టి20 మ్యాచ్లో మోస్తరు లక్ష్యం నిర్దేశించి... విజయం సాధించాలంటే పటిష్ట బౌలింగ్ వనరులుండాలి. ఇలా కాకుంటే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ముందే ఒత్తిడికి గురిచేయాలి. మొదటి మ్యాచ్లో లంకపై రోహిత్ సేన ఈ రెండూ చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్లో సాదాసీదా ప్రదర్శన... తర్వాత పస లేని బౌలింగ్తో మ్యాచ్ చేజారింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ మెరుపులూ తోడైతేనే టీమిండియాది పైచేయి అవుతుంది.