Yuzvendra Chahal
-
చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..?
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్-ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం చహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ధనశ్రీ చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేయడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ధనశ్రీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ధనశ్రీ చహల్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఈ విషయంలో చహల్కు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రికెట్ అభిమానుల్లాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా చహల్కు మద్దతుగా నిలిచినట్లనిపిస్తుంది.తాజాగా ధనశ్రీని విమర్శిస్తూ శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి రితిక లైక్ కొట్టింది. ఇది తెలిసి అభిమానులు ధనశ్రీ అంటే రితికకు సరిపోదా అని చర్చించుకుంటున్నారు. ధనశ్రీపై శుభాంకర్ విమర్శలతో ఏకీభవించే రితిక ఇలా చేసుంటుందని అనుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?శుభాంకర్ మిశ్రా ధనశ్రీ వర్మను 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించాడు. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునే మహిళ అని అర్దం. వీడియోలో శుభాంకర్ ధనశ్రీని ఉద్దేశిస్తూ ఇలా కూడా అన్నాడు. విడాకుల తర్వాత ధనశ్రీ ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొనుంది. అందకే ఆమె చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేసింది. భరణం పేరుతో భర్త నుంచి డబ్బు తీసుకుంటే అది సాధికారత ఎలా అవుతుంది. ఇలా చేసి స్వయంకృషితో ఎదిగిన మహిళ అని ఎలా చెప్పుకుంటారంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.కాగా, చహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర చహల్ డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత చహల్, ధనశ్రీ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఈ ఏడాది మార్చి 20న చహల్, ధనశ్రీకి విడాకలు మంజూరయ్యాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరు కలిసి లేరని తెలుస్తుంది. అంటే వీరి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లు మాత్రమే సాగిందన్న మాట.ఇదిలా ఉంటే, చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చహల్ను ఇటీవలే (మెగా వేలంలో) పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. చహల్ గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. అంతకుముందు అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించే వాడు. చహల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా టీమిండియాలో చోటు మాత్రం దక్కడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా ఉండటంతో చహల్కు అవకాశాలు రావడం లేదు. చహల్ పంజాబ్ జెర్సీలో ఇవాళ (మార్చి 25) తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నేటి మ్యాచ్లో పంజాబ్ గుజరాత్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ధనశ్రీ విషయానికొస్తే.. ఆమె ఇటీవలే ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోపై సోషల్మీడియాలో ద్వంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇకపై భార్యాభర్తలు కారు.. బంధం ముగిసిపోయింది (ఫొటోలు)
-
చహల్, ధనశ్రీ బంధానికి ఎండ్ కార్డు.. విడాకులు మంజూరు
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. చాహల్-ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. వీరిద్దిరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట ఐదేళ్ల వివాహ బందం నేటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు. ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి విడాకుల కేసుపై గత కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్-2025లో పాల్లోనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలొనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు నేడు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు.అయితే గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి పూటకో ఓ వార్త వస్తూనే ఉండేది. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వశ్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.చదవండి: షాక్లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్ -
రూ.4 కోట్ల 75 లక్షలు!
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. -
టీమిండియాలో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. చాహల్ 2025 సీజన్లో నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత చాహల్ ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. ఈ ఏడాది జూన్లో చాహల్ నార్తాంప్టన్షైర్ క్రికెట్ జట్టులో చేరి సీజన్ ఆఖరి వరకు కొనసాగనున్నాడు.రెడ్బాల్ క్రికెట్తో పాటు రాయల్ లండన్ వన్డే కప్నకు కూడా చాహల్ అందుబాటులో ఉండనున్నాడు. చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనుండడం ఇది రెండోసారి. అంతకుముందు 2023లో నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్కే చాహల్ ప్రాతినిథ్యం వహించాడు. కేవలం నాలుగు మ్యాచ్ల్లో 21.10 సగటుతో 19 వికెట్లు పడగొట్టి.. నార్తాంప్టన్షైర్ను డివిజన్ టూలో నాల్గవ స్థానానికి చేర్చాడు. ఇక మరోసారి నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై చాహల్ స్పందించాడు."గత సీజన్లో కౌంటీల్లో ఆడిన సమయాన్ని నేను ఆస్వాదించాను. మరోసారి నార్తాంప్టన్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషం ఉంది. నార్తాంప్టన్షైర్ డ్రెస్సింగ్ రూమ్లో లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. వారితో కలిసి మరోసారి డ్రెసింగ్ రూమ్ను పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.గత సీజన్లో చివరివరకు మేము అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈ సీజన్లో భారీ విజయాలను సాధిస్తామని ఆశిస్తున్నాము" అని చాహల్ పేర్కొన్నాడు. చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చాహల్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. అయితే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో అతడ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఈ టోర్నీ మొత్తం బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్-2025 సీజన్ కోసం ఈ లెగ్గీ సన్నద్దమవుతున్నాడు. మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ -
వద్దంటున్నా క్రికెటర్ చాహల్తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి, నిర్మాత, ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్వశ్ తలపట్టుకుంది. కట్ చేస్తే ఇటీవల దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకుదీంతో లవ్ గాసిప్స్కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్పై మహ్వశ్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వశ్ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.భార్యకు చాహల్ విడాకులు!కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్ ఎక్కువగా మహ్వశ్తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఎవరీ ఆర్జే మహ్వశ్?మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది.సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది.చాహల్తో డేటింగ్ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్కు చేరింది.నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే? -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు ఆమెతో పాటు ఎంట్రీ
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్ మరో యువతితో డేటింగ్లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్, మహ్వాష్ ఫోటోలను షేర్ చేశారు.ఆర్జే మహ్వాష్ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL— Cinemania (@CinemaniaIndia) March 9, 2025 -
ట్రెండింగ్ లో చాహల్, ధనశ్రీ.. ఎందుకో తెలుసా (ఫొటోలు)
-
కౌన్సెలింగ్ ఇచ్చినా మారని చాహల్, ధనశ్రీ..
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయినట్లు వినికడి. గురువారం బాంద్రా కోర్టు బయట చాహల్ కన్పించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఏబీపీ న్యూస్ రిపోర్టు ప్రకారం.. గురువారం ఉదయం చాహల్- ధనశ్రీ విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత న్యాయమూర్తి ఈ జోడీకి కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారని న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో సాయంత్రం 4.30 గంటలకు వీళ్లకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తుది విచారణకు ముందు చాహల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు"దేవుడు నన్ను నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు రక్షించాడు. ఆ సందర్బాలు కూడా నాకు గుర్తులేవు. నేను కష్టాల్లో ప్రతీ సమయంలోనూ దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు."మనం పడే బాధలు, ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తడిని కొంతకాలం అనంతరం ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి.దేవుడిపై మీకున్న విశ్వాసం మీకు మంచి జరిగేలా చేస్తుంది అంటూ ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ను షేర్ చేసింది. కాగా 2020లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో వర్మతో చాహల్కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో డిసెంబర్ 2020లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. -
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ విడాకులు.. తాజా పోస్ట్తో క్లారిటీ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్స్టాగ్రామ్లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
చాహల్ భార్యకు భరణం రూ.60 కోట్లు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది.ఇటీవల కాలంలో చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్లు సైతం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కూడా చేశారు. చాహల్ అయితే ఏకంగా ఆమె ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో చాహల్-ధనశ్రీ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ధనశ్రీకి రూ. 60 కోట్లు..?ఈ క్రమంలో తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జోడీ ఎప్పటికప్పుడు వీడియోలు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించేవారు. కానీ ఇటీవల కాలంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాగా వీరి విడాకులపై వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని చాహల్-ధనశ్రీ తీవ్రంగా ఖండిచారు. కానీ ఈసారి మాత్రం వారిద్దరూ విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.తాజాగా ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ.. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారు. కానీ నిజానికి విలువెక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. చాహల్ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని.. బయటకొస్తున్న వార్తలు నిజాలు కావచ్చు, కాకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.చదవండి: సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు -
చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్..
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో బెన్ డకెట్ను ఔట్ చేసిన అర్ష్దీప్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును సింగ్ బ్రేక్ చేశాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు అర్ష్దీప్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్లోనే విధ్వంసర ఆటగాడు ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో బెన్ డకెట్ను ఔట్ చేశాడు. ఈ పంజాబీ పేసర్ గత కొంత కాలంగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అర్ష్దీప్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అర్ష్దీప్ బంతిని పంచుకోనున్నాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు వీరే..97 వికెట్లు - అర్ష్దీప్ సింగ్ (61 మ్యాచ్లు)96 వికెట్లు - యుజ్వేంద్ర చాహల్ (80 మ్యాచ్లు)90 వికెట్లు - భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్లు)89 వికెట్లు - జస్ప్రీత్ బుమ్రా (70 మ్యాచ్లు)89 వికెట్లు - హార్దిక్ పాండ్యా(110 మ్యాచ్లు)తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం: బీసీసీఐ -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్స్టా ఖాతాలో మాత్రం చహల్తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
గ్లామర్లో హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ధనశ్రీ వైరల్ ఫొటోలు
-
IPL 2025: వేలంలో చహల్కు కళ్లు చెదిరే ధర.. జాక్పాట్ కొట్టేశాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చహల్ కొనసాగుతున్నాడు.ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్తప్పుకోగా.. పంజాబ్ చహల్ను దక్కించుకుంది.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం -
చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కోసం ఫ్యాన్స్ ఆన్లైన్లో మాక్ వేలం నిర్వహించారు. ఈ మెగా వేలం కోసం చహల్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది. ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. చహల్ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్ వేసింది. ఆఖరికి ఈ మాక్ వేలంలో చాహల్ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చహల్ ఐపీఎల్ జర్నీ ఇదే.. చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ తరపున తొలి సీజన్లోనే పర్పుల్ క్యాప్ను చహల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రాజస్తాన్ కూడా చహల్ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా చహల్ ప్రస్తుతం ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఇప్పటివరకు 155 మ్యాచ్లు ఆడిన చహల్.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడుచదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్.. -
ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిన చహల్
టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ బౌలర్గా అందరికీ సుపరిచితుడు. అయితే ఇతనిలో ఓ బ్యాటర్ దాగి ఉన్నాడన్న విషయం ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. బక్క పలచని శరీరాకృతి కలిగిన చహల్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఇది చూసి అతని అభిమానులు ఔరా అంటున్నారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్తో జరిగిన రంజీ మ్యాచ్లో చహల్ 152 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. వేదిక ఏదైనా ఎప్పుడూ ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడని చహల్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. టీమిండియాకు నయా ఆల్రౌండర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా, రంజీల్లో హర్యానాను ప్రాతినిథ్యం వహించే చహల్ తాజాగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగిన చహల్.. తొమ్మిదో నంబర్ ఆటగాడు హర్షల్ పటేల్తో (72 నాటౌట్) కలిసి దాదాపు 300 బంతులు ఎదుర్కొన్నాడు. హర్షల్, చహల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో మధ్యప్రదేశ్పై హర్యానా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేయగా.. హర్యానా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 123 ఆధిక్యంలో ఉంది. హర్షల్ పటేల్తో పాటు అమన్ కుమార్ (4) క్రీజ్లో ఉన్నాడు. -
భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్బాల్తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను. నాకు కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. -
‘మరో ఏడాది.. మరింత అద్భుతంగా’: భార్యకు భారత క్రికెటర్ విషెస్(ఫొటోలు)
-
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్లో..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు ముందు డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు) మెరిశాడు.అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్షైర్ ఫేట్ మారిపోయింది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 మ్యాచ్ల్లో భాగంగా లీసస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 203 పరుగులకు ఆలౌటైంది. లీసెస్టర్ ఇన్నింగ్స్లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: భారత్పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు! -
తొమ్మిది వికెట్లు తీసిన చహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్షైర్కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ డెర్బీషైర్పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్షైర్54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.టార్గెట్ 266266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు.చదవండి: ఐదేసిన చహల్ -
ఐదేసిన చహల్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో చహల్ ఈ ఫీట్ను సాధించాడు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024అంతకుముందు నార్తంప్టన్షైర్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రెండు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్లో ఉన్నారు.అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లో కెంట్పై ఈ ఫీట్ను సాధించాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. -
చహల్ మాయాజాలం.. తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది. కాగా, చహల్ ఈ మ్యాచ్తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఆడేందుకు నార్తంప్టన్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్షైర్ ఈ మ్యాచ్లో గెలిచినా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో గ్రూప్ దశ మ్యాచ్లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. -
చహల్కు విషెస్.. నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే అంటున్న భార్య (ఫొటోలు)
-
కళ్లు చెదిరే అందం.. టీమిండియా స్టార్ భార్య ఫొటోలు వైరల్
-
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషబ్ పంత్ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: భర్తను చీర్ చేసేందుకు వచ్చిన ధనశ్రీ వర్మ.. లేటెస్ట్ పిక్స్
-
నేనొక ఫైటర్.. వెనకడుగు వేయను: ధనశ్రీ వర్మ
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్కు గురైంది. ధనశ్రీ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్గా బరిలోకి దిగింది. ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో వైరల్గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది. "అస్సలు మీరు ఎలా ఏదో ఏదో ఊహించుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు దయచేసి మనుషులగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈ సారి ఈ చెత్త ట్రోల్స్పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఇతరుల వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. కొంత మంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను. కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి.. మా ప్రతిభ, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఒక పోరాట యోధురాలిని. .ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. మంచి విషయాలపై దృష్టి మీ జీవితంలో ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాని ధనశ్రీ పేర్కొంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
చహల్ భార్య ధనశ్రీ వర్మ చార్మింగ్ లుక్స్ (ఫొటోలు)
-
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
బీసీసీఐ షాకిచ్చింది.. చహల్ అక్కడ అలా!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బరిలోకి దిగిన అతడు మళ్లీ పునరాగమనం చేయలేదు. షాకిచ్చిన బీసీసీఐ వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుతో పాతుకుపోవడంతో చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ యజువేంద్ర చహల్కు మొండిచేయి చూపింది బీసీసీఐ. ఐపీఎల్లో కింగ్ ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్లోనే మళ్లీ యుజీ స్పిన్ మాయాజాలాన్ని చూసే వీలుంది. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన చహల్ 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చహల్ చరిత్రకెక్కాడు. చుక్కలు చూపించిన సంగీత ఇదిలా ఉంటే.. తనకు దొరికిన విరామ సమయాన్ని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోసం కేటాయించాడు చహల్. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా షోతో బిజీగా ఉంది. భారత రెజ్లర్ సంగీత ఫొగట్ కూడా ఈ టీవీ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలో విరామ సమయంలో చహల్తో కలిసి సంగీత సందడి చేసింది. అతడిని గొర్రెపిల్లలా వీపుపై వేసుకుని గిరాగిరా తిప్పుతూ తన రెజ్లింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఆ సమయంలో చహల్ కిందపడతానేమోన్న భయంతో దింపేయమంటూ వేడుకున్నా ఆమె వినలేదు. View this post on Instagram A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఫొగట్ సిస్టర్స్లో చిన్నవారైన సంగీత ఫొగట్.. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను వివాహమాడింది. ఇక ఝలక్ దిఖ్లాజా షోలో పాల్గొన్న సంగీత తాజాగా ఎలిమినేట్ అయింది. ధనశ్రీ వర్మ మాత్రం టాప్-5లో కొనసాగుతోంది. చదవండి: అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Dhanashree Verma Pics: కొత్త సంవత్సరం వేళ చహల్ భార్య ధనశ్రీ ఇలా..గ్లామర్ ఫొటోలు
-
ఒకే రోజున టీమిండియా క్రికెటర్ల వివాహ వార్షికోత్సవం (ఫొటోలు)
-
పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం
‘‘నా ప్రియమైన సతీమణి... మనం మొట్టమొదటిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం దాకా.. ఈ ప్రయాణంలోని ప్రతీ సెకండ్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు చెప్పారో గానీ.. సరిగ్గా నా కోసం చెప్పినట్లే ఉంది. ప్రతి రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నేను సంపూర్ణమయ్యాను!! నా ప్రేమ దేవతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ పట్ల ప్రేమను చాటుకున్నాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణికి కవితాత్మక సందేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. Dear wifey , From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕 You make me a better human being every single day.❤️ You complete… pic.twitter.com/1xxe8KqfSt — Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023 ఈ సందర్భంగా తన నిచ్చెలితో దిగిన అందమైన ఫొటోలను యుజీ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా ధనశ్రీ సైతం.. ఓ పాటకు తామిద్దరం డాన్స్ చేసిన వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. మూడేళ్లుగా పరస్పర సహకారంతో తమ ప్రయాణం ఇక్కడిదాకా వచ్చిందంటూ భర్త పట్ల ఆప్యాయతను చాటుకుంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) కాగా టీమిండియా బౌలర్గా కెరీర్లో తారస్థాయిలో ఉన్న సమయంలో యూట్యూబర్ ధనశ్రీ వర్మను చహల్ పెళ్లాడాడు. 2020, డిసెంబరు 22న గూర్గావ్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, కొన్నాళ్ల క్రితం ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. అంతేకాదు.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ పేరును ముడిపెట్టి అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ క్రమంలో యజువేంద్ర చహల్ స్వయంగా స్పందించి విడాకుల రూమర్స్ను కొట్టిపడేశాడు. ధనశ్రీ సైతం భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) ఇదిలా ఉంటే.. టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ పెళ్లిరోజు కూడా నేడు. ఈ సందర్భంగా సతీమణికి విష్ చేస్తూ అందమైన ఫొటోలను పంచుకున్నాడు సంజూ. కాగా తన చిన్ననాటి స్నేహితురాలు చారులతా రమేశ్ను ఐదేళ్ల క్రితం వివామమాడాడు సంజూ. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఈ కేరళ బ్యాటర్ మూడో వన్డేలో శతకం బాది టీమిండియాను గెలిపించాడు. మరోవైపు.. చహల్కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చదవండి: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ! -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
చహల్ మ్యాజిక్.. శతక్కొట్టిన లోమ్రార్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో రాజస్థాన్కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్పై), కర్ణాటకకు చెందిన విజయ్కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల స్కోర్ల వివరాలు.. తొలి క్వార్టర్ ఫైనల్: బెంగాల్ 225 (50 ఓవర్లు) హర్యానా 226/6 (45.1 ఓవర్లు) 4 వికెట్ల తేడాతో హర్యానా విజయం రెండో క్వార్టర్ ఫైనల్: రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు) కేరళ 67/9 (21 ఓవర్లు) 200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం మూడో క్వార్టర్ ఫైనల్: విదర్భ 173 (42 ఓవర్లు) కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం నాలుగో క్వార్టర్ ఫైనల్: ముంబై 227 (48.3 ఓవర్లు) తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో నో ఛాన్స్.. చాహల్ రియాక్షన్ ఇదే! పోస్ట్ వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు సెలక్టర్లు మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్కు చాహల్ను పట్టించుకోపోయిన సెలక్టర్లు.. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పరిగణలోకి తీసుకోలేదు. టీ20ల్లో అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్గా ఉన్న చాహల్ పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాహల్ చివరగా ఈ ఏడాది వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు తరపున కన్పించాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాను ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ఖాతాలో స్మైలింగ్ ఎమోజీతో తన స్పందించిన చాహల్.. తాజా మరో క్రిప్టిక్ స్టోరీని పోస్ట్ చేశాడు. "మనం కోసం ఎవరూ ఏమనుకున్నా లక్ష్యం దిశగా దూసుకుపోవడమే ఓ యోధుని నిజమైన బలమని" అర్ధం వచ్చేట్లుగా క్రిప్టిక్ స్టోరీని చాహల్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా 2016లో టీమిండియా తరుఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహల్.. 80 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. చాహల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2023 సీజన్లో హర్యానా తరుపున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్తో తొలి మ్యాచ్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తన పది ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. చదవండి: IND vs AUS: 'నువ్వు మా జట్టుపై ఎక్కువ సిక్సర్లు కొట్టావు'.. రోహిత్ శర్మపై సంజూ కీలక వ్యాఖ్యలు See you at work. 🏏 pic.twitter.com/JNMbz5owKI — Yuzvendra Chahal (@yuzi_chahal) November 24, 2023 -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. అంతకుముందు ఆసియాకప్కు కూడా చాహల్ను పరిగణలోకి తీసుకోలేదు. కాగా చాహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీగా ఉన్నాడు. కెంట్ క్రికెట్ క్లబ్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తనను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడంపై తాజాగా చాహల్ స్పందించాడు. జట్టులో చోటు దక్కించుకోపోవడం తనకు అలవాటు అయిందని, అది తన జీవితంలో ఒక భాగమైందని చాహల్ చెప్పుకొచ్చాడు. "ఇది వరల్డ్కప్. జట్టులో పదిహేను మంది ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి. 17 లేదా 18 ప్లేయర్స్ను ఎంపిక చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. అయితే జట్టులో చోటు దక్కించుకోపోయినందుకు కొంచెం బాధగా ఉంది. కానీ కష్టపడుతూ జీవితంలో ముందుకు సాగడమే నా మోటివ్. నాకు ఇది అలవాటు అయిపోయింది. వరల్డ్కప్లో చోటు దక్కకపోవడం నాకు ఇది మూడో సారి అంటూ నవ్వుతూ" విజ్డెన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. అదే విధంగా ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడాలన్న ఉద్దేశ్యంతో ఇంగ్లండ్ కౌంటీల్లో భాగమయ్యానని చాహల్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'అశ్విన్ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు' -
చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో.. అందుకే ఎంపిక చేయడం లేదు
వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో అనుహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సెలక్టర్లు చోటుకల్పించారు. ఈ సిరీస్కు అశ్విన్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు మాత్రం మరోసారి మొండి చేయి చూపించారు. అశ్విన్తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. ఇక ఆసీస్ సిరీస్కు చాహల్ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్ ఎవరితోనైనా గొడవపడి ఉండవచ్చు, అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని భజ్జీ సంచలన వాఖ్యలు చేశాడు. చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో.. "యుజ్వేంద్ర చాహల్ ఆసీస్ సిరీస్ జట్టులో ఉండాల్సింది. అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు ఎవరితోనైనా గొడవపడ్డాడా? లేదా ఎవరికైనా ఏమన్నా అన్నాడా? అనేది మాత్రం తెలియడం లేదు. కేవలం స్కిల్స్ పరంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే చాహల్కు కూడా చోటు ఇవ్వాలి. చాలా మంది భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నందున చాహల్ పేరు జట్టులో ఉంటుందని భావించాను. జట్టు మేనెజ్మెంట్ హాఫ్ స్పిన్నర్ల కోసం వెతుకుతున్నట్లు నాకు అన్పిస్తోంది. అందుకే వరల్డ్కప్ ప్రణాళికలలో లేని అశ్విన్, వాషింగ్టన్ సుందర్కు మళ్లీ పిలుపునిచ్చారని" భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. తొలి రెండు వన్డేల కోసం భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడో వన్డే కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్ -
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం!
వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. చాహల్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కపోయినప్పటికీ.. వరల్డ్కప్కు మాత్రం ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో చాహల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని చాహల్ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్ల్లో కెంట్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు సమాచారం. చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున ఆడనున్నాడు. ఇందుకు సంబంధించి కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అతనికి ఎన్ఓసీ కూడా మంజూరు చేసింది. అతడు భారత జట్టుకు అవసరమైతే వెంటనే జాతీయ జట్టుతో చేరుతాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఉమేశ్యాదవ్ సహచర ఆటగాళ్లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడతున్నారు. చదవండి: ODI WC 2023: వరల్డ్కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ.57లక్షలు! -
'ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. అతడి కంటే జట్టులో తోపులు ఎవరూ లేరు'
ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్తో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా.. యువ ఆటగాడు తిలక్ వర్మకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ జట్టులో స్టార్స్పిన్నర్ యజువేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. చహల్కు బదులగా కుల్దీప్ యాదవ్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇక ఆసియాకప్ జట్టు నుంచి చహల్ను పక్కన పెట్టడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో చాహల్ అత్యుత్తమ బౌలర్ అని, అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని హర్భజన్ అన్నాడు. "యుజ్వేంద్ర చాహల్ జట్టులో లేకపోవడం భారత్కు తీరని లోటు. ఎందుకంటే ఆసియాకప్కు ఎంపిక చేసిన జట్టులో లెగ్ స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. లెగ్ స్పిన్నర్కు మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉంటుంది. వైట్బాల్ క్రికెట్లో భారత జట్టులో చాహల్ కంటే మెరుగైన స్పిన్నర్ మరొకడు లేడు. అతడు గత కొన్ని మ్యాచ్ల్లో బాగా రాణించకపోవచ్చు. అంత మాత్రాన అతడు మంచి బౌలర్ కాకుండా పోడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అతడి సేవలు చాలా అవసరం. అతడికి జట్టులోకి వచ్చేందుకు దారులు ఇంకా మూసుకుపోలేదని నేను అనుకుంటున్నాను. వరల్డ్కప్ భారత్లో జరగనుంది. కాబట్టి చాహల్ను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. చాహల్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. అతడు ఫామ్లో లేడని నాకు తెలుసు. కానీ జట్టుతో లేకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్లో భారత్దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు! -
అందుకే చాహల్కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం. ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్ను కాదని కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్తో కూడా రాణించగలడని, అందుకే చహల్ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. "విండీస్ సిరీస్లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్కు లోయార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్.. -
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ధనశ్రీ వర్మ అందమైన ఫొటోలు చూసేయండి
-
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్తో పాటు సిరీస్ను విండీస్కు అప్పగించింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్కు దక్కింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను కోల్పోయింది. -
'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
వెస్టిండీస్తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 39, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్ బ్యాటింగ్ ఆర్డర్పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్లో ముకేశ్ కుమార్.. చహల్ చివరి స్థానంలో బ్యాటింగ్కు రావాలి. కుల్దీప్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి. ముకేశ్ పొడగరి కాబట్టి విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్లో బ్యాటింగ్కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి చహల్ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్ మళ్లీ పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్లో ఒక బ్యాటర్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్ పిలుపుతో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చిన చహల్ను అంపైర్ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో ముకేశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బ్యాటింగ్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి చహల్ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్మెంట్ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్ను విండీస్కు అప్పగించింది. Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh — Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023 చదవండి: ధోని రనౌట్తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా! -
అందమైన ఫోటోలు షేర్ చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ ఫిదా!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మంచి డ్యాన్సర్ కూడా. ధనశ్రీ ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ వీడియాలు, ఇన్స్టా రీల్స్తో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. హాలీవుడ్ కొత్త మూవీ 'బార్బీ' చూడటానికి ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్స్ను ధరించింది. ఈ ప్రత్యేక దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది. ధనుశ్రీ కొత్త లూక్కు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ధనుశ్రీ పోస్టుపై చాహల్ కూడా స్పందించాడు. హార్ట్, ముద్దు ఎమోజీలను చాహల్ రిప్లేగా ఇచ్చాడు. కాగా చాహల్ ప్రస్తుతం వెస్టిండీస్లో ఉన్నాడు. విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ల్లో చాహల్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్ -
నన్ను మోసం చేశారు..ఆర్సీబీపై చాహల్ ఫైర్
-
ఆర్సీబీపై చాహల్ గరం గరం.. నమ్మించి మోసం చేశారు! కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా..
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో 8 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు చాహల్ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన చాహల్ను కనీసం మళ్లీ తిరిగి పొందే ప్రయత్నం కూడా ఆర్సీబీ చేయలేదు. అయితే ఈ వేలంలో చాహల్ను సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ రూ. 6.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై తాజాగా చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 8 సీజన్ల పాటు సేవలు అందించిన తనను విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని చాహల్ తెలిపాడు. "నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. 2014లో ఆర్సీబీతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి మ్యాచ్ నుంచే నాపై నమ్మకం ఉంచాడు. నేను 8 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడాను. 2022 వేలానికి ముందు నేను మేనేజ్మెంట్ను ఎక్కువ డబ్బులు అడిగానని నాపై విమర్శలు వచ్చాయి. నేను అలా చేయలేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చా. దాదాపు 140 మ్యాచ్లు పైగా ఆర్సీబీ తరపున ఆడాను. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఆర్సీబీ నన్ను ఎందుకు సొంతం చేసుకోలేదో ఇప్పటికి నాకు అర్దం కాలేదు. రిటైన్ చేసుకోపోనప్పటికీ వేలంలో కచ్చితంగా కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ వేలంలో కనీస ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వారి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఈ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతీసారి నాకు బాధ కలుగుతోంది. ఆ తర్వాత ఏది జరిగినా అది నా మంచికే అని భావించాను. రాజస్తాన్ రాయల్స్లో చేరడం వల్ల నేను డెత్ బౌలర్గా మారాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా దాదాపు 16 లేదా 17 ఓవర్కే పూర్తయ్యేది. కానీ రాజస్తాన్లో చేరాక నా ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది" అని ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Asian Games 2023: భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది -
'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే!
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్కు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. చెస్కు చహల్ వీరాభిమాని. గతంలో భారత్లో జరిగిన వరల్డ్ యూత్ చెస్ చాంపియన్షిప్కు ప్రతినిధిగా వ్యవహరించాడు. ఆల్పైన్ వారియర్స్ ఫ్రాంచైజీకి చహల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఇటీవలే దుబాయ్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్లు లేకపోవడంతో అంబాసిడర్ హోదాలో దుబాయ్కు వెళ్లాడు. తాజాగా చహల్ ఒక యువతితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''నేనిప్పుడు దుబాయ్లో ఉన్నా. మిస్టరీ గర్ల్ విత్ గ్లోబల్ చెస్ లీగ్''అని క్యాప్షన్ జత చేశాడు. అయితే చహల్ పేర్కొన్న మిస్టరీ గర్ల్ పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆమె పేరు జెస్సీ ఫిబ్రవరి. సౌతాఫ్రికాకు చెందిన జెస్సీ ఫిబ్రవరి.. రెండుసార్లు సౌతాఫ్రికా వుమెన్స్ చెస్ చాంపియన్.. మరోసారి ఆఫ్రికన్ వుమెన్స్ చెస్ చాంపియన్గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా జెస్సీ తన ట్విటర్లో చహల్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''మొత్తానికి చహల్ను కలుసుకున్నా.. సంతోషంగా ఉంది'' అంటూ పేర్కొంది. కాగా చహల్ ఫోటోపై అభిమానులు స్పందించారు. ''ఎవరు పిల్లా నువ్వు.. పేరే గమ్మత్తుగా ఉంది.. చహల్తో ఫోటో దిగావు సరే.. ధనశ్రీ చూస్తే ఊరుకుంటుందా.. అంతే సంగతి'' అంటూ కామెంట్ చేశారు. ఇక సౌతాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్కు చెందిన జెస్సీ ఫిబ్రవరి 2016లో మహిళల విభాగంలో చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. 2021 మేలో జెస్సీ ఫిబ్రవరి వుమెన్స్ ఆఫ్రికన్ చాంపియన్షిప్లో పాల్గొని 8 స్కోరుకు గాను ఏడు పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో 2100 రేటింగ్ సాధించిన జెస్సీ ఫిబ్రవరి గ్రాండ్మాస్టర్ హోదా సాధించింది. ఇక 2021 జూలైలో జరిగిన మహిళల చెస్ వరల్డ్కప్కు క్వాలిఫై సాధించినప్పటికి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. Just 2 hardcore cricket fans. pic.twitter.com/UBgN3TTmxy — Jesse February (@Jesse_Feb) June 25, 2023 చదవండి: #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! #Wimbledon2023: 'ఆ రూమ్లు మెడిటేషన్కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. గంగూలీ హెచ్చరిక
టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ టెస్టుల్లో పెద్దగా మెరవనప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్లు తీయగల సమర్థుడు. కుల్దీప్ యాదవ్తో కలిసి స్వదేశంలో ఎన్నో మ్యాచ్ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఈ మధ్యన అతన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఉపఖండపు పిచ్లు స్పిన్నర్లకు స్వర్గధామం. అశ్విన్ లాంటి టాప్క్లాస్ స్పిన్నర్ టెస్టుల్లో మాత్రమే ప్రభావం చూపించగలడు. వన్డేలు ఆడినప్పటికి పెద్దగా మెరిసింది లేదు. మరో నాలుగు నెలల్లో భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్ జరగనుంది. 2011 తర్వాత పుష్కర కాలానికి టీమిండియా మెగా సమరానికి ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి రోహిత్ సేన కచ్చితంగా కప్ కొట్టి ధోని సేన మ్యాజిక్ను పునరావృతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ బాధ్యతలు ఎవరు నడిపస్తారనేది ఆసక్తిగా మారింది. చహల్, కుల్దీప్ యాదవ్లతో పాటు అక్షర్ పటేల్లు ఉన్నప్పటికి రెగ్యులర్ స్పిన్నర్లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వన్డే వరల్డ్కప్కు యజ్వేంద్ర చహల్ను ఆడించడం ఉత్తమమని.. అతను ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గంగూలీ మాట్లాడుతూ.. ''వన్డే వరల్డ్ కప్లో యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిభష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే... పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు.. యజ్వేంద్ర చహాల్ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! -
భార్య ధనశ్రీతో చహల్.. చూడముచ్చటైన జంట (ఫొటోలు)
-
KKR VS RR: గురువు రికార్డును సమం చేసిన చహల్
రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్కు ఐపీఎల్-2023 సీజన్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఈ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న చహల్.. నిన్న (మే 11) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ అత్యుత్తమ రికార్డును తన పేరిట లిఖించుకోవడంతో పాటు పలు సాధారణ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టిన చహల్.. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్ల్లో 187 వికెట్లు) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించడంతో పాటు ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్గా (12 మ్యాచ్ల్లో 21 వికెట్లు) తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. ఈ క్రమంలో చహల్ మరో అన్ నోటీస్డ్ రికార్డును సైతం సమం చేశాడు. తన ఐపీఎల్ గురువైన లసిత్ మలింగ పేరిట ఉండిన ఓ రికార్డును చహల్ సమం చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు (7) నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉండగా.. నిన్నటి ప్రదర్శనతో చహల్ (7) గురువు సరసన చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు పడగొట్టిన రికార్డు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (8) పేరిట ఉంది. ఈ సీజన్లో అన్ని అనుకూలిస్తే చహల్ మరో 5 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. దీంతో చహల్ మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి. చహల్ ప్రస్తుత ఫామ్ను కొనసాగిస్తే, ఈ సీజన్లోనే ఎవరికీ సాధ్యం కాని 200 వికెట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చహల్ (4/25) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగా.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బీభత్సం సృష్టించడంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..! -
చాలా సంతోషంగా ఉంది.. అతడొక లెజెండ్! అది మా అదృష్టం: శాంసన్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ దిశగా రాజస్తాన్ రాయల్స్ అడుగులు వేస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన రాజస్తాన్.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్పై విజయంపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్, యజువేంద్ర చాహల్పై సంజూ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక లెజెండ్.. "ఈ మ్యాచ్లో నేను చేసింది ఏమీ లేదు. నాన్స్ట్రైకర్ నుంచి జైశ్వాల్ ఇన్నింగ్స్ చూసి ఎంజాయ్ చేశాను. పవర్ప్లేలో యశస్వీ ఎలా ఆడుతాడో ప్రత్యర్ధి బౌలర్లకు సైతం తెలుసు. పవర్ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అటువంటి ఆటగాడు మాకు దొరకడం మా అదృష్టం. ఇక చాహల్ అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహంలేదు. చదవండి: #Yashasvi Jaiswal: వాట్ ఏ టాలెంట్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే: విరాట్ కోహ్లి తాను ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడొక లెజెండ్. ఫ్రాంచైజీలో చాహల్ వంటి స్పిన్నర్ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాహల్కు నేను ఎటువంటి సూచనలు చేయాల్సిన అవసరం లేదు. బంతితో ఏమి చేయాలో అతడికి బాగా తెలుసు. యుజీకి డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా ఉంది. కెప్టెన్గా నాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాహల్ చేస్తున్నాడు. ఇక ప్లేఆఫ్స్కు చేరడానికి మాకు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్ కూడా మాకు కీలకం. ఇదే ఫలితాన్ని రాబోయే మ్యాచ్ల్లో పునరావృతం చేసి ప్లేఆఫ్స్లో అడుగు పెడతామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సంజూ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జైశ్వాల్(98) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. చదవండి: # Nitish Rana: నువ్వేమన్నా నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ -
చహల్కు మాత్రమే సాధ్యం.. నలుగురిలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల జాబితాలో డ్వేన్ బ్రావోను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16 నుంచి 20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో చహల్ చోటు సంపాదించాడు. మతీషా పతీరానా 12 వికెట్లతో టాప్లో ఉండగా.. చహల్ 11 వికెట్లతో రెండో స్థానంలో, తుషార్ దేశ్ పాండే 10 వికెట్లతో మూడో స్థానంలో, హర్షల్ పటేల్ 9 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే టాప్లో ఉన్న నలుగురు బౌలర్లలో ముగ్గురు పేసర్లు ఉంటే చహల్ మాత్రం ఏకైక స్పిన్నర్గా ఉన్నాడు. కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు.ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్ల్లో 171) టాప్-5లో ఉన్నారు. -
KKR VS RR: చరిత్ర సృష్టించిన చహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్ల్లో 184) సాధించిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 11) కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు. ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్ల్లో 171) టాప్-5లో ఉన్నారు. కాగా, కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగలు చేసింది. జేసన్ రాయ్ (10), రహ్మానుల్లా గుర్భాజ్ (18), నితిశ్ రాణా (22), ఆండ్రీ రసెల్ (10) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (49 నాటౌట్), రింకూ సింగ్ (4) క్రీజ్లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా.. చహల్, ఆసిఫ్ తలో వికెట్ దక్కించకున్నారు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లకు ఇది డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలిచి తీరాలి. చదవండి: సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి! -
చహల్ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్గా
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చహల్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్లో తన పేరిట ఒక రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చహల్ డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. తాజా మ్యాచ్తో కలిపి ఇప్పటివరకు చహల్ ఐపీఎల్లో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో కూడా 183 వికెట్లు తీశాడు. అయితే బ్రావో 161 మ్యాచ్ల్లో 183 వికెట్లు తీయగా.. చహల్కు మాత్రం 141 మ్యాచ్లే అవసరమయ్యాయి. ఇక టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా చహల్ నిలిచాడు. చహల్, బ్రావో తర్వాత పియూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో, అమిత్ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
బిడ్డ ముందే బట్లర్ కు లవ్ ప్రపోజల్ చేసిన చాహల్..
-
నువ్వంటే నాకిష్టం.. నా లవ్ నువ్వే: బట్లర్కు చాహల్ ప్రపోజల్.. వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మైదానంలోనే కాకుండా ఆఫ్ది ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను చాహల్ అలరిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్కు సంబంధించిన మరో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో రాజస్తాన్ రాయల్స్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు.. చహల్ ఫన్నీగా డేటింగ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ టీమిండియా చేతిలో ఒక చిన్న పూల కుండీని పట్టుకుని మరీప్రపోజ్ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ప్లీజ్ నాతో డేట్కు వస్తారా" అని సరదాగా చహల్ ప్రపోజ్ చేశాడు. అందుకు బదులుగా బట్లర్ "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రాజస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 20న ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్.. The perfect proposal doesn’t exi- 😂 pic.twitter.com/vENeuVtfTq — Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2023 -
RR VS LSG: చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న చహల్... ఈ మ్యాచ్లోనే అవుతుందా..?
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. జైపూర్లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్లో చహల్ మరో 7 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ జాబితాలో విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో 183 వికెట్లతో (161 మ్యాచ్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. చహల్ ప్రస్తుతం 177 వికెట్లతో (136 మ్యాచ్ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. చహల్ ఈ రికార్డును నేటి మ్యాచ్లోనే నెలకొల్పడం కాస్త కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. పైగా చహల్ ఈ మ్యాచ్ తమ సొంత మైదానంలో ఆడుతుండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..? అదీ కాక చహల్కు లక్నోపై గణమైన రికార్డు ఉంది. ఐపీఎల్-2022లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో చహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అదే సీజన్లో జరిగిన రెండో మ్యాచ్లోనూ కీలకమైన దీపక్ హుడా (59) వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి సూపర్ ఫామ్లో ఉన్న చహల్.. ఈ సీజన్లోనూ లీడింగ్ వికెట్ టేకర్గా (5 మ్యాచ్ల్లో 11 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇన్ని సానుకూలమైన అంశాల మధ్య చహల్ నేడు లక్నోతో జరిగే మ్యాచ్లోనే అత్యధిక వికెట్ల ఐపీఎల్ రికార్డును తిరగరాస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే, రాజస్థాన్-లక్నో జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (5 మ్యాచ్ల్లో 4 విజయాలు).. రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో విజేత ఎవరో అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ -
శ్రేయస్తో చహల్ భార్య ధనశ్రీ తాజా ఫొటో వైరల్! కలిసి వెళ్లేది అందుకేనా?
Shreyas Iyer- Yuzvendra Chahal- Dhanashree Verma: గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. భారత స్టార్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ కీలక బౌలర్ యజువేంద్ర చహల్ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మతో అయ్యర్ కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ధనశ్రీ స్వయంగా శనివారం తన ఇన్స్టా స్టోరీలో వీటిని షేర్ చేయడం గమనార్హం. ‘‘మై క్యూటీస్’’ అంటూ హార్ట్ ఎమోజీతో తన స్నేహితురాలు పంచుకున్న ఫొటోను చహల్ సతీమణి షేర్ చేసింది. ఇందులో ఆమె స్నేహితులతో పాటు ఓ మూలన అయ్యర్ కూడా కనిపించాడు. ఇందులో శ్రేయస్ సోదరి శ్రేష్ట అయ్యర్ కూడా ఉండటం విశేషం. కాగా గతంలో.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా దంపతులతో ధనశ్రీ, శ్రేయస్ దిగిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. విడాకుల రూమర్లు అంతకుముందే ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటి పేరును తొలగించడం.. తర్వాత ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో విడాకుల రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో స్వయంగా చహల్- ధనశ్రీ స్పందిస్తూ పుకార్లకు అడ్డుకట్ట వేశారు. అయితే, ఇటీవల టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా దంపతులతో కలిసి ధనశ్రీ- శ్రేయస్ దిగిన ఫొటోలతో మరోసారి వీరు నెట్టింట ట్రెండ్ అయ్యారు. తాజాగా స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్ పార్టీకి శ్రేయస్, శ్రేష్టతో పాటు ధనశ్రీ కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మళ్లీ వీరి పేర్లు హైలైట్ అవుతున్నాయి. కలిసి వెళ్లేది అందుకేనా.. డాక్టర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అలాగే కొరియోగ్రాఫర్ కూడా! నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియాగ్రాఫర్గా రాణించాలని కలలు కంటోంది. ఈ క్రమంలో వీరిద్దరికి స్నేహం కుదరగా.. శ్రేయస్తో కూడా ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిందని టాక్. ఇప్పటికే అయ్యర్తో గతంలో ఓ డాన్స్ వీడియో షేర్ చేసిన ధనశ్రీ అతడి ఆట తీరును ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో కొంతమంది అయ్యర్తో ధనశ్రీ స్నేహాన్ని విమర్శిస్తూ కామెంట్లు చేస్తుండగా.. అభిమానులు మాత్రం తన ఫ్రెండ్ సోదరుడితో ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేస్తే పెడర్థాలు తీస్తారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా.. ఏదో రకంగా వార్తల్లో ఉండటం ధనశ్రీకి పరిపాటి అయిందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. తను దొరకడం నా అదృష్టం ధనశ్రీ వీలు చిక్కినప్పుడల్లా భర్త చహల్తో కలిసి ప్రయాణాలు చేస్తుంది. అతడిని ప్రోత్సహిస్తూ భర్త సాధించే విజయాలను ఆస్వాదిస్తుంది. ఇటీవల సన్రైజర్స్తో హైదరాబాద్లో రాజస్తాన్ మ్యాచ్కు విచ్చేసిన ధనశ్రీ.. చహల్ వికెట్లు తీసినపుడు సెలబ్రేషన్ చేసుకున్న తీరు హైలైట్గా నిలిచింది. ఇక మ్యాచ్ తర్వాత చహల్ మాట్లాడుతూ.. తన భార్య గురించి గొప్పగా చెబుతూ.. ఆమెలాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టమని పొంగిపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో చహల్ బిజీగా ఉన్న సమయంలో ధనశ్రీ ఫొటోలు షేర్ చేసింది. -
చహల్ చరిత్ర.. మలింగను దాటి రెండో స్థానంలోకి
రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్తో మ్యాచ్లో జితేశ్ శర్మ వికెట్ తీయడం ద్వారా చహల్ ఐపీఎల్లో 171 వ వికెట్ సాధించాడు ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 133 మ్యాచ్లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్ల్లో 170 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్తో సమానంగా ఉన్నాడు. తాజాగా చహల్ మలింగను దాటి రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. ఇక ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలుస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్కు మినహా మరే బౌలర్కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
'మాట తప్పాడు.. చాలా బ్యాడ్గా అనిపిస్తోంది'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్తో హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. రాజస్తాన్ బౌలర్ చహల్ నాలుగు వికెట్లతో ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. ఇక బుధవారం రాజస్తాన్ పంజాబ్ కింగ్స్తో తర్వతి మ్యాచ్ ఆడనుంది. కాగా పంజాబ్కు వెళ్లే సమయంలో విమానంలో చహల్ను రాజస్తాన్ ప్రెజంటేటర్ ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. చహల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశావు.. ఉమ్రాన్ బాయ్ ఢిపెన్స్ చేయకపోయుంటే నీకు ఐదో వికెట్ లభించేది.. ఇప్పుడు నువ్వు ఉమ్రాన్కు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగాడు. ''చెప్పడానికి ఏం లేదు.. నేను ఉమ్రాన్ను కలిసినప్పుడు నాకు బాగా గుర్తు అతను నా బౌలింగ్లో మూడు సిక్సర్లు కొడుతా అని చెప్పాడు.. కానీ ఉమ్రాన్ మాట తప్పాడు.. ఇది చాలా బ్యాడ్గా అనిపించింది. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రాజస్తాన్తో మ్యాచ్లో గంటకు 145 కిమీ వేగంతో బంతులేసిన ఉమ్రాన్ మాలిక్.. దేవదత్ను క్లీన్బౌల్డ్ చేసిన బంతి మాత్రం 150 కిమీ స్పీడుతో వచ్చినట్లు తెలుస్తోంది. 🎥Lesson learnt: You cannot escape Taran 😂😂 pic.twitter.com/5XW5CCXqno — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 చదవండి: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం -
IPL 2023: పంజాబ్ కింగ్స్తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్రైజర్స్పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్తో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్కు మినహా మరే బౌలర్కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
IPL 2023: చహల్ సంచలన రికార్డు.. ఎవరికీ అందనంత ఎత్తులో! అశూ, బుమ్రా వెనకే!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: గతేడాది అత్యధిక వికెట్లు(27) తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్-2023లోనూ శుభారంభం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో చహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ మ్యాచ్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(27), పవర్ హిట్టర్గా పేరొందిన హ్యారీ బ్రూక్(13) రూపంలో కీలక వికెట్లు తీసి రైజర్స్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన చహల్.. ఆఖర్లో ఆదిల్ రషీద్(18), కెప్టెన్ భువనేశ్వర్కుమార్ (6)లను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో చహల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఎవరికీ అందనంత ఎత్తులో టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా యజువేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో 300కు పైగా వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టిన చహల్.. లసిత్ మలింగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో హ్యారీ బ్రూక్ను అవుట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 300వ వికెట్ నమోదు చేసిన చహల్కు ఐపీఎల్లో ఇది 167వ వికెట్. ఇక రషీద్, భువీ వికెట్లు కూడా పడగొట్టి ఈ సంఖ్యలను 303, 170గా మార్చుకున్నాడు చహల్. అదే విధంగా సన్రైజర్స్పై రాజస్తాన్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా క్రికెటర్లు ►యజువేంద్ర చహల్- 303 ►రవిచంద్రన్ అశ్విన్- 287 ►పీయూశ్ చావ్లా- 276 ►అమిత్ మిశ్రా- 272 ►జస్ప్రీత్ బుమ్రా- 256. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు(ఇప్పటి వరకు) 1.డ్వేన్ బ్రావో- 183 వికెట్లు 2. యజువేంద్ర చహల్-170, లసిత్ మలింగ(శ్రీలంక)- 170 వికెట్లు. చదవండి: మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి.. IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. The first Indian to 300 T20 wickets. 👏💗 pic.twitter.com/Q8PDmhHR4V — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 Picked up where he left off in 2022. What a performance, Yuzi bhai! 💪💗 pic.twitter.com/t14Erw8ab5 — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
భర్త ఘనతను దగ్గరుండి ఎంజాయ్ చేసిన ధనశ్రీ
ఐపీఎల్ 16వ సీజన్ను యజ్వేంద్ర చహల్ ఘనంగా ఆరంభించాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఈ రాజస్తాన్ బౌలర్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఈ నేపథ్యంలో చహల్ తన ఖాతాలో రెండు రికార్డులను జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన చహల్కు టి20ల్లో ఇది 300వ వికెట్. టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన తొలి స్పిన్నర్గా.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా ఏకకాలంలో రికార్డు సాధించాడు. కాగా చహల్ సాధించిన ఈ ఘనతను భార్య ధనశ్రీ వర్మ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్కు ధనశ్రీ వర్మ హాజరైంది. భర్త టి20ల్లో 300వ వికెట్ సాధించగానే స్టాండ్స్లో ఉన్న ధనశ్రీ ఒక్కసారిగా సంతోషంతో గెంతులేసి చప్పట్లతో చహల్కు అభినందనలు పంపించింది. ఈ సమయంలో ఆమె మొహం నవ్వుతో వెలిగిపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు.. చహల్కు ఇంతలా సపోర్ట్ చేసే భార్య దొరకడం నిజంగా అతని అదృష్టం అని మనసులో అనుకునే ఉంటారు. ధనశ్రీ ఎంజాయ్ చేస్తున్న వీడియోపై మీరు ఒక లుక్కేయండి. 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
చరిత్ర సృష్టించిన చహల్..
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చహల్ నిలిచాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో చహల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో చహల్ 167వ వికెట్ సాధించాడు. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో చహల్ అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్లో మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన చహల్ 170 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా(167 వికెట్లు) రెండో స్థానంలో, పియూష్ చావ్లా(157 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(157 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక సునీల్ నరైన్ 153 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు టి20ల్లో అన్ని మ్యాచ్లు(లీగ్లు, అంతర్జాతీయం) కలిపి చహల్కు ఇది 300వ వికెట్ కావడం విశేషం. ఇలా చహల్ ఒక్క వికెట్తో రెండు రికార్డులను కొల్లగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్పై రాజస్తాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఒక దశలో వంద పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో అబ్దుల్ సమద్(32 నాటౌట్), ఉమ్రాన్ మాలిక్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో వంద పరుగులు దాటగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, అశ్విన్, హోల్డర్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ బట్లర్, శాంసన్, జైశ్వాల్లు అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్మ్యాన్ మరో మ్యాచ్లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్లు ఆడి టాప్లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్లో రిలాక్స్ మోడ్లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్గ్రీన్గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
RRRతో RR.. వైరలవుతున్న రాజస్థాన్ రాయల్స్ ట్వీట్
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నిన్న (ఫిబ్రవరి 11) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఆర్ఆర్ స్టార్ బౌలర్, టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ నిన్న హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, RRR ఫేమ్ రాజమౌళిని కలిశాడు. When RR met RRR. 🔥 pic.twitter.com/y8fjeNwibX — Rajasthan Royals (@rajasthanroyals) February 11, 2023 ఈ సందర్భంగా చహల్ దంపతులు రాజమౌళితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ఆర్ఆర్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ పోస్ట్కు ఆర్ఆర్ యాజమాన్యం.. RR.. RRRని కలిపినప్పుడు అన్న ఆసక్తికర క్యాప్షన్ను పెట్టింది. కాగా, చహల్ కొద్దిరోజుల కిందట RRR మరో ఫేమ్ తారక్ను కలిశాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు చహల్తో పాటు టీమిండియా సభ్యులు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్లు కూడా తారక్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ అయితే అతని భార్య కలిసి తారక్తో ఫోటో దిగాడు. అప్పుడు ఈ ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుండగా.. టెస్ట్ జట్టులో స్థానం దక్కని చహల్ ఖాళీగా ఉన్నాడు. కాగా, 32 ఏళ్ల చహల్ భారత్ తరఫున 72 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 27.13 సగటుతో 121 వికెట్లు పడగొట్టిన చహల్.. టీ20ల్లో 24.68 సగటున 91 వికెట్లు సాధించి, భారత్ తరఫున లీడింగ్ టీ20 వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. -
హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్షిప్లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్చరణ్తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు. ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్లు జరిగాయి. హైదరాబాద్లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML — Sarita Avula (@SaritaTNews) February 11, 2023 He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT — Bharat Sharma (@sharmabharat45) February 11, 2023 -
గిల్పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్
న్యూజిలాండ్తో జరిగిన వన్డే, టి20 సిరీస్లను చేజెక్కించుకున్న టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ శుబ్మన్ గిల్కు బాగా ఉపయోగపడింది. కీలకమైన వన్డే వరల్డ్కప్కు ముందు అతను మంచి ఫామ్ కనబరుస్తుండడం.. వరుస సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక కివీస్తో జరిగిన చివరి టి20మ్యాచ్లో గిల్ సుడిగాలి శతకంతో టి20 ప్లేయర్గా పనికిరాడన్న అపవాదును తొలగించుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం తన పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. సిరీస్ ముగిసిన అనంతరం శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చహల్లు కలిసి చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. పాపులర్ యూత్ షో ఎంటీవీ రోడీస్లో ఆడిషన్ ఎపిసోడ్ను ఈ ముగ్గరు రీక్రియేట్ చేశారు. చహల్ దర్శకత్వం చేయగా.. గిల్, ఇషాన్లు తమ యాక్షన్ను షురూ చేశారు. వీడియోలో ఇషాన్ కిషన్ గొరిల్లా లాగా జంప్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ఆడిషన్లో భాగంగా సరైన ప్రదర్శన ఇవ్వని గిల్ను ఇషాన్ కిషన్ తిట్టడం.. ఆపై చెంపలు వాయించుకోమనడం లాంటివి సరదాగా అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోనూ గిల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియోను బాగా ఎంజాయ్ చేసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం టీమిండియా టెస్టు క్రికెట్కు సిద్ధమవుతోంది.ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా నాగ్పూర్కు చేరుకుంది. ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఆసీస్తో సిరీస్ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) చదవండి: ఆసీస్తో తొలి టెస్టు.. నాగ్పూర్ చేరుకున్న టీమిండియా -
చహల్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా!
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా చహల్ నిలిచాడు. లక్నో వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఒక్క వికెట్ పడగొట్టిన చహల్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. చహల్ 75 మ్యాచ్ల్లో 91 వికెట్లు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(90) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీ రికార్డును చహల్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: బుమ్రా 'ఓ బేబీ బౌలర్'.. దారుణంగా అవమానించిన పాక్ మాజీ ఆటగాడు -
పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం..
India vs New Zealand, 2nd T20I: న్యూజిలాండ్తో రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లక్నోలో జరిగిన ఆదివారం నాటి మ్యాచ్లో రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రమాదకర బ్యాటర్ ఫిన్ అలెన్ను నాలుగో ఓవర్లోనే పెవిలియన్కు పంపి టీమిండియాకు శుభారంభం అందించాడు. పొదుపుగా బౌలింగ్ కివీస్ ఇన్నింగ్స్లో భాగంగా చహల్ వేసిన ఈ మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అలాగే ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆరో ఓవర్లో బరిలోకి దిగిన యుజీ.. 4 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం ఆ తర్వాత చహల్ చేతికి బంతినివ్వలేదు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేయనివ్వలేదు. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హార్దిక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. చెత్త నిర్ణయం చహల్ విషయంలో కెప్టెన్ నిర్ణయం తనని ఆశ్చర్యపరిచిందన్న గౌతీ.. టీ20 ఫార్మాట్లో జట్టులో నంబర్ స్పిన్నర్గా ఉన్న బౌలర్ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించాడు. ఈ మేరకు బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మ్యాచ్ అనంతర చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘‘నాకైతే అమితాశ్చర్యం కలిగింది. ఇలాంటి వికెట్పై ఈ నిర్ణయం తీసుకోవడమెలా జరిగిందన్న ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం ఉండదు. టీ20 ఫార్మాట్లో మీకున్న నంబర్ 1 స్పిన్నర్ చహల్. అలాంటిది తనతో రెండు ఓవర్లే వేయించాడు. అప్పటికే తను ఫిన్ అలెన్ వంటి కీలక ఆటగాడిని అవుట్ చేశాడు. అయినా సరే బౌలింగ్ కోటా పూర్తి చేయనివ్వకపోవడం నాకైతే చెత్త నిర్ణయం అనిపిస్తోంది’’ అని గంభీర్.. హార్దిక్ పాండ్యాను విమర్శించాడు. హుడా విషయంలో అలా ఎలా? చహల్కు రెండు ఓవర్లు ఇవ్వడమే ఒక ఎత్తైతే.. దీపక్ హుడాతో నాలుగు ఓవర్లు వేయించడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందంటూ గంభీర్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్ లేదంటే శివం మావికి అవకాశం ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటపుడు చహల్తో మొదటి, చివరి ఓవర్లు వేయిస్తే సరి. లక్నో పిచ్పై అతడు న్యూజిలాండ్ను 80 లేదంటే 85 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. కానీ హుడాతో 4 ఓవర్లు వేయించారు. అక్కడే ట్రిక్ మిస్ అయింది’’అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఎక్కువ పరుగులు ఇచ్చింది ఎవరంటే? ఈ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా 4 ఓవర్ల బౌలింగ్లో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక అందరికంటే అత్యధికంగా పేస్ ఆల్రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టగలిగాడు. మిగతా వాళ్లలో వాషింగ్టన్ సుందర్కు ఒకటి, కుల్దీప్ యాదవ్కు ఒకటి, అర్ష్దీప్ సింగ్కు రెండు వికెట్లు దక్కాయి. ఇదిలా ఉంటే.. కివీస్తో రెండో మ్యాచ్లో ఒక వికెట్ తీసిన చహల్.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించాడు. ప్రస్తుతం 91 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. IND vs NZ: వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్కు ఏమైంది? ఇకనైనా అతడిని.. .@surya_14kumar hits the winning runs as #TeamIndia secure a 6-wicket win in Lucknow & level the #INDvNZ T20I series 1️⃣-1️⃣ Scorecard ▶️ https://t.co/p7C0QbPSJs#INDvNZ | @mastercardindia pic.twitter.com/onXTBVc2Wu — BCCI (@BCCI) January 29, 2023 -
కుల్దీప్ చెవులు పిండిన చహల్.. బెదిరించిన సిరాజ్
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో చహల్, కుల్దీప్, సిరాజ్ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చహల్ వెనుక నుంచి కుల్దీప్ చెవులను పట్టుకొని పిండగా.. ముందున్న సిరాజ్ అతనికేదో వార్నింగ్ ఇచినట్లుగా కనిపించాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే అని వీడియోలో స్పష్టంగా కనిపించింది. కానీ వీడియోలో మాత్రం కుల్దీప్ కాస్త సీరియస్గానే కనిపించినప్పటికి.. సిరాజ్, చహల్లు మాత్రం నవ్వు మొహంతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనింగ్ జోడి రోహిత్, గిల్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరు శతకాలతో విరుచుకుపడడం.. చివర్లో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 295 పరుగులకు ఆలౌట్ అయింది. డెవన్ కాన్వే శతకంతో మెరిసినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్లో 25 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. శార్దూల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీలో డబుల్ సెంచరీ,సెంచరీతో మెరిసిన గిల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. pic.twitter.com/blhqgq6QVG — LePakad7 (@AreBabaRe2) January 24, 2023 చదవండి: వన్డే, టి20ల్లో మనమే.. ఇక టెస్టులే బాకీ 'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్తో సిరీస్ అంత ఈజీ కాదు' -
'మంచి భవిష్యత్తు'.. చహల్ను టీజ్ చేసిన రోహిత్ శర్మ
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్పూర్ వేదికగా మరికొద్ది గంటల్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. సిరాజ్ ఒక్కడే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతని చలువతోనే టీమిండియా తొలి వన్డే గెలవగలిగింది. తొలి వన్డేలో ఏమాత్రం ప్రభావం చూపని శార్దూల్ ఠాకూర్ను తప్పించి ఉమ్రాన్ మాలిక్ను రెండో వన్డేలో ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ను టీజ్ చేయడం వైరల్గా మారింది. రాయ్పూర్లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్పై చహల్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో డ్రెస్సింగ్ రూమ్లో తమకు కల్పించిన సౌకర్యాల గురించి వివరించాడు. అటుపై ఆటగాళ్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ వద్దకు రాగానే చహల్.. ఎక్కడైనా హాయిగా ఉంటుందంటే అది ఇదే అంటూ మసాజ్ స్ట్రెచర్ను చూపించాడు.. దీనిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని పేర్కొన్నాడు. చహల్ వ్యాఖ్యలను గమనించిన రోహిత్ శర్మ.. ''నీకు మంచి భవిష్యత్తు ఉంది'' చహల్ అంటూ టీజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. Inside #TeamIndia's dressing room in Raipur! 👌 👌 𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF — BCCI (@BCCI) January 20, 2023 చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్బాలర్ IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’ -
మ్యాన్ ఆఫ్ మాసెస్.. జూనియర్పై టీమిండియా బౌలర్ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ పోటీలో నిలవడంతో యంగ్ టైగర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్లు సైతం టాలీవుడ్ యంగ్ టైగర్ను కలిశారు. న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆటగాళ్లు జూనియర్తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఎన్టీఆర్తో దిగిన ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చాహల్ తన ట్విటర్లో రాస్తూ..' మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచినందుకు అభినందనలు. ఇది మనమందరం గర్వపడాల్సిన సమయం.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. It was indeed a pleasure meeting the man of masses @tarak9999 What a gentleman. Congratulations on the golden globe win. We all are proud. 🇮🇳 pic.twitter.com/tw79z2YtAw — Yuzvendra Chahal (@yuzi_chahal) January 17, 2023 -
సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలకమైన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య భాయ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగల భారీ స్కోర్ సాధించింది. సూర్య భాయ్ ఇన్నింగ్స్కు చాహల్ ఫిదా ఇక సూర్య సంచలన ఇన్నింగ్స్కు భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చేతికి చాహల్ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు.. సూర్య భాయ్ ఆటకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే గౌహతి వేదికగా జనవరి 10న జరగనుంది. pic.twitter.com/NeFHhMq35d — Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023 చదవండి: AUS vs SA: వైట్వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా -
నేను ఆల్రౌండర్ని.. చహల్కు ఇక ఎప్పటికీ ఆ ఛాన్స్ రాదు!
Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్... సౌతాఫ్రికా చైనామన్ బౌలర్ తబ్రేజ్ షంసీ.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలో చహల్తో.. షంసీకి స్నేహం బలపడింది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా పరస్పరం సరదాగా మాటల యుద్ధానికి దిగడం వీరికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షంసీ... చహల్ను ఆటపట్టిస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా జనవరి 10 నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానున్న సమయం తెలిసిందే. సౌతాఫ్రికా ఆల్రౌండర్ని! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్- ముంబై ఫ్రాంఛైజీ ఎంఐ కేప్టౌన్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా రాజస్తాన్ తమ ట్విటర్లో షంసీ వీడియోను షేర్ చేసింది. ఇందులో షంసీ చహల్ను ఉద్దేశించి.. ‘‘హెలో యుజీ.. సౌతాఫ్రికా నుంచి నేను.. ఆల్రౌండర్ను మాట్లాడుతున్నా.. అది సరేగానీ.. నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్ ఆర్డర్లో నా కంటే ముందు స్థానంలో ఎప్పుడూ రాలేవు.. ఎప్పుడూ అంటే ఎప్పుడూ కూడా నీకు ఆ అవకాశం రాదు’’ అంటూ ఆటపట్టించాడు. ఇక సోషల్ మీడియాలో తనదైన పంచులతో చెలరేగే చహల్.. ‘‘అది సరేగానీ.. నీ టమ్మీ(పొట్ట) గురించి కాస్త చెప్పు బ్రో’’ అంటూ కౌంటర్ వేశాడు. కాగా చహల్ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నాడు. గతంలో రాజస్తాన్కు ఆడిన షంసీ.. ఈసారి వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, సౌతాఫ్రికా టీ20లీగ్లో మాత్రం ఈ స్పిన్నర్ రాజస్తాన్ పర్ల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు.. What about your tummy my bru 😂😂 @shamsi90 — Yuzvendra Chahal (@yuzi_chahal) January 7, 2023 -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో విఫలమైన శుభ్మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
Ind Vs SL: భువీ రికార్డుకు ఎసరు పెట్టిన చహల్! అదే జరిగితే..
India Vs Sri Lanka 1st T20: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. శ్రీలంకతో మంగళవారం మొదలు కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టీ20 తుదిజట్టులో చహల్కు చోటు ఖాయంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు వాంఖడే మ్యాచ్లో నాలుగు వికెట్లు తీస్తే.. తోటి బౌలర్, టీమిండియా సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు బద్దలు కొట్టే వీలుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్గా భువీ కొనసాగుతున్నాడు. భువీ రికార్డు బద్దలు! ఇప్పటి వరకు మొత్తంగా పొట్టి క్రికెట్లో పేసర్ భువీ ఆడిన 87 మ్యాచ్లలో 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. స్పిన్నర్ చహల్.. 71 మ్యాచ్లలో 87 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో స్వదేశంలో సిరీస్కు భువీని సెలక్టర్లు పక్కనపెట్టగా.. చహల్కు మాత్రం జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో రాణిస్తే చహల్.. భువీ పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉంది. టాప్-5లో ఉన్నది వీళ్లే కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీ20 సిరీస్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో పాండ్యా టాప్-5లో ఉండటం విశేషం. భువీ 90, చహల్ 87, అశ్విన్ 72, జస్ప్రీత్ బుమ్రా 70 వికెట్లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా -
మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. బంగ్లాదేశ్తో రెండో వన్డేలో అనముల్ హక్ ఔట్ చేసిన సిరాజ్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 23 వికెట్లు సాధించాడు. ఇక అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 14 మ్యాచ్లు ఆడిన చాహల్ 21 వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన మెహాదీ హసన్ ఇక కీలకమైన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. కేవలం 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను మహ్మదుల్లా, మెహాదీ హసన్ అదుకున్నారు. ఏడో వికెట్కు వీరిద్దరూ కలిసి 147 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్లో మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా మెహాదీ హసన్ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోకు ఘోర అవమానం? పాపం.. బెంచ్ మీద కూర్చుని నిర్లిప్తతతో.. సిగ్గుచేటు అంటూ.. -
'అతడు అద్భుతమైన బౌలర్.. న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు'
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో తొలి టీ20లో శుక్రవారం టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్ భారత బౌలింగ్ విభాగంపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో భారత బౌలింగ్ ఎటాక్లో లెగ్స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కీలకపాత్ర పోషిస్తాడని ఫిలిఫ్స్ అభిప్రాయపడ్డాడు. విలేకరుల సమావేశంలో ఫిలిప్స్ మాట్లాడూతూ.. "టీ20 క్రికెట్లో ప్రతీ జట్టు సరైన లెగ్ స్పిన్నర్ కోసం వెతుకుతోంది. మా జట్టుకు ఇష్ సోధి రూపంలో మ్యాచ్ విన్నింగ్ లెగ్స్పిన్నర్ ఉన్నాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్ రషీద్ ఖాన్ రూపంలో అద్భుతమైన లెగ్గీ ఉన్నాడు. లెగ్ స్పిన్నర్లు మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక టీమిండియాకు కూడా చాహల్ రూపంలో అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ ఉన్నాడు. అతడు ఈ సిరీస్లో మా బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని నేను భావిస్తున్నారు. అదే విధంగా భారత్ బౌలింగ్ ఎటాక్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అతడికి 'స్కై' స్టేడియం వంటి చతురస్రకార మైదానంలో బంతిని రెండు వైపులా టర్న్ చేసే సత్తా ఉంది. అతడి బౌలింగ్లో బంతి ఎటువైపు వెళుతుందో అంచనా వేయడం చాలా కష్టం" అని అతడు పేర్కొన్నాడు. టీ20 సిరీస్కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్తో తొలి టీ20 కష్టమే! -
Kul-Cha ReUnite: ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసి ఎన్నాళ్లయిందో..
టి20 ప్రపంచకప్లో సెమీస్ ఓటమి అనంతరం స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. ఆ వెంటనే మరో సిరీస్కు సన్నద్ధమైంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. న్యూజిలాండ్తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా టి20 జట్టుకు పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. వన్డే జట్టును సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. కాగా నవంబర్ 18న కివీస్, టీమిండియాలు తొలి టి20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వతహాగా లెగ్స్పిన్నర్ అయిన చహల్.. తన పార్టనర్.. మరో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఎన్నాళ్లయింది భయ్యా ఇద్దరం కలిసి అంటూ ట్యాగ్ జత చేశాడు. కుల్దీప్ యాదవ్ సంగతి పక్కనబెడితే.. యజ్వేంద్ర చహల్ టి20 ప్రపంచకప్కు లెగ్ స్పిన్నర్గా ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేకపోయాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆదిల్ రషీద్ లాంటి లెగ్ స్పిన్నర్ వికెట్ల పంట పండిస్తుంటే టీమిండియా మాత్రం చహల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. జట్టుకు ఇది మైనస్గా మారిందని చెప్పొచ్చు. సెమీస్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో చహల్ను ఆడించాల్సిందని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక చహల్, కుల్దీప్ యాదవ్లు ధోని, కోహ్లిలు కెప్టెన్గా ఉన్న సమయంలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరి జోడి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడమే గాక వికెట్లు తీస్తూ కీలక సమయాల్లో ఒత్తడి పెంచేవారు. కానీ రోహిత్ కెప్టెన్గా ఎంపికయిన తర్వాత చహల్, కుల్దీప్లు జట్టుకు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. మరి తాజాగా న్యూజిలాండ్తో టి20, వన్డే సిరీస్లలోనైనా వీరిద్దరు రాణిస్తారని ఆశిద్దాం. Kya haal hai 😂 @imkuldeep18 ❤️ pic.twitter.com/3Qf2cCosnK — Yuzvendra Chahal (@yuzi_chahal) November 16, 2022 చదవండి: FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్ ఫుట్బాల్ చరిత్ర '2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి' -
చాహల్ ఏమైనా టూర్కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్లోనైనా!
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో భారత జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ చేధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్కు ఎంపికైన మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ను కేవలం బెంచ్కే పరిమితం చేశారు. కాగా ఈ ప్రపంచకప్లో హసరంగా, అదిల్ రషీద్, జంపా, రషీద్ ఖాన్ వంటి మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కాగా స్పిన్నర్లగా భారత జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్, అక్షర్ పటేల్ తీవ్ర నిరాశ పరిచారు. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో 4 ఓవర్లలో అక్షర్ పటేల్ 30 పరుగులు ఇవ్వగా.. అశ్విన్ రెండు ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు . ఈ క్రమంలో కేవలం ఒక్క మ్యాచ్లో కూడా చాహల్కు అవకాశం ఇవ్వకపోవడంతో భారత జట్టు మేనేజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చాహల్ ఏమైనా టూర్కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. కాగా టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా చాహల్ ఉన్న సంగతి తెలిసిందే. A friendly reminder that Yuzvendra Chahal has never bowled a single ball in a T20 World Cup. pic.twitter.com/QBX2vun2rP — Broken Cricket Dreams Cricket Blog (@cricket_broken) November 10, 2022 చదవండి: Virat Kohli: కోహ్లి బాధ వర్ణణాతీతం.. ఒకప్పుడు కెప్టెన్గా; ఇప్పుడు ఆటగాడిగా -
ఇంగ్లండ్తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు. వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
ఓయ్ చహల్.. ఏంటా పని?
ఆట అన్నాకా కాస్త కళా, పోషణ ఉంటేనే మజాగా ఉంటుంది. ఎప్పుడు సీరియస్గా ఆడితే పెద్దగా కిక్ ఉండదు. అందుకే క్రికెట్ సహా ఇతర ఏ ఆటలైనా.. గొడవలు, సరదా సంఘటనలు లేకుండా చప్పగా సాగితే బోర్ కొట్టేస్తుంది. ఇక టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తన తుంటరితనాన్ని మరోసారి బయటపెట్టాడు. చహల్ ఫ్రేమ్లో ఉన్నాడంటే చాలు ఏదో ఒక చర్యతో నవ్వులు పూయిస్తుంటాడు. తాజాగా సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య జరిగిన రెండో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీని చహల్ వెనుక నుంచి వచ్చి తన్నడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ రెండో ఓవర్ ముగిసిన తర్వాత క్రీజులో ఉన్న డికాక్, మార్క్రమ్లకు డ్రింక్స్ అందించడానికి తబ్రెయిజ్ షంసీ వచ్చాడు. మార్క్రమ్, డికాక్లతో కీపర్ పంత్ ముచ్చటిస్తున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన చహల్.. వెనుక నుంచి షంసీని తన్నాడు. దీంతో పక్కనే ఉన్న డికాక్, మార్క్రమ్, పంత్లు నవ్వాపుకోలేకపోయారు. వెంటనే వెనక్కి తిరిగిన షంసీ.. ఓయ్ చహల్ ఏంటా పని అన్నట్లుగా పేర్కొన్నాడు. మ్యాచ్ తిరిగి ఆరంభం కావడంతో ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇక లెగ్ స్పిన్నర్లైన చహల్, షంసీలు ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. చహల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ రాగా.. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ స్థానంలో లుంగీ ఎన్గిడి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 237 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో టీమిండియాను వణికించినప్పటికి.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ప్రొటిస్కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను గెలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టి20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4న జరగనుంది. Yuzi bhai 😂#INDvSA #CricketTwitter pic.twitter.com/CTkXqpw2A5 — ...... (@Brahman_Kuldip) October 2, 2022 చదవండి: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి! స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర.. -
రూమర్లకు చెక్! అందమైన వీడియో షేర్ చేసిన టీమిండియా క్రికెటర్!
Yuzvendra Chahal- Dhanashree Verma Video Viral: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తన భార్య ధనశ్రీ వర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘అత్యంత శక్తిమంతమైన మహిళ.. తనే నా బలం’’ అంటూ సతీమణితో గడిపిన అందమైన క్షణాల తాలూకు దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ‘రూమర్లకు పర్ఫెక్ట్ చెక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడిపోతున్నారంటూ వదంతులు! కాగా టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ ఒంటరిగా హాజరైన నేపథ్యంలో చహల్తో ఆమెకు విభేదాలంటూ వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో దిగిన ఫొటో కారణంగా ధనశ్రీపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. చహల్- ధనశ్రీ విడిపోబోతున్నారంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. అందమైన వీడియోతో ముందుకు వచ్చిన చహల్! ఈ నేపథ్యంలో చహల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఇలాంటివి నమ్మవద్దని ఈ భారత బౌలర్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా మరోసారి.. వదంతులు వ్యాప్తి చేసిన వారికి కౌంటర్గా భార్యతో కలిసి ఉన్న వీడియోను పంచుకున్నాడు. ఇక షేర్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైక్ సాధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా చహల్ టీ20 వరల్డ్కప్-2022కు ఎంపికైన విషయం తెలిసిందే. అంతకంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్లో భాగం కానున్నాడు. సెప్టెంబరు 20 నుంచి ఆసీస్తో ఆరంభం కానున్న టీ20 సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు చహల్. ఇదిలా ఉంటే.. ధనశ్రీ వర్మ యూట్యూబర్గా, కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నారు. వీరి వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగింది. చదవండి: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న శాంసన్ ఫ్యాన్స్.. ఎప్పుడంటే? T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
చహల్ను ముద్దు పెట్టుకున్న విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా ఈ మ్యాచ్లో కూడా భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్లు పర్వాలేదన్పించిన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. కాగా శ్రీలంక కోల్పోయిన ఆ నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లు పడగొట్టినవే. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన యజువేంద్ర చాహల్ వరుసగా నిసంకా(52), ఆసలంక(0)ను పెవిలియన్కు పంపాడు. అదే విధంగా మళ్లీ 15 ఓవర్ వేసిన చాహల్ మంచి ఊపు మీద ఉన్న కుశాల్ మెండిస్(57)ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. చాహల్ను ముద్దుపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి డకౌట్గా వెనుదిరిగడం గమనార్హం. #ViratKohli kisses #YuzvendraChahal #INDvsSL pic.twitter.com/5XHuQjfHCf — Cricket fan (@Cricket58214082) September 6, 2022 చదవండి: Asia Cup 2022: 'నీ కీపింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్' -
'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో కీలక పోరుకు సిద్దమైంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియా తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్కు ఎదురైన పరాజయం .. ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది. భారత్ ఫైనల్కు చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇక శ్రీలంకతో డూ ఆర్డై మ్యాచ్కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. దారుణంగా విఫలమవుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అవేశ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. అదే విధంగా భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అతడు తెలిపాడు. చాహల్ను పక్కన పెట్టి అవేష్ ఖాన్కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అదే విధంగా రవి బిష్ణోయ్కు ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలి. అతడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో చాహల్ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం అసన్నమైంది అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో బిష్ణోయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చాహల్ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. శ్రీలంకతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్కు చాన్స్ ఉందా? -
మొన్న చహల్ అలా.. ఇప్పుడు ధనశ్రీ ఇన్స్టా పోస్టుతో ఇలా! మరోసారి వైరల్..
Yuzvendra Chahal Wife Dhanashree Verma Post Goes Viral: ‘‘గత 14 రోజులుగా నేను విశ్రాంతి తీసుకుంటున్నా. ఓ రీల్ కోసం డాన్స్ చేస్తున్న సమయంలో మోకాలికి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి రెస్ట్. కోలుకునే క్రమంలో గాఢమైన నిద్ర.. కళ్లు తెరిచి చూడగానే ఎంతో ఉపశమనం.. అంతే ఆత్మవిశ్వాసం కూడా! ఈ గాయం కారణంగా ఇంటికే పరిమితమయ్యాను. బెడ్ నుంచి సోఫా.. సోఫా నుంచి బెడ్ మీదకు అంతే! ఇంత త్వరగా కోలుకునేందుకు నా భర్త, బంధు మిత్రులు, శ్రేయోలాభిలాషులు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. నేను మళ్లీ డాన్స్ చేయగలననే అనుకుంటున్నా. కానీ.. ఇలాంటి షాకింగ్ న్యూస్ను నేను జీర్ణించుకోలేకపోతున్నా. నాకు ఎప్పుడైతే విశ్రాంతి అవసరమో అప్పుడే ఇలాంటి న్యూస్తో కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఇది నిజంగా విద్వేషపూరితమైనది. ఇవన్నీ విని నా మనసు ఎంతగానో గాయపడింది’’ అని టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు. కొంతకాలంగా వార్తల్లో చహల్ దంపతులు కాగా గత కొంతకాలంగా చహల్, ధనశ్రీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ధనశ్రీ.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో దిగిన ఫొటో, ఇన్స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించిన నేపథ్యంలో వీరిద్దరు విడిపోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై స్పందించిన యుజీ.. దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు భర్త షేర్ చేసిన ఇన్స్టా స్టోరీతో ధనశ్రీ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సొంతంగా ఎదిగి ఈ స్థాయికి.. అయితే, ఆదివారం తాజాగా మరో సుదీర్ఘ పోస్టుతో ముందుకు వచ్చారు. తాను సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానన్న ధనశ్రీ.. ఇలాంటి నిరాధార వార్తలు, ఇలాంటి గాయలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే, ఇలాంటి గడ్డు పరిస్థితులు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని పేర్కొన్నారు. పబ్లిక్ లైఫ్లో ఉన్న కారణంగా ఒక్కోసారి ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసనన్న ధనశ్రీ.. తాను మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోనని తేల్చి చెప్పారు. నువ్వు నా దానివి! తద్వారా తన భర్తకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టతనిచ్చారు. ఇక ధనశ్రీ పోస్టుకు స్పందించిన చహల్.. ‘‘మై వుమన్(నీవు నా దానివి అన్న అర్థంలో)’’ అంటూ హార్ట్ ఎమోజీతో భార్యపై ప్రేమను చాటుకున్నాడు. నీకు ఏ దిష్టి తగలకూడదు అన్నట్లు మరో ఎమోజీని జతచేశాడు. ధనశ్రీ ఇన్స్టా పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా డాక్టర్ అయిన ధనశ్రీ వర్మ.. కొరియోగ్రాఫర్గా, యూట్యూబర్గా రాణిస్తున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆమె దగ్గర డాన్స్ నేర్చుకున్న చహల్.. 2020లో ధనశ్రీని వివాహమాడాడు. ఇక కెరీర్ విషయానికొస్తే చహల్ ప్రస్తుతం ఆసియా కప్-2022 టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే! టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్! View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
మొన్న ఆ క్రికెటర్తో ఫొటో! ఇంటి పేరు తొలగించిన చహల్ భార్య! విడిపోబోతున్నారంటూ..
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడా? భార్య ధనశ్రీ వర్మతో అతడి అనుబంధం బాగానే ఉందా? లేదా అభిప్రాయభేదాలేమైనా తలెత్తాయా? లేదంటే విషయం ఇంకేదైనా ఉందా అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. కెరీర్లో మెరుగైన దశలో ఉన్న చహల్ పర్సనల్ లైఫ్లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నాడా అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో చహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. కెరీర్లో ఎత్తుపళ్లాలు! కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్- 2021 టోర్నీలో ఆడిన భారత జట్టులో చహల్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తాను సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు అతడిని వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ యుజీని కొనుగోలు చేసి అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో తన సత్తా ఏమిటో నిరూపించుకున్న ఈ లెగ్ స్పిన్నర్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో జట్టును రెండోసారి ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 17 ఇన్నింగ్స్లో 27 వికెట్లు పడగొట్టి తాజా ఎడిషన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన చహల్ వరుస విజయాల్లో భాగమయ్యాడు. తిరిగి పూర్వ వైభవం పొంది ప్రతిష్టాత్మక ఆసియాకప్-2022 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతున్న చహల్ వ్యక్తిగత జీవితం గురించి వదంతులు గుప్పుమంటున్నాయి. సూర్య పార్టీలో అతడితో ఫొటో దిగిన ధనశ్రీ! చహల్ భార్య ధనశ్రీ వర్మ ఎల్లవేళలా అతడి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తమ అనుబంధాన్ని చాటేలా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంది కూడా! అయితే, టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఇచ్చిన పార్టీకి ధనశ్రీ వెళ్లింది. అక్కడ సూర్య- దేవిషా శెట్టి దంపతులతో పాటు శ్రేయస్ అయ్యర్తో కలిసి ఫొటో దిగింది. ఈ పార్టీలో చహల్ మిస్సయ్యాడు. ఇక ఈ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన సూర్య దంపతులు నిన్ను మేము ఏమాత్రం మిస్సవడం లేదు చహల్.. సారీ అంటూ టీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కొంతమంది చహల్- ధనశ్రీ- శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి విపరీతపు కామెంట్లు చేశారు. చహల్ పని అయిపోయిందని.. ధనశ్రీ శ్రేయస్తో చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొడుతున్న తీరే ఇందుకు నిదర్శనమంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు. టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్కు మురళీ విజయ్ పట్టించిన గతే చహల్కు కూడా పట్టబోతుందంటూ ట్రోల్ చేశారు. కాగా పెళ్లి అయిన తర్వాత తన ఇన్స్టా అకౌంట్లో ధనశ్రీ వర్మ.. చహల్ ఇంటిపేరును చేర్చుకుంది. అయితే, తాజాగా తన ఇన్స్టా బయోలో ఆ పేరు తొలగించిందామె. దీంతో వదంతులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో చహల్- ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఇందుకు ఓ టీమిండియా క్రికెటరే కారణమంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ లైఫ్ లోడింగ్(కొత్త జీవితం ఆరంభం కాబోతుంది) అంటూ చహల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ‘‘అంతా బాగానే ఉందా.. లేదంటే వదంతులే నిజం కాబోతున్నాయా’’ అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. ‘‘ వాళ్లు కలిసింది రక్షాబంధన్ రోజు. తప్పుగా అర్థం చేసుకోకండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. ఇంకొందరు.. ధనశ్రీ తనకు తానుగా ఎదిగిన వ్యక్తి అని.. ఈ డాన్సింగ్ యూట్యూబర్ భర్త ఇంటి పేరు తొలగించినంత మాత్రాన విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరేమో త్వరలోనే వారి జీవితాల్లోకి బుజ్జాయి రాబోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మురళీ విజయ్తో బంధం పెంచుకున్న దినేశ్ కార్తిక్ భార్య.. భర్తకు విడాకులు ఇచ్చి అతడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక ఒకరినొకరు ఇష్టపడ్డ యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ 2020, డిసెంబరు 22న అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. చదవండి: తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్.. Instagram story of Yuzi chahal 👀 pic.twitter.com/HjQSBraLCH — Mufaddal Vohra (@mufaddol_vohra) August 16, 2022 Surya's story pic.twitter.com/oOa6UJxRCJ — 𝙨𝙝𝙧𝙚𝙮𝙖 (@jaanekyabaathai) August 13, 2022 -
IND Vs WI 3rd ODI: విండీస్పై భారత్ గెలుపు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్తో వన్డే సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా... కుర్రాళ్లు సత్తా చాటడంతో విండీస్ను 3–0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. రెండు హోరాహోరీ వన్డేల తర్వాత చివరి పోరులో ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 119 పరుగుల భారీ తేడాతో (డక్వర్త్–లూయిస్ ప్రకారం) విండీస్ను చిత్తు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను కుదించారు. ముందుగా భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (98 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ శిఖర్ ధావన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం డక్వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అయితే విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెండన్ కింగ్ (37 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. సిరాజ్ తన తొలి ఓవర్లోనే మేయర్స్ (0), బ్రూక్స్ (0)లను అవుట్ చేయడంతో ‘సున్నా’కే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. యజువేంద్ర చహల్ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... సిరాజ్, శార్దుల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్లలో వరుసగా 64, 43, 98 నాటౌట్ (మొత్తం 205) పరుగులు చేసిన శుబ్మన్ గిల్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. విండీస్ గడ్డపై ఆ జట్టును వన్డేల్లో భారత్ క్లీన్స్వీప్ చేయడం ఇదే తొలిసారి. -
టీమిండియా తొలి బౌలర్గా ఆ ఘనత చహల్దే! నేను నీ వీరాభిమానిని!
Dhanashree Verma Birthday Post For Chahal Melts Hearts: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ పుట్టినరోజు నేడు(జూలై 23). శనివారం అతడు 32వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చహల్కు సోషల్ మీడియా వేదికా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చహల్ భార్య ధనశ్రీ భర్తతో దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జీవితమనే ప్రయాణంలో ఎన్నెన్నో అందమైన మలుపులు. నువ్వు మంచివాడివి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నేను నీకు వీరాభిమానిని’’ అంటూ విషెస్ తెలిపింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) ఇక బీసీసీఐ సైతం.. ‘‘127 అంతర్జాతీయ మ్యాచ్లు.. 192 ఇంటర్నేషనల్ వికెట్లు.. పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్.. టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి టీమిండియా బౌలర్’’ అంటూ చహల్ ప్రతిభను కొనియాడుతూ ఈ లెగ్ స్పిన్నర్ను విష్ చేసింది. 127 international games 👌 192 international wickets 💪 Fastest Indian bowler (in Men's cricket) to scalp 50 T20I wickets 👍 1st Indian bowler (in Men's cricket) to take a 5-wicket haul in T20Is 🔝 Here's wishing #TeamIndia leg-spinner @yuzi_chahal a very happy birthday. 🎂👏 pic.twitter.com/aGtBAyFP0q — BCCI (@BCCI) July 23, 2022 అదే విధంగా.. టీమిండియా క్రికెటర్లు దినేశ్ కార్తిక్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ సహా రాబిన్ ఊతప్ప, ఆర్పీ సింగ్ తదితరులు చహల్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. జింబాబ్వేతో మ్యాచ్తో... 1990 జూలై 23న హర్యానాలోని జింద్లో చహల్ జన్మించాడు. 19 ఏళ్ల వయసులో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగ్రేటం చేసిన ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2011లో ముంబై ఇండియన్స్ తరఫున క్యాష్ రిచ్లీగ్లో ఎంట్రీతో అతడు వెలుగులోకి వచ్చాడు. అయితే, ముంబై ఫ్రాంఛైజీ అతడికి ఎక్కువ ఛాన్స్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో 2014లో వేలంలోకి వచ్చిన చహల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి తనను తాను నిరూపించుకునే అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుని ఆర్సీబీలో కీలక బౌలర్గా ఎదిగాడు. ఈ క్రమంలో 2016లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20ల్లోనూ జింబాబ్వేతో సిరీస్లో పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో ఆడిన 127 మ్యాచ్లలో చహల్ 192 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన చహల్ భాయ్...27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఇక ప్రస్తుతం అతడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం నాటి మొదటి వన్డేలో చహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 ఇక యూట్యూబర్ ధనశ్రీ వర్మతో 2020లో చహల్ వివాహం జరిగింది. ఆమె ఎప్పటికప్పుడు తన, భర్త కెరీర్కు సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! -
Ind Vs WI: అతడికి బ్రేక్ ఇవ్వకండి.. ఆడనివ్వండి: టీమిండియా మాజీ క్రికెటర్
India Vs West Indies T20 Series 2022: వెస్టిండీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. అతడిని సిరీస్కు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2021 భారత జట్టులో చోటు దక్కించుకోలేక పోయిన చహల్.. ఐపీఎల్-2022లో మాత్రం అదరగొట్టాడు. తాజా ఎడిషన్లో తొలిసారిగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 17 ఇన్నింగ్స్లో కలిపి 27 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. రాజస్తాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకున్న చహల్.. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్కు ఎంపికయ్యాడు. టీ20 సిరీస్ ఆడాడు. అదే విధంగా ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. అయితే, విండీస్తో పొట్టి ఫార్మాట్ సిరీస్కు మాత్రం చహల్ను సెలక్టర్లు పక్కనపెట్టారు. బ్రేక్ ఇవ్వడం ఎందుకు? ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘యుజీ చహల్.. నాకు తెలిసీ.. 2021, 2022లో టీమిండియా తరఫున మొత్తం 17 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, తనకు బ్రేక్ ఇవ్వడం మాత్రం సరికాదు. తను ఇంకా క్రికెట్ ఆడగలడు. ఇప్పుడే విశ్రాంతి అవసరం లేదు. ఫామ్లో ఉన్నపుడు వరుస మ్యాచ్లు ఆడితే లయ కోల్పోకుండా ఉంటాడు కదా! నిజమే.. తను ఐపీఎల్-2022లో అన్ని మ్యాచ్లు ఆడాడు. కానీ బ్రేక్ తీసుకునేంత అవసరమైతే లేదనుకుంటా. ఒకవేళ గాయపడితే తప్ప అతడు రెస్ట్ అడిగే అవసరమే లేదు. అయినా చహల్ బ్రేక్ అడిగాడా.. సెలక్టర్లు విశ్రాంతినిచ్చారా అన్న అంశంలో నిజానిజాలేమిటో మనకు తెలియదు కాబట్టి ఓ అంచనాకు రాలేము’’ అని పేర్కొన్నాడు. ఇక చహల్ను ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడించారన్న ఆకాశ్ చోప్రా.. ఇంగ్లండ్తో ఓ రెండు మ్యాచ్లు ఆడించిన తర్వాత విండీస్ టూర్కు పక్కనపెట్టడం సరికాదన్నాడు. వన్డేలతో పాటు టీ20 సిరీస్కు కూడా చహల్ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా వెస్టిండీస్తో టీ20 సిరీస్కు సెలక్టర్లు చహల్ను కాకుండా రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేశారు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
'చాహల్ ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది'
మూడో టీ20కు ముందు యజువేంద్ర చాహల్ ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తెలిపాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన చాహల్.. ఏకంగా 75 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆకాష్ చోప్రా.. ఈ సిరీస్లో భారత జట్టులో లోపాలను ఎత్తి చూపాడు. "మిడిల్ ఓవర్లలో భారత్ వికెట్లు తీయకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. అనుభవం ఉన్న యుజ్వేంద్ర చాహల్ వంటి బౌలర్ కూడా విఫలవమవుతన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్కు అతడు ఎంపిక కానప్పుడు చాలా మంది సెలెక్టర్లపై విమర్శలు వర్షం గుప్పించారు. కానీ నిజం ఏమిటంటే అతడు అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారీగా పరుగులు సమర్పించకుంటున్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్కు అతడిని ఎంపిక చేయలేదు. ఇక కటక్ టీ20లో పవర్ప్లేలో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మిడిల్ ఓవర్లలో మిగతా బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించారు. స్పిన్నర్లు తీవ్రంగా విఫలమయ్యారు. చాహల్, అక్షర్ పటేల్ తలా వికెట్ మాత్రమే సాధించారు. మిడిల్ ఓవర్లలో బౌలర్లు రాణిస్తానే జట్టు విజయం సాధిస్తుంది" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..! -
ఐపీఎల్ చరిత్రలో యజ్వేంద్ర చహల్ సరికొత్త రికార్డు
రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్ సీజన్లో స్పిన్నర్గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చహల్ అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ పోరులో హార్దిక్ పాండ్యాను ఔట్ చేయడం ద్వారా ఈ సీజన్లో చహల్ 27వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సూపర్ ఫామ్తో దూసుకెళ్తున్న చహల్ ఓవరాల్గా 17 మ్యాచ్ల్లో 7.75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఇమ్రాన్ తాహిర్(26 వికెట్లు) రికార్డును బ్రేక్ చేసిన చహల్ తొలి స్థానానికి దూసుకెళ్లాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్ తాహిర్ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగా కూడా 26 వికెట్లతో తాహిర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ 2012లో కేకేఆర్ తరపున స్పిన్నర్గా 24 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్ తరపున హర్భజన్ 24 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: ఓవర్ యాక్షన్ అనిపించే రియాన్ పరాగ్ ఖాతాలో అరుదైన రికార్డు -
'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి'
ఐపీఎల్-2022లో తొలి క్వాలిఫైయర్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు రాజస్తాన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్.. లెజెండరీ లెగ్-స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో వార్న్ మరణించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్లో నాకు ఇది మొదటి సీజన్. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. "నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది. నేను ఇక్కడ చాలా రిలాక్స్గా ఉన్నాను. నాతో ఆడే జట్టు సభ్యులే కాకుండా మేనేజ్మెంట్ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. మరోవైపు వార్న్ సార్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతను తొలి ఐపీఎల్ ఛాంపియన్గా ఉన్నారు. ఆదే విధంగా అతని ఆశీస్సులు నాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అతను నన్ను పై నుంచి చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది" అని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Nikhat Zareen: ఒలంపిక్ పతకం సాధిస్తా.. రెట్టింపు కృషి ఉంటేనే.. అందుకోసం! -
ఐపీఎల్ చరిత్రలో చహల్ అరుదైన ఫీట్
రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న చహల్ ఒక సీజన్లో స్పిన్నర్గా అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ఇమ్రాన్ తాహిర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకు చహల్ 14 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ధోనిని ఔట్ చేయడం ద్వారా సీజన్లో 26వ వికెట్ను ఖతాలో వేసుకున్నాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్ తాహిర్ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. తాజాగా చహల్ తాహిర్తో సమానంగా నిలిచినప్పటికి.. మరో రెండు మ్యాచ్లు ఉండడంతో తొలి స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగా 24 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ 2012లో కేకేఆర్ తరపున స్పిన్నర్గా 24 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్ తరపున హర్భజన్ 24 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక చహల్ తన కెరీర్లోనే బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఒకే మ్యాచ్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో చహల్ చోటు సంపాదించాడు. టి20 ప్రపంచకప్ 2022 టార్గెట్గా కసిగా ఆడతున్న చహల్ను రూ. 6.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. తన ధరకు న్యాయం చేస్తున్న చహల్ రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2008 తర్వాత సూపర్ఫామ్లో కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ఎలాగైనా కప్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. మే 24న గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్లనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. చదవండి: Ravi Shastri: 'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతుంది' Yashasvi Jaiswal: 'బట్లర్, శాంసన్ల కంటే బెటర్గా కనిపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాజస్తాన్ రాయల్స్ తరపున యజ్వేంద్ర చహల్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోరాజస్తాన్ ఓడినప్పటికి చహల్ మాత్రం ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా చహల్ నిలిచాడు. ఈ సీజన్లో చహల్ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున ఇదే అత్యుత్తమం. ఇక తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్ 28 వికెట్లతో దుమ్మురేపాడు. లీగ్లో రాజస్తాన్కు మరో రెండు మ్యాచ్లు మిగిలిఉండడం.. ఆ తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్లు ఉండడంతో చహల్ ఫాల్కనర్ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్ తన్వీర్(22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. 2020 సీజన్లో జోఫ్రా ఆర్చర్(20 వికెట్లు), 2019లో శ్రేయాస్ గోపాల్(20 వికెట్లు) సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నారు. చదవండి: IPL 2022: వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది -
వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే వార్నర్ అదృష్టం రాజస్తాన్ రాయల్స్ కొంపముంచినట్లయింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ యజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ వేసిన బంతి వార్నర్ బ్యాట్ను దాటి ఆఫ్స్టంప్ను తాకుతూ వెళ్లిపోయింది. వికెట్ దక్కిందనుకున్న చహల్ ఆనందం అంతలోనే ఆవిరైంది. PC: IPL Twitter బంతి నెమ్మదిగా తాకడంతో లైట్స్ వెలిగినా... బెయిల్ మాత్రం పడలేదు. దాంతో వార్నర్ నాటౌట్గా తేలాడు. ఒకవేళ ఆ బెయిల్ కిందపడి వార్నర్ ఔట్ అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికి వార్నర్ 22 పరుగులు మాత్రమే చేశాడు. మార్ష్ దాటిగా ఆడుతున్నప్పటికి.. మంచి భాగస్వామ్యం ఏర్పడిన దశలో వార్నర్ ఔట్ అయ్యుంటే రాజస్తాన్కు కలిసొచ్చేదే. కానీ విజయం ఢిల్లీకే రాసిపెట్టినట్లుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్లు), డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. వార్నర్ వీడియో కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా! -
IPL 2022: వారెవ్వా చహల్.. మూడు వికెట్లు.. అద్భుత రికార్డు!
IPL 2022 PBKS Vs RR- Yuzvendra Chahal Record: ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్. రిటెన్షన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేయగా వేలంలోకి వచ్చాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ పోటీ పడి మరీ ఆరున్నర కోట్లు వెచ్చించి చహల్ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2022లో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్న చహల్ భాయ్ పంజాబ్ కింగ్స్తో శనివారం(మే 7) నాటి మ్యాచ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. 2019లో 20 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్న శ్రేయస్ గోపాల్ను అధిగమించాడు. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా జానీ బెయిర్ స్టో వికెట్ తన ఖాతాలో వేసుకుని ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా తాజా ఎడిషన్లో చహల్ ఇప్పటి వరకు 22 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్లో కొనసాగుతున్నాడు. ఇక పంజాబ్తో మ్యాచ్లో చహల్ 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చహల్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో చహల్పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్.. ‘‘ఇతడు చాలా బాగా ఆడుతున్నాడు. టూ గుడ్’’ అంటూ కొనియాడాడు. చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వారిద్దరూ అద్భుతమైన స్పిన్నర్లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి'
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్ధీప్ యాదవ్ అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ 10 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న కుల్ధీప్ యాదవ్ 18 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచించాడు. కొన్నాళ్ల పాటు భారత తరుపున చాహల్, అత్యత్తుమంగా రాణించారు. కాగా 2019 ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ ఫామ్ను కోల్పోయారు. తరువాత కొన్ని మ్యాచ్లకు జట్టుకు దూరమయ్యారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 కు కూడా వీరిద్దకి చోటు దక్కలేదు. అయితే 'కుల్-చా' ద్వయం మళ్లీ తిరిగి ఫామ్లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. "టీమిండియా తరపున అద్భతంగా రాణించిన కుల్ధీప్,చహల్ భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో నాకు తెలియదు. అయితే ప్రస్తుతం 'కుల్-చా' ద్వయాన్ని ఖచ్చితంగా మళ్లీ జట్టులోకి తీసుకురావాలి. వారిద్దరూ కలిసి భారత్ తరపున ఆడినప్పుడు.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టేవారు. టీ20, వన్డేల్లో భారత జట్టుకు చాలా విజయాలు అందించారు. కాబట్టి వీరిద్దరూ టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో భాగం కావాలి" అని "డ్రీమ్ సెట్ గో" ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ జరగనున్న ఆస్ట్రేలియాలో పిచ్లు పెద్దగా స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. అంతేకాకుండా రవీంద్ర జడేజా వంటి స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో వీరిద్దరికి భారత జట్టులో మరి చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: IPL 2022: 'కోల్కతా మ్యాచ్లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్' -
చహల్తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అంచనాలకు మంచి భాగానే రాణిస్తోంది. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటే.. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ 19 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ ఇద్దరు కలిసి డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే పాటకు ఇరగదీశారు. బట్లర్ స్లో మూమెంట్స్తో క్యూట్గా చేయగా.. చహల్ మాత్రం మాస్ డ్యాన్స్ చూపించాడు. ఇక ఈ పాటకు కొరియోగాఫ్రర్ ఎవరో తెలుసా.. చహల్ భార్య.. యూట్యూబర్ ధనశ్రీ వర్మ. ‘నా మోస్ట్ ఫెవరెట్ రీల్... మై ఫెవరెట్స్... లవ్’ అంటూ ధనశ్రీ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే... వేరే ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. Jos & Yuzi. Together. Dancing to Balle ni Balle. 😍💗 Is this the best collab of the season? 👀 #RoyalsFamily | @yuzi_chahal | @josbuttler pic.twitter.com/KqITBfozSt — Rajasthan Royals (@rajasthanroyals) May 6, 2022 -
అంపైర్ ఔటివ్వలేదని అలిగాడు.. బుజ్జగించిన సూర్యకుమార్
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు రాణించడంతో సీజన్లో ముంబై తొలిసారి బోణీ కొట్టింది. కాగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చహల్ వేశాడు. ఆ ఓవర్ చివరి బంతిని సూర్యకుమార్ స్వీప్షాట్ ఆడే ప్రయత్నం చేయగా మిస్ అయింది. దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్ ఔట్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో చహల్ డీఆర్ఎస్ కోరాడు. అయితే రిప్లేలోనూ బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్స్టంప్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో థర్డ్అంపైర్ కూడా నాటౌట్ ప్రకటించాడు. థర్డ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న చహల్ నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ వచ్చి చహల్కు హగ్ ఇచ్చి ''పోనీలే.. మరోసారి ట్రై చెయ్'' అంటూ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Gill No Ball Contoversy : గిల్ ఔట్పై అప్పీల్.. నో బాల్ ఇవ్వడం వెనుక అసలు కథ! IPL 2022: రోహిత్ విఫలం.. రితికాను ఓదార్చిన అశ్విన్ భార్య pic.twitter.com/RqRV7p0zPc — Patidarfan (@patidarfan) April 30, 2022 -
కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్ను మెడపట్టి తోసిన చహల్
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన రసవత్తర సమరంలో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజీ పోరులో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించగా, రాజస్థాన్దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. జోస్ బట్లర్ విధ్వంసకర శతకంతో (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా, ఛేదనలో డీసీ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో భారీ స్కోర్లతో పాటు అభిమానులకు కావల్సినంత వినోదం లభించింది. డీసీ లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో అంపైర వివాదాస్పద నిర్ణయాన్ని (బంతి నడుము కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ నో బాల్గా ప్రకటించకపోవడం) నిరసిస్తూ ఢిల్లీ కెప్టెన్ చేసిన హంగామా (క్రీజ్లో ఉన్న బ్యాటర్లను వెనుక్కు పిలువడం) గల్లీ క్రికెట్ను తలపించగా, అదే సమయంలో ఫీల్డ్లో ఉన్న చహల్ (రాజస్థాన్ రాయల్స్), కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్) మధ్య జరిగిన సరదా సన్నివేశం క్రికెట్ లవర్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. Meanwhile Chahal & Kuldeep #pant #noball #pant 😂 pic.twitter.com/A4975pt3uH — Troyboi™ (@1ove_it786) April 22, 2022 ఇంతకీ ఏం జరిగిందంటే.. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం కాగా, ఆ దశలో రోవ్మన్ పావెల్ ఒక్కసారిగి విరుచుకుపడి తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి (మెక్ కాయ్ బౌలింగ్) మ్యాచ్ను డీసీ వైపుకు తిప్పాడు. అయితే మెక్ కాయ్ వేసిన నాలుగో బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్గా ప్రకటించకపోవడంతో వివాదం మొదలైంది. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి పంత్ డగౌట్లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేశాడు. #DC#DC #RRvsDC #RishabhPant #NoBall #IPL2022 #ChotiBachiHoKya No ball Pant Gully Cricket 😅😅 #CSKvMI https://t.co/5izO2o75tX pic.twitter.com/XoS3DUc79d#ChotiBachiHoKya — Mankesh Meena (@Mankesh1212) April 23, 2022 ఇదే సమయంలో పావెల్తో పాటు క్రీజ్లో ఉన్న కుల్దీప్ యాదవ్.. కెప్టెన్ పిలుపు మేరకు గ్రౌండ్ వదిలే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ప్రత్యర్ధి బౌలర్ చహల్ మైదానం వీడటానికి ప్రయత్నిస్తున్న కుల్దీప్ను అడ్డుకుని.. కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. క్రీజ్లోకి నడువ్..! అంటూ మెడ పట్టుకుని పిచ్పైకి తీశాడు. సరదాగా సాగిన ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదిలా ఉంటే, నో బాల్ విషయంలో రిషబ్ పంత్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ అలా ప్రవర్తించడం సరికాదని మాజీలు మండిపడుతున్నారు. కొందరేమో.. ఐపీఎల్ పుణ్యమా అని జెంటిల్మెన్ గేమ్ కాస్త గల్లీ స్థాయి ఆటగా మరిందని కామెంట్లు చేస్తున్నారు. No ball thi na ......??? #RishabhPant#noball #badumpiring @vikrantgupta73 @rashikarajput01 pic.twitter.com/nBnct175rH — Anurag Singh (@AnuvirajSingh) April 23, 2022 చదవండి: IPL 2022: అలా చేయడం తప్పే.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్ హ్యాట్రిక్.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా!
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్తో మ్యాచ్లో చహల్ ఈ ఫీట్ సాధించాడు. హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్ల ఫీట్ను సాధించి అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్ తీసిన ఆనందంలో చహల్ ఇచ్చిన పోజు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. తాజాగా తన పోజు వెనకున్న విషయాన్ని మ్యాచ్ అనంతరం చహల్ వెల్లడించాడు. 2019 వరల్డ్కప్ టైమ్లో మీమ్గా మారిన తన పోజునే మళ్లీ రిపీట్ చేశానని చెప్పాడు. ఆ టోర్నీలో ఓ మ్యాచ్లో ఫైనల్ ఎలెవన్లో చహల్కు చోటు దక్కలేదు. దీంతో డ్రింక్స్ బాయ్గా మారిన అతను ప్లేయర్లకు డ్రింక్స్ అందించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల రెండు కాళ్లు చాపి తాపీగా కూర్చొని పోజు ఇచ్చాడు. ఆ ఫోటోపై అప్పట్లో చహల్పై విపరీతమైన మీమ్స్ వచ్చాయి. జట్టులో చోటు దక్కక డ్రింక్స్ బాయ్గా మారిపోయాడని.. ఏం చేయాలో తెలియక ఇలా పోజు ఇచ్చాడంటూ కామెంట్స్ చేశారు. ఈ మాటలు మనుసులో పెట్టుకున్నాడేమో తెలియదు కాని.. తాజాగా చహల్ దానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. ఇక, కేకేఆర్తో మ్యాచ్లో గూగ్లీలతో రాణా, వెంకటేశ్ అయ్యర్ను ఔట్ చేసిన చహల్.. లెగ్ బ్రేక్తో కమిన్స్ వికెట్ పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. వాస్తవానికి ఈ బాల్ కూడా గూగ్లీ వేయాలనుకున్నప్పటికీ.. చాన్స్ తీసుకోవద్దని లెగ్ బ్రేక్ వేశానని చహల్ చెప్పాడు. చదవండి: Chahal Hat-Trick: చహల్ పేరిట వెబ్సైట్.. ఆ మాత్రం ఉండాలి! Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు.. Game-changing hat-trick 👏 Yet another 💯 💪 Thrilling last over 💥 Milestone men @yuzi_chahal and @josbuttler sum up @rajasthanroyals' special win over #KKR. 👍 👍 - By @RajalArora Full interview 📹 🔽 #TATAIPL | #RRvKKRhttps://t.co/h2YK5ykg8o pic.twitter.com/G7aWCoYfiL — IndianPremierLeague (@IPL) April 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్ పేరిట వెబ్సైట్.. ఆ మాత్రం ఉండాలి!
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ కేకేఆర్తో మ్యాచ్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్తో మెరిశాడు. కేకేఆర్ మ్యాచ్ను లాగేసుకుంటున్న తరుణంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ మ్యాజిక్ చేశాడు. తొలుత వెంకటేశ్ అయ్యర్ను స్టంప్ ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే చహల్ సాధించిన ఘనతకు గుర్తింపుగా రాజస్తాన్ రాయల్స్ అతని పేరిట ప్రత్యేక్ వెబ్సైట్ను డిజైన్ చేసింది. ఆ వెబ్సైట్కు www.Yuzigetshattrick.com అని పేరు ఇచ్చి చహల్ను గౌరవించుకుంది. ఆ వెబ్సైట్లో చహల్ ఫోటోలతో పాటు అతను ఈ సీజన్లో వికెట్లు తీసిన సందర్భాలను గుర్తుచేస్తూ షేర్ చేసింది. దీంతో పాటు సీజన్లో మరెవరైనా హ్యాట్రిక్ నమోదు చేసినా ఈ వెబ్సైట్లో కనిపించేలాగా డిజైన్ చేసింది. అయితే అవన్నీ రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లు మాత్రమే. తాజాగా చహల్ పేరిట వెబ్సైట్ను డిజైన్ చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''చహల్ సాధించింది మాములు ఘనత కాదు.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం గొప్ప విషయం.. వెబ్సైట్ తయారు చేయడంలో తప్పులేదు.. ఆ మాత్రం ఉండాల్సిందే..'' అని పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం..'' చహల్ సాధించింది ఘనతే కావొచ్చు.. అంతమాత్రానా వెబ్సైట్ తయారు చేయడం ఏంటని తప్పుబట్టారు. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు.. So we did a thing... 😂https://t.co/zvjEuIDk2X https://t.co/l3kOpsNkw0 — Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2022 -
ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు..
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సంచలనం సృష్టించాడు. కేకేఆర్తో మ్యాచ్లో హ్యాట్రిక్ తీయడంతో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ను చావుదెబ్బ కొట్టాడు. ముందుగా వెంకటేశ్ అయ్యర్ను తొలి బంతికే స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో చహల్ది 21వ హ్యాట్రిక్ కాగా.. రాజస్తాన్ రాయల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన ఐదో బౌలర్గా చహల్ నిలిచాడు. ఇంతకముందు రాజస్తాన్ నుంచి అజిత్ చండీలా, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, శ్రేయాస్ గోపాల్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన 25 బౌలర్గా చహల్ నిలచాడు. అయితే ఒకే మ్యాచ్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్గా చహల్ చరిత్ర సృష్టించాడు.ఓవరాల్గా కేకేఆర్తో మ్యాచ్లో చహల్ (4-0-40-5)తో ఐపీఎల్ కెరీర్లో ఉత్తమ గణాంకాలు సాధించాడు. -
చహల్పై దాడి ఘటన.. చిక్కుల్లో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్
James Franklin In Big Trouble After Chahals Harassment Allegations: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ బౌలర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఏడాది మెగా వేలం ముగిశాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన ఓ పోడ్కాస్ట్ షో సందర్భంగా చహల్ మాట్లాడుతూ.. 2013 ఐపీఎల్ సీజన్లో ఓ ముంబై ఇండియన్స్ ఆటగాడు పీకలదాకా తాగి తనను 15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీసాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతుండగానే చహల్ మరో బాంబు పేల్చాడు. 2011 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఆడుతున్నప్పుడు నాటి సహచర ఆటగాళ్లు జేమ్స్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ సైమండ్స్లు తనపై భౌతిక దాడికి దిగారని, ఆ ఇద్దరు తన కాళ్లు, చేతలు కట్టివేడేసి, నోటిని ప్లాస్టర్తో బిగించి గదిలో పడేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన ఆనందంలో చిత్తుగా తాగిన ఆ ఇద్దరు తన పట్ల క్రూరంగా ప్రవర్తించారని, మైకంలో తనను కట్టేశారన్న విషయాన్ని సైతం వారు మర్చిపోయారని, దాంతో ఓ రాత్రంతా తాను గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని, మరుసటి రోజు ఉదయం హౌస్ కీపింగ్ బాయ్ నన్ను చూసి కట్లు విప్పాడని తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంత జరిగాక కూడా ఆ ఆటగాళ్లు తనకు క్షమాపణలు చెప్పలేదని చహల్ పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. చహల్ ఆరోపణల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ బౌలర్, ప్రస్తుత డర్హమ్ కౌంటీ ప్రధాన కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంటుంది. డర్హమ్ కౌంటీ.. ఫ్రాంక్లిన్ను విచారించి చహల్ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేలుస్తామని పేర్కొంది. 2011లో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయని, మా విచారణలో ఫ్రాంక్లిన్ తప్పు చేసినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలుంటాయని వివరించింది. ఇదిలా ఉంటే, చహల్ తొలుత చేసిన ఆరోపణల (15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీయడం) నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించిన విషయం తెలిసిందే. చదవండి: 'తమాషానా.. అలాంటి క్రికెటర్పై జీవితకాల నిషేధం విధించాలి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంపైర్పై కోపంతో ఊగిపోయిన చాహల్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం(ఏప్రిల్10) లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా యుజువేంద్ర చాహల్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి రాజస్తాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫీల్డ్లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే చాహల్.. ఈ మ్యాచ్లో మాత్రం కోపంతో ఊగిపోయాడు. లక్నో ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన చాహల్ ఐదో బంతిని ఫుల్ ఆఫ్ సైడ్ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్ ఆ బంతిని వైడ్గా ప్రకటించాడు. కాగా రీప్లేలో బంతి లైన్ లోపల ఉన్నట్లు కనిపించింది. దీంతో అసహనానికి గురైన చాహల్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఆసంతృప్తిగా ఉన్నట్లు కన్పించింది. కాగా తరువాతి బంతికే చమీరాను చాహల్ పెవిలియన్కు పంపాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో కేఎల్ రాహుల్ చెత్త రికార్డు.. తొమ్మిదేళ్ల తర్వాత! pic.twitter.com/gYy2jqG26y — Vaishnavi Sawant (@VaishnaviS45) April 10, 2022 -
ఐపీఎల్ చరిత్రలో చహల్ అరుదైన ఘనత
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో దుష్మంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చహల్ ఐపీఎల్లో 150వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా చహల్ చరిత్ర సృష్టించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో 173 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. లసిత్ మలింగ 170 వికెట్లతో రెండు, అమిత్ మిశ్రా 166 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 157 వికెట్లతో పియూష్ చావ్లా నాలుగో స్థానంలో ఉండగా.. హర్బజన్ సింగ్ 150 వికెట్లతో ఐదో స్థానంలో ఉండగా.. తాజగా చహల్ 150 వికెట్లతో భజ్జీ సరసన చేరాడు. ఇక చహల్కు తొలి 50 వికెట్లు 40 మ్యాచ్ల్లో అందుకోగా.. మలి 50 వికెట్లు 44 మ్యాచ్ల్లో సాధించాడు. తాజాగా మూడో విడత 50 వికెట్లను మాత్రం కేవలం 34 మ్యాచ్ల్లోనే చహల్ అందుకోవడం విశేషం. చదవండి: IPL 2022: అశ్విన్ ఒక సంచలనం; అప్పుడు 'మన్కడింగ్'.. ఇప్పుడు 'రిటైర్డ్ ఔట్' -
'తమాషానా.. అలాంటి క్రికెటర్పై జీవితకాల నిషేధం విధించాలి'
టీమిండియా ఆటగాడు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఒక విదేశీ క్రికెటర్ నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవలే పంచుకున్న సంగతి తెలిసిందే. జట్టు సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్లకు తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును చహల్ వివరించాడు. తాగిన మైకంలో సహచర క్రికెటర్ తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేయబోయాడంటూ.. తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాని చహల్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. అయితే చహల్ ఆ క్రికెటర్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా చహల్కు జరిగిన చేదు అనుభవంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి పిచ్చి పని చేసిన ఆ క్రికెటర్ను జీవితకాలం నిషేధించడమే సరైనదని పేర్కొన్నాడు. ‘'ఈ ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి. సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా విషయం కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి.'’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇదంతా 2013లో చోటుచేసుకుంది. అప్పుడు యజ్వేంద్ర చాహల్ ముంబై జట్టులో ఉన్నాడు. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్.. చచ్చేవాడిని! Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్
IPL 2022- Rajasthan Royals Players: ‘‘నిజానికి ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాను. బెంగళూరులో మ్యాచ్ ఆడాము. ఆ తర్వాత హోటల్కు చేరుకున్నాం. నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఉన్నాడు. తాగిన మైకంలో నన్ను తన దగ్గరకు పిలిచాడు. ఒక్కసారిగా నన్ను ఎత్తిపట్టుకుని బాల్కనీ నుంచి వేలాడదీశాడు. తన చుట్టూ నేను చేతులు వేసి పట్టుకుని ఉన్నాను. ఏమాత్రం పట్టు కోల్పోయినా 15వ అంతస్తు నుంచి కిందపడిపోయే వాడినే. అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేశారు. స్పృహ కోల్పోయిన నాకు నీళ్లు ఇచ్చి కుదుటపడేలా చేశారు’’ అని టీమిండియా ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్తో కలిసి తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును వివరించాడు. బయటకు వెళ్లినపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని చహల్ చెప్పుకొచ్చాడు. తాను అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని, తనకు అదొక పునర్జన్మ లాంటిదని పేర్కొన్నాడు. దయచేసి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే తనకు ఆ పరిస్థితి కల్పించిన క్రికెటర్ ఎవరన్న విషయాన్ని మాత్రం చహల్ బయటపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కాగా 2013 తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన చహల్ చాలా కాలం పాటు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగాడు. అయితే, ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో రాజస్తాన్ చహల్ను కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ గెలిచిన రెండు మ్యాచ్లలో చహల్ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్లో ఉండగా.. రెండు మ్యాచ్ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
టి20 క్రికెట్లో చహల్ అరుదైన ఫీట్
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్.. ఎస్ఆర్హెచ్తో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో చహల్ 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో టి20 క్రికెట్లో(అంతర్జాతీయ, లీగ్లు) కలిపి చహల్ 250 వికెట్ల మార్క్ను సాధించాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ షెపర్డ్ను ఔట్ చేయడం ద్వారా చహల్ ఈ ఫీట్ను సాధించాడు. టీమిండియా నుంచి టి20ల్లో 250 వికెట్ల మార్క్ను అందుకున్న నాలుగో బౌలర్గా నిలిచాడు. ఇంతకముందు పియూష్ చావ్లా(262 వికెట్లు), అమిత్ మిశ్రా(260 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(264 వికెట్లు) ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎయిడెన్ మార్ర్కమ్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు నాటౌట్గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ 3, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా.. బట్లర్ 35, పడిక్కల్ 41 కీలకపాత్ర పోషించారు. What a spell by Yuzvendra Chahal, gets his 3rd now. Also his 250th wicket in T20 cricket. — Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022 -
IPL 2022: డబ్బు డిమాండ్ చేసానన్నది అవాస్తవం.. ఆర్సీబీపై చహల్ సంచలన వ్యాఖ్యలు
Yuzvendra Chahal: 8 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడి, ఐపీఎల్ 2022కి ముందు రాజస్థాన్ రాయల్స్లో భాగమైన టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. తనకెంతో గుర్తింపు తెచ్చిన ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ జాతీయ మీడియాతో చహల్ మాట్లాడుతూ.. ఆర్సీబీతో ఏర్పడిన ఎమోషనల్ బాండింగ్ గురించి, గతేడాది ఐపీఎల్ తదనంతరం ఆర్సీబీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆర్సీబీ కాకుండా మరే ఇతర జట్టుకు ఆడతానని అనుకోలేదని, అంతలా ఆ జట్టుతో, అక్కడి అభిమానులతో మమేకమైపోయానని, అలాంటిది ఐపీఎల్ 2022 రిటెన్షన్ సమయంలో జరిగిన కీలక పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చిందని వాపోయాడు. ఆర్సీబీలో కొనసాగేందుకు తాను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశానని కొందరు పనిగట్టుకుని సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్ చేసుకునేందుకు కానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు కానీ ఆసక్తి చూపలేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటెన్షన్ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్ తనకు ఫోన్ చేశాడని, రిటెన్షన్లో మూడు స్లాట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడని, వాటిని విరాట్, మ్యాక్స్ వెల్, సిరాజ్లతో భర్తీ చేయాలనుకుంటున్నామని తెలిపాడని వివరించాడు. ఆ సమయంలో హెస్సన్ తనను రిటైన్ చేసుకునేది కానీ, వేలంలో దక్కించుకుంటామని కానీ చెప్పలేదని అన్నాడు. ఒకవేళ హెస్సన్ నన్ను వేలంలో దక్కించుకుంటానని చెప్పి ఉంటే సంతోషించేవాడినని, కానీ అలా జరగకపోవడం బాధించిందని వాపోయాడు. ఏదిఏమైనా తాను ఐపీఎల్ అరంగేట్రం (2010) చేసిన జట్టుకే తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. కాగా, చహల్ తన ఐపీఎల్ కెరీర్లో 114 మ్యాచ్ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. చదవండి: మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు -
చహల్ చేసిన పనికి షాక్ తిన్న క్రికెటర్లు
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలిఉంది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అభిమానులకు ఆనందాన్ని పెంచే పనిలో పడ్డారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యజ్వేంద్ర చహల్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అతను అన్న మాట రెండు అర్థాలకు దారి తీయడంతోనే ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. విషయంలోకి వెళితే.. గురువారం ప్రాక్టీస్ సమయంలో జాస్ బట్లర్, చహల్లు పక్కపక్కనే కూర్చున్నారు. ఏదో విషయమై ఇద్దరు సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంతలో చహల్.. జోషీ బాయ్ కమ్ ఓపెన్ విత్ మి అని పేర్కొన్నాడు. దీంతో షాకైన బట్లర్.. అరె చహల్ భయ్యా ఏంటిది అంటూ తలకు చేతులు పెట్టడం కెమెరాలకు చిక్కింది. వీరి పక్కనే ఉన్న జిమ్మీ నీషమ్ కూడా చహల్ వ్యాఖ్యలపై షాక్ తిన్నాడు. అయితే బట్లర్ను చహల్ అడిగింది ఓపెనింగ్ గురించి. బట్లర్తో కలిసి ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు.. దానినే ఇన్డైరెక్ట్గా ''ఓపెన్ విత్ మి'' అని అన్నాడు. కాగా చహల్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు కూడా వినూత్న రీతిలో స్పందించారు. ఎంతైనా చహల్ కదా.. ఆ మాత్రం ఉండాలి.. ఒక 10వేల ట్వీట్స్ చేయ్.. అప్పుడు నీతో ఓపెన్ అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు. ఇక సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ ఈసారైనా కప్పు కొడుతుందా అనేది చూడాలి. మొదటి సీజన్(2008లో) విజేత మినహా రాజస్తాన్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేదు. సంజూ శాంసన్ నేతృత్వంలో ఈసారి జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. మార్చి 29న సన్రైజర్స్తో రాజస్తాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?! IPL 2022- Ravindra Jadeja: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా? 🤷♂️🤷♀️ pic.twitter.com/yXPHiB4kvP — Rajasthan Royals (@rajasthanroyals) March 24, 2022 -
IPL 2022: క్వారంటైన్ పూర్తి కానివ్వండి ఏం చేయాలో అది చేద్దాం: చహల్
IPL 2022- Rajasthan Royals Swagat: ఐపీఎల్-2022 కోసం రాజస్తాన్ రాయల్స్ సంసిద్దమవుతోంది. క్యాష్ రిచ్లీగ్లో భాగంగా నాగపూర్లో తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుందీ ఈ జట్టు. పుణె వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 29న రాజస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు జట్టుతో చేరారు. కెప్టెన్ సంజూ శాంసన్ సహా యజువేంద్ర చహల్ తదితరులు రాయల్స్ క్యాంపునకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఇదిలా ఉండగా.. ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర సహా ఆటగాళ్లకు రాజస్తాన్ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఈ క్రమంలో చహల్, అతడి భార్య ధనశ్రీకి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన రాజస్తాన్.. ‘‘మరి.. మా స్వాగతం ఎలా ఉంది చహల్’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన చహల్.. ‘‘మూడు రోజుల క్వారంటైన్ పూర్తి కానివ్వండి. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం’’ అంటూ మీ స్వాగతసత్కారాలతో హృదయం ప్రేమతో నిండిపోయిందంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా బెంగళూరు ఫ్రాంఛైజీ వదిలేయడంతో ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చిన చహల్ను రాజస్తాన్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే.. 😂😂 fire hai @KumarSanga2 🔥 pic.twitter.com/eng1wzzLs1 — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 #HallaBol in 𝗳𝘂𝗹𝗹 𝗽𝗼𝘄𝗲𝗿. ⚡ Welcoming One Moto India to the #RoyalsFamily as our Associate Sponsor. 💗#RoyalsFamily | #OneMotoIndia | #ElectrifyingRR pic.twitter.com/zsyUNRHJGX — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 Wiiiiiings 🔜 pic.twitter.com/X5q1K7bmGD — Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022 3 days quarantine bus uske baad hum he karenge joh karna hai 💖💗 https://t.co/YBqJwOwM59 — Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2022 -
'తొలి మ్యాచ్ కదా తడబడ్డాడు.. వదిలేయ్ రోహిత్'
వెస్టిండీస్తో తొలి టి20 మ్యాచ్ ద్వారా లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయి 4 ఓవర్లలో 17 డాట్ బాల్స్ వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఎంట్రీతో అదరగొట్టిన బిష్ణోయ్ క్యాచ్ విషయంలో కాస్త పొరబడడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో పవర్ ప్లేలో యజ్వేంద్ర చహల్ బౌలింగ్లో తొలి బంతిని నికోలస్ పూరన్ లాంగ్ఆప్ భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ అని మనం అనుకుంటున్న సమయంలో బిష్ణోయ్ క్యాచ్ అందుకున్నాడు. చదవండి: IND Vs WI: 'అది వైడ్బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా కానీ తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో బిష్ణోయ్ బౌండరీ లైన్ను తాకేశాడు. దీంతో అంపైర్ సిక్స్గా ప్రకటించాడు. తాను చేసిన తప్పుకు నాలుక కరుచుకుంటూ నిరాశతో బంతిని విసిరేశాడు. ఇది చూసిన రోహిత్ శర్మ బిష్ణోయ్ వైపు కాస్త కోపంతో చూశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. '' అతనికి ఇది తొలి మ్యాచ్.. వదిలేయ్ రోహిత్..'' అంటూ కామెంట్ చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. చహల్ చేతుల మీదుగానే రవి బిష్ణోయ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన బౌలింగ్లో క్యాచ్ పట్టినప్పటికి పొరపాటున బౌండరీలైన్ తాకడంతో చహల్ వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. చహల్ ఇదేం పట్టించుకోకుండా ఓవర్ పూర్తైన తర్వాత బిష్ణోయ్ వద్దకు వెళ్లి ''మంచి ప్రయత్నం చేశావు..'' అంటూ మెచ్చుకున్నాడు. టి20 క్రికెట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు.మొదటి మ్యాచ్లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్ను తాకి సిక్స్ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. చదవండి: Ravi Bishnoi: 24 బంతుల్లో 17 డాట్బాల్స్.. సూపర్ ఎంట్రీ రవి బిష్ణోయి Congratulations to Ravi Bishnoi who is all set to make his debut for Team India.@Paytm #INDvWI pic.twitter.com/LpuE9QuUkk — BCCI (@BCCI) February 16, 2022 pic.twitter.com/msvTjxmAH3 — Bleh (@rishabh2209420) February 16, 2022 -
కాపీ కొట్టడానికి సిగ్గుండాలి.. పంత్పై ట్రోల్స్ వర్షం
వెస్టిండీస్తో రెండో వన్డేలో ఓపెనర్గా వచ్చి అందరిని ఆశ్యర్యపరిచిన రిషబ్ పంత్ అంతగా ఆకట్టుకోలకపోయాడు. 34 బంతులాడి 3 ఫోర్లు సాయంతో 18 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే మ్యాచ్లో నిరాశపరిచిన పంత్.. సోషల్ మీడియాలో మాత్రం హిట్ అయ్యాడు. ఫ్యాన్స్ ట్రోల్స్కు గురయ్యాడు.. బ్యాటింగ్ విషయంలో ఆ ట్రోల్స్ వచ్చాయి అనుకుంటే పొరపాటే. చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్ విషయంలోకి వెళితే.. పంత్ ఔటై పెవిలియన్ చేరాక కాసేపటికి బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. అక్కడ టీమిండియా ఫిజియో నితిన్ పటేల్, దీపక్ చహర్లతో కాసేపు ముచ్చటించాడు. అయితే పంత్ కూర్చున్న విధానం ఆసక్తిగా మారింది. గతంలో స్పిన్నర్ చహల్ ఒక మ్యాచ్లో బాయ్గా వ్యవహరించినప్పుడు డ్రింక్స్ అందించడానికి బౌండరీ లైన్ వద్ద మోచేతిపై కూర్చొని మ్యాచ్ వీక్షించడం కెమెరాలకు చిక్కింది. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా పంత్ అది కాపీ కొట్టాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందో లేక కావాలనే చేశాడో తెలియదు కానీ పంత్పై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ వర్షం కురిపించారు. పంత్ ఫోటోను.. చహల్ అప్పటి ఫోటోను ఒక దగ్గర పెట్టి షేర్ చేశారు. ''సిగ్గుండాలి పంత్.. చహల్ను కాపీ కొట్టడానికి.. చహల్ది మాస్టర్ పీస్.. నీది(పంత్) కాపీ పీస్.. చహల్ మాస్టర్ పీస్ను దొంగలించావు.. యూ ఆర్ కాపీ క్యాట్.. పంత్ నీ కాపీ చెత్తగా ఉంది..'' అంటూ ఫన్నీ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 49 పరుగులు చేశాడు. దీపక్హుడా 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం #INDvWI Rishabh Pant 🤝Yuzi Chahal pic.twitter.com/iTI5pC5jOe — Sudhanshu Ranjan Singh (@memegineers_) February 9, 2022 Just Rishabh Pant thinks 😂😭#INDvWI #INDvsWI pic.twitter.com/6gMYO5JKph — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 9, 2022 -
Rohit Sharma: "చాహల్ భాయ్ నీకు భారీ ధర దక్కడం ఖాయం.. ఆల్ది బెస్ట్ "
ఐపీఎల్-2022 మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. అయితే ఈ మెగా వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో వేలానికి సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ యుజువేంద్ర చాహల్ను రీటైన్ చేసుకోలేదు. కాగా ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చాహల్ అందుకున్నాడు. కాగా మ్యాచ్ అనంతరం చాహల్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో వన్డే క్రికెట్లో 100 వికెట్లు పూర్తి చేసినందుకు చాహల్ను రోహిత్ అభినందించాడు. ఇక 100 వికెట్లు పడగొట్టడం ఎలా అనిపిస్తుంది అని రోహిత్ ప్రశ్నించగా.. "నాకు ఈ ఘనత సాధించడం చాలా గర్వంగా ఉంది. నేను ఇంత వేగంగా ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడూ ఊహించలేదు" అని చాహల్ బదులు ఇచ్చాడు. ఇక ఫుల్ టైమ్ వైట్-బాల్ కెప్టెన్గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్లోనే భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక రాబోయే వేలంలో చాహల్కి రోహిత్ ఆల్ది బెస్ట్ చెప్పాడు. చదవండి: U 19 WC- Shaik Rasheed: పాత మల్లాయపాలెం నుంచి ప్రపంచకప్ విజేత దాకా.. తన కోసం ఎన్ని తాగ్యాలకైనా మేము సిద్ధం: రషీద్ తల్లిదండ్రులు -
అదరగొట్టిన చహల్.. అత్యంత తక్కువ వన్డేల్లో
టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. విండీస్తో తొలి వన్డేలో నికోలస్ పూరన్ను ఔట్ చేయడం ద్వారా చహల్ ఈ ఘనత సాధించాడు. కాగా 100 వికెట్ల మైలురాయిని చహల్ 60 వన్డేల్లో సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యంత తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో ఆటగాడిగా చహల్ నిలిచాడు. చహల్ కంటే ముందు మహ్మద్ షమీ(57 వన్డేలు), జస్ప్రీత్ బుమ్రా(57 వన్డేలు), కుల్దీప్ యాదవ్(58 వన్డేలు), ఇర్ఫాన్ పఠాన్(59 వన్డేలు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా చహల్ మంచి కబ్బ్యాక్ ఇచ్చాడు. పూరన్ను ఔట్ చేసిన మరుసటి బంతికే విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో 12 పరుగులు చేసిన బ్రూక్స్ను తెలివైన బంతితో బోల్తా కొట్టించిన చహల్ మూడో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. Least matches to 100 ODI wickets for India: 56 : M Shami 57 : J Bumrah 58 : Kuldeep Yadav 59 : Irfan Pathan 60 : Yuzvendra Chahal*#INDvWI — Umang Pabari (@UPStatsman) February 6, 2022 -
'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం'
టి20 ప్రపంచకప్ 2021కు తనను ఎంపిక చేయకపోవడం చాలా బాధ కలిగించిందని టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు. విండీస్తో వన్డే సిరీస్కు సిద్ధమైన టీమిండియా జట్టులో చహల్ చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో ఆర్సీబీ పాడ్కాస్ట్తో చహల్ మాట్లాడాడు. ''టి20 ప్రపంచకప్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించే రోజు అది. ఉదయం 9:30 గంటల సమయంలో జట్టును ప్రకటిస్తామన్నారు. కానీ కాస్త లేట్ అయింది. అప్పటివరకు నా పేరు జట్టులో ఉంటుందని బాగా నమ్మాను. కానీ లిస్ట్ బయటికి వచ్చాకా గట్టిషాక్ తగిలింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎవరితో ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య విషయం ప్రస్తావించింది. లిస్ట్కు సంబంధించిన స్క్రీన్షాట్ను ఆమెకు పంపాను. ఆరోజు రాత్రి ఏమి తినకుండా ఆలోచిస్తూ కూర్చుండిపోయా. అంతకముందు ఐదేళ్లలో ఒక్కసారి కూడా టీమిండియాలో చోటు కోల్పోలేదు.. ఎందుకిలా అని ఆలోచించాను'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: PSL 2022: ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే ఇక ఐపీఎల్ మెగావేలం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీమిండియాకు మరో 5-6 సంవత్సరాల పాటు ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఆర్బీకీ ఆడిన చహల్ను ఆ జట్టు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న వేలంలో చహల్ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో చహల్ 114 మ్యాచ్ల్లో 139 వికెట్లు తీశాడు. కాగా టి20 ప్రపంచకప్లో చహల్ స్థానంలో రాహుల్ చహర్ను ఎంపిచేశారు. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. తర్వాతి మ్యాచ్లను గెలిచినప్పటికి సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. చదవండి: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరమంటున్న భారత మాజీ బౌలర్ -
అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలరాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. విండీస్తో త్వరలో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్లో మరో వికెట్ సాధిస్తే ఈ ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకునే 23వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 269 మ్యాచ్ల్లో 334 వన్డే వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 59 మ్యాచ్లు ఆడిన 31 ఏళ్ల చహల్.. 5.19 సగటున 99 వికెట్లు తీశాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్ల ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ గణాంకాలు 6/42గా ఉన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో మునుపటి ఫామ్ను ప్రదర్శించలేకపోతున్న చహల్.. జట్టులోని వస్తూ పోతూ ఉన్నాడు. తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో ఛాన్స్ లభించినప్పటికీ 3 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. అయినప్పటికీ విండీస్తో ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు చహల్ ఎంపికయ్యాడు. చదవండి: అందుకే ఐపీఎల్లో ఆడకూడదని డిసైడయ్యా.. ఆసీస్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సన్రైజర్స్ లోకి యజువేంద్ర చహల్.. మరీ ఇన్ని కోట్లా!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ చకచక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను కూడా ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. అంతేకాకుండా ఈ క్యాష్ రీచ్ లీగ్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ సైతం తాము ఎంచుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను రిటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. దీంతో రషీద్ని అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రషీద్ స్ధానాన్ని భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్తో భర్తీ చేయాలని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం. ఇప్పటికే చహల్తో సన్రైజర్స్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఆర్సీబీ చహల్ను రీటైన్ చేసుకోలేదు. అయితే గత కొన్నాళ్లుగా ఆర్సీబీకి ఆడిన చహల్ రూ. 6 కోట్ల వేతనం అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ సారి వేలంలో తన కనీస ధరను రూ. 2 కోట్లగా చహల్ రిజిస్టర్ చేసుకున్నాడు. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వేలంలో చహల్ 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చహల్కు ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సన్రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Ipl 2022 mega auction: వేలంలో అతడు రికార్డు ధర బద్దలు కొట్టడం ఖాయం! -
IPL Auction: రాహుల్ భయ్యా.. నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? దేవుడికి కూడా వెల కట్టగలరా?
IPL 2022 Auction- Chahal, Rahul, Shardul Funny Video: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.... కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ సైతం తాము ఎంచుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తమ సారథిగా ఎంపిక చేసుకోగా.. అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించనుంది. ఇక రాహుల్ కోసం గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు భారీగానే ఖర్చు చేసిన విషయం తెలిసిందే. సుమారు 17 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, రాహుల్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగా వేలం గురించి ప్రస్తావించిన శార్దూల్.... తనకోసం లక్నో ఫ్రాంఛైజీ వెచ్చించగల బడ్జెట్ ఎంత అంటూ రాహుల్ను ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన రాహుల్... బేస్ ప్రైస్(కనీస ధర) అంటూ సమాధానమిచ్చాడు. ఇంతలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న చహల్.. ‘‘దేవుడికి(లార్డ్) కూడా బడ్జెట్ కేటాయించగల మనుషులు ఉంటారా’’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఓ హోటల్లో ఈ సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ జట్టును విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో నలుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై అతడిని వదిలేసింది. దీంతో శార్దూల్ వేలంలోకి రానున్నాడు. ఇక ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లతో చెలరేగి అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. లార్డ్ అన్న ట్యాగ్ విషయానికొస్తే... ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా శార్దూల్ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అప్పటి నుంచే తన పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్గా మారిపోయిందని ఈ యువ ఆటగాడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: చెన్నై చేరుకున్న ధోని.. టార్గెట్ అదేనా! India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి View this post on Instagram A post shared by Cricket bloggers (@_cricblog_) -
అరుదైన రికార్డుకు చేరువలో చాహల్.. తొలి బౌలర్గా!
India vs South Africa ODI: దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయిన టీమిండియా అఖరి పోరుకు సిద్దమైంది. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత స్సిన్నర్ యుజ్వేంద్ర చాహల్ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో చాహల్ ఒక్క వికెట్ సాధిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటిస్ జట్టుపై అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్గా నిలుస్తాడు. కాగా ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టిన చాహల్.. కుల్దీప్ యాదవ్ (17)తో సమానంగా నిలిచాడు. అదే విధంగా మరో రెండు వికెట్లు సాధిస్తే.. వన్డేల్లో 100 వికెట్ల క్లబ్లో చాహల్ చేరుతాడు. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల క్లబ్లో చేరడానికి 12 పరుగుల దూరంలో నిలిచాడు. చదవండి: Ind Vs Sa 3rd ODI: ధావన్కు విశ్రాంతి.. ఓపెనర్గా వెంకటేశ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్! -
కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం
Yuzvendra Chahal Emotional Note For Virat Kohli Viral: ‘‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు... పరస్పర నమ్మకం.. అవగాహనతో ముందుకు వెళ్లడం నిజంగా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ఇలాగే మరిన్ని మ్యాచ్లలోనూ మనం కలిసి ముందుకు సాగాలి. అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. విజయవంతమైన కెప్టెన్గా ఏడేళ్లు నడిపించిన నీకు ధన్యవాదాలు. అవును... భయ్యా నేను ఎవరి వికెట్ తీయాలో చెప్పవా?’’ అంటూ టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఒకప్పటి సారథి కోహ్లితో చహల్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలి నాళ్ల నుంచి కింగ్ కెప్టెన్ అతడిని ప్రోత్సహించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చహల్పై నమ్మకం ఉంచి మెరుగైన ఫలితాలు అందుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సంప్రదాయ క్రికెట్ కెప్టెన్సీకి కోహ్లి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు కూడా చేతులు మారాయి. ఈ నేపథ్యంలో కోహ్లితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చహల్ ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఫొటో షేర్ చేశాడు. ఇందులో కోహ్లి అతడికి ఏవో సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో చహల్తో కలిసి కోహ్లి ఓ సభ్యుడిగా మాత్రమే మొదటి వన్డే ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ ఫొటో షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇక జనవరి 19 నుంచి ప్రొటిస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆరంభమవుతోంది. చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే Ind Vs Sa 1st ODI: ధావన్కు షాక్... ఓపెనర్గా వెంకటేశ్ అయ్యర్! View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి
All IPL franchises would want to buy Yuzvendra Chahal in IPL Auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను రీటైన్ చేసుకోలేదు. కెప్టెన్ కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్ను మాత్రమే ఆర్సీబీ రీటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో చాహల్కు భారీ ధర దక్కనుందని భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొన్ని సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్- 2021 తొలి విడతలో పెద్దగా రాణించకపోయినా, యూఏఈ వేదికగా జరిగిన రెండో విడతలో చాహల్ అద్బుతంగా రాణించాడు. అయితే రానున్న మెగా వేలంలో చాహల్ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అతడు తెలిపాడు. ఈ వేలంలో చాహల్ను దక్కించుకోవడానికి చాలా జట్లు తీవ్రమైన పోటీ పడతాయి అని అతడు తెలిపాడు. " ఆర్సీబీ చాహల్ని తిరిగి దక్కించుకోవడానికి ప్రత్నిస్తుంది. ఐపీఎల్లో అతని అసాధారణ రికార్డు కారణంగా ఇతర జట్లు కూడా చాహల్ కోసం తీవ్రమైన పోటీపడతాయి. కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు ఎక్కువ మెత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. చాహల్ రీటైన్ చేసుకునే మెత్తం కంటే.. వేలంలో ఇంకా ఎక్కువ ధర పొందవచ్చు అని అతడు పేర్కొన్నాడు. ఇక యువ క్రికెటర్లు గురించి మాట్లాడుతూ.. ఆటగాళ్లందరూ తమ దేశం కోసం ఆడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అని శివరామకృష్ణన్ సూచించాడు. చదవండి: Rashid Khan: 16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి! -
కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం
Virat Kohli Argument With Umpire Virender Sharma.. ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి తనకు ఇదే చివరి సీజన్ అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా కప్ అందించి కోహ్లికి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది. కాగా కేకేఆర్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడితే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. అందుకే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ కాపాడుకునే అవకాశం ఉండడంతో ఆర్సీబీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ బ్యాటర్ ఔట్ నిర్ణయంపై అంపైర్ తీరుపై కోహ్లి వాగ్వాదానికి దిగాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ చహల్ వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని త్రిపాఠి పుల్ చేయబోయి మిస్ అయ్యాడు. దీంతో బంతి ప్యాడ్లను తాకింది. చహల్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వీరేందర్ శర్మ నాటౌట్ ఇచ్చాడు. చహల్ అప్పీల్తో కోహ్లి వెంటనే రివ్యూ కోరాడు. అల్ట్రాఎడ్జ్లో బంతి మొదట ప్యాడ్లను తాకి నేరుగా లెగ్స్టంప్ను ఎగరగొట్టినట్లు స్పష్టంగా కనిపించడంతో త్రిపాఠి అవుట్ అని తేలింది. దీంతో కోహ్లి ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ వీరేందర్ శర్మ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య సీరియస్ చర్య నడిచింది. అనంతరం కోహ్లి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చదవండి: Glenn Maxwell: మ్యాక్స్వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి pic.twitter.com/4tRKN5lSnB — pant shirt fc (@pant_fc) October 11, 2021 -
ఏం మార్పులుండకపోవచ్చు.. చహల్ మాత్రం!
No Change In Team India Squad For T20WC.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని బీసీసీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ జట్టులో మార్పులకు సంబంధించి ఆయా జట్లు ఐసీసీకి పంపించాల్సిన రిపోర్ట్కు గడువు నేడే(అక్టోబర్ 10) ఆఖరు. కాగా ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా స్థానాలపై సందిగ్థత నెలకొంది. దీనికి సంబంధించి కోచ్ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు సెలక్టర్ల నుంచి చివరి కాల్ ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. చదవండి: T20 World Cup 2021: రోహిత్ భయ్యా.. మాకు రెండు టికెట్స్ ఇప్పించవా అయితే జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ఒక్క హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రమే ఇంకా క్లారిటీ లేదని.. మిగతా జట్టంతా ముందు ప్రకటించిన విధంగానే ఉంటుందని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యజ్వేంద్ర చహల్ను మాత్రం యూఏఈలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ముందు ప్రకటించిన జట్టులో చహల్కు చోటు లేదు. చహల్ కంటే రాహుల్ చహర్పై సెలెక్టర్లు నమ్మకముంచి జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తాజాగా ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిచిన చహల్ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఇక నెట్ బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ సేవలను వినియోగించుకోనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈ విషయమై ఐపీఎల్ ముగిసిన తర్వాత ఉమ్రాన్ను టీమిండియా బయెబబుల్లో కలుస్తాడని తెలిపింది. ఇక ఉమ్రాన్ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతులు విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జట్టు టీ 20 వరల్డ్కప్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ. రిజర్వ్ ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ చదవండి: INDw Vs AUSw: ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి -
T20 World Cup 2021: అతడు తప్పకుండా భారత జట్టులోకి వస్తాడు...
Harbhajan Singh Comments On Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడాని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ థీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్2021 సెకెండ్ పేజ్లో చాహల్ అధ్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో సెలక్టర్లపైన పలువురు మాజీ ఆటగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో చాహల్ జట్టుకు ఎంపికవుతాడని హర్భజన్ సింగ్ కూడా ట్వీట్ చేయడం గమనర్హం. "భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందడానికి చాహల్ 'సరైన వేగంతో' బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. . టీ 20 ప్రపంచ కప్లో చాహల్ను భారత జట్టులో చూడాలని తాను ఇప్పటికీ ఆశిస్తున్నానని, టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు కూడా జట్టులో మార్పులు జరగవచ్చు" అని భజ్జీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే 15 మంది సభ్యలుతో కూడిన భారత జట్టును బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజ్వేంద్ర చాహల్ దక్కకపోవడం అందరనీ ఆశ్యర్యపరిచంది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. జట్లు అక్టోబర్ 10 లోపు తమ జట్టులో మార్పులు చేయవచ్చు. కాగా టీ20 ప్రపంచకప్ ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది. చదవండి: టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
షూటింగ్లో దుమ్మురేపిన చహల్.. 'ఐపీఎల్ వదిలేశావా'
Yuzvendra Chahal Shooting.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ షూటింగ్లో దుమ్మురేపాడు. ఆర్సీబీకి మ్యాచ్ గ్యాప్ రావడంతో చహల్ సరదాగా షూటింగ్ ఈవెంట్కు వెళ్లాడు. అక్కడ షూటింగ్ చేసిన చహల్ 10 పాయింట్లు సాధించాడు. తన షూటింగ్ వీడియోనూ చహల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ మై టార్గెట్ ఈజ్ సెట్ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం చహల్ షేర్ చేసిన వీడియో ట్రెండింగ్గా మారింది. అయితే ఒక అభిమాని చహల్పై ఒక ఫన్నీ కామెంట్ చేశాడు. '' షూటింగ్లో దుమ్ములేపావు.. ఐపీఎల్ వదిలేశావా ఏంటి..'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే Courtesy: IPL Twitter ఇక కొద్దిరోజులుగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న చహల్ ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సెకండ్ఫేజ్ మొదలైన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన గత మ్యాచ్లో 2/18తో మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శననే కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్కు చేరాలని భావిస్తోంది. కాగా రాజస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ అక్టోబర్ 3న పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. చదవండి: Viral Video: సచిన్ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్ View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
అతడిని టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారో తెలియదు!
Virender Sehwag Comments On Yuzvendra Chahal Omission From T20 World Cup: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్లో ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో ఆ జట్టు ఆఫ్ సిన్నర్ యజువేంద్ర చాహల్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో చాహల్ ప్రదర్శనపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ని స్మార్ట్ ఆటగాడని, బెంగళూరు జట్టుకు దొరికన ఆస్తి అని సెహ్వాగ్ కొనియాడాడు. కాగా టీ 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15 మంది భారత జట్టు సభ్యుల్లో చాహల్కు స్ధానం దక్కకపోవడంపై సెహ్వాగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. "చాహల్ గతంలో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అతడిని టీ 20 ప్రపంచకప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో నాకు అర్థం కాలేదు. దీనిపై సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి. శ్రీలంక పర్యటనలో రాహుల్ చాహర్ కూడా ఆశించనంతగా రాణించలేదు. కానీ ప్రస్తుతం చాహల్ బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. టీ20 క్రికెట్లో ఏ జట్టు కైనా ఒక ఆస్తిగా ఉంటాడు"అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా టీ 20 ప్రపంచకప్ కోసం స్పిన్నర్లు రవి అశ్విన్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ ఎంపిక చేసింది. చదవండి: RCB vs MI: తండ్రి ఔట్ కావడంతో కుర్చీని లాగి కొట్టిన ఏబీడీ కొడుకు, షాక్కు గురైన తల్లి! Harshal Patel was spectacular and Yuzvendra Chahal showed why he is such a smart cricketer. Graet win for @RCBTweets . Still see India tweaking the final 15 for the World Cup. #RCBvMI — Virender Sehwag (@virendersehwag) September 26, 2021 -
'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా.. చాహల్ ఫన్నీ వీడియో!
అహ్మదాబాద్: భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు . తాజాగా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి నటించిన ఓ ఫన్నీ వీడియో ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో చాహల్ కోసం అతని భార్య ఆలు పరోటా తీసుకు వస్తుంది. అయితే అది తినడానికి ముందు ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించట్లేదేమిటని అతడు చమత్కారంగా ప్రశ్నిస్తాడు. దానికి బదులుగా ఆమె 'కాశ్మీరీ పులావ్' లో కాశ్మీర్ ఉంటుందా, 'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై చాహల్ కింద పడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ ధావన్ వరుసగా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేశాడు. కాగా మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ కోసం చాహల్ యూఏఈ వెళ్లనున్నాడు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు -
చహల్, గౌతమ్లకు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్పిన్నర్ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్లు శుక్రవారం కోవిడ్–19 పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దీపక్ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్ పాజిటివ్గా తేలారు. మిగిలిన టీమ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆ ముగ్గురి పరిస్థితేంటి? పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్గా తేలితే భారత్కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్కు వెళ్లేందుకు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. -
చహల్, గౌతమ్లకు కరోనా పాజిటివ్
-
IND Vs SL: చహల్, గౌతమ్లకు కరోనా పాజిటివ్
కొలంబో: టీ20 సిరీస్ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు మరోషాక్ తగిలింది. తాజాగా భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, కె. గౌతమ్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్, గౌతమ్లు క్వారంటైన్లో ఉన్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్కు ముందు కృనాల్ పాండ్యా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కృనాల్తో క్లోజ్గా ఉన్న 8 మందిని క్వారంటైన్కు తరలించగా.. అందులో చహల్, గౌతమ్లు కూడా ఉన్నారు. తాజాగా వీరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను దక్కించుకున్న భారత్ టీ20 సిరీస్లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మొదటి టీ20 మ్యాచ్ నెగ్గిన టీమిండియా తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ను కోల్పోయింది. అయితే ఐపీఎల్కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల అనంతరం నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత అదే గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సీనియర్ జట్టు ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. -
నీది చాలా పెద్ద మనసు: చహల్ భార్య భావోద్వేగం
న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్సిన్నర్ యజువేంద్ర చాహల్ నేడు(జూలై 23) 31వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్డే ప్రాంక్స్టర్ అంటూ కేఎల్ రాహుల్ విష్ చేయగా... నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని కుల్దీప్ యాదవ్ ప్రేమను కురిపించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్కు హ్యాపీ బర్త్డే అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. అదే విధంగా... ‘‘104 అంతర్జాతీయ మ్యాచ్లు, 159 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడు’’ అని యుజీ గణాంకాలను కీర్తిస్తూ బీసీసీఐ బర్త్డే విషెస్ తెలిపింది. చహల్ భార్య భావోద్వేగం ‘‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒద్దికగా ఉండటం, దయ, సహాయ గుణం, ఇతరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, నిస్వార్థంగా ముందుకు సాగడం.. ఇలాంటి సుగుణాలన్నీ కలగలిసి ఉన్న వ్యక్తి మిస్టర్ యుజువేంద్ర చాహల్. నీ స్థాయి ఏమిటన్న విషయం గురించి నువ్వు అస్సలు పట్టించుకోవు. చాలా హుందాగా ఉంటావు. ఇలాంటి పరిపక్వత సాధించడం అంత తేలికేమీ కాదు. దేశం కోసం నువ్వు సాధించిన విజయాలు అమోఘం. చాలా పెద్ద మనసు నీది. నీ నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాను నేను. నిన్ను చూసి ఎల్లప్పుడూ గర్విస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్డే’’ అంటూ చహల్ భార్య ధనశ్రీ వర్మ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన యుజీ.. ‘‘ధన్యవాదాలు సతీమణి’’ అంటూ భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మ గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చహల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు శుక్రవారం కొలంబోలో జరిగే చివరివన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐదుగురు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేసిన నేపథ్యంలో యుజీకి తుదిజట్టులో చోటుదక్కలేదు. View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9) Thank you ❤️ https://t.co/tLUizmGNBX — Yuzvendra Chahal (@yuzi_chahal) July 23, 2021 View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9) -
టీమిండియా స్పిన్నర్లను ఊరిస్తున్న రికార్డులు
కొలంబో: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దక్కించుకోవాలని ధావన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో పాటు ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మొదట యజ్వేంద్ర చహల్ విషయానికి వస్తే.. చహల్ ఈ మ్యాచ్లో మరో ఆరు వికెట్లు తీస్తే గనుక వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అతి తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్ల ఫీట్ అందుకున్న ఆటగాడిగా చహల్ నిలువనున్నాడు. షమీ 56 మ్యాచ్ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. చహల్ కూడా ప్రస్తుతం 56వ మ్యాచ్ ఆడనున్నాడు.ఇదే మ్యాచ్లో హర్బజన్ రికార్డును కూడా చహల్ అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో చహల్ ఐదు వికెట్ల ఫీట్ అందుకుంటే హర్భజన్తో సమానంగా వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు. మరో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు వన్డేల్లో 107 వికెట్లు తీసిన కుల్దీప్.. మరొక వికెట్ తీస్తే బుమ్రా.. మూడు వికెట్లు తీస్తే యువరాజ్లతో సమానం కానున్నాడు. ఇక తొలి వన్డేలో ఈ ఇద్దరు తమ బౌలింగ్లో దారాళంగా పరుగులు ఇచ్చుకున్నా కీలక సమయంలో వికెట్లు తీశారు. చహల్ , కుల్దీప్లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇక తొలి వన్డేలో (86 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ ఓపెనర్గా అన్ని ఫార్మాట్లు( వన్డే, టీ20, టెస్టు) కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఓపెనర్గా వచ్చి 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సచిన టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్, రోహిత్ శర్మలు ఈ ఫీట్ను సాధించారు. అంతేగాక వన్డే క్రికెట్లో ఓపెనర్గా 6వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా ధావన్ నిలిచాడు. -
ప్రాక్టీస్లో అదరగొట్టిన కుల్దీప్, చహల్.. వీడియో వైరల్
కొలంబొ: శ్రీలంకతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్లు గురువారం ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ సందర్భంగా తమ బౌలింగ్తో మెరిశారు. నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్ల వికెట్లను చహల్ తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ చానెల్లో షేర్ చేసింది. కాగా చహల్, కుల్దీప్తో పాటు నవదీప్ సైనీ, దీపక్ చహర్, చేతన్ సకారియాలు కూడా వికెట్లతో మెరిశారు. సైనీ ఖాతాలో దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యాలు వికెట్లు ఉండగా.. ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ను చేతన్ సకారియా దక్కించుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో కుల్దీప్ యాదవ్ ఘోరంగా విఫలమవడం విమర్శలకు దారి తీసింది. చహల్ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే నమోదు చేయడంతో లంకతో సిరీస్ వీరిద్దరికి కీలకం కానుంది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ల సారధ్యంలో రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా ఇంట్రాస్కా్వడ్ మ్యాచ్లను ముగించుకొని జూలై 13న లంకతో తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది. -
ధనశ్రీ వర్మ డ్యాన్స్.. చాటుగా ఎంజాయ్ చేసిన చహల్
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. కాగా ఇటీవలే కరోనా బారీన పడిన చహల్ తల్లితండ్రులు కోలుకుంటున్నారు. చహల్కు గతేడాది డిసెంబర్లో ధనశ్రీ వర్మతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీకి మద్దతుగా ఆమె చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేరు. ధనశ్రీ మంచి డ్యాన్సర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ధన్యశ్రీ డ్యాన్స్ చేస్తుంటే .. చహల్ తన పెంపుడు కుక్కతో కలిసి కర్టెన్ వెనుక నుంచి ఆమె డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ప్రపంచటెస్టు చాంపియన్షిప్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు చహల్ ఎంపికవలేదు. అయితే జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కాగా ఈ పర్యటనకు రాహుల్ ద్రవిడ్ను ప్రధాన కోచ్గా ఎంపిక చేసిన బీసీసీఐ శిఖర్ ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇక చహల్ టీమిండియా తరపున 54 వన్డేల్లో 92 వికెట్లు, 48 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. చదవండి: జడేజా పేసర్ అయితే బాగుండు.. మాకు చాన్స్ వచ్చేది డ్యాన్స్తో రచ్చ చేసిన చహల్ భార్య.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9) -
జడేజా పేసర్ అయితే బాగుండు.. మాకు చాన్స్ వచ్చేది
ముంబై: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మీడియం పేసర్ అయి ఉంటే నాకు, కుల్దీప్కు జట్టుకు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉండేవని స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు కుల్దీప్, చహల్లు ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో చహల్ స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. '' నేను, కుల్దీప్ ఆడిన సందర్భాల్లో జట్టులో హార్ధిక్ పాండ్యా ఉండేవాడు. అతను ఆల్రౌండర్గా జట్టులో చోటు సంపాదిస్తే.. మేమిద్దరం స్పెషలిస్టు స్పిన్నర్లుగా ఉన్నాం. కానీ 2018లో హార్దిక్ గాయంతో జట్టుకు దూరమవడం.. జడేజా వన్డే జట్టులోకి మళ్లీ ఆల్రౌండర్గా రావడం జరిగింది. జట్టుకు కీలకమైన ఏడో స్థానంలో అతను బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అయితే అతని రాకను నేను తప్పుబట్టలేదు. జడేజా స్పిన్నర్ అవ్వడం మా దురదృష్టం. పాండ్యా లాగా అతను మీడియం పేసర్ అయి ఉండే మాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. జడేజా స్పిన్ ఆల్రౌండర్ కావడంతో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం పడేది. దాంతో నాకు, కుల్దీప్ యాదవ్కు మధ్య పోటీ ఉండేది. 2017 చాంపియన్స్ ట్రోపీ తర్వాత మేమిద్దరం స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడిపించేవాళ్లం. ఇద్దరం 50-50 శాతంగా మ్యాచ్లు ఆడేవాళ్లం. ఉదాహరణకు ఐదు వన్డేల సిరీస్ తీసుకుంటే.. ఒకసారి కుల్దీప్ మూడు వన్డేలు ఆడితే.. నేను రెండు మ్యాచ్లు ఆడేవాడిని. హార్దిక్ ఉన్నంతవరకు అతను ఆల్రౌండర్ కోటాలో ఏడో స్థానంలో రావడంతో.. మాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. జడేజా వచ్చాకా ఆ పరిస్థితి మారిపోయింది. అయినా ఏదైనా టీం డిమాండ్ మేరకే నడుచుకోవాలి.. జట్టుకు ఆడనంత మాత్రానా నేనేం బాధపడడం లేదు. నాకు వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటాను.. నేనున్నా లేకున్నా టీమిండియా గెలుపే నాకు ముఖ్యం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చహల్, కుల్దీప్ యాదవ్ల కెరీర్ అనుకున్నంత సాఫీగా లేదు. జట్టులోకి వచ్చిన కొత్తలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెగ్యులర్ స్పిన్నర్లుగా కనిపించిన వీరిద్దరు తర్వాత తమ ఫామ్ను కోల్పోయారు. ముఖ్యంగా కుల్దీప్ ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. చహల్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ మధ్యనే జరిగిన ఐపీఎల్ 14వ సీజన్లో చహల్ ఆర్సీబీ తరపున బరిలోకి దిగి అంతగా ఆకట్టుకోలేదు.. ఇక కుల్దీప్ కేకేఆర్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. చహల్ టీమిండియా తరపున 54 వన్డేల్లో 92 వికెట్లు, 48 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. ఇక కుల్దీప్ యాదవ్ 63 వన్డేల్లో 105 వికెట్లు.. 21 టీ20ల్లో 39 వికెట్లు.. 7 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు. చదవండి: ఫీల్డింగ్లోనే కాదు.. గుర్రపుస్వారీతోను ఇరగదీశాడు Kuldeep Yadav: క్రికెటర్ తీరుపై అధికారుల అసహనం -
డ్యాన్స్తో రచ్చ చేసిన చహల్ భార్య.. వీడియో వైరల్
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనశ్రీలో మంచి డ్యాన్సర్ ఉందన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే ఆమె తన డ్యాన్స్ నైపుణ్యాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తాజగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు అండగా ఒక డ్యాన్స్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రఖ్యాత అమెరికన్ రాపర్ సౌలిజా బాయ్స్ రూపొందించిన షీ మేక్ ఇట్ క్లాప్ పాటకు ధనశ్రీ డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన డ్యాన్స్తో పాటు గెటప్తోనూ ఆకట్టుకుంది. ఆర్సీబీ జెర్సీ .. బ్లూ ప్యాంట్ ధరించి స్టెప్స్తో ఇరగదీసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లిస్టులో చేరింది. కాగా చహల్ తల్లిదండ్రులు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అతని తల్లి హోం ఐసోలేషన్లో ఉండగా.. తండ్రి మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. కాగా యజ్వేంద్ర చహల్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. కరోనా సెగతో లీగ్ రద్దు కావడంతో చహల్ ఇంటికి చేరుకున్నాడు. ఇక ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు చహల్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే జూలైలో శ్రీలంక పర్యటనకు చహల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: RCB VS SRH: అరిచి అరిచి నా గొంతు పోయింది పేరెంట్స్కు కరోనా.. చహల్ ఎమోషనల్ పోస్ట్ View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9)