది ఐపీఎల్ వేలంలో ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ పేస్ ఆల్రౌండర్ కోసం ఏకంగా.. రికార్డు స్థాయిలో 17. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే, ఐపీఎల్-2023 సీజన్ మొత్తంలో అతడు 16 మ్యాచ్లాడి 452 పరుగలు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ గ్రీన్ను ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాడిన్.. కామెరాన్ గ్రీన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఫాస్ట్బౌలర్లు కమిన్స్, హాజిల్వుడ్, స్టార్క్.. ఐపీఎల్కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నవాళ్లే. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ కూడా అదే పనిచేస్తే బాగుంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉందనుకుంటే.. అతడు టెస్టు క్రికెట్ కోసం ఐపీఎల్ను త్యాగం చేయాల్సి ఉంటుంది’’ అని ఫాక్స్ క్రికెట్తో హాడిన్ వ్యాఖ్యానించాడు. గ్రీన్కు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని.. ఆస్ట్రేలియా తరఫున మేటి క్రికెటర్గా ఎదగాలంటే ఇలాంటివి తప్పవని బ్రాడ్ హాడిన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి ఆరోసారి చాంపియన్గా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ఆడిన తుది జట్టులో కామెరాన్ గ్రీన్కు స్థానం దక్కలేదు. -
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో.. హెడ్కోచ్గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సేవలు అందించిన మైక్ హసన్కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్
Disappointed to be leaving RCB: ‘‘గత నాలుగు సీజన్లలో మూడుసార్లు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్నకు చేరుకున్నాం. కానీ.. అభిమానులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు నేనూ.. మేమంతా కోరుకున్నట్లుగా.. ట్రోఫీ గెలవలేకపోయాం. ఆర్సీబీని వీడటం నిరాశకు గురిచేసినా.. ఇక్కడ నేనెన్నో మధురజ్ఞాపకాలు మూటగట్టుకోగలిగాను. గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఆర్సీబీకి, జట్టు కొత్త కోచింగ్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్. ఇక అద్భుతమైన ఆర్సీబీ అభిమానుల గురించి చెప్పేదేముంది? మీ అందరి అంతులేని ఆదరాభిమానాలకు, ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు.. సొంత ఇంట్లో ఉన్న భావన కల్పించినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పనిచేసిన మైక్ హసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాధగా ఉంది.. ఆర్సీబీని వీడటం బాధగా ఉందని.. శాయశక్తులా కృషి చేసినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా కొత్త సిబ్బంది మార్గదర్శనంలో ఆర్సీబీ మరింత ముందుకు వెళ్లాలని మైక్ హసన్ ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్సీబీ కీలక నిర్ణయాలు మైక్ హసన్ను ఉద్వాసన పలకడంతో పాటు హెడ్కోచ్ సంజయ్ బంగర్పై వేటు వేసింది. కొత్త కోచ్గా ఆండీ ఫ్లవర్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్కప్ కప్ విన్నింగ్ కోచ్ ఫ్లవర్కు స్వాగతం పలుకుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో బంధం ముగిసిన నేపథ్యంలో.. న్యూజిలాండ్కు చెందిన 48 ఏళ్ల మైక్ హసన్ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ మాత్రం చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో పదహారో ఎడిషన్ను ముగించింది. చదవండి: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు View this post on Instagram A post shared by Mike Hesson (@hesson_mike) We thank 𝐌𝐢𝐤𝐞 𝐇𝐞𝐬𝐬𝐨𝐧 and 𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐫 for their commendable work during the stints as 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿 𝗼𝗳 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 and 𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 of RCB. 🙌#PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0 — Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 -
టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు.. నా ధ్యేయం అదే!
I am not thinking about an India call-up: టీమిండియాలో చోటు కోసం తాను ఎదురుచూడటం లేదని, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణించడమే ధ్యేయమని ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ అన్నాడు. దేశీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల అనూజ్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్లో కలిపి 91 పరుగులు చేయగలిగాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఈ మేరకు రన్స్ రాబట్టాడు. ఉత్తమంగా ఆడొచ్చు ఇక తాజాగా స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూజ్ రావత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాలి. ఈ టీ20 టోర్నీలో మెరుగైన ప్రదర్శన వల్ల ఐపీఎల్లో మరింత ఉత్తమంగా ఆడే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ సీనియర్ జట్టు నుంచి తనను తప్పించడంపై అనూజ్ ఈ సందర్భంగా స్పందించాడు. ఆలస్యంగానైనా ‘‘ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనపుడు మానసికంగా మరింత దృఢంగా ఉండాలి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు. తిరిగి జట్టులో చేరే రోజు కోసం ఓపికగా ఎదురుచూడాలి. ఐపీఎల్ కూడా ఉంది. అక్కడ బాగా ఆడితే మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయి. మా రాజ్కుమార్ సర్ ప్రతిసారి ఓ మాట చెబుతారు. మన ఆట తీరు బాగుంటే కాస్త ఆలస్యంగానైనా అవకాశాలు దక్కుతాయి. నేను అండర్-14, అండర్-16 జట్లకు ఆడేటపుడు షార్ట్లిస్ట్లో ఉండేవాడిని. కానీ తుదిజట్టులో మాత్రం నా పేరు ఉండేది కాదు. కానీ నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. కఠినంగా శ్రమించి అండర్-19 స్థాయిలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాను’’ అని అనూజ్ రావత్ చెప్పుకొచ్చాడు. కాగా అనూజ్ రావత్ ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 220 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్క్లాస్ డెబ్యూ మ్యాచ్లో అసోం మీద 71 పరుగులు సాధించాడు అనూజ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడి సగటు 40. చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు! ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. -
IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల..
IPL 2023 RCB Vs LSG: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఆర్సీబీతో మ్యాచ్లో తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా హెల్మెట్ విసిరి ఉండాల్సింది కాదన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని.. ఏదేమైనా అలా అతి చేయడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి చిన్నస్వామి స్టేడియంలో ఈ దృశ్యాన్ని చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలు కాగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక బీసీసీఐ సైతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించింది. మొదటి తప్పిదం కాబట్టి ఈసారికి వదిలేస్తున్నామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. నా ప్రవర్తన వల్ల.. ఆ ఘటన తర్వాత తాను ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాడు. ‘‘హెల్మెట్ విసరడం కాస్త ఓవర్ అయ్యింది. ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నిజానికి గెలిచామన్న సంతోషంలో నేనలా చేశానే తప్ప ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే! కానీ మైదానం వీడిన తర్వాతే నేనేం చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నాను. అలా ఎందుకు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది’’ అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్నకు చేరుకున్న లక్నో.. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
నిరాశ కలిగింది! మనం తలెత్తుకునే ఉండాలి: కోహ్లి పోస్ట్కు గిల్ రిప్లై.. వైరల్
IPL 2023- RCB- Virat Kohli: ‘‘సీజన్లో కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. నిరాశ కలిగించే విషయమే. కానీ మనం తలెత్తుకోవాలి. ఈ ప్రయాణంలో అడుగడుగునా.. మాకు అన్ని విధాలా అండగా నిలిచిన విశ్వసనీయమైన మద్దతుదారులకు, అభిమానులకు రుణపడి ఉంటాం’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. 12th మ్యాన్ ఆర్మీకి, మేనేజ్మెంట్, కోచ్లకు ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ నోట్ షేర్ చేశాడు. ఐపీఎల్-2023లో లీగ్ దశలోనే ఆర్సీబీ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది బెంగళూరు జట్టు. భంగపాటు తప్పలేదు ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాట్ ఝులిపించినా ఫలితం లేకుండా పోయింది. అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించిన కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన కారణంగా ఆర్సీబీ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. కోహ్లి పోస్ట్కు బదులిచ్చిన గిల్ ఈసారైనా కప్ మనదే అని ఆశలు పెంచుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్కు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులను ఉద్దేశించి మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశాడు. వచ్చే సీజన్లో మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తామని పేర్కొన్నాడు. PC: Virat Kohli ఇక ఇందుకు స్పందించిన శుబ్మన్ గిల్.. ‘‘కింగ్’’ అన్నట్లు ఎమోజీలతో కోహ్లికి బదులిచ్చాడు. కాగా గిల్ కారణంగానే ఆర్సీబీ ఓడిందని కొంతమంది ఫ్యాన్స్ అతడిని, అతడి సోదరిని దారుణంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కోహ్లి ట్వీట్కు గిల్ బదులిచ్చిన తీరు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సీజన్లో బ్యాటర్గా కోహ్లి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆడిన 14 ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా 639 పరుగులు చేశాడు. కేజీఎఫ్ రాణించినా ఇక ఆఖరి రెండు మ్యాచ్లలో కోహ్లి వరుస శతకాలు సాధించాడు విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్పై 100 పరుగులు చేసిన కింగ్.. గుజరాత్ టైటాన్స్పై 101 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు. అదే విధంగా ఈ ఎడిషన్లో కోహ్లి సాధించిన అర్ధ శతకాల సంఖ్య 6. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్తో లీగ్ దశ ముగిసేనాటికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. 14 ఇన్నింగ్స్లలో కలిపి 730 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతడి అత్యధిక స్కోరు 84. కారణమెవరు? ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లితో పాటు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సైతం ఈసారి మెరుగైన ప్రదర్శన చేశాడు. 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. ఇలా ‘కేజీఎఫ్’ రూపంలో పటిష్టమైన బ్యాటర్లు దొరికినా.. బౌలింగ్ వైఫల్యాలు, కీలక సమయంలో ఆటగాళ్ల తప్పిదాలు ఆర్సీబీ ఓటములకు కారణమయ్యాయి. దీంతో మరోసారి నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం కోహ్లి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అభిమానులను మరింతగా బాధించాయి. చదవండి: పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్! A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn — Virat Kohli (@imVkohli) May 23, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
IPL 2023- RCB Knocked Out: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. పదిహేనేళ్లుగా కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్తో తప్పక గెలవాల్సి ఆదివారం నాటి మ్యాచ్లో మెరుగైన స్కోరు సాధించినా.. శుబ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసి అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. చాంపియన్గా నిలుస్తారని ఆశపడితే టాప్-4కి కూడా చేరకపోవడంతో ఆర్సీబీపై విమర్శలు కూడా వచ్చాయి. మాది అత్యుత్తమ జట్టు కాదు ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమణ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్ను ఇక్కడితోనే ముగించడం పట్ల బాధగా ఉంది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. ఆ అర్హత మాకు లేదు నిజాయితీగా చెప్పాలంటే.. మా ప్రదర్శనను పరిశీలిస్తే మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హులం కాదు. కాకపోతే మాకంటూ కొన్ని గొప్ప విజయాలు ఉండటం నిజంగా మా అదృష్టం. కానీ జట్టుగా మా ప్రదర్శన చూస్తే సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అర్హత మాత్రం మాకు లేదు’’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. తమ వైఫల్యాల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ డుప్లెపిస్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆటగాడిగా, కెప్టెన్గా రాణించినా కాగా గతేడాది విరాట్ కోహ్లి నుంచి ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్.. బ్యాటర్గా, సారథిగా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2022లో 468 పరుగులు సాధించాడు. అదే విధంగా జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ఇక ఈసారి ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించి 730 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. మరోవైపు.. కోహ్లి సైతం బ్యాట్ ఝులిపించి 639 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం విశేషం. కానీ.. ఆర్సీబీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో డుప్లెసిస్కు, అతడి బృందానికి నిరాశ తప్పలేదు. చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా.. IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ RCB v GT Game Day Review Captain Faf, players and the coaches reflect on the #IPL2023 season and send in their gratitude and regards to the 12th Man Army, after match that brought an end to our campaign this year.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/8Vst2kRZLV — Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023 -
నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా..
IPL 2023 RCB Vs GT: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్, అతడి సోదరి షానిల్ గిల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. షానిల్ను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్రత్యర్థి జట్టు ఓడిపోయినందుకు అతడి సోదరిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆర్సీబీ ఓడిపోవడంతో కాగా ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో మెరిసినా.. లక్ష్య ఛేదనలో గిల్ శతకంతో రాణించి గుజరాత్ను గెలిపించాడు. దీంతో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ‘దురభిమానులు’ శుబ్మన్ గిల్తో పాటు అతడి సోదరి షానిల్ను కూడా టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ఆగ్రహం.. ఇది నిజంగా సిగ్గుచేటు ఈ విషయంపై స్పందించిన స్వాతి మలివాల్.. గిల్, షానిల్లపై వస్తున్న ట్రోల్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లు చూసిన ఓ మ్యాచ్లో తమకిష్టమైన జట్టు ఓడిపోయిందని శుబ్మన్ గిల్ సోదరిని అబ్యూజ్ చేయడం నిజంగా సిగ్గుచేటు. చర్యలు తీసుకుంటాం గతంలో విరాట్ కోహ్లి కూతురి పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఇలాంటివి చూస్తూ ఊరుకోదు. గిల్ సోదరిని కించపరిచేలా మాట్లాడిన వాళ్లపై తప్పక చర్యలు తీసుకుంటాం’’ అని ట్విటర్ వేదిగా పేర్కొన్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫైయర్-1లో సీఎస్కేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో శుబ్మన్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు సెంచరీలు సాధించిన ఈ యువ ఓపెనర్.. ఇప్పటి వరకు 14 మ్యాచ్లలో కలిపి 680 పరుగులు చేశాడు. చదవండి: IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ IPL 2023 CSK Vs GT Probable Playing XI: ‘ఫైనల్’కు ముందెవరు? Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 Extremely shameful to see trollers abusing #ShubhmanGill’s sister just because the team they follow lost a match. Previously we had initiated action against people abusing #ViratKohli daughter. DCW will take action against all those who have abused Gill’s sister as well. This… pic.twitter.com/eteGtGgPVm — Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2023 -
ఢిల్లీ క్యాపిటల్స్కు కోహ్లి! అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
IPL 2023- RCB- Virat Kohli: ఒక్క టైటిల్.. ఒకే ఒక్క ట్రోఫీ.. అంటూ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గత పదిహేనేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ప్రతి ఎడిషన్ ఆరంభం నుంచే ‘‘ఈసారి కప్ మనదే’’ అంటూ సందడి చేసే ఫ్యాన్స్కు ఎప్పటిలాగే ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. ముఖ్యంగా ఈసారి విరాట్ కోహ్లి వింటేజ్ కింగ్ను గుర్తు చేస్తూ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లపైనే ఆధారపడి ఈ మ్యాచ్లో కోహ్లి చేసిన అజేయ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. ‘కేజీఎఫ్’(కోహ్లి, గ్లెన్, ఫాఫ్) రూపంలో తమకు లభించిన ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ప్రతిసారీ ఆధారపడటం.. బౌలింగ్లోనూ సిరాజ్ మినహా మిగతా వాళ్లు మరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కోహ్లికి ఆర్సీబీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతున్న కింగ్.. నేటికీ బంధం కొనసాగిస్తున్నాడు. కెప్టెన్గానూ సేవలు అందించాడు. ఆర్సీబీ ముఖచిత్రంగా మారాడు. బ్యాటర్గా తనపై భారం పడితే జట్టుకు నష్టం చేకూరుతుందేమోనన్న ఆలోచనతో గతేడాది సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ ఒక్క లోటు అయితే, క్యాష్ రిచ్ లీగ్లో ఎన్ని రికార్డులు సాధించినా.. శతకాల వీరుడిగా పేరొందినా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్గా నిలవలేదన్న లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తాజా సీజన్లోనూ అదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీకి మారాల్సిన సమయం వచ్చేసింది! గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘ విరాట్ రాజధాని నగరానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా పరోక్షంగా సూచన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు మారితేనైనా రాత మారుతుందేమోనని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అయితే, ఢిల్లీ అభిమానులకు పీటర్సన్ ట్వీట్ విపరీతంగా నచ్చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘అసలేం మాట్లాడుతున్నావు. కోహ్లి లేని ఆర్సీబీని ఊహించను కూడా ఊహించలేం. పోయి పోయి ఢిల్లీకి మారాలా? నీ ట్వీట్కు అర్థం ఏమిటి? ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడు. లేదంటే తనకిష్టమైన ధోని సారథ్యంలోని సీఎస్కేకు ఆడతాడు. అంతేగానీ.. నీ చెత్త సలహాలు ఎవరికీ అవసరం లేదు’’ అంటూ పీటర్సన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్బేస్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్ను ముగించింది. చదవండి: ముంబై కోసమే గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్ #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. Time for VIRAT to make the move to the capital city…! #IPL — Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023 -
IPL 2023: గొప్పగా అనిపిస్తోంది.. అయినా వాళ్లకేం తెలుసు?: విరాట్ కోహ్లి
IPL 2023 RCB- Virat Kohli: ‘‘చాలా మంది నా టీ20 క్రికెట్ గురించి ఏదేదో మాట్లాడారు. సరిగ్గా ఆడటం లేదని విమర్శించారు. కానీ నాకెప్పుడూ నా ఆట తీరుపై ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రస్తుతం నేను టీ20లలో అత్యుత్తమంగా ఆడుతున్నాను. నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నేను టీ20 క్రికెట్ ఇలాగే ఆడతాను. గ్యాప్స్ మధ్య బౌండరీలు బాదుతూ.. పరిస్థితి నాకు అనుకూలంగా మారినపుడు మరింత స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడుతూ ఉంటాను’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. రికార్డులు బద్దలు ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఎడిషన్లో వరుసగా రెండు సెంచరీలు బాది.. క్యాష్ రిచ్లీగ్లో ఓవరాల్గా ఏడు శతకాలతో రికార్డులు బద్దలు కొట్టాడు. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సెంచరీ చేసి జట్టును గెలిపించడంతో కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లకేం తెలుసు? ఇదిలా ఉంటే.. కోహ్లి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రవిశాస్త్రితో మాట్లాడుతూ తనను విమర్శిస్తున్న వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘నాకు గొప్పగా అనిపిస్తోంది. టీ20 క్రికెట్ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. చాలా మంది స్ట్రైక్రేటు గురించి మాట్లాడుతూ ఉంటారు. గతంలో చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టును గెలిపించడం కోసం ఆడటం గొప్పగా అనిపిస్తుంది. నేను మొదటి నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. నా బ్యాటింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా ఎన్ని పరుగులంటే? కాగా ఈ మ్యాచ్లో రన్మెషీన్.. 61 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కోహ్లి శతకం(100)తో మెరిసిన విషయం తెలిసిందే. గుజరాత్తో మ్యాచ్లో బాదిన సెంచరీ ఈ సీజన్లో కోహ్లికి రెండోది. ఇక ఐపీఎల్-2023లో కింగ్ కోహ్లి మొత్తంగా 639 పరుగులు సాధించి ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు: ►టాస్- గుజరాత్- బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 197/5 (20) ►గుజరాత్ స్కోరు: 198/4 (19.1) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు.. టోర్నీ నుంచి ఆర్సీబీ అవుట్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 104 పరుగులు). చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. -
#Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి..
IPL 2023- RCB Vs GT- Virat Kohli- Shubman Gill: ఒకరిపై అభిమానం హద్దులు దాటి.. మరొకరిపై ద్వేషంగా మారితే.. అటువంటి వాళ్లను ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి తాము దైవంగా భావించే వ్యక్తులు కూడా ఇష్టపడరు. దిగజారుడు వ్యాఖ్యలతో ఎదుటివాళ్లను కించపరిస్తే అస్సలు సహించరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు నెటిజన్లు. అభిమానం ఉండాలి గానీ.. అది ఎదుటివాళ్ల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడింది. కోహ్లి సెంచరీ వృథా.. ఆర్సీబీ అవుట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 197 పరుగులు స్కోరు చేసింది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీ(101) కారణంగా గుజరాత్కు 198 పరుగుల భారీ లక్ష్యం విధించగలిగింది. టార్గెట్ ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గిల్ సిక్సర్ల వర్షం 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడి 104 పరుగులు సాధించాడు. కోహ్లి మాదిరే ఈ సీజన్లో రెండో శతకం నమోదు చేశాడు. గిల్ అజేయ సెంచరీతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మరోవైపు.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కావడం ఫ్యాన్స్ మదిని మెలిపెట్టింది. ఈసారైనా ట్రోఫీ గెలుస్తారనుకుంటే.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటూ ఉసూరుమన్నారు. గిల్తో పాటు అతడి సోదరిని కూడా దారుణంగా ఈ నేపథ్యంలో కొంతమంది ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్తో పాటు అతడి సోదరి షానిల్ గిల్ను కూడా సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. గిల్కు ఏదైనా అపాయం జరగాలని కొంతమంది కోరుకుంటుండగా.. షానిల్ను ఉద్దేశించి మరికొందరు రాయలేని పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. కుటుంబంతో శుబ్మన్ గిల్ వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదు! కోహ్లి ఫ్యాన్స్ అసలే కాదు! అయితే, ఆర్సీబీ ‘అభిమానులం’దరూ అలాగే చేస్తున్నారనుకుంటే పొరపాటే! నిజమైన ఫ్యాన్స్ మాత్రం.. ‘‘కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయిందన్న బాధ ఉంది. నిజానికి.. శుబ్మన్ ఆడిన తీరును కూడా మేము ఆస్వాదించాం. ఆర్సీబీ ఓడినంత మాత్రాన గిల్ను, అతడి సోదరిని విమర్శించే వాళ్లు నిజమైన అభిమానులు అనిపించుకోరు. కాస్త సంయమనం పాటించండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా గతంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచినందుకు కోహ్లిని సైతం ఇలాగే కొంతమంది దారుణంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి అయితే ఏకంగా కోహ్లి చిన్నారి కూతురు వామికను ఉద్దేశించి అత్యాచార బెదిరింపులకు పాల్పడి జైలు పాలయ్యాడు. కాస్తైనా సిగ్గుపడండి! తాజాగా గిల్, అతడి సోదరిపై ట్రోల్స్ వస్తున్న తరుణంలో.. మ్యాచ్ అనంతరం కోహ్లి.. గిల్ను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇద్దరూ హీరోలే. ఆటలో గెలుపోటములు సహజం. మీరెందుకు అనవసరంగా కొట్టుకుంటారు. కోహ్లి, గిల్ ఇద్దరూ రేపు టీమిండియాకు కలిసే ఆడతారు కదా! పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్లు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కాస్తైనా సిగ్గుపడండి’’ అంటూ ట్రోలర్స్కు గడ్డి పెడుతున్నారు. చదవండి: IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
బెంగళూరు ఖేల్ఖతం
బెంగళూరు: కోహ్లి తన జట్టు గెలిచేందుకు చేయాల్సిందంతా చేశాడు. కానీ బెంగళూరు చెత్త బౌలింగ్, అడ్డూఅదుపు లేని ఎక్స్ట్రాలు అతని శ్రమను నీరుగార్చింది. దీంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచింది. ఈ ఓటమితో బెంగళూరు ప్లే ఆఫ్ దశకు అర్హత పొందలేకపోయింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. కోహ్లి (61 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తర్వాత గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 104 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో గుజరాత్ను గెలిపించాడు. విజయ్ శంకర్ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 123 పరుగులు జోడించారు. ఆఖరి దాకా కోహ్లినే... మొన్న హైదరాబాద్ ఆటనే కోహ్లి బెంగళూరులో రిపీట్ చేశాడు. ఓపెనింగ్లో డుప్లెసిస్ (19 బంతు ల్లో 28; 5 ఫోర్లు)తో మంచి ఆరంభం ఇచ్చాడు. డుప్లెసిస్ అవుటయ్యాక మ్యాక్స్వెల్ (11), మహిపాల్ (1) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీకి కోహ్లినే పెద్దదిక్కయి నడిపించాడు. బ్రేస్వెల్ (16బంతుల్లో 26; 5 ఫోర్లు) అండతో కోహ్లి మళ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న బ్రేస్వెల్ను షమీ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేయగా, దినేశ్ కార్తీక్ (0) నిరుత్సాహపరిచాడు. అనూజ్ రావత్ (15 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో కోహ్లి 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 101; డుప్లెసిస్ (సి) తెవాటియా (బి) నూర్ అహ్మద్ 28; మ్యాక్స్వెల్ (బి) రషీద్ 11; మహిపాల్ (స్టంప్డ్) సాహా (బి) నూర్ అహ్మద్ 1; బ్రేస్వెల్ (సి అండ్ బి) షమీ 26; కార్తీక్ (సి) సాహా (బి) యశ్ 0; అనూజ్ (నాటౌట్ ) 23; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–67, 2–80, 3–85, 4–132, 5–133. బౌలింగ్: షమీ 4–0–39–1, యశ్ 4–0–39–1, రషీద్ 4–0–24–1, నూర్ 4–0–39–2, మోహిత్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) పార్నెల్ (బి) సిరాజ్ 12; గిల్ (నాటౌట్) 104; విజయ్ (సి) కోహ్లి (బి) వైశాక్ 53; షనక (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) హర్షల్ 0; మిల్లర్ (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) సిరాజ్ 6; తెవాటియా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–25, 2–148, 3–150, 4–171. బౌలింగ్: సిరాజ్ 4–0–32–2, పార్నెల్ 3.1–0–42–0, వైశాక్ 4–0– 40–1, హిమాన్షు 3–0–28–0, హర్షల్ 4–0–29–1, బ్రేస్వెల్ 1–0–16–0. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మే 23: క్వాలిఫయర్–1 గుజరాత్ టైటాన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 24: ఎలిమినేటర్ లక్నో సూపర్ జెయింట్స్ VS ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 26: క్వాలిఫయర్–2 క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు VS ఎలిమినేటర్ విజేత వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి మే 28: ఫైనల్ క్వాలిఫయర్–1 విజేత VS క్వాలిఫయర్–2 విజేత వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి -
ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!
IPL 2023- SRH Vs RCB: ఐపీఎల్-2023 బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పిచ్చి షోలతో మహిళా యాంకర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. క్రికెట్, క్రికెటర్ల గురించి మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఆట గురించి కాకుండా అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ప్రశ్నలు అడగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ- సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. బీసీసీఐ బాస్ కోడలు సహా ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ‘‘హాట్ ఆర్ నాట్’’ పేరిట స్టార్ స్పోర్ట్స్లో ఓ షో నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ సహా మరో ముగ్గురు యాంకర్లు ఈ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్తో కలిసి సురేన్ సుందరం నిర్వహించిన ఈ షోలో పురుష క్రికెటర్ల అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ ఎవరు హాట్గా ఉన్నారో చెప్పాలంటూ అడిగారు. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ తదితరులు షర్టు లేకుండా నీళ్లలో ఉన్న ఫొటోలు స్క్రీన్ మీద చూపించారు. ఇది క్రికెట్ షోనా? సిగ్గుండాలి! మయంతి సహా మిగిలిన ముగ్గురు యాంకర్లు ఆ ఫొటోలు చూసేందుకు అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఇది క్రికెట్ షోనా? లేదంటే మరేదైనానా? స్టార్ స్పోర్ట్స్' రోజురోజుకీ దిగజారి పోతోంది. షో నడిపించడానికి ఇంతకంటే మంచి కంటెంటే దొరకలేదా?’’ అని ఏకిపారేస్తున్నారు. ‘‘సీనియర్, ఓ బిడ్డకు తల్లి అయిన మయంతి లాంటి సీనియర్లకు కూర్చో బెట్టి ఇలాంటి ఫొటోలు చూపిస్తూ ఆ క్వశ్చన్లు అడగటానికి సిగ్గు లేదా?’’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 104 పరుగులు చేయగా.. ఆర్సీబీ స్టార్ కోహ్లి 100 పరుగులు సాధించాడు. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! Is this a Cricket related show or what....Starsports u are disgrace#ViratKohli #SRHvRCB pic.twitter.com/gCygfzX8ga — I am NEGAN (@IamNEGA62524296) May 18, 2023 Star with their 'Hot or Not' segment in today's pre-match show clearly embarrassed themselves. Imagine asking a senior anchor and married woman like Mayanti Langer to pick sides for a junior fellow like Shubman Gill. She was clearly uncomfortable. #NotDone#IPL2023 — Subhayan Chakraborty (@CricSubhayan) May 18, 2023 -
అద్భుతం... స్పిన్ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు.. మాస్టర్క్లాస్! ఎవరికీ సాధ్యం కాని రీతిలో
IPl 2023 SRH vs RCB- Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్.. ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకునే క్లాస్ ప్లేయర్. ఈ సీజన్లో ఈ మిడిలార్డర్ ఇప్పటి వరకు చేసిన మొత్తం పరుగులు 430. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సెంచరీతో చెలరేగి ఈ మేరకు స్కోరు సాధించాడు. మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ప్రొటిస్ బ్యాటర్. ఇక ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓడినప్పటికీ క్లాసెన్ తన అద్భుత సెంచరీతో అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో జట్టు మెరుగైన స్కోరు సాధించేలా ఒంటరి పోరాటం చేయడం అలవాటు చేసుకున్న అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం క్లాసెన్ అద్భుత బ్యాటింగ్ ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. ఏ విదేశీ ప్లేయర్కు సాధ్యం కాని రీతిలో ‘‘క్లాసెన్ బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఏ విదేశీ ప్లేయర్ కూడా తనలా ఇండియన్ పిచ్లపై స్పిన్నర్లను అటాక్ చేయడం నేను చూడలేదు. విదేశీ ఆటగాళ్లనే కాదు ఈ టోర్నీలో ఆడుతున్న ప్రతి ఒక్క బ్యాటర్కు కూడా స్పిన్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో తన మాస్టర్క్లాస్తో నిరూపించాడు. గత మూడు మ్యాచ్లలో అతడి బ్యాటింగ్ ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా క్లాసెన్లా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడుతూనే దూకుడు కూడా ప్రదర్శిస్తాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా.. హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్ను కొనియాడాడు. కాగా ఐపీఎల్-2023లో సన్రైజర్స్ తరఫున నిలకడైన ఆట తీరు కనబరుస్తున్న ఏకైక ఆటగాడు అంటే క్లాసెన్ ఒక్కడే! ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో తొలి సెంచరీ సాధించి శతక లోటు కూడా తీర్చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్ Klaasen mowa khundal khundal ke maarre 💯 Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR — JioCinema (@JioCinema) May 18, 2023