Disease
-
లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చర్మంపై దద్దుర్లు, కండరాలు బలహీనత, కీళ్ల వాపు ఇలా శరీరంలోని ఏదో ఒక సమస్యకు గురి చేస్తుంది. అసలు లూపస్ లక్షణాలు ఏంటి? ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో ఒకరు ల్యూపస్ వ్యాధితో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 3.2 మంది ల్యూపస్ బారిన పడ్డారని అంచనా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చర్మసంబంధమైన లూపస్: చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు రియాక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.నియోనాటల్ లూపస్ : ఇది శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం లూపస్ వ్యాధికి సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే నయమయ్యే అవకాశాలున్నాయి. ల్యూపస్ - లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటి ల్యూపస్. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సందర్బంలో ఏ అవయవాన్నైనా ల్యూపస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, ఎముకలు దీనివల్ల ప్రభావితమవుతాయి. అందుకే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవడం, కీళ్లలో వాపులు, ఎముకల నొప్పులు, కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది. ముఖంమీద బటర్ ఫ్లై ఆకారంలో ర్యాషెస్, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది. ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమైతే ఆటో ఇమ్యూన్ కణాలు మెదడు పొరలపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్లమేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూపస్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి. అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్రభావితమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.నిర్ధారణ ఎలా?క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే పరీక్ష ద్వారా లూపస్ వ్యాధిని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు, ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు. చికిత్స ఏంటి?నిజం చెప్పాలంటే ల్యూపస్ వ్యాధికి శాశ్వత చికిత్స అంటూ ఏమీ లేదు. ఉపశమన చికిత్స మాత్రమే. సోకిన అవయవం,లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఉంటుంది ఏయే అవయవాలపై వ్యాధి ప్రభావం ఉందనే దాన్ని బట్టి రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు) ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు, సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం. -
Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు
మనిషి పుట్టుకకు ప్రధాన అవయవమైన గర్భాశయమే పుండుగా మారుతోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా లోలోపలే ఇబ్బంది పెడుతోంది. అనంతరం క్యాన్సర్గా మారి అమ్మనే కబలిస్తోంది. ప్రాథమిక దశలో దీనిని గుర్తిస్తే ప్రాణాలతో బయట పడవచ్చు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత గుర్తిస్తే మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధిపై అవగాహన లేక చాలా మంది మహిళలు తమలోపల క్యాన్సర్ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను వైద్యపరిభాషలో సెర్వికల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్గా, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్గా వైద్యులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యుల వద్దకు ప్రతిరోజూ 120 నుంచి 150 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కర్నూలులో ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి కీమోథెరపీ, 40 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నిత్యం 150 నుంచి 200 మంది ఇన్పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెర్వికల్ క్యాన్సర్) బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉంటుందని వైద్యుల అంచనా. పేదరోగులకు అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఉచితంగా వైద్యం అందుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధానంగా హ్యూ మన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) కారణంగా వస్తుంది. ఇదే గాక తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడ ం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు. ఈ క్యాన్సర్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా వస్తోంది. నివారణ చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 ఏళ్ల వయస్సులోపు హెచ్పీవీ వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70 శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు జనవరి మాసాన్ని సర్వికల్ క్యాన్సర్ అవగాహన మాసంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ⇒ రుతుక్రమంలో సమస్యలు.. యోని నుంచి రక్తస్రావం ⇒ లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ⇒పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ⇒ యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ⇒ మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి వివాహమైన మహిళలు ఏటా గర్భాశయ ముఖద్వారంలో పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ మేరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీనికి తోడు కౌమారదశ బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80 శాతం వరకు ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా మహిళలకు హెచ్పీవీ వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారుతుంది. – డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలుప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజీ విభాగానికి గైనిక్ సమస్యలతో వచ్చే ప్రతి వంద మంది మహిళల్లో ఇద్దరు, ముగ్గురికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటోంది. ఓపీకి వచ్చే వారికి పాప్స్మియర్ పరీక్షను చేస్తున్నాం. ఇందులో అసాధారణంగా కనిపించే వారికి కాల్పోస్కోపి టెస్ట్ ద్వారా బయాప్సీ తీసి పంపిస్తున్నాం. అందులో క్యాన్సర్గా నిర్ధారణ అయితే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా లక్షణాలు ఉన్నా లేకపోయినా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ను ముందుగానే గుర్తించి వారికి చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ పి.స్నేహ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
జాకీర్ హుస్సేన్ ఉసురు తీసిన ప్రాణాంతక వ్యాధి, ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.కారణాలుధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయిలక్షణాలుఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గుకీళ్ళు ,కండరాలలో నొప్పిఅలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడంనైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడం రక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలుఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చికిత్స లేదుఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది. -
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
దడదడలాడించే వ్యాధి..! సరైన చికిత్స సైతం..
రోడ్డును తొలిచే దగ్గరో లేదా కొత్తగా ఇల్లు కట్టే చోట రాతిని బద్దలు చేయడానికి వాడే మెకానికల్ గడ్డపలుగు / గునపం లాంటివి వాడినప్పుడు అది దడదడలాడుతూ చేతులను వణికిస్తుంటుంది. ఆన్ చేసిన ట్రాక్టర్ స్టీరింగుపై చేతులు ఆన్చినా అదీ చేతుల్ని దడదడలాడిపోయేలా చేస్తుంది. ఇలాంటి పరికరాలు చాలాకాలం వాడుతూ ఉండే వృత్తుల్లో ఉన్నవాళ్లలో కొందరికి వచ్చే జబ్బు పేరే ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’. కేవలం అలాంటి గడ్డపలుగు మాత్రమే కాదు... పవర్ డ్రిల్స్, జాక్ హ్యామర్స్, పెద్ద పెద్ద చెట్లను నరికేసే చైన్ సాల వంటి వాటిని వాడేవారిలోనూ ఇది రావడం సహజం. ఈ జబ్బుకు ‘హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (హావ్స్) అనీ, డెడ్ ఫింగర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ‘రేనాడ్స్ డిసీజ్’ అనే రక్తనాళాలలనూ, నరాలను దెబ్బతీసే ఒక కండిషన్ తాలూకు తర్వాతి రూపం (సెకండరీ ఫార్మ్) అని కూడా భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్లో ‘వైట్ ఫింగర్ డిసీజ్’కు తోడ్పడే జన్యువును సైతం ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’ ప్రధానంగా వేళ్లలోని రక్తనాళాలు, నరాలు, కండరాలూ, కీళ్లతో పాటు చేతులు, మణికట్టు వంటి వాటిపై తన దుష్ప్రభావం చూపుతుంది. మొదట్లో వేళ్ల చివర్లు తిమ్మిరిగా అనిపిస్తాయి. అటు తర్వాత అవి తెల్లగా పాలియినట్లుగా అవుతాయి. జబ్బు తీవ్రత బాగా పెరిగినప్పుడు వేళ్లు వేళ్లన్నీ తెల్లగా మారిపోతాయి. అందుకే ఈ జబ్బుకు ‘వైట్ ఫింగ్ డిసీజ్’ అని పేరు. అయితే... అలా తెల్లగా మారిన కొద్దిసేపటి తర్వాత రక్తం వేళ్ల చివరికి వేగంగా ప్రవహించడం వల్ల అవి ఎర్రగా కూడా మారవచ్చు. ఒకసారి వచ్చిందంటే... ఆ తర్వాత అత్యంత త్వరలోనే తాము చేసే పనిని మానేయాల్సిన (రిటైర్ అవ్వాల్సిన) పరిస్థితి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడుతున్నప్పటికీ... దీనికి సరైన చికిత్స అంటూ నిర్దిష్టంగా ఏదీ లేదు. అందుకే తీవ్రంగా / విపరీతంగా కంపిస్తూ పనిచేసే ఉకపరణాలతో పనిచేసేవారు తమ పని గంటలను తగ్గించుకుంటూ రావడమే ఓ మంచి నివారణ చర్య. (చదవండి: యూత్ఫుల్గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..? వేటిలో ఉంటాయంటే..!) -
పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.లెప్టోస్పిరోసిస్ అంటే ..?లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. లక్షణాలు..ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. వ్యాధి తీవ్రత..దీన్ని యాంటీ బయాటిక్స్తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. నిర్థారించడం కష్టమైతే..ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.ఎందువల్ల అంటే..కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్లలో లూజ్కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలిసారిగా..1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మద్యం, ధూమపానానికి దూరంగుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.అలసటపై నిర్లక్ష్యం వద్దుగుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.నిద్రలేమిని విస్మరించొద్దునిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.ఒత్తిడిని జయించండి అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.వ్యాయామం తప్పనిసరిఫిట్నెస్పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. -
గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!
రక్తంలో పలు రకాల గ్రూప్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్ గ్రూప్ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్ గ్రూప్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.పెప్టిక్ అల్సర్..ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.కేన్సర్కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.ఒత్తిడిసాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.వెయిన్స్ త్రాంబోఎంబోలిజంకొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహ వ్యాధి..ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
మగపిల్లలనే కబళించే భయంకర వ్యాధి..! బారిన పడితే అంతే ..!
కేవలం మగపిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి ఇది. వచ్చిందో అంతే సంగతులు. సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. కుటుంబంలో ఒక్కరూ బారిన పడ్డారంటే..ఆ తల్లి కడుపున పుట్టిన వారందరికీ కూడా వచ్చేస్తుంది. ఇంతకీ ఈ వ్యాధి పేరేంటంటే..?ఈ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ). దీన్ని ‘పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు ఏళ్ల వయస్సు నుంచి మొదలై ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల తెలంగాణలోనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం అందరీలోనూ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఒకేసారి తోబుట్టువులకీ వచ్చే అవకాశం..ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగేళ్లపాటు చాలా సాధారణంగా ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగా చక్కగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవారు. సడెన్గా పెద్దవాడు శారీరకంగా బలహీనంగా కనిపించడం ప్రారంభించాడు. దీంతో వైద్యులను సంప్రదించగా ..అసలు విషయం విని షాకయ్యారు. వెంటనే తమ్ముడుకు కూడా ఇవే టెస్టులు చేయగా.. ఇద్దరూ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిబారిన పడ్డట్లు పేరెంట్స్కు తెలిపారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టువులందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే దీనికి చికిత్స అందుబాటులో లేదని, కొంతకాలం ఇలాగే జీవించి చనిపోతారని వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన పిల్లలు యుక్తవయస్సు దాటి బతకడం కష్టమేనని అన్నారు.తీరని కడుపుకోత..అలాంటి ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. మన టాలీవుడ్ సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. తనను ఒక పేరెంట్ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయం చేయమని కోరడంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నానని చెప్పారు. అంతేగాదు గర్భం దాల్చిన 3వ నెలలో దాదాపు రూ. 3000 రూపాయలకే ప్రతి స్త్రీ ప్రీ-నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ సూచిస్తున్నారు. పిండానికి డీఎండీ ఉన్నట్లు గుర్తించినట్లయితే తక్షణమే గర్భం తీయించుకోవడం లేదా అబార్షన్ చేయించడం వంటివి చేయొచ్చని అన్నారు. లేదంటే వారిని బతికించుకోలేక కళ్ల ముంగిటే చనిపోతున్న బిడ్డలను చూసి తట్టుకోవడం ప్రతి తల్లిదండ్రులకు కష్టమేనని అన్నారు. అలాగే ఇలా గర్భం దాల్చిన సమయంలోనే ఆ టెస్ట్లు చేయించుకుంటే.. ఏ తల్లిదండ్రులకు కడుపు కోత అనుభవించాలన్సి పరిస్థితి ఎదురవ్వదని చెబుతున్నారు శ్రీనివాస్ అవసరాల.(చదవండి: International Chocolate Day: చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!) -
భారత్లో అనుమానిత మంకీపాక్స్ కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
అనుష్కకు వింత వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుష్క శెట్టి. 2005లో ‘సూపర్’ చిత్రంలో టాలీవుడ్కి పరిచమైన ఈ మలయాళ భామ..తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అరుంధతి చిత్రం ఆమె సినీ జీవితాన్నే మార్చేసింది. (చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్)ఆ తర్వాత వరుసగా ఫీమేల్ ఓరియెంటెండ్ మూవీస్ చేసి హిట్టుకొట్టింది.బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ భామ చేసిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మరో లేడి ఓరియెంటెండ్ మూవీ చేస్తోంది. (చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)ఇదిలా ఉంటే అనుష్క ఆరోగ్యంపై ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె నవ్వడం ప్రారంభిస్తే..చాలా సేపటివరకు ఆపలేదట. ఎవరైనా జోక్ చేస్తే పగలబడి నవ్వేస్తుందట. చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. దాని వల్ల షూటింగ్ సమయంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనుష్కనే చెప్పింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని తెలిపింది అనుష్క. అయితే ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యానికేమి ఇబ్బంది లేదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రముఖ లేడీ సింగర్కి అరుదైన వ్యాధి.. ఫలితంగా చెవుడు!
ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్లో టాప్ సింగర్స్లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?) View this post on Instagram A post shared by Alka Yagnik (@therealalkayagnik) -
‘పుష్ప’ విలన్కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?
మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్నెస్) టైమ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది. -
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
హీరోయిన్లు పైకి అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటారు. సమంత కొన్నాళ్ల ముందు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతోంది. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.'హార్ట్ ఎటాక్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ.. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. మరోవైపు బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయి.. 'ద కేరళ స్టోరీ', 'బస్తర్' లాంటి మూవీస్తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)'కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 'బస్తర్' చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని''కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం) -
జ్వరం ఒక వ్యాధి కాదు!
మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలని పోరపడుతూ ఉంటాం. నిజానికి జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజుల కు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా తాత్సారం చేస్తే జ్వర కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చురక్తశుద్ధికి...👉టేబుల్ స్పూన్ నెయ్యి లో పది మిరియాలు వేసి చిన్న మంట మీద వేయించి తర్వాత వడపోసి, మిరియాలు తీసివేయాలి. వీటిని ఆహారంలో మొదటి ముద్దలో కలిపి తినాలి, 40 రోజులపాటు ఇలా చేస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మవ్యాధులు అన్నీ హరించి వేస్తాయి పాస్టిక్ వాటర్ బాటిల్ లో, నీళ్లు తాగడం ఆపి కేవలం రాగి ΄ాత్రలో నీళ్లు మాత్రమే తాగండి ∙మీకు వచ్చే అన్ని రోగాలు, కొద్ది రోజులలో మటుమాయమవుతాయి. -
'పుష్ప' విలన్కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024 -
ప్రియుడు ఫోన్ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. ఎవరికి సోకుతుందంటే..ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్లో ఉన్నవాళ్లు ఈ లవ్బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కారణాలు.. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. -
సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!
వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్డ్రింక్లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్డ్రింక్లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!. నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! ఎన్ని లాభలంటే.. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్ ఫైబర్ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. వీళ్లు అస్సలు తాగొద్దు.. అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు. అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!. ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది. లక్షణాలు.. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నివారణ.. డీ హైడ్రేట్ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం. వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్లను ఉపయోగించాలి అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్లను ఉపయోగించడం వంటివి చేయాలి. నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గవదబిళ్ళకు చికిత్స.. ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. (చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!) -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది
గుంటూరు మెడికల్: మోహన్ ప్రతిరోజూ సిగిరెట్లు కాలుస్తాడు. మూడు నెలలుగా దగ్గు వస్తున్నా పట్టించుకోకుండా వదిలివేశాడు. స్మోకింగ్ మానేయాలని వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. చలికాలం ప్రారంభం కావడంతో ఇటీవల ఓ రాత్రివేళలో శ్వాసతీసుకోవటం ఇబ్బందిగా ఉండి నిద్రకూడ పట్టకపోవటంతో అర్థరాత్రి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు శ్వాసకోస నాళాలకు సోకే సీఓపీడీ వ్యాధి సోకినట్లు చెప్పి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఎందరో ఈ వ్యాధి సోకినా తెలియక ప్రాణాపాయ స్థితివరకు ఇళ్ల వద్ద ఉంటూ చివరి సమయంలో పరుగులు తీస్తున్నారు. 2019లో 3.23 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా సీఓపీడీతో మృతిచెందారు. మనదేశంలో ప్రతిఏడాది 2,300 మంది చనిపోతున్నారు. సీఓపీడీ అంటే... క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్( సీఓపీడీ). ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది. వ్యాధి సోకినవారికి గాలి గొట్టాలు ఇన్ఫెక్షన్కు గురై కొన్ని సార్లు మూసుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆయాసం, దగ్గు, కళ్లెపడటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, గుండెదడ, కాళ్లు వాయటం, పిల్లికూతలు, బరువు తగ్గటం, కొద్దిగా జలుబు చేయగానే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎక్సరే, స్పైరో మెట్రో లేదా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది... ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వస్తుంది. పొగతాగేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగకపోయినా పొగతాగేవారి పక్కన ఉండి పొగ పీల్చటం వల్ల కూడా వ్యాధి వస్తుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి వినియోగించేవారికి, బొగ్గు గనుల్లో, సిమెంట్ ఫ్యాక్టరీల్లో, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి, ధుమ్ము, ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారికి వ్యాధి సోకుతుంది. ఉబ్బసం( ఆస్తమా), అలర్జీ ఉన్నవారు జబ్బు నయం అయ్యేందుకు వైద్యం చేయించుకోకపోతే సీఓపీడీ రావచ్చు. జిల్లాలో వ్యాధి బాధితులు... జిల్లాలో 50 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఇరువురు లేదా, ముగ్గురు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల హాస్పటల్లో ప్రతిరోజూ పది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాససమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకు దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... నివారణ ఇలా... కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం అనే ఓవర్ క్రౌడింగ్ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగవాతావరణానికి ఎక్స్పొజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ అలవాటుకూ దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు... మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లూ నివారితమవుతాయి. చిన్నపిల్లలకు, పెద్దవయసు వారికి నిమోనియాను నివారించే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. -
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం!
మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది. ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్ఐవీ ప్రబలంగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా. సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవీ / ఎయిడ్స్ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్)ను మొదట హెచ్ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ని హెచ్ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్పోజర్ ప్రొఫై లాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్ ఎయిడ్స్’ పిలుపునిచ్చింది. డాక్టర్ యనమదల మురళీకృష్ణ వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్: 94406 77734 (నేడు ప్రపంచ ఎయిడ్స్ డే) -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
భారత్లో.. ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు భారీగా తగ్గనుంది
భారత్ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు మన దేశంలో.. అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. జన్ ఔషద కేంద్రాల్లో మెడిసన్ ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ ధూమపానంతో క్యాన్సర్ తో పాటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసా. ఒకరకరంగా చెప్పాలంటే సిగరెట్ కాల్చడం లేదు మన ఆరోగ్యానన్ని మనమే చేజేతులారా తగలెట్టుసుకుంటున్నాం అన్నాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఆయన మాటల్లో చూద్దామా! ఊపిరితిత్తుల వ్యాధులు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (COPD), బ్రోన్కైటిస్ తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం. 1. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2. క్షయ: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో క్షయ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3.-COPD అనేది ఊపిరితిత్తుల యొక్క పరిమిత గాలి ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ఇందులో బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా ఉన్నాయి. ధూమపానం COPDకి ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో COPD వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3. బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ COPD యొక్క ఒక రకం. ధూమపానం తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్కు ప్రధాన కారణం. గుండె జబ్బులు ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ తోపాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1.-గుండెపోటు: ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 3 రెట్లు పెంచుతుంది. 2. స్ట్రోక్ ఇది మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని 2 రెట్లు పెంచుతుంది. 3. ధూమపానం కొరోనరీ ఆర్టరీ వ్యాధి గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్ వంటి ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇతర క్యాన్సర్లు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు మూత్రపిండ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 1. మూత్రపిండాల క్యాన్సర్ ఇది మూత్రపిండాలలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం మూత్రపిండ క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 2. నోటి క్యాన్సర్ నోటిలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 3. గొంతు క్యాన్సర్: గొంతు క్యాన్సర్ అనేది గొంతులో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 4. గ్యాస్ట్రిక్ క్యాన్సర్: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది జీర్ణశయాంతరంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. 5. 5. 5. ప్యాంక్రియాస్ క్యాన్సర్: ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్లో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. ధూమపానం దంతాల ఆరోగ్యానికి హానికరం ధూమపానం దంతాల క్షయం, పళ్ళ మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటిలో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది అలాగే దంతాల క్షయానికి దారితీస్తుంది. దంతాల ఎనామెల్ను దెబ్బతీస్తుంది, ఇది పళ్ళ మధ్య రంధ్రాలకు దారితీస్తుంది. దంతాలపై పసుపు మచ్చలను ఏర్పరుస్తుంది. నోటిలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది. దంతాలను బలహీనపరుస్తుంది, ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. ఇలా క్యాన్సర్ మాత్రమె కాకుండా ధూమపానం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీయగలదు.అందుకని వీలైనంత తొందరగా మానేయటం ఉత్తమం. -ఆయుర్వేద వైద్యులు, నవీన్ నడిమింటి (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
క్రయోథెరపీ!
హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు కూడా. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆమె పలు రకాల వైద్య చికిత్సా పద్ధతులు అనుసరిస్తున్నారు. వైద్య చికిత్సలో భాగంగా తాజాగా క్రయోథెరపీ చేయించుకుంటున్నారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. క్రయోథెరపీలో భాగంగా గడ్డ కట్టేంత చల్లని నీటి టబ్లో మెడ భాగం వరకూ మునిగి ఉన్నారు సమంత. ‘‘క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరగడంతో పాటు రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ థెరపీ శరీరానికి సరికొత్త శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. రాజ్ –డీకే ద్వయం తెరకెక్కించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్సెఫలైటిస్తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్ఆర్తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ చీఫ్ -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
అనారోగ్యం అంటే ఏంటీ..? ప్రకృతి వైద్యం ఏం చెబుతోంది?
ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది. నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం. – డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య -
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్ఫాక్స్ వ్యాక్సినేషన్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి
-
భయపెడుతున్న కండ్లకలక, వేలల్లో కేసులు నమోదు!
బనశంకరి(బెంగళూరు): కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన హావేరి జిల్లా ప్రస్తుతం మద్రాస్ ఐ కండ్లకలక కేసుల్లోనూ మొదటిస్థానంలో నిలిచింది. 9901 మంది కండ్లకలక బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,506 కండ్లకలక కేసులు వెలుగు చూడగా బీదర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో శివమొగ్గ ఉంది. కండ్లకలక బాధితులు హావేరి జిల్లా ఆసుపత్రిలో వేలాదిమంది చికిత్స తీసుకుంటున్నారు.కాగా ఇటీవల రైతుల ఆత్మహత్యల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. రెండునెలల్లో 18 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదవండి: రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మీకు తెలుసా! వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి
రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
వైరస్లను గుర్తించే స్మార్ట్ వాచ్
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్వాచ్ అందుబాటులోకి వచ్చింది. టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్ను గుర్తించే ఈ స్మార్ట్వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది. -
వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు!
చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్ ప్లాట్ఫామ్పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. లెప్టోస్పైరా ఇంటెరొగాన్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు, కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్లలో పెంచే జంతువులతోనూ వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్/ వెయిల్స్ డిసీజ్’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్ను కలుగజేస్తుంది. అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్), అండర్గ్రౌండ్ సీవరేజ్ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్ వంటి మామూలు యాంటిబయాటిక్స్తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు. లక్షణాలు: బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో) ఛాతీ నొప్పి, కండరాల నొప్పి కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం) వాంతులు, విరేచనాలు కొందరిలో చర్మంపై ర్యాష్తో. నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స అందిస్తారు. డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ ఫిజీషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ (నిర్థారణ: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..!
తిరువనంతపురం: కేరళలో మరో అరుదైన బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి వెలుగులోకి వచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు.. షాంపుల్స్ను ల్యాబ్కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు. చికిత్సను ప్రారంభించామని తెలిపారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. కలుషిత నీటితో స్నానం చేయకూడదని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైరానా పెడుతున్న హెచ్ఐవీ -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్టెన్షన్తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!
తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. కాని దీన్ని తయారుచేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ తాటిబెల్లం దేవుడు ఇచ్చిన ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల తోపాటు అనేక విటమిన్లు దీనిలో ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో ఆహారం తీసుకున్న తర్వాత తాటిబెల్లం ముక్క తింటారు. పేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఆస్తమాని తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేగాదు ఎముకలకు బలాన్ని ఇచ్చి కాల్షియం, పోటాషియం, భాస్వరం తదితరాలు ఉంటాయి. దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల నీరసం రాదు, పైగా శరీర పుష్టి, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఎలాంటి వ్యాధులకు చెక్ పెడుతుందంటే.. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది. శరీరంలోని హానికర టాక్సిన్ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. చివరగా ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకులో ఎక్కువగా దొరుకుతుంది. దీంతో చేసుకునే సింపుల్ స్నాక్ ఐటెం తాటి బెల్లం నువ్వుల లడ్డు: కావాల్సిన పదార్థాలు: తాటి బెల్లం 2 కప్పులు నువ్వులు 2 కప్పులు తయారీ విధానం: తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు, తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి. (చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!) -
డాన్సింగ్ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. ఇదేం పనంటూ నెటిజన్స్ ఫైర్!
కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్ ఉంది. అందుకే ఫుడ్ బిజినెస్లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మాత్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆ వీడియో వైరల్గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) చదవండి: Video: బైక్పై లవర్స్ రొమాన్స్.. అందరిముందే హగ్లతో రెచ్చిపోయిన జంట -
ఓవైపు ఎండల మంటలు.. మరోవైపు మసూచి.. ఒక్క ఊళ్లోనే 100 మందికి
పాట్నా: వడగాల్పులు ఉత్తరాదిని వణికిస్తుండగా.. ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. తీవ్రమైన ఎండలతో ఉత్తరప్రదేశ్, బిహార్లో రోజురోజుకూ పెరిగిపోతున్న వడదెబ్బ బాధితులకు తోడు స్మాల్ ఫాక్స్(మసూచి) బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ హెచ్చవుతోంది. బిహార్లో ఓ గ్రామంలో దాదాపుగా సగం జనాభాకు ఈ వ్యాధి సోకడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సాపౌల్ జిల్లాలోని త్రివేణిగంజ్ గ్రామంలో 100 మందికి స్మాల్ ఫాక్స్ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనార్హం. అయితే.. గత మూడు నెలల నుంచి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ ఇప్పటి వరకు వైద్య అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. వ్యాధి వ్యాపించిన తొలినాళ్లలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తమ విన్నపాలను పెడచెవిన పెట్టారని చెబుతున్నారు. తమకు తెలిసిన వైద్యాన్ని చేస్తున్నట్లు చెప్పారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం ఆ గ్రామాన్ని వైద్య అధికారులు పరిశీలించారు. రోగులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమకు విషయం తెలియగానే ఆ గ్రామాన్ని సందర్శించామని జిల్లా వైద్య అధికారి మిహిర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున స్మాల్ ఫాక్స్ సోకడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వేసవి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: Video: గురుగ్రామ్లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. 5 కి.మీ మేర ట్రాఫిక్ -
అనారోగ్యం తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి: అనారోగ్యం తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివీ.. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మ దంపతుల కుమా రుడు వినోద్కుమార్(25) మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గత కొన్ని నెలలుగా సోరియాసిస్ వ్యాధి బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్కుమార్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గడ్డమల్లయ్యగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఆసరా అయ్యే సమయానికే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
టాయిలెట్కి వెళ్లలేని అరుదైన సమస్య! జీవితాంతం..
ఎన్నో జబ్బులు గురించి ఇంతవరకు విన్నాం. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. పైగా అవి ఏదో విటమిన్లోపం లేదా జన్యు సమస్యల కారణంగా వచ్చిన జబ్బులు. ఇంకాస్త ముందుకెళ్లితే మన పనితీరు కారణంగా వచ్చే విచిత్రమైన వ్యాధులు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునే ఈ వ్యాధి అత్యంత అరుదైనది, విని ఉండే ఆస్కారమే లేదు కూడా. ఎందుకంటే అది మనిషి జీవితంలో రొటిన్గా చేసే సాధారణ పనిని చేయలేకపోవడం. చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అరుదైన వ్యాధి బారిన పడింది 30 ఏళ్ల మహిళ. ఈ వ్యాధి పగవాడికి కూడా వద్దంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల మహిళ మూత్ర విసర్జన చేయలేకపోడం అనే వింత సమస్యతో బాధపడుతుంది. ఆ మహిళ పేరు ఎల్లే ఆడమ్స్. ఆమె అక్టోబర్ 2022లో తాను టాయిలెట్కి వెళ్లలేకపోతున్నట్లు తొలిసారిగా గుర్తించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆమె ఆరోజంతా టాయిలెట్కి వెళ్లలేకపోయింది. మనిషి నిత్య జీవితంలో సర్వసాధరణంగా చేసే పనిని చేయలేకపోతున్నానంటూ భోరున విలపించింది. దీంతో ఆమె వైద్యలును సంప్రదించగా..వారు అత్యవసర క్యాథెటర్ను అందించారు. అంటే ఒక ఒక గొట్టాన్ని మూత్రాశయంలోకి పంపి యూరిన్ని తీయడం. దీంతో ఆమె మూత్రశయం నుంచి లీటర్ యూరిన్ తీశారు వైద్యులు. ఇది సాధారణంగా రోగికి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడే ఉపయోగిస్తారు. అయితే ఎల్లేకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే యూరిన్ని ఇలా తీయాల్సి వస్తోంది. ఆ గొట్టాన్ని తీసేసి బాత్రూంకి వెళ్లి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. చివరికి ఎన్ని మందులు వాడిని ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. దీని గురించి యూరాలజీ సెంటర్ల చుట్టు తిరుగుతూనే ఉంది. సరిగ్గా 14 నెలలు తర్వాత వైద్యులు నిర్వహించిన పలు టెస్ట్ల ద్వారా ఎల్లే ఫౌలర్స్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇక జీవితాంతం మూత్ర విసర్జన చేయడానికి క్యాథెటర్ అవసరం అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవని తెలిపారు. ఫౌలర్స్ అనేది యూరిన్ని పాస్ చేయలేని సమస్య. ఇది ఎక్కువగా యువతులలోనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల తాను ఎంతగా ఇబ్బందిపడుతోందో కన్నీరుమున్నీగు చెబుతోంది ఎల్లే. (చదవండి: మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్ దుమారం!) -
కలకలం రేపుతున్న కొత్త వ్యాధి.. నీటితో జాగ్రత్త.. సోకితే బతకడం కష్టమే!
ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఆ వైరస్ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అయితే అక్కడక్కడ వెలుగుచూస్తున్న కొత్త వైరస్లు, ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఫ్లోరిడాలో ఓ వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఒక వ్యక్తి తన ముక్కును పంపు నీటితో కడుక్కోవడంతో వైరస్ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. అరుదైన వ్యాధి.. సోకితే కష్టమే! బ్రెయిన్ తినే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలెరీ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ధృవీకరించింది. ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారినపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సీడీసీ ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ఈ అమీబా సోకితే మెదడుని తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ (అమీబా) ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. అక్కడ అది జీవి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది, ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 154 మందిలో బయటపడింది కేవలం నలుగురు ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97 శాతం మంది మరణించారని, 1962-2021 మధ్య కాలంలో యూఎస్లో 154 మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
వెండితెరపై తమ అందం, గ్లామర్తో ఆకట్టుకుంటునే భామలు వ్యక్తిగతంగా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత, మమత మోహన్ దాస్, శృతి హాసన్తో సహా పలువురు నటీనటులు ఉన్నారు. ఇటీవల మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్ ప్రస్తుతం కోలుకుంది.మయోసైటిస్తో బాధపడుతున్నానని సమంత వెల్లడించడంతో పలువురు నటీనటులు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమ వ్యాధిని బయటపెట్టారు. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. తాజాగా స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె తాను బాధపడుతున్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. తనకు నవ్వే జబ్బు ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద సమస్య కానప్పటికి తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ ‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నవ్వుని అసలు కంట్రోల్ చేసుకోలేను. ఇక సెట్లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ ఆపేసుకోవాల్సిందే. దాదాపు 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. ఈ గ్యాప్లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని అంటూ తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనుష్క మైత్రి మూవీ ప్రొడక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
కరీంనగర్ జిల్లా: నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురి మృతి
-
అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్లో కుటుంబం బలి
సాక్షి, కరీంనగర్: అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. ఒకే వ్యాధితో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన గంగాధర మండల కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు..గంగాధరకు చెందిన లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. నవంబర్ నెలలో మొదట శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు విరేచనాలు, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తనయుడి మరణం నుంచి కోలుకోకముందే శ్రీకాంత్ కూతురు అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్9న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. ఇటీవల ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్కు ఏడుపే మిగిలింది. భార్య, పిల్లల మృతితో అనారోగ్యానికి గురైన శ్రీకాంత్ కూడా శనివారం ఉదయం ఇంట్లో రక్తం కక్కుకొని మరణించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతుల రక్త నమూనాలను పుణె ల్యాబ్కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కుటుంబానికి బలితీసుకున్న వ్యాధి ఏంటనేది మిస్టరీగా మారింది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట హైదరాబాద్లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. మరోవైపు అంతుచిక్కని వ్యాధిపై గంగాధర స్థానికల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. -
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
వేప చెట్లకు ముప్పు..
సాక్షి, హైదరాబాద్: కొమ్మల ముడత లేదా డైబ్యాక్ అని పిలిచే విధ్వంసకర వ్యాధితో ప్రస్తుతం వేపచెట్లకు ముప్పున్నదని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ పాథాలజిస్ట్ డా.జగదీశ్ తెలిపారు. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుందని, ఐతే దీని వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేంత బలంగా మన రాష్ట్రంలోని చెట్లున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆగస్టు–డిసెంబర్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం మొదలయ్యాక లక్షణాలు కనిపిస్తాయని, వర్షాకాలం చివర్లో శీతాకాలంలో ఇది క్రమంగా తీవ్రమవుతుందని వివరించారు. విత్తన శుద్ధితో తగ్గుముఖం వేప విత్తనాలు విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి ఈ సంక్రమణను తగ్గిస్తుందని తెలియజేశారు. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాముల లీటరు నీరు లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు కచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, వ్యాధులకు నిరోధకతను కల్పిస్తాయని తెలిపారు. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని బాగా తట్టుకోగలుగుతుందని, తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీలో అధ్యయనాలు నిర్వహించామని, వ్యాధికారక కారణాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఇది వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9705893415 నంబర్లో సంప్రదించవచ్చునని జగదీశ్ తెలియజేశారు. -
సమంత లాగే నాకు కూడా మయోసైటిస్ ఉంది : హీరోయిన్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి కదల్లోని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్తో పాటు వైరస్, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్ వస్తుంది. ప్రస్తుతం సమంత దీనికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కూడా మయోసైటిస్ వ్యాధితో పోరాడినట్లు హీరోయిన్ పియా బాజ్పేయ్ తెలిపింది. సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్ బారిన పడ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నాకు మయోసైటిస్ వచ్చిందని విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నా. సమంతకు మయోసైటిస్ ఉందని తెలియగానే బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది. కాగా పియా బాజ్పేయి జీవా హీరోగా నటించిన 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై నాగ చైతన్య స్పందిస్తాడా?
సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్కి గురయ్యారు. చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్ సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా, నందినిరెడ్డి, వంశీపైడిపల్లి సహా పలువురు ప్రముఖులు స్పందించారు.ఆమెకు ధైర్యం చెబుతూ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. మరోవైపు సమంత అనారోగ్యంపై నాగచైతన్య స్పందిస్తాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్లా అయినా చై సామ్ గురించి పోస్ట్ చేస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2018లో పెళ్లి చేసుకున్న చై-సామ్లు గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా? -
'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?
సమంత 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్స్టా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సామ్ పోస్ట్ చూసి సినీతారలు సహా ఆమె ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు. 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా మయోసైటిస్ అనే వ్యాధి కారణంగానే సమంత ముఖం మారిపోయిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్ బయట కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అప్పటికే రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇటీవలె ఓ యాడ్లో కనిపించిన సమంత ముఖం ఉబ్బిపోయి తేడాగా కనిపించింది. దీంతో సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి. కానీ తాజాగా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడున్నట్లు స్వయంగా సమంత పేర్కొనడంతో ఆ వ్యాధి కారణంగానే సమంత ముఖం అలా మరిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకావాలంటూ ఆమె ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. చదవండి: సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్ -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
భారత్లో టమాటో ఫ్లూ కలకలం...హెచ్చరించిన లాన్సెట్ నివేదిక
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. (చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం) -
బాధపడుతూ వదిలేసినా.. బతికేందుకు దారి చూపాడు
ఈ ఫొటోలో దీనంగా కనిపిస్తున్న కుక్కను చూశారుగా. దీని పేరు బేబీ గర్ల్. మంటలు ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఓ ఫైర్ హైడ్రంట్కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగుంది. జంతువుల బాగోగులను చూసుకునే ఓ చారిటీ వాళ్లు వచ్చి ఆ కుక్కను, ఆ బ్యాగును చూశారు. కుక్కను ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారని అనుకుంటూ ఆ బ్యాగును తెరిచి చూశారు. దాన్నిండా ఆ కుక్క ఆడుకునే వస్తువులు, దానికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆ కుక్కును పెంచుకునే యజమాని ఓ లేఖను కూడా గుర్తించారు. దాన్ని చదివి చలించిపోయారు. యజమాని చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు వెంటనే కుక్కను మెడికల్ టెస్టుకు పంపారు. దానికి కెనైన్ డయాబెటిస్ (డయాబెటిస్ మిల్లిటస్) వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుంది. కుక్కను పెంచుకుంటున్న యజమానే కొన్ని వైద్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వ్యాధి చికిత్సకే డబ్బులు సరిపోక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు కుక్కు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని బాధపడ్డాడు. మరో అవకాశం లేక.. లోలోపల బాధపడుతున్నా ఎవరో ఒకరు ఆదుకోకుండా ఉంటారా జనాలు తిరిగే వీధిలో దాన్ని వదిలేశాడు. కానీ ఉండలేకపోయాడు. కుక్కను చారిటీ వాళ్లు తీసుకెళ్లారని తెలుసుకొని పరుగును వాళ్లను కలుసుకున్నాడు. ఆయన తిరిగి రావడం చూసి చారిటీ వాళ్లు సంతోషించారు. ‘కుక్కకు ఇష్టమైన వస్తువులను ప్యాక్ చేసి, ప్రమాదవశాత్తు కార్ల కింద పడకుండా, అందరికంట పడేలా ఓ పక్కన కట్టేసి, ఎందుకు వదిలేశారో లేఖను రాసిన తీరును చూసి కుక్కంటే మీకెంతిష్టమో మాకు అర్థమైంది’ అన్నారు. ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదని, బేబీ గర్ల్కు మంచి భవిష్యత్తు ఉందని భరోసానిచ్చారు. ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ బే ప్రాంతంలో జరిగింది. -
Tomato Flu: చిన్నారుల్లో అంతుచిక్కని ‘టమాటో ఫ్లూ’ కలకలం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. అలాగే వలయార్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
జుట్టును ఎంత దువ్వినా మాట వినదు.. ఈ వ్యాధికి చికిత్స ఉందా?
ఫొటో చూడండి. పిల్లాడి జుట్టు గమ్మత్తుగా ఉంది కదా. ఏ హెయిర్ స్టైలిస్టో కానీ భలే పనిమంతుడు.. బాగా సెట్ చేశాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇది మనుషులు సెట్ చేస్తే వచ్చేది కాదు. వెంట్రుకలకు వచ్చే వ్యాధి వల్ల జుట్టు ఇలా తయారైంది. దీన్ని అన్ కోంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (యూహెచ్ఎస్) అంటారు. జన్యుప రమైన సమస్యలతో ఇలాంటి సమస్య వస్తుంటుంది. ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా 3–12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ల జుట్టును ఎంత దువ్వినా చెప్పిన మాట వినదు. పొలుసులుగా నిటారుగా నిలబడి ఉంటుంది. మెల్లమెల్లగా రాలిపోతుంటుంది. ఇలాంటి వాళ్ల జుట్టులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. మామూలు మనుషుల వెంట్రుకల మొనలు స్థూపాకారంలో ఉంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ల వెంట్రుకలు త్రిభుజాకారంలో మారిపోతాయి. చదవండి👉ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా.. అందుకే దువ్వెనతో కూడా దువ్వలేనంతగా వింతగా, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. జన్యుపరమైన మార్పు వల్ల కొందరిలో చర్మం, పళ్లు, గోర్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏం లేదు. అయితే కొందరు పిల్లల్లో బయోటిన్ వాడటం వల్ల కొంత మార్పు కనిపిస్తోందని.. మరికొందరిలో వయసు పెరుగుతున్నాకొద్దీ సమస్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మలేరియా లేని ప్రపంచం కోసం...
చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్ 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. దీనిని ‘ప్లాస్మోడియం’ జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అనే ఐదు రకాల పరాన్నజీవుల వలన మానవులకు మలేరియా సోకుతోంది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ద్ధరించారు. ఇందుకుగానూ ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ‘అనాఫిలస్’ జాతికి చెందిన ఆడ దోమల వలన మలేరియా వ్యాధికారక క్రిమి వ్యాప్తి చెందుతుంది. మలేరియా వ్యాధి తీవ్రతను అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో ‘‘ఆఫ్రికా మలేరియా డే’’ ఆచరించింది. అదే స్ఫూర్తితో 2008 నుండి ఏప్రిల్ 25ను ‘వరల్డ్ మలేరియా డే’గా ఆచరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల మంది మలేరియా వ్యాధి బారినపడగా, 6 లక్షల 27 వేల మంది చనిపోయారు. ఇక మనదేశం విషయానికివస్తే 2021లో అధికారికంగా 1,58,326 మలేరియా కేసులు గుర్తించగా, 80 మరణాలు సంభవించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణల్లో కనుగొన్న నూతన ఆవిష్కరణల ఫలితంగా గత 10 సంవత్సరాల్లో మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలు, దీర్ఘకాలం వినియోగించ గలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాల వలన ఇది సాధ్యమైంది. దీన్ని సాధించడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు చేసిన కృషి ఎనలేనిది. 2030 నాటికి భారత దేశం నుండి మలేరియా వ్యాధిని పూర్తిగా తొలగించడానికి పథక రచన చేశారు. – తలతోటి రత్న జోసఫ్ రిటైర్డ్ ఏడీ; ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ -
జాతీయ మహమ్మారి ‘బ్రూసెల్లోసిస్’: పశువులతో పాటు మనుషులకూ ప్రమాదమే
సాక్షి, పాలకొల్లు అర్బన్: బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. జాతీయ ప్రాజెక్టుగా వ్యాధి నివారణ... ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఏడాదిలో మూడు సార్లు ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు చొప్పున పశువులకు అందించాలని కార్యాచరణ రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ఒకసారి పశువులకు చేస్తే జీవిత కాలంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 29,159 పశువులకు ఈ వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పశువులకు వేసేటప్పుడు రక్షణ పరికరాలు వినియోగించాలి. లేనిపక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకొల్లు మండలం గోరింటాడలో ఆవుదూడకి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు పిండం ద్వారా గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. గర్భస్రావం జరిగిన పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవుల మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్లిపోవడం వల్ల పిండం మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా రెండు, మూడు ఈతల్లో సంభవిస్తాయి. మనుషులకు వ్యాప్తి ఇలా.. బ్రూసెల్లోసిస్ సూక్ష్మజీవులు మనిషి కంటి పొరల ద్వారా లేదా ఈ వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం ఆహారంగా భుజించడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు చెందుతాయి. వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరగదు. పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అబార్షన్ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు అవగాహన పెంచుకోవాలి బ్రూసెల్లోసిస్ వ్యాధి చాలా కాలం నుంచి పశువులకు సోకుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో కొన్ని పశువులను గుర్తించి వ్యాక్సిన్ అందించాం. ఈ వ్యాధిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్ వేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, భీమవరం -
అరుదైన కుషింగ్స్ వ్యాధి: భారీ పొట్ట, ఇతర లక్షణాలు తెలుసా?
-
క్యాన్సర్పై యుద్ధం..మాస్ స్క్రీనింగ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్)గా నియమించింది. ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్) క్యాన్సర్తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్), రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్గా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 240 మంది మహిళలు స్క్రీనింగ్కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పాప్స్మియర్ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్లన్నింటీని గుంటూరు జీజీహెచ్లోని నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి తరలించారు. ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్కుమార్ నేతృత్వంలోని కోర్ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. సచివాలయం యూనిట్గా స్క్రీనింగ్ నిర్వహణ సచివాలయం యూనిట్గా మాస్ స్క్రీనింగ్ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్ రోగులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ద్వారా దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు వాకబు చేస్తారు. – నవీన్కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్బనేగా శిఖర్వతి’ వెబ్సిరీస్లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
ఆమెకు ‘కొరియా’ వ్యాధి.. ప్రపంచం మొత్తంలో వెయ్యి మందికి మాత్రమే
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఆమె వయస్సు 32. కానీ చూడటానికి 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. కాళ్లు చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతూ ఉంటాయి. అన్నం తినేందుకు నోట్లో ముద్ద పెడితే.. తన ప్రమేయం లేకుండానే నాలుక ఆ ముద్దను బయటకు తోసేస్తుంది. ఇలాంటి వింతైన, అరుదైన పరిస్థితిని ఆస్పరికి చెందిన వీరేషమ్మ అనుభవిస్తోంది. వైద్యం చేయించాలని కుటుంబసభ్యులు కనిపించిన వైద్యులందరి వద్దకు తిరిగారు. మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం పట్టిందేమోనని భూతవైద్యులనూ ఆశ్రయించారు. ఇలా ఆ కుటుంబం దాదాపు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసింది. చివరకు కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్ డాక్టర్ హేమంత్కుమార్ ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్ ఎక్సీమ్ సీక్వెన్సింగ్ జెనటిక్ టెస్ట్ను అహ్మదాబాద్కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్ 13ఎ అనే జీన్ మ్యూటేషన్ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ చెప్పారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సీజనల్ వ్యాధులు.. కిచెన్ ఫార్మసీతో చెక్ పెట్టండి
ఈ సీజన్ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి. ►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. ►పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి. ►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. ►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి. ►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. -
పాదాలు కదలడం లేదా? అయితే గులియన్ బ్యారీ సిండ్రోమ్!
కొంతమందిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గాక... ఎందుకోగానీ.... వారి సొంత వ్యాధినిరోధక శక్తే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఓ రుగ్మతే ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’. ఇందులో బాధితుడు చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంటాడు. కానీ అతడి దేహం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. సంక్షిప్తంగా ‘జీబీ సిండ్రోమ్’ అని పిలిచే... ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ గురించి తెలిపే కథనమిది. ఓ చిన్న కేస్స్టడీ ద్వారా గులియన్ బ్యారీ సిండ్రోమ్ తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్ టాయిలెట్కు వెళ్లాడు. పనిపూర్తయ్యాక లేచి నిలబడి ఎప్పటిలాగే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా పాదాలు కదలడం లేదు. అత్యంత కష్టంగా బయటకు వచ్చాడు. కాళ్లెందుకు స్వాధీనంలో లేవో తెలియలేదు. దాంతో హాస్పిటల్లో చేరాడు. తొలుత పాదాలూ, కాళ్లే కాదు... క్రమంగా నడుమూ... అటు తర్వాత చేతులు, మెడ... ఇలా దేహంలోని అన్ని అవయవాలూ అచేతనమైపోవడం మొదలైంది. బయటకు కనిపిస్తున్న ఆ లక్షణాలను గమనించిన డాక్టర్లు దాన్ని ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’గా భావించారు. కారణం... మనకు ఏవైనా వైరస్ల వల్ల జ్వరం/ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి, ఆ జ్వరానికి/ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్ను తుదముట్టిస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా యాంటీబాడీస్ ఆ వైరస్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అది నరాలనూ దెబ్బతీసే అవకాశముంది. అలా జరిగినప్పుడు ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ కనిపించవచ్చు. అయితే నరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయం మనలో తయారైన యాంటీబాడీస్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. మెడలను నిలపలేరు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించాలి. ఇక మిగతా 20 శాతం మందిలో ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకిలా జరుగుతుందంటే...? మన మెదడు... దేహంలోని ప్రతి అవయవాన్నీ నియంత్రిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. మెదడు నుంచే నరాల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ, కండరాలకు ఆదేశాలూ, సమాచారాలూ అందుతూ ఉంటాయి. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర (మైలీన్ షీత్) ఉంటుంది. వాస్తవానికి ఈ పొర కారణంగానే ‘కదలిక’లకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో అయా అవయవాలకు అందుతూ ఉంటుంది. ఒక్కోసారి మన వ్యాధినిరోధకతకు దోహదపడే యాంటీబాడీస్... ఏ కారణం వల్లనో ఈ ‘మైలీన్’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు నుంచి అందే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది. దాంతో కండరాలను కదిలించడం సాధ్యం కాదు. ఆ విధంగా మైలీన్ పొర దెబ్బతిన్న ప్రతి కండరమూ అచేతనమవుతుంది. తీవ్రత స్థాయులు వ్యాధి తీవ్రత చాలా స్వల్పం మొదలు కొని అత్యంత తీవ్రం వరకు ఉండవచ్చు. స్వల్పంగా ఉంటే నడవడం కష్టం కావచ్చు. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితుడు పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం జరగవచ్చు. సాధారణంగా కాళ్లూచేతులు కదిలించడం అన్న పనులు మన ప్రమేయంతో మనమే చేసేవి. చాలా సందర్భాల్లో జీబీ సిండ్రోమ్లో మన ప్రమేయం లేకుండా జరిVó కీలక కార్యకలాపాలు చాలా అరుదుగా ప్రభావితమవుతాయి. ఒకవేళ అలా జరిగినçప్పుడు కొందరిలో గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం జరగవచ్చు. కాస్తంత అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడయూ జరగవచ్చు. ఒకసారి వ్యాధి కనిపించడం మొదలయ్యాక అది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో క్రమంగా పెరుగుతూ, తీవ్రమవుతూ పోవచ్చు. బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి... ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం మొదలుకావచ్చు. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్ అందకపోవడం జరిగితే... అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. చికిత్స : గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నా, బీపీలో హెచ్చుతగ్గులు, గుండె స్పందనల్లో లయ తప్పుతున్నా (అటనామిక్ న్యూరోపతి ఉన్నా) వాళ్లకు జీబీ సిండ్రోమ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. ప్రస్తుతం బాధితులకు రెండు రకాల ప్రధాన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి... ►ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స: బాధితుడి బరువు ఆధారంగా నిర్ణయించిన మోతాదు ప్రకారం...అతడికి ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి మన దేహంలోని యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కబరుస్తాయి. తద్వారా నరాల పైన ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ►ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స: ఈ చికిత్సలో శరీరంలో జబ్బుకు కారణమైన యాంటీబాడీస్ను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బాధితుడి శరీరం బరువును పరిగణనలోకి తీసుకుని... ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్ఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా.... అంటే దాదాపు నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేస్తారు. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాను సెలైన్, ఆల్బుమిన్లతో భర్తీ చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. ఈ రెండూ ఇంచుమించూ సమానమైన ఫలితాలనే ఇస్తాయి. రోగి కోలుకునే అవకాశాలు : ►జీబీ సిండ్రోమ్ వచ్చిన రోగుల్లో చాలామంది పూర్తిగా కోలుకునే అవకాశాలే ఎక్కువ. అయితే 3 శాతం నుంచి 5 శాతం రోగుల్లో మాత్రం మంచి చికిత్స ఇప్పించినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక పది శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. ఈ గణాంకాలు మినహాయించి మిగతా అందరిలోనూ కోలుకునే అవకాశాలు ఎక్కువే ఉండటం ఓ సానుకూల అంశం. ►వయసు పైబడిన రోగులతో పోలిస్తే వయసులో ఉన్నవారు, యుక్తవయస్కులు చాలా త్వరగా కోలుకుంటారు. ►చచ్చుబడ్డ అవయవాలు పూర్తిగా పనిచేయడం ప్రారంభించి మళ్లీ నార్మల్ కావడం అన్న అంశం రోగి నుంచి రోగికి మారుతుంది. ►ఐదు శాతం మందిలో మాత్రం జీబీ సిండ్రోమ్ వచ్చినవారికే మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి. -
'జెర్సీ' పేరు మీద ఓ జబ్బు ఉంది తెలుసా? చికిత్స వివరాలు ఇవిగో..
ఆటగాళ్లు ధరించే ప్రత్యేకమైన షర్ట్ను ‘జెర్సీ’ అంటారన్న సంగతి తెలిసిందే కదా. ఆ జెర్సీ పేరు మీద కూడా ఓ జబ్బు ఉంది. దాని పేరే ‘జెర్సీ ఫింగర్’! ఈ జబ్బు ఎందుకు వస్తుందో, దానికి చికిత్స ఏమిటన్న విషయాలు తెలిపే సంక్షిప్త కథనమిది. మైదానంలో ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ, ప్రత్యర్థిని నిలువరిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే వేళ్లన్నీ గుప్పిటలా బిగించి... ప్రత్యర్థి జెర్సీని అప్రయత్నంగానే లాగేస్తుతుంటారు. మరీ ముఖ్యంగా ఫుట్బాల్ ఆటలో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు వేగంగా ఆడే సమయంలో... వారి వేళ్ల కండరాలు చురుగ్గా కదిలేందుకు కొన్ని టెండన్స్ తోడ్పడుతుంటాయి. ఈ టెండన్స్ అనేవి ఎముకలనూ, కండరాలను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి టెండన్స్లో ‘ఫ్లెక్సార్ టెండన్’ చాలా ప్రధానమైనది. ఆటగాళ్ల కదలికల సమయంలో ఈ ఫ్లెక్సార్ టెండన్ చీరుకుపోవడమో లేదా దెబ్బతినడమో జరగవచ్చు. ఇదే జరిగితే... ఆటగాళ్ల మణికట్టులోగానీ, అరచేతిలోగానీ లేదా నేరుగా వేళ్లకే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ కారణంగా వచ్చే నొప్పినే ‘జెర్సీ ఫింగర్’ అంటారు. జెర్సీ ఫింగర్తో బాధపడే ఆటగాళ్లు... తమ వేలిని ఏమాత్రం ఒంచలేకపోవడం, అది పూర్తిగా మొద్దుబారడం, గాయపడిన భాగం ఎర్రబారడం, ముట్టుకోనివ్వకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మేనేజ్మెంట్ / చికిత్స : గాయపడ్డ చేతికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం లేదా దాని కదలికలను పూర్తిగా నివారించేలా ఓ స్లింగ్ అమర్చడం ద్వారా కొద్దిరోజుల్లోనే సమస్య దానంతట అదే తగ్గుతుంది. బాధ చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉంటే... అప్పుడు ఫ్లెక్సార్ టెండన్ అతుక్కుని ఉండవలసిన కండరానికి, ఎముకకూ దాన్ని కలిపేలా ఓ చిన్నపాటి శస్త్రచికిత్స అరుదుగా అవసరం పడవచ్చు. టెండన్ చిరిగినప్పుడు మాత్రమే ఈ శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
వికటించిన పెడిక్యూర్.. ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం
మహిళలు బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటారనే విషయం తెలుసు. కానీ ఒక్కొసారి అవి వికటిస్తే ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో కుడా ఇటీవల చూస్తున్నాం. అచ్చం అలానే ఒక మహిళ పాదాలకు మానిక్యూర్ చేయించకున్న తర్వాత ఆమె ఏకంగా కాలునే పొగొట్టుకుంది. (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) అసలు విషయంలోకెళ్లితే....ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్కి వెళ్లింది. అయితే అప్పుడు ఆమె పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంది. అప్పుడు పార్లర్ వాళ్లు పాదాలు మంచి అందంగా ఉండే నిమిత్తం కాస్మటిక్ ట్రీట్మెంట్ వంటివి చేశారు. అయితే ఆ సమయంలో ఆమె పాదం కాస్త తెగుతుంది. ఈ మేరకు ఆమెకు ఫెరిఫెరల్ వాస్క్యూలర్ అనే వ్యాధి( రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఏర్పడి ద్వారాలు ఇరుకై రక్త ప్రవహానిక అవరోదం ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు. దీంతో ఆ చిన్న గాయం కాస్త మానకపోగా పూర్తిగా ఇన్ఫెక్షన్కి గురై కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైద్యా ఖర్చుల అధికమవ్వడమే కాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లును కూడా కోల్పోయింది. అయితే 55 ఏళ్ల ఈ మహిళ పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఏదిఏమైతేనే ఆ టామీస్ నెయిల్స్ పార్లర్ మూడు సంవత్సరాల తర్వాత తమ తప్పుని ఒప్పుకోవడమే కాక ఆ మహిళకు ఏకంగా రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. (చదవండి: తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!) -
Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది..
వేప చెట్టులో వెయ్యి జబ్బులను నయం చేసే గుణాలున్నాయంటారు. ఆయుర్వేదంలో ఇది లేని మందు లేదు. ఇక వేప నూనె, వేప కషాయాలను చీడపీడల నివారణకూ ఉపయోగిస్తారు. నాలుగైదు లేత వేపాకులు తింటే రక్తం శుద్ధి అవుతుందంటారు. చిన్నారులకు చెంచాడు వేప కషాయం తాపితే దగ్గు తదితర సమస్యలు బలాదూర్ అనాల్సిందే. అపర సంజీవినిగా పరిగణించే ఈ వేప చెట్లకే ఇప్పుడు ఆపదొచ్చింది. ఉన్నట్టుండి ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే వేలకొలది చెట్లు మోడు బారుతుండటతంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్ అధికారులు కానీ ముందుకు రావడం లేదు. – కర్నూలు అగ్రికల్చర్/ఆత్మకూరు రూరల్ చిగురుటాకు వద్ద మొదలై.. వేప చెట్టు చిగురుటాకులు ఎండిపోతున్నాయి. క్రమంగా చెట్టుకు ఉన్న మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తోంది. చివరికి చెట్టు మొత్తానికి పాకి మోడుగా కళావిహీనంగా తయారవుతుంది. ఈ తెగులు కర్ణాటకలో మొదలై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకూ విస్తరించినట్లు సమాచారం. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా వేప చెట్టు ఎండిపోయి కనిపిస్తుండటంతో భవిష్యత్లో వేప ఉత్పత్తులు కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) తెగులుపై భిన్నాభిప్రాయం.. వేపచెట్లు ఎండిపోతుండటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డై బ్యాక్ డిసీజ్ వల్లే వేప చెట్ల చిగుర్లు ఎండిపోయి చనిపోతున్నాయని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాదుకాదు ఫోమోప్సిన్ అజాడిరిక్టేట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే చెట్లు ఎండిపోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ విజృంభిస్తుందంటున్నారు. గోరింటాకు రసాన్ని వేప చెట్లపై పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించ వచ్చని చెబుతున్నారు. ఈ ఫంగస్ వ్యాప్తి చెందిన చెట్లపై ఎండిపోయిన ఆకులు, కొమ్మల్లో టీ మస్కిటో బగ్ అనే క్రిమి స్థిర నివాసం ఏర్పరుచుకుని వేప చెట్టు నిర్జీవమయ్యేలా చేస్తోందని వృక్ష శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వయస్సు ఉన్న వేప చెట్లు ఈ తెగులు నుంచి త్వరగా కోలుకుంటుండగా కాస్త వయసైన చెట్లు ఎండిపోతున్నాయంటున్నారు. కానీ అధికారికంగా ఎవరూ ఫలానా తెగులు వల్లే చెట్లు ఎండిపోతున్నాయని కానీ, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కానీ ప్రకటించకపోతుండటంతో వేప చెట్టు మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. -
హైదరాబాద్లో చాపకింద నీరులా పాకుతున్న కొత్త వ్యాధి.. గాంధీ ఆస్పత్రిలో 15 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఇప్పటికే కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో భాగ్యనగర వాసులను మరో కొత్త రకం వ్యాధి పీడిస్తోంది. స్క్రబ్ టైఫస్ పేరుతో ఉన్న ఈ వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం. స్క్రబ్ టైఫస్ అనే పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. క్రమంగా దీని బాధితుల సంఖ్య కూడా పెరుగడం వైద్యులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధితో గాంధీ ఆస్పత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. అందులో ఇద్దరు కోలుకోగా, మిగిలిన ఇద్దరికి చికిత్స జరగుతోంది. అయితే, ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో సబ్టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అక్కడ కూడా బాధితుల్లో అధికంగా చిన్నారులే ఉన్నారు. అసలే ఒమిక్రాన్తో హడలిపోతున్న నగర వాసులకు ఇప్పుడు స్క్రబ్ టైఫస్ వైరస్కు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ) ప్రకారం, స్క్రబ్ టైఫస్ (ఓరియంటియా సుట్సుగముషి) అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. దీనిని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ ఒక క్రిమి (లార్వా మైట్) కాటు ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు.. దీని కాటు వల్ల.. తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి, కళ్లు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావాలన్నీ కూడా 10 రోజులలోపు బయటపడతాయి. కనుక ఈ లక్షణాలు కనిపించిన తక్షణమే వైద్యులను సంప్రదించాలి. చదవండి: Tamil Nadu: ట్రాన్స్జండర్గా మారుతానన్నందుకు కొడుకును హతమార్చిన తల్లి! -
Covid: జీవితాన్ని కడగండ్లపాలు చేస్తున్న కొత్త జబ్బులు..
సాక్షి, బనశంకరి (కర్ణాటక): జీవితాన్ని కడగండ్లపాలు చేసే ఇతర జబ్బులకు కూడా కోవిడ్ రక్కసి కారణమవుతోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 59, 632 మంది డయాబెటిస్, రక్తపోటు (బీపీ) రోగాల బారినపడినట్లు జాతీయ డయాబెటిస్ నియంత్రణ కార్యక్రమంలో వెల్లడైంది. కొత్తగా షుగర్ జబ్బు కనబడిన రోగుల్లో 35 నుంచి 40 శాతం మంది కోవిడ్కు గురైనవారిగా తేలింది. జీవనంలో మార్పులకు తోడు కోవిడ్ సోకడం వల్ల షుగర్, బీపీ ప్రమాదం పెరిగింది. తీవ్రమైన కోవిడ్ బారినపడినవారికి చికిత్సలో స్టెరాయిడ్స్ ఔషధాలను ఇస్తారు. దీంతో దేహంలో షుగర్ భారీగా పెరిగి మధుమేహానికి దారి తీస్తోందని నిపుణులు తెలిపారు. కొత్త ప్రమాదాలు.. ఇప్పటికే కర్ణాటకలో లక్షలాది మంది మధుమేహ, బీపీ రోగులు ఉన్నారు. కొత్తగా వచ్చినవారు వీరికి అదనం. నగర ప్రదేశాలకు పరిమితం కాదని, పల్లెల్లోని వారు, అక్కడి నుంచి వలస వచ్చిన వారిలో కూడా బీపీ, షుగర్ కనిపించాయి. కోవిడ్ రోగుల్లో 30 నుంచి 40 శాతం మందిలో మధుమేహం, బీపీ కనపించినట్లు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకినప్పటికీ తీవ్రం కాకుండా సత్వర చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకర జీవన రీతులతో షుగర్, బీపీ రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. -
మాయదారి రోగం: రెండేళ్ల క్రితం తండ్రి.. నేడు తల్లి..
సాక్షి, చండూరు(నల్లగొండ): అభం శుభం తెలియని వయసులో పెద్ద కష్టమే వచ్చింది. అమ్మానాన్న నీడలో హాయిగా ఉండాల్సిన చిన్నారులపై విధి కన్నెర్రజేసింది. రెండేళ్ల తేడాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అభాగ్యులు నేడు విధి వంచితులుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని బోడంగపర్తి గ్రామానికి చెందిన బొమ్మరగాని రాజు (32), యాదమ్మ (30) దంపతులకు వర్షిత్(10), వైష్ణవి(8) సంతానం. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. స్థానికంగా వర్షిత్ 5వ తరగతి, వైష్ణవి 3వ తరగతి చదువుతున్నారు. సొంత భూమి లేకపోయినా పూరి గుడిసెలోనే ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్నా రు. కాగా, రెండేళ్ల క్రితం మాయదారి రోగం బారిన పడి రాజు మృతిచెందాడు. దీంతో యాదమ్మపైనే కుటుంబ భారం పడింది. మనోధైర్యం కోల్పోకుండా కూలీ పనులు చేస్తూ పిల్లల ఆలనా పాలన చూస్తోంది. కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడిన యాదమ్మ కూడా సోమవారం కన్నుమూయడంతో ఆ చిన్నారులకు నా అనేవారు లేకుండా పోయారు. దీంతో గ్రామస్తులే ఆమె దహనసంస్కారాలు నిర్వహించారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవా లని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు టీఆర్ఎస్ గ్రామ నాయకులు కట్కూరి సత్తయ్య, గుర్రం వెంకట్రెడ్డి, ము త్తయ్య, వెంకన్న, సురేష్, నరేష్, రామలింగం, శ్రీను, మహేష్ రూ. 10వేల ఆర్థికసాయం అందజేశారు. -
దేహం తేలికైంది.. జీవితం బరువైంది
మిల్లీ సాన్సోయీ రచయిత్రి. యూకేలో మీడియారంగంలో కెరీర్ని నిర్మించుకుంటోంది. ఇరవై ఏడేళ్ల మిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. ఒక రకంగా ముంచుకు వస్తున్న మృత్యువు బారిన పడకుండా ఉండడానికి పెద్ద పోరాటమే చేసింది. పదహారేళ్ల వయసులో 33 కిలోల బరువుతో జీవితాన్ని బరువుగా లాక్కు వచ్చింది మిల్లీ. ఇదంతా చూస్తుంటే ఏ ప్రాణాంతక వ్యాధి వచ్చి తగ్గిందో అనుకుంటాం. కానీ ‘‘అంతా నేను చేతులారా చేసుకున్నదే’’ అంటుంది మిల్లీ. ‘‘అదృష్టవశాత్తూ నేను మృత్యువు ఒడిలోకి జారిపోవాల్సిన సమయానికి రెండు వారాల ముందు డాక్టర్ రక్షణలోకి వెళ్లగలిగాను కాబట్టి వ్యాధి బారి నుంచి బయటపడ్డాను. ఆరోగ్యాన్ని పొందడం కోసం నేను చేసిన పోరాటాన్ని మీతో పంచుకుంటాను. ఎందరో అమ్మాయిలు నా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటోంది మిల్లీ సాన్సోయీ. కేలరీల దహనమే ధ్యేయం ‘‘చిన్నప్పటి నుంచి బొద్దుగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఒక వెక్కిరింత... నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా సరే బరువు తగ్గాలి, నన్ను ఎగతాళి చేసిన అమ్మాయికంటే స్లిమ్గా మారాలనే పట్టుదల కలిగింది. ఆహారంలో మార్పులు చేసుకుని, జిమ్లో వర్కవుట్లు చేస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాను. డ్రెస్ సైజ్ కూడా మారింది. ఆ మార్పును గుర్తిస్తారని ఆశించాను. కానీ అలా జరగలేదు. దాంతో ఇంకా మొండితనం వచ్చేసింది. తీవ్రంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. అంతలో ఒక యాక్సిడెంట్. మోకాలికి గాయమైంది. జిమ్లో వర్కవుట్ సాధ్యం కాదు. మరెలా? ఆహారం పరిమాణం బాగా తగ్గించేశాను. కేలరీలు కొలత చూసుకోవడం, దేహంలోకి వెళ్లిన కేలరీలను దహింప చేయడానికి విపరీతంగా నడవడం దినచర్యగా మారింది. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు వరకు నడుస్తూనే ఉండేదాన్ని. క్రమంగా పీలగా మారిపోయాను. అయినా సరే... ఎగతాళి చేసిన అమ్మాయి కంటే సన్నగా అయ్యాను. కానీ ఆమె నన్ను ఏడిపించడం మానలేదు. ‘మిల్లీ ఇప్పుడు నీ కంటే సన్నగా ఉంది కదా? ఇంకా ఎందుకు ఏడిపిస్తావ్’ అని నా ఫ్రెండ్ నిలదీసింది. అప్పుడా అమ్మాయి ‘మిల్లీ అప్పట్లో లావుగా ఉండేది, ఇప్పుడు పేషెంట్లా ఉంది’ అని వెక్కిరించింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను ఎలా ఉండాలి? అనే సందేహం. నేను మరీ సన్నబడడంతో ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక... రెండు వారాలే! పద్నాలుగేళ్ల వయసులో పడిన ఒక విషబీజం పదహారేళ్లు వచ్చేసరికి ఊడలుగా విస్తరించి ఆరోగ్యాన్ని కబళించింది. ‘దేహంలో అంతర్గత అవయవాల పనితీరు క్షీణించింది. మరో రెండు వారాలకంటే బతకడం కష్టం’ అని చెప్పారు డాక్టర్. నా ఆరోగ్యం కోసం అమ్మ పడుతున్న తపనను చూసి అమ్మకోసం అనొరెక్సియా, ఈటింగ్ డిజార్డర్ సమస్యల నుంచి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశాను. ఒక వేసవి మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను. బరువు 33 కిలోల నుంచి 51 కిలోలకు పెరిగిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత చేసిన మొదటి పని స్కూలు మారడం. ఇదొక పాఠం నా అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత మా అమ్మమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడామె అన్న మాటను నేను మర్చిపోలేను. ‘అందరి దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఏదైనా సాధించు. అంతే కానీ అనారోగ్యంతో కాదు. పని చేసుకునే వాళ్లను చూడు, వాళ్లకు దేహాకృతి గురించిన పట్టింపు ఉండదు. తమ పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు’ అని చెప్పింది. స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్లో చేరాను. చదువు పూర్తయ్యేటప్పటికి జీవితం చాలా చిన్నదనే వాస్తవం తెలిసింది. అనొరెక్సియా, ఈటింగ్ డిజార్టర్ల వెనుక అసలైన జీవితం ఉందని కూడా తెలిసింది. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాను. నా అనుభవం ఎందరికో పాఠంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పింది మిల్లీ సాన్సోయీ. మీడియా కూడా ‘సన్నబడడానికి సులువైన మార్గాలు’ అనే కథనాలకు బదులు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన మార్గాలను సూచించాలని మిల్లీ కోరుతోంది. అంతేకాదు... తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బాడీ షేమింగ్కు పాల్పడే ఆలోచనను పిల్లల్లో మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని కూడా సమాజం తెలుసుకోవాలి. -
అనుకోని అరుదైన వ్యాధి ఆమె జీవితాన్నే మార్చేసింది
రాజస్తాన్: మనం కాస్త బాగొకపోతేనే డీలా పడిపోతాం. కొంచెం వంట్లో బాగోకపోతే ఇక రెస్ట్ తీసుకుంటాం. కానీ రాజస్తాన్కి చెందిన ఒక అమ్మాయి లక్షల్లో ఒక్కరికీ వచ్చే అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే..... రాజస్తాన్కి చెందిన హర్షిత దరియాని 11 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పయింది. అంత చిన్నవయసులో ఆ దుఃఖాన్ని అధిగమించి అందరిలా నవ్వుతూ, ఆడుతూ...హయిగా చదువుకునేది. సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటుండగా అనుకోని అరుదైన గుయిలిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) వ్యాధి ఆమెను మళ్లీ అగాధంలోకి తీసుకువెళ్లిపోయింది. హర్షిత ఇంటర్మీడియేట్లో ఉండగా ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఎడమ చేయి విపరీతమైన నొప్పి వచ్చి ఇక ఆడలేక హాస్టల్కి వచ్చేసింది. ఆ తర్వా త రోజు స్టడీ అవర్స్ కోసమై వార్డెన్ మేడం తెల్లవారుఝూమున లేపితే ఆమె అసలు బెడ్మీద నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పుడే తెలిసింది అత్యంత అరుదుగా నూటికి ఒక్కరికో ఇద్దరికో వచ్చే గుయిలిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటికే ఆమె ఆ వ్యాధి నరాల వ్యవస్థపై దాడి చేసి శరీరం మొతం పక్షవాతం వచ్చినట్లుగా చలనం లేకుండా చేసేసింది. ఆఖరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టమైంది, ఆమె ఐసీయూలో 47 రోజులు కోమాలోనే ఉంది. అయినప్పటికీ విద్యాసంవత్సరాన్ని క్పోల్పోకుండా పరీక్షకి వీల్ చైర్లో వెళ్లి మరీ రాసి మంచి మార్కులతో ఇంటర్మీడియేట్ పాసై అయ్యింది. కానీ ఈ వ్యాధి కారణంగా తనకి ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఆశను వదులుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం తాను బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వుతున్నానని, అమెజాన్తో కలిసి పనిచేయడానికీ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మేరకు హర్షిత మాట్లాడుతూ..."సరిగ్గా ఐద్దేళ్ల క్రితం తాను కనీసం కళ్ల రెప్పలను కూడా కదిలించ లేకపోయాను చూపుతోటే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడూ వాటన్నింటిని అధిగమించగలిగాన. జీబీఎస్ వ్యాధి నా జీవితాన్ని మార్చేసింది. దేన్నైన తట్టుకుని బతకలగలనన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కష్టం నన్ను కదలనియదు అనుకున్నాను కానీ కాలంతో పాటు అది మారిపోతుంది. కబళించేసేంతా కష్టమైన కదలకుండ ఉండదని, కాల గమనంతోపాటు మారిపోతుంది" అంటూ తన ఆత్మస్థైర్యాన్ని వ్యక్తం చేసింది. -
అరుదైన వ్యాధికి వైద్యం.. శిశువుకు ప్రాణం
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు) : కోవిడ్తో పాటు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్–మిస్క్(ఎంఐఎస్–సీ)తో బాధపడుతున్న 900 గ్రాముల బరువైన శిశువుకు మెరుగైన వైద్యం అందించి వ్యాధిని నయం చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్యాధి నుంచి కోలుకున్న అతి చిన్న శిశువుగా వైద్యులు పేర్కొన్నారు. విశాఖలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. ఆస్పత్రిలో గురువారం ఈ కేసు వివరాలను చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్కిశోర్ మీడియాకు వెల్లడించారు. విశాఖకు చెందిన తేజస్వి గర్భంలోని బిడ్డ ఎదుగుదల, రక్త సరఫరా సరిగా లేకపోవడంతో సిజేరియన్ చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్) అయితే ఆ శిశువు కేవలం 900 గ్రాముల బరువే ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువు ఎడమ కాలులో ఇస్కీమిక్ మార్పుల వలన రక్త సరఫరా నిలిచినట్టు గుర్తించారు. శిశువు కోవిడ్తో పాటు ఎలివేటెడ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్లను కలిగి ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అతి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి రావడం అరుదు. ఇంక్యుబేటర్లో ఉన్న శిశువుకు మూడు రోజులు అత్యాధునిక వైద్యం అందించారు. 36 రోజుల అత్యవసర చికిత్స అనంతరం శిశువు సాధారణ స్థితికి చేరుకోవడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం) -
భయపెట్టే బెల్స్పాల్సీ.. కారణం ఏంటో తెలుసా?
బెల్స్పాల్సీ చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. కానీ ముఖంలో పక్షవాతంలా రావడంతో చాలా ఆందోళనకు గురిచేస్తుంది. దీన్ని ‘ఫేషియల్ పెరాలసిస్’ అని కూడా అంటారు. సాధారణంగా ఇది కొద్దిపాటి చికిత్సతో తగ్గిపోతుంది. కారణం: మెదడునుంచి బయల్దేరి వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడో నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్ లేదా అలాంటి ఇతర ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, దేహంలో ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ను దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వస్తుంది. దానితో అనుసంధానమై ఉన్న ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే పుక్కిలించగలగడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ / చికిత్స : బెల్స్ పాల్సీ నిర్ధారణ కోసం మిథైల్ ప్రెడ్నిసలోన్ అనే మందును 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్లు చొప్పున గాని లేదా 1 గ్రామును రోజుకు ఒకసారిగాని... మూడు రోజులు ఇవ్వాలి. ఆ తర్వాత 10వ రోజు నుంచి మెరుగుదల కనిపిస్తుంటుంది. పూర్తిగా కోలుకునేందుకు ఒక నెల రోజులు పట్టవచ్చు. -
ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. చిట్టి తల్లికి పెద్ద కష్టం
కాచిగూడ (హైదరాబాద్): చిన్న వయస్సులోనే పెద్ద వ్యాధితో బాధ పడుతోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ చిన్నారి మంచానికి అతుక్కుపోతోంది. బుడిబుడి అడుగులతో, బోసి నవ్వులతో సందడి చేసిన తమ కలల పంట ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఆమె వైద్యానికి అవసరమైన ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కావడంతో.. దయగల దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడుతున్నారు. అరుదైన వ్యాధి ఎస్ఎంఏ– 3 హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన దోషిలి వినయ్, శిల్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సాన్వి జన్యు సంబంధమైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ టైప్ –3) వ్యాధితో పోరాడుతోంది. సాన్వి కొంతకాలం నుంచి సరిగ్గా నడవలేక పోతుండటంతో వైద్యులకు చూపించగా నరాల బలహీనత ఉందని చెప్పి మందులు వాడాలని, ఫిజియోథెరపీ చేయించాలని చెప్పారు. వారి సూచనల మేరకు వైద్యం చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తున్నా చిన్నారి ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇటీవల నిమ్స్ ఆసుపత్రిలో జెనిటిక్ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రజ్ఞా రంగనాథన్ వద్ద చూపించారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం సాన్వి.. కోట్ల మందిలో ఏ ఒక్కరికో వచ్చే ఎస్ఎంఏ టైప్ 3 వ్యాధితో బాధపడుతున్నట్టుగా వైద్యులు నిర్ధారించారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వకపోతే జీవితాంతం మంచంపైనే.. ఈ వ్యాధి కోసం ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. పైగా అది ఇక్కడ దొరకదని, విదేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుందని, జీఎస్టీతో కలుపుకొని దాదాపు రూ.22 కోట్లు అవుతుందని చెప్పారు. ఐదు సంవత్సరాల వయస్సు లోపే తమ చిన్నారికి ఈ ఇంజెక్షన్ వేయించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు విలపిస్తూ తెలిపారు. ఇటీవల నగరానికే చెందిన ఆయాన్స్ గుప్తాకు నిధుల సమీకరణ ద్వారా ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారని, జీఎస్టీని ప్రభుత్వం మినహాయించిందని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. తక్కువ సమయమే ఉంది తమ కుమార్తెకు చికిత్స ప్రారంభించడానికి తక్కువ సమయం మాత్రమే ఉందని వినయ్, శిల్ప తెలిపారు. నాలుగు నెలల్లో ఇంజెక్షన్ ఇస్తేనే సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. దాతలు తాము చేయగలిగినంత సాయం చేసి (బ్యాంక్ అకౌంట్ నంబర్ : 50100421831334, ఐఎఫ్ఎస్సీ కోడ్: హెచ్డీఎఫ్సీ 000024, గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం నంబర్ : 9618779839) తమ చిన్నారిని కాపాడాలని వారు కోరుతున్నారు. చదవండి: నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు -
Black Fungus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి పాలిట బ్లాక్ ఫంగస్ శాపంగా మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం బ్లాక్ఫంగస్ను ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ఫంగస్ (మ్యూకోర్మైకోసి)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. ఇక దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కాగా మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. (చదవండి: Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్కు మెరుగైన చికిత్స) -
వింత వ్యాధితో 4వేల కోళ్లు మృతి!
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్గౌడ్ను సంప్రదించాడు. కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్ను ల్యాబ్కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం -
అల్జీమర్స్కు ప్రధాన ముప్పు..పెరిగే వయసు!
వయసు పైబడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమే. కానీ అల్జీమర్స్ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిమరపు, దిక్కు తోచనిస్థితిలో చిక్కుకోవడం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చేతులు ఎక్కడో పెట్టి మరచిపోవడం సాధారణ మతిమరపు లక్షణమే. అయితే వాహనం నడిపే విధానాన్నే మరిచిపోవడం, దశాబ్దాలుగా తిరుగుతున్న వీధుల్లో దారితప్పిపోవడం వంటివి వృద్ధాప్యపు మతిమరపు కానేకాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరం. వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరపునకూ, అల్జీమర్స్కూ చాలా తేడా ఉంటుంది. ఇది మెదడులో జరిగే మార్పులు, మెదడును దెబ్బతీసే పరిణామాల కారణంగా వస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ ఆలోచించడం, తినడం, మాట్లాడటం వంటి సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. వృద్ధాప్యం లక్షణాలు అల్జీమర్స్ కాదు. కానీ వయసు పైబడిన కొందరిలో అనివార్యంగా వస్తున్న వ్యాధి అల్జీమర్స్. ప్రస్తుతానికి అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినా... లక్షణాలు కనిపించినప్పుడు వ్యాధిని సాధ్యమైనంత ఆలస్యం చేసే మందులు ఉన్నాయి. అయితే అల్జీమర్స్ను నివారించడానికి మెదడును ఉపయోగించి పరిష్కరించగలిగే పజిల్స్, సుడోకూ వంటి మెదడుకు మేత వ్యాయామాలతో దాన్ని చాలావరకు నివారించవచ్చు. -
వికారాబాద్లో వింత వ్యాధి కలకలం
సాక్షి, వికారాబాద్: జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోవటం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా దారూర్ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయి. వాటిని పాతిపెట్టకుండా బయట పడేయడంతో అవి తిని కుక్కలు, కాకులు చనిపోతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు భయాంధోలనకు గురవుతున్నారు. వింత వ్యాధి విషయాన్ని పశు సంవర్ధక అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు. -
నయంచేసే ఔషధాలే ఎదురు తిరిగితే..?
సాక్షి, హైదరాబాద్: వ్యాధులను నయం చేయాల్సిన ఔషధాలే ఎదురు తిరిగితే పరిస్థితేంటి..? యాంటీ బయోటిక్స్ అతి వాడకంతో ఇప్పుడు అలాంటి ప్రమాదమే మానవాళికి ముప్పుగా పరిణమించింది.. సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్కు లొంగకుండా తట్టుకునే శక్తిని పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) దీన్ని తీవ్ర విపత్తుగా గుర్తించింది. రెండేళ్ల పాటు 114 దేశాల్లో యాంటీ బయోటిక్స్ వాడకంపై క్షుణ్ణంగా సర్వే చేసి తొలిసారిగా ఒక సమగ్ర నివేదిక తయారు చేసింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘ప్రపంచ యాంటీబయోటిక్స్ అవగాహన వారం’సందర్భంగా అన్ని దేశాలను హెచ్చరిస్తూ సూచనలు చేసింది. మన దేశంలో అతి వినియోగం.. యాంటీ బయోటిక్స్ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచంలో ఏటా కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. 2030 నాటికి యాంటీ బయోటిక్స్ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడి యాంటీ బయోటిక్స్ వాడకంలో భారత్ ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా. అందులో 58 వేల మంది చిన్నపిల్లలే. చదవండి: (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) వారిలో ఐదేళ్ల లోపు పిల్లలుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి దేశంలో ఏటా 15 లక్షల మంది చనిపోతారని అంచనా. 2001–15 మధ్య మనదేశంలో కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ వాడకం 8.5 మిలియన్ యూనిట్ల నుంచి 13.2 మిలియన్ యూనిట్లకు పెరిగిపోయింది. ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 14 యాంటీ బయోటిక్ మాత్రలు మింగుతున్నారని వైద్య నిపుణులు అంచనా వేశారు. 2014 నుంచి 24 రకాల యాంటీ బయోటిక్స్ మందులను సీడీఎస్సీవో హెచ్1 జాబితాలో చేర్చింది. అంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కానీ, ఇష్టారీతిన వాడుతున్నారు. వ్యవసాయం, జంతువుల ద్వారా.. పశువులు, కోళ్లు, మేకల్లో వచ్చే బ్యాక్టీరియా సంబంధ వ్యాధులకు కూడా యాంటీ బయోటిక్ మందులనే వైద్యులు సూచిస్తారు. డాక్టర్లు ఇచ్చే యాంటీ బయోటిక్స్ మందులు నేరుగా మన శరీరంపై 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. కానీ, వ్యవసాయంలో వాడే పురుగుల మందులు, రసాయన మందులు, కోళ్లు, గేదెలు, ఇతర జంతువులకు వాడే యాంటీ బయోటిక్స్, నీళ్లల్లో రసాయనాల ద్వారా యాంటీ బయోటిక్స్ నిరోధకతను పెంచుకుని 70 శాతం మనపై ప్రభావం చూపిస్తున్నాయి. జాతీయ పాల పరిశోధన సంస్థ పరిశోధన ప్రకారం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సేకరించిన 44 పాల శాంపిళ్లలో 14 శాతం యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలింది. రాజస్తాన్లో సేకరించిన పాల శాంపిళ్లలోని ఇకోలి బ్యాక్టీరియా ప్రస్తుతం వాడకంలోని 70 శాతం యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. పందుల్లో సేకరించిన 774 శాంపిళ్లు, బాతుల్లో సేకరించిన 74 శాంపిళ్లలోని బ్యాక్టీరియా 70 శాతం యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. చేపలోని 82 శాంపిళ్లలోని విబ్రియా బ్యాక్టీరియా.. అందుబాటులో ఉన్న 90 శాతం సాధారణ యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. సీడీడీపీ పరిశోధన ప్రకారం.. హైదరాబాద్లో ఫార్మసీ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉండటంతో వాటి ద్వారా వచ్చే వృథా నీటి ప్రాసెసింగ్ ప్లాంట్ల సమీపంలో ఉన్న భూగర్భ, ఉపరితల నీళ్లల్లో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా అన్ని రకాల యాంటీ బయోటిక్స్ మన శరీరాల్లో చేరిపోతున్నాయి. (వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!) టీకాలే మేలు.. ఫ్లూ, న్యుమోనియా, రోటా వైరల్ డయేరియా, డిప్తీరియా, కోరింత దగ్గు, టైఫాయిడ్, మీజిల్స్ వంటివాటికి టీకాలున్నాయి. వాటిని ముందే ఇవ్వటం మంచిది. చేతి, నీటి, ఆహార శుభ్రత, టీకాలు, చక్కటి పోషకాహారం ఇవన్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. యాంటీ బయో టిక్స్ వాడకంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఒక విధానమంటూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సూక్ష్మక్రిములు ప్రస్తుత యాంటీ బయోటిక్స్కు నిరోధకత పెంచుకోవటం వల్ల క్షయ, మలేరియా, గనేరియా, న్యుమోనియా, మూ త్రనాళ ఇన్ఫెక్షన్లు సమస్యలుగా పరిణ మిస్తున్నా యని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. శరీరంలో 10 కోటి కోట్ల బ్యాక్టీరియా మన శరీరంలో దాదాపు కోటి కోట్ల జీవ కణాలుంటే, దానికి పదింతలు ఎక్కువగా అంటే 10 కోటి కోట్ల బ్యాక్టీరియా కూడా మనలోనే ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో, చర్మం మీద, ముక్కులో, నోట్లో, ఊపిరితిత్తుల్లో ఇలా చాలా శరీరభాగాల్లో స్థిర నివాసం ఉంటాయి. వీటిలో చెడ్డవీ మంచివీ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మనలోని రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేలా చేస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం.. అయితే యాంటీ బయోటిక్స్ వేసుకున్నప్పుడు దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు, కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ఈ రెండు రకాల సూక్ష్మజీవులే అన్ని రకాల వ్యాధులకు కారణం. యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. వైరల్ ఇన్ఫెక్షన్లను యాంటీబయోటిక్స్ పెద్దగా అదుపు చేయలేవు. ఈ విషయం తెలియక వైరల్ ఇన్ఫెక్షన్లైన జలుబు, ఫ్లూలకు యాంటీబయోటిక్స్ వాడేస్తుంటాం. ఇలా వాడటం వల్ల వైరస్ నశించకపోగా శరీరంలోని బ్యాక్టీరియా బలం పెరుగుతుంది. మరికొన్ని అంశాలు ►యాంటీ బయోటిక్స్ నిరోధకత పెంచుకోవడంతో చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. ►జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా యాంటీ బయోటిక్స్ వాడటం సాధారణమై పోయింది. ►తెలంగాణ గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి. ►పంటలకు విచ్చలవిడిగా పురుగు మందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్య పు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలివే.. ►యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించేందుకు దేశాలు జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ► వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ►యాంటీ బయోటిక్స్ అవసరం లేకుండా జలుబు లాంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించే సహజ పద్ధతులను వైద్యులు రోగులకు సూచించాలి. హెచ్1 జాబితాలోని యాంటీ బయోటిక్స్ ఇవే.. 1) సెఫడ్రాక్సిల్ 2) సెఫజోలిన్ 3) సెఫ్డినిర్ 4) సెఫ్టజిడిమ్ 5) సెఫ్టిజోగ్జిమ్ 6) సిఫరోగ్జిమ్ 7) సిప్రోఫ్లోగ్జాసిన్ 8) క్లారిత్రోమైసిన్ 9) క్లిండామైసిన్ 10) కోట్రిమోక్సాజోల్ 11) గాటిఫ్లోక్సాసిన్ 12) అజిత్రోనామ్ 13) ఇస్పామిసిన్ 14) లివోఫ్లోక్సాసిన్ 15) లినజోలిడ్ 16) మెరోపినామ్ 17) మోక్సిఫ్లోక్సాసిన్ 18) నైట్రాజిపామ్ 19) నార్ఫ్లాక్సాసిన్ 20) ఒఫ్లాక్సాసిన్ 21) తొబ్రామైసిన్ 22) అమికాసిన్ 23) స్పార్ఫ్లోక్సాసిన్ 24) మినోసైక్లిన్ -
పురుషుల ప్రాణం తీస్తోన్న వ్యాధి, కారణం తెలిసింది!
వాషింగ్టన్: జన్యుపరమైన ఒక వ్యాధితో అమెరికాలో చాలామంది పురుషులు మరణించారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఇటీవలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధిగల కారణాన్ని కనుగొని దీనికి విశాక్స్ అనే పేరుపెట్టింది. సాధారణంగా మన శరీరంలోకి హానికరమైన వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధి నిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి. అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికి ఈ కణాలు యుద్దాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడిచేసి మంటను రగిలిస్తాయి. దాని వలన నరాల్లో రక్తం గడ్డకట్టడం, తరచు జ్వరం రావడంలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు. ఆ వ్యాధి సోకిన వారిలో 40శాతం మంది మరణిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 25వేలమందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది యూబీఏ1 అనే జన్యువులో మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఇంటికి పిలిపించి కుక్కతో కరిపించాడని.. -
ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో తెలుసా..
న్యూఢిల్లీ: తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషనే సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాగా దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచికరంగా ఉండడంతో అధికంగా ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ముడి బియ్యం(దంపుడు బియ్యం లేదా పాలిష్ పట్టని బియ్యం). ఈ మధ్య కాలంలో ప్రకృతి వైద్య నిపుణులు వినియోగంపై ఈ బియ్యంపై ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజముందో తెలుసుకుందాం. ఉదాహరణకు 100 గ్రాముల ముడి య్యం తీసుకుంటే 1.8గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అదేవిధంగా తెల్ల బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల కేవలం 0.4గ్రాముల ఫైబర్ మాత్రమే లభిస్తుంది. తెల్ల బియ్యం నిరంతరం తీసుకుంతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందక పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ముడి బియ్యంలో అధిక శాతం యాంటి న్యూట్రియెంట్స్, ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్లు (విష రసాయనం) ఉంటాయి. ఎక్కువ శాతం ముడి బియ్యాన్ని తీసుకోవడంతో యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి. అధికంగా ముడి బియ్యం తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ విషరసాయనం ముప్పు ఉంటుంది. మన శరీరంలో అధికంగా ఆర్సెనిక్ చేరడం వల్ల క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ తదితర జబ్బులు వస్తాయి. మితంగా తినడమే శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముడిబియ్యం వల్ల హెచ్డీఎల్(మంచి కొలెస్ట్రాల్) పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్(కొవ్వు)ను తగ్గిస్తుంది. మరోవైపు మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారు తెల్ల బియ్యం కంటే ముడి బియ్యమే బెటర్. బీఎమ్ఐ(ఎత్తుకు కావాల్సిన బరువు) పాటించాలనుకునే వారికి ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. -
అమ్మ మళ్లీ నవ్వాలి..
అమ్మ కళ్ల ముందే ఉంది.. కానీ గోరు ముద్దలు తినిపించలేకపోతోంది. ఆ తల్లి పిల్లల ఎదురుగానే ఉంది. కానీ దగ్గరకు తీసుకోలేకపోతోంది. అంతుచిక్కని వ్యాధి అమ్మను కబళించేస్తుంటే.. ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. తల్లిని కాపాడుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు పూటలా తినిపించడం దగ్గర నుంచి మందులు వేయించడం వరకు అన్ని బాధ్యతలు వారివే. కన్నతల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు. చికిత్స కోసం మాత్రం సమాజం నుంచి కాస్త సాయం కోరుతున్నారు. ‘మా అమ్మ మళ్లీ మాకు నవ్వుతూ కనిపించాలి’ అంటూ చే యూత అర్థిస్తున్నారు.. రణస్థలం మండలం కమ్మశిగడాం గ్రామానికి చెందిన సునీత అనే మాతృమూర్తి కోసం భర్త, పిల్లలు పడుతున్న ఆ..వేదన. రణస్థలం రూరల్: రణస్థలం మండలం కమ్మశిగడాంకు చెందిన కాపరపు మహాలక్ష్ము నాయీ బ్రాహ్మణుడు. కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. అప్పుడప్పుడూ కూలి పనులకు కూడా వెళ్లేవారు. ఈయనకు 2006 లో ఒడిశాకు చెందిన సునీతతో వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతుండగా నాలుగేళ్ల కిందట సు నీత ఓ దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పట్టింది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఓ వైపు పేదరికం, ఇంకోవైపు అంతు చిక్కని వ్యాధి, మరోవైపు పిల్లలు చదువులు.. ఇన్ని బాధ్యతల నడుమ మహాలక్ష్ము నలిగిపోతున్నాడు. ప్రభుత్వం పింఛన్ సదుపాయం క ల్పించాలని కోరుతున్నాడు. రోజూ వంట చేసి కూలి పనికి వెళ్లి తిరిగి వచ్చే వరకు తన భార్య ఆలనాపాలనా పిల్లలే చూసుకుంటున్నారని, ఈ యాతన తప్పేలా చికిత్స కోసం దాతలు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు. వంట చేసి పనికి వెళ్తున్నా.. వంట చేసి నా భార్యకు పిల్లలకు భోజనం పె ట్టి కూలి పనులకు వెళ్తుంటాను. పిల్లలే వాళ్ల అ మ్మకు భోజనం తినిపిస్తుంటారు. నేను కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. పింఛన్కు దరఖాస్తు చేసుకుందామంటే కరోనా సమయంలో సద రం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దాతలే మమ్మల్ని ఆదుకోవాలి. – మహాలక్ష్ము, సునీత భర్త అమ్మ త్వరగా కోలుకోవాలి.. నా చిన్నతనం నుంచి అమ్మను మంచంపైనే చూస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలి. అ మ్మకు బాగవ్వాలని రోజూ దేవుడిని ప్రార్థి స్తున్నాం. – మణికంఠేశ్వరి, పెద్ద కుమార్తె సాయం చేయదలచుకున్న వారు 78936 41275 ఫోన్ నంబర్కు కాల్ చేసి సాయం అందించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది. -
అమిత్ షా అరోగ్యంపై వదంతులు.. క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బోన్ క్యాన్సర్ బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున పుకార్లు కూడా వచ్చాయి. అందుకే కరోనా సమయంలోనూ పెద్దగా మీడియా సమావేశాల్లోకి రావడంలేదంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అయితే తనపై వస్తున్న పుకార్లపై అమిత్ షా ట్విటర్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదని, పూర్తిగా అరోగ్యంగా ఉన్నానంటూ బదులిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను అమిత్ షా ఖండించారు. (మాజీ సీఎంకు గుండెపోటు.. పరిస్థితి విషమం) ‘ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట సమయంలో ఉంది. ప్రజలంతా కరోనాపై యుద్ధం చేస్తున్నారు. దేశ హోంమంత్రిగా బాధ్యతాయుతంగా నాపనిలో నేను ఉన్నాను. గడిచిన రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో నా ఆరోగ్యంపై అనేక వదంతులు వస్తున్నాయి. ఇలాంటివి ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు తప్పుడు వార్తలతో మనోవేదనకు గురువ్వకూడదని భావించాను. అందుకే వారందరికీ వివరణ ఇస్తున్నాను. నేను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదు. పూర్తిగా అరోగ్యంగా ఉన్నాను’ అని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. Is this true????#AmitShah bone cancer 🤔 This tweet is edited by anyone.❣️ pic.twitter.com/RE0WTbOJc5 — Fatima (@Fatima__2021) May 9, 2020 So sorry and sad to know your health effected with malicious diseases. My pray and good wishes for you and your family. Stay strong . May Allah help you to get well soon. — imteyaz Ahmad (Mojassam) (@IMojassam) May 9, 2020 -
వందేళ్లకో మహమ్మారి..
సాక్షి, సుజాతనగర్: కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతోంది. కొన్ని రోజుల కిందట పక్క దేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మహమ్మారికి ఇంకా మందు కనుక్కోలేదని, టీకా కూడా లేదని, ముందస్తు జాగ్రత్తలతోనే దీనిని నివారించాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. అయితే, గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతి వందేళ్లకు ఓ మహమ్మారి ఇలా ప్రజల ప్రాణాలకు పెనుముప్పులా పరిణవిుంచాయని తెలుస్తోంది. మూడు పర్యాయాలు వచ్చిన ఆయా రకాల వ్యాధులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యాధుల సరసన కరోనా (కోవిడ్–19) చేరిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వణికించిన ప్లేగు క్షణాల్లో సోకే ప్లేగు వ్యాధిని మానవ వినాశనిగా చెప్పవచ్చు. నల్లని పెద్ద ఎముకల మూలంగా సోకే డిసీజ్ ఇది. ఈ వ్యాధి 1720 ప్రాంతంలో వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 2,400 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో కనుగొన్న ఈ వ్యాధి 1894లో ఆగ్నేయ చైనాలో భయంకర భూకంపం ప్రబలినప్పుడు ఆహరధాన్యాల రవాణా, పరిసరాల కాలుష్యం, వలసపోయే వారి వల్ల ప్రపంచమంతటా వ్యాపించింది. 1895లో హాంకాంగ్ నుంచి వచ్చినవారితో మనదేశంలోని బొంబాయి (ఇప్పటి ముంబై)తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లేగు ప్రబలింది. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్లపాటు ఈ వ్యాధి వివిధ ప్రాంతాలను పీడించింది. 1898 నుంచి 1908 వరకు అంటే దాదాపు పదేళ్లలో ప్లేగు వ్యాధి వల్ల దేశంలో 5 లక్షల మంది చనిపోయారు. ఈ వ్యాధి బారిన పడి పారిస్ నగరంలోనే సుమారు 50 వేల మంది మృత్యువాత పడినట్లు చెబుతుంటారు. 1820లో కలరా.. ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం తర్వాత కలరా వ్యాధి సోకింది. ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రబలిన ఈ వ్యాధి బారిన పడి లక్షల మంది మృత్యువాత పడ్డారు. కలరా వ్యాధిని అతిసార వ్యాధి అనికూడా పిలుస్తుంటారు. ‘విబ్రియో కలరే’అనే సూక్ష్మ క్రిమి కారణంగా కలరా సోకుతుంది. దేశంలోని కోల్కతా నగరంలో తొలిసారి కలరా ప్రబలింది. అయితే, దేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ 1820లో మాత్రం యూరప్ వరకూ వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు కలరా మూలంగా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా లక్ష మందికి పైగానే చనిపోయారు. బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశాన్ని వణికించిన కలరా గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. 1920లో స్పానిష్ ఫ్లూ.. కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. ఈ వైరస్ పేరు చెబితేనే ఇప్పటికీ భయపడతారు. సృష్టిలోనే అతిపెద్ద విషాదం మిగిలి్చన భయంకర వ్యాధిగా స్పానిష్ ఫ్లూ మిగులుతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్గా ఇప్పటికీ దీనిని పరిగణిస్తారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా సుమారు కోటి మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా.. స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చిన వందేళ్ల తరువాత ప్రస్తుతం మనం ఇప్పుడు వింటున్న కరోనా వైరస్ వచ్చింది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడి సుమారు 8 వేల మంది మృతి చెందినట్లు అంచనా. దేశంలో కూడా సుమారు 170 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆలయాలు మూసివేశారు. పరీక్షలను వాయిదా వేస్తున్నారు. వివాహాలను నిలిపివేస్తున్నారు. బహిరంగసభలు, సమావేశాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్నారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం రద్దు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి భక్తులను రానీయడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. కోవిడ్–19కి కచ్చితమైన చికిత్స కానీ, టీకా కానీ లేదు. ప్రపంచం కనీవినీ ఎరుగనీ ఈ ముప్పును ఎదుర్కొవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం తప్ప మరోటి లేదు. అప్రమత్తంగా ఉండాలి ఒక మనిషి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ వైరస్ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు, లేదా చెయ్యి అడ్డుపెట్టుకోవడంతో పాటు, తరచూ సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. కోవిడ్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయితే, రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో ఉండి వాటి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, వ్యక్తికి, వక్తికి మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. -భూక్యా నాగమణి, వైద్యాధికారి, పీహెచ్సీ, సుజాతనగర్ -
అంతు చిక్కని వ్యాధితో నాలుగేళ్లుగా నరకయాతన
కందుకూరు అర్బన్: ఆడుతూ పాడుతూ అందరు పిల్లలతో కలిసి బడికి వెళ్లాల్సిన వయస్సులో నిత్యం చర్మం పగిలి, దురద, మంటతో ఆ బాలుడు నరక యాతన అనుభవిస్తున్నాడు. తోటి పిల్లలు దగ్గరకు రానివ్వక ఆ బాలుడు పడుతున్న మానసిక వేదన తల్లిదండ్రులతో పాటు చూసిన గ్రామస్తులను కలిచివేస్తోంది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం ఎస్సీ కాలనీలోని లింగాబత్తిన మాల్యాద్రి, శ్రీలతలది రోజు కూలీ పనులకు వెళితే కానీ పూటగడవని పరిస్థితి. ఈ దంపతులకు మూడవ సంతానం జోష్కుమార్ 2015లో జన్మించాడు. గంటలోపే బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం మొత్తం పొరలు పొరలుగా ఊడి పోవడం ప్రారంభమైంది. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రాదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు వడ్డీకి అప్పుచేసి రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. ఇక చూపించే స్తోమత లేక బిడ్డను ఇంటి దగ్గర వదిలి కూలీనాలి చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చూపిస్తూ నెలకు రూ. 5వేల ఖర్చుతో మందులను వాడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వేసవి వచ్చిందంటే నరకమే.. వేసవి కాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒళ్లంతా చర్మం పగిలి రక్తం కారడం, దురద, భరించలేని మంటతో బాలుడు తట్టుకోలేక అల్లాడుతుంటే తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎండను తట్టుకునేందుకు ప్లాస్టిక్ టబ్లో నీళ్లుపోసి దాంట్లో ప్రతి అరగంటకు ఒకసారి కూర్చోబెడుతున్నారు. బైట ఉన్నంత సేపూ తడి బట్టలు కప్పితేనే ఉపశమనం. కూలి పనులకు వెళ్తేనే గానీ పూటగడవని పరిస్థితుల్లో పిల్లవాడిని కనిపెట్టుకొని ఒకరు ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా బడేవారిపాలెం వచ్చినప్పుడు పిల్లవాడి తల్లి జోష్కుమార్ను జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకొచ్చి తన కుమారుడి దీనగాథను వివరించి మెరుగైన వైద్యం అందించాలని కోరింది. అప్పట్లో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో వింత వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిని చూశానని అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీలో ఇలాంటి వ్యాధులను కూడా చేరుస్తామని చెప్పారు. -
పెయిన్కిల్లర్స్ వాడుతున్నారా...? ఒకింత జాగ్రత్త!
ఏదైనా కారణాలతో కాస్త నొప్పి అనిపించగా మెడికల్ షాపుకు వెళ్లిపోయి నొప్పి నివారణ మందులు (పెయిన్కిల్లర్స్) కొని వేసుకోవడం చాలా ఎక్కువగా జరుగుతోంది. కొందరు తమకు తెలిసిన మందుల పేర్లు చెప్పి అదేపనిగా తీసుకుంటూ ఉంటే... మరికొందరు పెయిన్కిల్లర్ ఏదైనా ఇవ్వమని అడుగుతుంటారు. ఇలా డాక్టర్ చీటీ లేకుండానే ఆన్కౌంటర్ పెయిన్కిల్లర్స్ వాడటం మన సమాజంలో చాలా ఎక్కువే. అయితే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన పురోగతి కారణంగా... ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, స్పాండిలోసిస్, ఇన్ఫెక్షియస్ జబ్బులకు చాలా కొత్తమందులు, గతంలో ఉన్న సైడ్ఎఫెక్ట్ లేని మందులు వస్తున్నాయి. కాబట్టి మునుపెప్పుడో డాక్టర్ రాసి ఇచ్చిన చీటీలోని మందులనే ఇంకా ఇప్పటికీ అదేపనిగా వాడటం సరైనది కాదు. ఎందుకంటే దానికంటే మెరుగైనవీ, సైడ్ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గినవీ అయిన మందులు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి. పైగా ముందుతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న మందులు మరింత త్వరితంగా ఉపశమనం ఇవ్వడంతో పాటు చాలా చవకగా కూడా లభ్యమవుతున్నాయి. అందుకే డాక్టర్ను సంప్రదించాకే మందులు వాడాలి. ఇక నొప్పి నివారణ మందుల విషయానికి వస్తే ఇలా డాక్టర్ను సంప్రదించాకే వాడటం అన్నది మరింతగా అవసరం. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఉదాహరణకు... నొప్పి నివారణకు మందులు వాడే వారిలో చాలా మందికి వాటి కారణంగా వచ్చే దుష్ప్రభావాలపై అవగాహనే ఉండదు. కొన్ని దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అవి నొప్పి నివారణ మందుల వల్ల అన్న విషయం కూడా వారికి తెలియనే తెలియదు. పెయిన్కిల్లర్స్ వాడుతున్నారా... జాగ్రత్త: నొప్పి నివారణ మందులను చాలా కొద్ది మోతాదుల్లోనూ, చాలా కొద్ది వ్యవధికోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది. మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి. నొప్పులను తగ్గించే విషయంలో అవి ఒక వరప్రదాయినులే. అయినప్పటికీ వాటిని ఉపయోగించే విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. దుష్పరిణామాలివే... ►నొప్పి నివారణ మందులు కడుపులోకి వెళ్లగానే అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని లోని పొరల వరకు... లోపలివైపు పొరలను (ఇన్నర్ లేయర్స్ను) దెబ్బతీస్తాయి. ప్రధాన రక్తనాళాల చివరన ఉండే సన్నటి నాళాలు, మూత్రపిండాల్లోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి. దానికి తోడు కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. మామూలుగానైతే కొన్ని యాంటాసిడ్ను తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి. అదేపనిగా అంతకుమించి వాడకూడదు. ►రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునేవారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెఫ్రోపతి అత్యంత ప్రమాదకరం. ముందుగా చెప్పుకున్నట్లుగా రక్తనాళాల చివరన ఉండే సన్నటి రక్తకేశనాళికలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి నివారణ మందుల వల్ల అన్ని అవయవాలకంటే కిడ్నీ దెబ్బతినే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ►కొందరిలో ఈ మందులతో పాటు అధిక రక్తపోటు కూడా అదనపు కారణమై ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలాంటివారిలో గుండె పనితీరుపై మరింత ఒత్తిడి పడి గుండెజబ్బులు కూడా రావచ్చు. ►ఈ మందులు పరిమితికి మించి వాడటం వల్ల కడుపులోని లోపల ఉండే పొరలు దెబ్బతినవచ్చు. ఇలాంటివారిలో కొందరికి మేజర్ సర్జరీ కూడా అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ►కొందరిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్పై దుష్ప్రభావం పడి కోయాగ్యులోపతి వంటి సీరియస్ పరిస్థితికి దారితీయవచ్చు. ఈ మందులు వాడే వారికి కొన్ని సూచనలు నొప్పి నివారణ మందులు తప్పనిసరిగా వాడాల్సిన వారు వాటి దుష్పరిణామాలను తగ్గించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... ►ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు నొప్పి నివారణ మందులను వాడకూడదు. ►అల్సర్ ఉన్నవారు వాడకూడదు. ∙పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ►గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ఉన్నవారు, గుండెజబ్బులతో బాధపడుతున్నవారు, హైబీపీ రోగులు వీటిని వేసుకోకూడదు. ►వీటిని వేసుకున్న తర్వాత నీరు ఎక్కువగా తాగాలి. ఎక్కువగా వాడాల్సి వస్తే కొన్ని రోజులు వ్యవధి అనంతరం మళ్లీ డాక్టర్ సలహా తీసుకుని ఆ మేరకే వాటిని వాడాలి. ►ఇవి వాడే సమయంలో తరచూ మూత్రపిండాలు, బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చివరగా... పెయిన్కిల్లర్ వాడాల్సి వచ్చినప్పుడు మీరీ నొప్పి భరించగలరేమో చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే నొప్పులు మరింత తీవ్రంగా ఉంటాయని గుర్తుంచుకోండి. – డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
అమ్మ నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే
అమ్మ ఏడుస్తుంది. ఎవరైనా తెలిసినవారు ఎదురుపడితే ఏడుస్తుంది. ఎవరైనా అయినవారు పలకరిస్తే ఏడుస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే ఏడుస్తుంది. ఎక్కడైనా శుభకార్యం జరుగుతున్నా ఏడుస్తుంది. అమ్మకు ఏడుపు ఆగదు. 62 సంవత్సరాల అమ్మ ఏడుస్తూనే ఉంది. ఆమెకు కావలసింది ఏమిటి? ఆదరించే ఒక గుండె. వినే శ్రద్ధ ఉన్న రెండు చెవులు. అప్పటికి ఇద్దరు కంటి డాక్టర్లు పరీక్షించి కంటిలో లోపం ఏమీ లేదని చెప్పారు. కన్నీళ్లు కారడం కంటి జబ్బు వల్ల కాదన్నారు. అవి లోపలి నుంచి వస్తున్నాయని, మనసు నుంచి వస్తున్నాయని, చూడబోతే ఆమె లోపల ఒక కన్నీటి సరోవరమే ఉన్నట్టుగా అనిపిస్తోందని డాక్టర్లు అన్నారు. ఇది కంటి డాక్టర్లు చూసే సమస్య కాదు. మరెవరు చూడాలి? అమెరికాలో సంధ్యమ్మ రెండు నెలలు ఇద్దరు కొడుకుల దగ్గర ఉండొచ్చింది. అక్కడకు వెళ్లిన రోజు నుంచి ఆమె ఊరికూరికే ఏడుస్తోంది. కొడుకులను చూస్తే ఏడుపు. కోడళ్లను చూస్తే ఏడుపు. బుజ్జి మనవడు, మనవరాళ్లను చూస్తే కూడా ఏడుపు. అక్కడ వారాంతంలో తెలిసినవారు రావడమో తెలిసినవారి ఫంక్షన్లకు వెళ్లడమో చేసేవారు కోడళ్లు. తోడుగా ఈమెను తీసుకెళ్లేవారు. అక్కడకు వెళ్లగానే ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఆమె ఏడుపు మొదలెట్టేది. ఇది కోడళ్లకు ఇబ్బంది అయ్యి ఈమె వల్ల మాకు చెడ్డపేరొస్తోంది అని మెల్లగా పంపించేసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన సంధ్యమ్మ అమెరికాలోనే ఉన్న పెళ్లికాని మూడోకొడుకు దగ్గరకు వెళ్లింది అతడు బాగా సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్ద భవంతి కూడా కొన్నాడు. అక్కడకు వెళ్లి ఆమె ఏడుస్తుంటే విసుక్కోవడం మొదలెట్టాడు. ‘నీకేం తక్కువని ఇక్కడ. చూడు ఎంత పెద్ద ఇల్లుందో. టీవీ చూడు. యూ ట్యూబ్లో భక్తి పాటలు విను. సినిమాలు చూడు. నాతో షికారుకు రా. కాని ఏడవకు. ఎందుకేడుస్తావ్ అలా? ఇంకా ఎన్నేళ్లని బతుకుతావ్ నువ్వు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు’ అని అతనికి తోచిన పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆమెకు ఏడుపు ఆగేది కాదు. ఆగదు కూడా. మెల్లగా ఆమె ఇండియా వచ్చేసింది. సొంత ఇంట్లో పనిమనిషిని పెట్టుకొని ఒక్కత్తే ఉంటోంది. ఆమెకు ఇద్దరు సోదరులు. ఇద్దరూ చనిపోయారు. భర్త చనిపోయి సంవత్సరం. కొడుకులు ముగ్గురూ అమెరికాలో. ఆమెకు ప్రస్తుతం తోడు ఉన్నది కన్నీరు. కన్నీరు. కన్నీరు.‘ఏమ్మా.. ఎలా ఉన్నావ్?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్. ఆ చిన్న ప్రశ్నకు, ఆ ఒక్క ప్రశ్నకు ఆమెకు ఏడుపు తన్నుకురాబోయింది. ‘ఆగమ్మా. ఆగు. నా ప్రశ్నకు నువ్వు ఏడవకుండా సమాధానం చెప్పగలిగితే మనం ఈ సమస్యను సగం అధిగమించినట్టు’ అన్నాడు సైకియాట్రిస్ట్. సంధ్యమ్మ కొంచెం సంభాళించుకోవడానికి ప్రయత్నించింది. ‘ఏం చెప్పను డాక్టర్... నా ప్రమేయం లేకుండానే నాకు ఏడుపు వస్తోంది’ అందామె. ‘ఏం పర్లేదమ్మా. నీకు ఈ సమస్య. మరొకరికి మరో సమస్య. సమస్య లేకుండా ఎవరూ ఉండరు. మనం ప్రయత్నించి, డాక్టర్ సాయం తీసుకుని, అయినవారి సాయం తీసుకుని వాటి నుంచి బయటపడాలి’ ‘నాకెవరూ లేరు డాక్టర్’ అందామె గంభీరంగా. ‘అదేంటమ్మా’ ‘అవును. పెళ్లయినప్పుడు ఎవరూ లేరు. పిల్లలు పుట్టాక ఎవరూ లేరు. భర్త ఉండగా ఎవరూ లేరు. భర్త లేనప్పుడూ ఎవరూ లేరు. నాకెవరూ లేరు’ అందామె. మెల్లగా ఆమె తన కథను డాక్టర్కు చెప్పడం మొదలుపెట్టింది. సంధ్యమ్మది పెద్దలు కుదిర్చిన పెళ్లి. భర్త ఆర్ అండ్ బిలో ఇంజనీరు. కాని అతనిది ముక్కుసూటి వ్యవహారం. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని లోపాయికరమైన వ్యవహారాలు తెలిసేవి కావు. మనసులో ఏదీ దాచుకోడు. ఎవరు తనవాళ్లో ఎవరు శత్రువులో తెలియక పై ఆఫీసర్ల గురించి ఏదో ఒక మాట అనేసేవాడు. దాంతో అతడికి ఉద్యోగంలో నిత్యం సమస్యలు ఉండేవి. ఒక్కోసారి ట్రాన్స్ఫర్లు, ఒక్కోసారి తనే లాంగ్లీవ్లు. బంధువులదగ్గర సంధ్యమ్మకు ఇదంతా తలకొట్టేసే పనిగా ఉండేది. పైగా ప్రతిసారీ ముగ్గురు పిల్లలను వేసుకొని ట్రాన్స్ఫర్ల మీద ఊర్లు తిరగాలంటే చాలా కష్టం. వాళ్ల చదువు, పెంపకం ఆమెకు కష్టంగా ఉండేది. ఏమైనా అతనికి హితవు చెప్పబోతే చాలా కర్కశంగా ఎదురు తిరిగేవాడు. అసలు ఆమె మాటే అతని దగ్గర చెల్లుబాటయ్యేది కాదు. ఒకరోజు రెండు రోజులు కాదు... అతడు మరణించేవరకు ఆమెకు అదే శిక్ష. పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండేవారు. ఆమెకు తన బాధలు ఎవరితోనైనా చెప్పుకోవాలని ఉండేది. వినడానికి ఎవరూ ఉండేవారు కాదు. చెప్పాలన్నా మళ్లీ భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని ఆ భయం. అలాగే నిన్న మొన్నటి వరకూ కృశించింది. ఎంతగా అంటే భర్త మరణించాక దుఃఖం కలగడంతోపాటు కొంత రిలీఫ్గా కూడా అనిపించేంత. కాని ఆ తర్వాతే ఆమె సమస్య మొదలయ్యింది. దారిలో ఏ కొత్త జంట స్కూటర్ మీద వెళుతున్నా తన పెళ్లయ్యాక అలా వెళ్లలేదే అని ఏడుపు. ఎవరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నా తన భర్తతో అలా చెప్పుకోలేదే అని ఏడుపు. పిల్లలు ఆడుకుంటుంటే తన పిల్లల ఆటపాటలు చూసేంత తీరిక తనకు లేకపోయాయని ఏడుపు. శుభకార్యాలకు వెళితే తాను సరిగ్గా ఏ శుభకార్యంలోనూ హాయిగా గడపలేదని గుర్తుకొచ్చి ఏడుపు. రాను రాను సంతోషానుభూతికి విషాదానుభూతికి తేడా తెలియని స్థితికి ఆమె చేరుకుంది. ఒక మనిషికి అసలైన విషాదం మాట్లాడే గొంతు లేకపోవడం కాదు. ఎదురుగా వినే రెండు చెవులు లేకపోవడం అని ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్కు అనిపించింది. ఇదే బాధ కొంచెం అటు ఇటుగా ఇవాళ చాలామంది స్త్రీలు అనుభవిస్తున్నారని అనిపించింది. ‘చూడమ్మా. నీ కష్టం అర్థమైంది. నీ కష్టానికి మందు ఏమిటంటే నువ్వు చెప్పడం నేను వినడం. ఎంత చెప్పుకుంటావో చెప్పు. రోజూ వచ్చి నువ్వు పడ్డ కష్టాలన్నీ చెప్పు’ అని అన్నాడు సైకియాట్రిస్ట్. ఆమె నాలుగు వారాల పాటు అప్పుడప్పుడు వచ్చి డాక్టర్తో ఒక గంట కూచుని మాట్లాడి వెళ్లేది. తనలో బాగా గుచ్చుకుపోయిన అనుభవాలు చెబుతూ చెబుతూ వాటి ఉచ్చు నుంచి మెల్లగా బయటపడటం మొదలుపెట్టింది. ఇక ఆమెకు కావలసింది రోజూ మాట్లాడే మనుషులు. వినే మనుషులు. ‘చూడమ్మా. నీ పిల్లల గురించి నేనేం చెప్పలేను. కాని నీలాంటి స్థితిలో ఉన్న మనుషులు ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి. వారితో గడపడం నీకు కొంత లాభించవచ్చు. లేదా నీ కాలనీలో నీ వంటి మనుషులతో స్నేహం చేసి రోజూ మీరంతా ఒకచోట కలుస్తుంటే మరింత లాభం చేకూర్చవచ్చు. అసలు నీ మాటలు అందరూ ఎందుకు వినాలి.. అందరి మాటలు నువ్వు విని నీ అనుభవంతో సలహాలు ఇవ్వొచ్చు కదా అనుకుంటే నువ్వే అందరికీ ఆప్తురాలివైపోతావ్. అందరూ నీ కోసం ఎదురు చూసే దానివిలా మారిపోతావ్. నువ్వు రోగిగా కాదు ఉండాల్సింది. డాక్టర్గా. నీ కోసం నువ్వు బతికే నలుగురి కోసం బతికే డాక్టర్గా’ అన్నాడతను. ఆ సలహా పని చేసింది. సంధ్యమ్మ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటోంది. ఎదుటివారి మాటలు వింటోంది. నవ్వే విషయాలకు నిజంగా నవ్వుతోంది. నిజంగా ఏడ్వాల్సిన విషయాలకు కూడా దిటవు ప్రదర్శిస్తోంది. సంధ్యమ్మ గతం నుంచి వర్తమానం నుంచి కూడా విముక్తం అయ్యి జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోగలిగింది. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో తన అందాలతో యువతను ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా. సరైనోడులో గ్లామరస్ ఎమ్మెల్యేగా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమెతో ఉన్న సన్నివేశాలను సినిమాకే హైలెట్. టాలీవుడ్ చాలా సినిమాలే చేసినా ఈ అందాల భామకు ఆశించన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే కోలీవుడ్లో మాత్రం వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెబుతూ.. వింత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది ఈ అమ్మడు. ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా.. అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు. ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్ కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన జబ్బు సినిమాల్లో నటించడానికి అడ్డు కాదని క్యాథరిన్ టెస్రా అంటోంది. -
ఈసారి డెంగీతో డేంజరస్ డబుల్ ధమాకా!..
సాధారణంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తుంటాయి. చిత్రం ఏమిటంటే... అటాంటి డబుల్ధమాకానే ఈ సారి ఈ సీజన్లో ఈ దోమ కూడా ఇస్తోంది. రెండు జబ్బులనూ వ్యాప్తి చేయగల ఈ దోమ కావడం వల్ల ఇది డెంగీనీ, చికన్గున్యాను కలిసి డెంజరస్ డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోంది. డెంగీ మళ్లీ విజృభించింది. టైగర్ దోమ తన పంజా విసిరి ఇరు రాష్ట్రాలనిప్పుడు అల్లకల్లోలం చేసేస్తోంది. డెంగీ వైరస్ను ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వ్యాప్తి చేసే విషయం తెలిసిందే కదా. ఈ దోమనే వాడుక భాషలో టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగీను వ్యాప్తి చేసే ఇదే దోమ ఇప్పుడు చికన్గున్యాను కూడా తెస్తోంది. మిక్స్డ్ ఇన్ఫెక్షన్ జ్వరాలుగా ఈ సీజన్లో ఈ వ్యాధులు వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే డెంగీపైనా, ఈ మిక్స్డ్ ఇన్ఫెక్షన్పైన అవగాహన పెంచుకోడాల్సిన అవసరం ఉంది. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. నిజానికి డెంగీ కూడా చాలా రకాల వైరల్ జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. కానీ కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో వారి ప్లేట్లెట్లు ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. దాంతో అది చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటివారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తత అవసరం. అది మినహా మిగతా అందరికీ ఇది లక్షణాలకు చేసే వైద్యచికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్)తోనే తగ్గిపోతుంది. కాకపోతే రోగి ప్రమాదకరమైన పరిస్థితిల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ప్లేట్లెట్లు పడిపోయిన కారణంగా రోగిలోని అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి రోగికి వచ్చినప్పుడు మాత్రం అలాంటి వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. అలాంటి కేసులు మినహాయిస్తే డెంగీ అనేది మనం అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే, దాని గురించి ఉన్న అపోహలతోనూ, వ్యాధి పట్ల ఉన్న దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గుతుంది. డెంగీలో రకాలు డెంగీలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1 ఎలాంటి హెచ్చరికలూ చూపకుండా వచ్చే సాధారణ డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) 2 కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) 3 తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు ►హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా కనిపించే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగీ వచ్చిన వారు సాధారణంగా డెంగీ విస్తృతంగా వస్తున్న ప్రాంతంలో నివసిస్తున్న వారై ఉంటారు. వైద్యపరిభాషలో ఇలా డెంగీ విస్తృతంగా ఉన్న ప్రాంతాలను ఎండెమిక్ ప్రాంతాలుగా చెబుతుంటారు. ఇలాంటి చోట్ల ఉన్న వారిలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లంతా నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తప్రరీక్ష చేసినప్పుడు డెంగీ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ►హెచ్చరికలతో కనిపించే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : పై లక్షణాలతో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం కొందరిలో పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి (పల్మునరీ ఎడిమాతో) శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడి చాలా కీలకమైన అవయవాలు పనిచేయకుండా మొరాయిస్తాయి. ►మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో భాగంగా చికన్గున్యాతో పాటు వస్తే... అలాంటప్పుడు మరింత ఎక్కువగా ఎముకలు, కీళ్ల నొప్పులు (జాయింట్ పెయిన్స్) ఉంటాయి. డెంగీలో కంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో ఈ నొప్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. డెంగీలో మరింత ప్రమాదకరమైన మరికొన్ని లక్షణాలివీ... ►ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాలలోకి రక్తస్రావం అయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితితో పాటు మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ రోగుల్లో కనిపిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). ►కొందరిలో కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల మెదడు దెబ్బతినే (బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే) ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (పూర్తి ఇమ్యూన్ సిస్టమే) డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ►గుండె స్పందనలు (హార్ట్బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నివారణే ఎంతో మేలు అన్ని వ్యాధుల లాగే డెంగీ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ►ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ►ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి ప్రదేశాల్లో మనకు తెలియకుండానే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంటి పరిసరాల్లో ఉండే ఇలాంటి వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. ఇంట్లో వాడని డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ►ఇది పెద్దగా ఎత్తులకు ఎగరలేదు. అందుకే కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు తొడుక్కోవడం చాలా రక్షణ ఇస్తుంది. అలాగే చేతుల విషయంలోనూ ఫుల్స్లీవ్ మంచివి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్స్ లాంటి వాటికి బదులుగా ఒంటిని నిండుగా కప్పిచేసే దుస్తులనే ధరించాలి. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, రాత్రిపూట కూడా సాక్స్ వేసుకుని నిద్రించడం మంచిది. ►ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ►దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపలెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. (పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది... అయితే ? ఇప్పుడు డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగీ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగీ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అలాగే ఒంటి మీద (చర్మం కింద) రక్తపు మచ్చల్లాంటివి కనిపిస్తే అది డెంగ్యూకు ముందస్తు స్థితి అన్నమాట. ఇలాంటి మచ్చలనే వైద్యపరిభాషలో ‘పిటేకియే’ అంటారు. దీన్ని బట్టి డెంగీని గుర్తించవచ్చు. మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చికిత్స... డెంగీ అనేది వైరస్ కారణంగా వచ్చే వ్యాధి కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్లెట్స్ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగీ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగీ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. ఆ సాధారణ మందులు...డెంగీ రోగులకు ఎంతో ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగీ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోడాల్సిన విషయం. ►ప్లేట్లెట్లు తగ్గుతున్నప్పుడు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రోజుకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు బాగా నీరసంగా ఉన్నా... దాంతో పాటు రక్తపోటు (బీపీ) పడిపోతూ ఉన్నా వెంటనే హాస్పిటల్లో చేరడం అవసరం. డెంగీ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్ల విచక్షణ, సలహా మేరకే ఇతర మందులు కూడా ఇక మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్, డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్ను ప్రభావితం చేయడం చేస్తాయి. అందుకే మరీ అత్యవసరం అయితే తప్ప డెంగీ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీబయాటిక్స్తో పాటు ఇతర రకాల మందులు వాడటం సరికాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వాడాలి. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొందరిలో మినహాయించి అది అంతరిలోనూ ప్రమాదకరం కాదు. అందుకే ఎప్పటికప్పుడు తమ ప్లేట్లెట్ల కౌంట్ను పరిశీలిస్తూ... నయమయ్యే వరకు అప్రమత్తంగా ఉంటే చాలు. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ►డెంగీ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ►డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అదే ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష. అయితే ఇది పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం రోగులందరికీ ఉండదు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే... డెంగీకి గురైన ప్రతి పేషెంట్కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కేవలం ప్రమాదకరమైన స్థాయిలో ప్లేట్లెట్లు పడిపోయిన వారికి మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనే ఈ చికిత్స చేస్తారు. మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో ఈసారి మరింత ప్రత్యేకం...! ఈసారి వస్తున్న డెంగీకి మరో ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో వస్తున్న వైరల్ జ్వరాల్లో డెంగీతో పాటు చికన్గున్యా ఫీవర్స్ కలిసి వస్తున్నాయి. అంటే ఒకరకంగా చెప్పాలంటే ‘మిక్సిడ్ ఇన్ఫెక్షన్’లాగా వస్తోంది. సాధారణంగానే డెంగీలో ఎముకల నొప్పి ఉంటుంది. పైగా దీనితో పాటు చికన్గున్యా తోడవ్వడంతో ఎముకల్లో నొప్పి మరింత తీవ్రస్థాయిలో ఉంటోంది. ఒకవేళ అది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ అయితే.. డెంగీకి ఇచ్చే చికిత్సతో పాటు ప్రతి ఆరుగంటలకు ఒకసారి పార్సిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. దీనివల్ల జ్వరం, నొప్పులు రెండూ తగ్గుతాయి. అదే కేవలం డెంగీకి అయితే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి పారసిటమాల్ ఇస్తారు. మూడు రోజులు మాత్రం ఇచ్చి ఆ తర్వాత ఆపేస్తారు. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పెరిగి డెంగీ నుంచి కోలుకున్న తర్వాత చికన్గున్యాకు అవసరమైన చికిత్స ఇస్తారు. ఎందుకంటే చికన్గున్యాతో వచ్చే నొప్పులు నెలల తరబడి ఉంటాయి కాబట్టి నొప్పులు తగ్గడానికి అవసరమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డెంగీ, మలేరియాకు ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి: మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ఆరోగ్యశ్రీ అమలుపై ఏర్పాటైన నిపుణుల కమిటీ భావిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన గురువారం జరిగిన ఈ కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కమిటీ రెండు నెలలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, గ్రామాలు, ఆస్పత్రులకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని తేల్చింది. జ్వరాలే కాకుండా తరచూ వచ్చే జబ్బులు, వాటికి ఎంత వ్యయం అవుతోంది.. ఒకొక్కరికి సగటున ఎంత ఖర్చవుతోంది అన్న అంశాలను పరిశీలించి 161 జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తే పేద రోగులకు ఉపశమనం కలుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుతం 944 రకాల జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలో వుండగా మరో వెయ్యి జబ్బులకు పైగా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచిస్తోంది. దీంతో రెండు వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం లభించనుంది. డే కేర్ సర్వీసులకు కూడా.. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ కనీసం 24 గంటల పాటు ఇన్పేషెంటుగా చేరితేనే ఆ కేసు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. కానీ, వెయ్యి రూపాయల బిల్లు దాటే ప్రతి జబ్బుతోపాటు డే కేర్ సర్వీసులనూ పథకం పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచిస్తోంది. కొత్తగా చేర్చిన జబ్బుల్లో సుమారు 800కు పైగా తరచూ వచ్చేవే అని.. వీటికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, వీటిని చేర్చితే పేదలకు భారీ లబ్ధి జరుగుతుందని కమిటీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తాజాగా పెంచిన జబ్బుల ప్రకారం ఏడాదికి రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే, వెయ్యి రూపాయల బిల్లు దాటిన జబ్బులను కూడా పథకం పరిధిలోకి తెస్తే మరో రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని.. మొత్తం రూ.3 వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణుల కమిటీ భావించింది. మరోవైపు.. ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులు జారీచేయడం.. ఆరోగ్యమిత్రల వ్యవస్థను బలోపేతం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచడం.. బాధితులకు వైద్యసేవలు, బిల్లుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోవడం వంటి వాటిని పకడ్బందీగా అమలుచేయాలని కమిటీలోని పలువురు నిపుణులు సూచనలిచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకాన్ని అమలుచేసి, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నివేదికను ఈనెల 18 లేదా 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వనున్నట్లు తెలిసింది. -
రోగాలకు నిలయం
సాక్షి, నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలోని పభుత్వ ఆస్పత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం పందుల సంచారంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగుల బంధువులు వంట చేసుకునే క్రమంలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణం వెనక భాగంంలో మురుగు పూర్తిగా పేరుకుపోవడంతో ముక్కు పుటలు అదిరేలా వాసన వస్తోంది. మున్సిపల్ అధికారులు చెత్తను తొలగించి డ్రెయినేజీని శుభ్రం చేయాలని ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి వైద్యాధికారులే చెబుతున్నారు. దీంతో రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్తరోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి తయారైందని రోగులు మండిపడుతున్నారు. లక్షల నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిదులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత జనరల్ ఆస్పత్రిలో దాదాపు 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. ప్రసవాలు చేయడానికి సరిపడ వైద్యులను నియమించకపోవడంతో గర్భిణులను ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. జాడలేని అభివృద్ధి కమిటీ జిల్లా కేంద్రంగా మారి జిల్లా ఆస్పత్రిలా పేరు మారిందే తప్పా పనితీరులో మార్పు రాలేదని పట్టణ వాసులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేయాలి కాని నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారే అడిగే నాథుడే లేడు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఏళ్ల తరబడి నిర్మించిన తాగునీటి పైపులైన్ ప్రస్తుతం పూర్తిగా మూసుకుపోవడంతో వార్డుల్లో నీరు అందడం లేదు. దీంతోపాటు ఆస్పత్రిలోని మరుగుదొడ్లు శుభ్రపరచడంలో శానిటరి సిబ్బందిసైతం అలసత్వం కారణంగా దుర్వాసన వస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు మండిపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు రోగులపై విజృంభించి ప్రతిరోజూ ఇన్పేషెంట్లు 80కి పైగా ఉండగా ఔట్ పేషెంట్లు 2,100 పైచిలుకు వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణం ఉంటే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి లేదా అని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించాం ఆస్పత్రి ఆవరణలో చెత్త తొలగింపు, మురుగు శుభ్రతం చేయాలని పలు మార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించాం. వారు స్పందించడం లేదు. ఆస్పత్రి వెనక భాగంలో మురుగు చాలా పేరుకుపోయింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. – ప్రభు, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి -
శబ్దాలను బట్టి జబ్బులు గుర్తించే ఆప్!
పిల్లలు అదేపనిగా దగ్గుతున్నప్పుడు, సమస్య ఏమిటో తెలుసుకునేందుకు మనం వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళతాం. అయితే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తే సమీప భవిష్యత్తులోనే సమస్య ఏమిటో ఇంట్లోనే గుర్తించవచ్చు. అదెలాగంటారా? చాలా సింపుల్.. దగ్గు తాలూకూ ధ్వనుల ద్వారా జబ్బు ఏమిటో తెలుసుకునేందుకు వీరు ఒక స్మార్ట్ఫోన్ యాప్ను తయారు చేస్తున్నారు మరి. ఆసుపత్రిలో చేరిన పిల్లలు (29 రోజుల వయసు నుండి 12 ఏళ్ల వయసు వరకూ) దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను రికార్డు చేయడం.. సాధారణ పద్ధతుల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను వీటికి జోడించడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం. ఇప్పటికే 1437 మంది శబ్దాలను రికార్డు చేసిన శాస్త్రవేత్తలు మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని నిశితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యుమోనియా, ఉబ్బసం, బ్రాంకైటిస్లతో పాటు సాధారణ ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన ధ్వనులను అప్లికేషన్ ద్వారా గుర్తించేలా చేశారు. అప్లికేషన్ పూర్తయిన తరువాత దగ్గు ధ్వనులను రికార్డు చేసిన పిల్లలు 585 మంది మీద పరీక్షలు జరిపారు. ఎవరికి ఏ జబ్బు ఉందో 81 నుంచి 97 శాతం కచ్చితత్వంతో గుర్తించింది ఆ అప్లికేషన్ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ పోర్టర్ తెలిపారు. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో పిల్లల సమస్యలను గుర్తించేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని, మరింత సమర్థంగా పనిచేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. -
ఉబ్బసానికి విరుగుడు మితాహారమా?
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్ పొలోట్స్కీ అంటున్నారు. ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార -
కోడిగుడ్లలో మానవ ప్రోటీన్లు
రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలని చెబుతూంటారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. త్వరలోనే కోడిగుడ్లతో మనిషికి ఇంకో ప్రయోజనమూ చేకూరనుంది. ఎడిన్బరో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని కొన్ని రకాల వ్యాధులకు అవసరమైన మందులను కూడా ప్రొటీన్ల రూపంలో కోడి గుడ్ల నుంచి సేకరించవచ్చు. మానవ ప్రొటీన్లను మందులుగా చాలాకాలంగా వాడుతున్నా వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. రకరకాలుగా ముడుతలు పడి ఉండే ప్రొటీన్లను చౌకగా తయారు చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎడిన్బరో శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన కోళ్ల ద్వారా మానవ ప్రొటీన్లు ఉన్న కోడిగుడ్లను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. వీటిద్వారా ప్రొటీన్ల పనితీరుపై పరిశోధనలు చేయాలన్నది లక్ష్యం. అయితే కోడిగుడ్లలోకి చేరిన మానవ ప్రొటీన్లు అచ్చం మనిషిలోని ప్రొటీన్ల పనితీరును కనబరుస్తూండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఉత్పత్తి చేసిన రెండు ప్రొటీన్లు యాంటీవైరల్, యాంటీ కేన్సర్ లక్షణాలు ఉన్న నేపథ్యంలో వాటిపై విస్తృత పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. సులువైన పద్ధతి ద్వారా ఈ ప్రొటీన్లను వేరుచేసి వాడుకోవచ్చునని కోళ్లను ఉపయోగిస్తూండటం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెన్ సాంగ్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రొటీన్లను మనుషుల్లో వాడే పరిస్థితి లేదని కాకపోతే సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. -
కీళ్లవాతానికి మంచి చికిత్స ఉందా?
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా ఉండే బాధను భరించడం కంటే చనిపోవడం మేలన్నంత తీవ్రంగా నొప్పులు ఉంటున్నాయి. ఈ సమస్యకు ఏవైనా పరిష్కారాలు ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని కొందరు నిర్లక్ష్యం చేసి, వ్యాధిని బాగా ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, కొన్ని నాటు పూతమందులు వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పువచ్చింది. ఈ మందుల కారణంగా రోగుల్లోనూ విశేషమైన మెరుగుదలకు అవకాశం చిక్కింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ సమస్యతో బాధపడేవారికి ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్కి వాడేలాంటివనే అపోహ మరికొందరిలో ఉంది. దాంతో బాధల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. అయితే రోగులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి: పైన పేర్కొన్నట్లుగా సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్కీ›్లరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండలైటిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన చాలామంది రోగులు... ఆ తర్వాత తమ వ్యాధులు బాగా ముదరడం వల్ల వ్యాధితీవ్రత బాగా పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వీటిని వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరిజు వేసుకొని, ఒక సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, -
ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి?
ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్లెట్స్ ఎక్కించేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి. శరీరంలో ప్లేట్లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కించకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్లెట్స్ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. సరైన వ్యాధి నిర్ధారణ అవసరం శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానేయాల్సి ఉంటుంది. ముందు ప్లేట్లెట్లు పడిపోవడానికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు శరీరంలో ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలామందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ), రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీ) అనే రెండు పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్డీపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్లెట్లను సేకరిస్తారు. ఆర్డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది. -
నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!
‘‘బాబాయ్... బాబాయ్’’ అని అరుచుకుంటూ అతడి వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అబ్బాయ్. ఆయన కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. దుస్తులు దుమ్ముకొట్టుకుపోయాయి. ఎన్ని రోజులవుతుందో తిండి తిని! ‘‘నాయనా వేణూ..’’ అంటూ పరుగెత్తుకు వచ్చింది అమ్మ. ఆమె కళ్లలో శోకనది కట్టలు తెంచుకుంది... ‘‘బాబూ వేణూ... ఏమిట్రా ఇది! ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావు? ఏమైపోయావు? ఇల్లు వదిలి పెట్టి ఎన్నాళ్లు ఇలా తిరుగుతావు?’’ ‘‘ఇల్లు వదిలి పెట్టినందుకు కాదమ్మా....తల్లిని వదిలి పెట్టినందుకు బాధ’’ కన్నీళ్లను దిగమింగుతూ అన్నాడు వేణు. ‘‘ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనబడక పోతావా’’ కొడుకు కళ్లలోకి చూస్తూ అడిగింది తల్లి. ‘‘ఏ ముఖం పెట్టుకొని కనబడమంటావు అమ్మా! చేయడానికి ఉద్యోగం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు వేణు. ‘‘తల్లికి కావల్సింది నీ సంపాదన కాదురా. నీ క్షేమం. సరేలే... పద ఇంటికి పోదాం’’ అని కొడుకు చేయి పట్టుకుంది తల్లి. ‘‘ఇంటికా!’’ ఒక్క క్షణం వెనకడుగు వేశాడు వేణు. ‘‘అన్నం తిని ఎన్నాళ్లయిందో’’ కొడుకు కడుపు వైపు చూస్తూ అన్నది అమ్మ. అందుకే అంటారు కదా... అమ్మ జేబు చూడదు... కాలే కడుపు చూస్తుందని! తన ఆకలిని అబద్ధంతో కప్పిపెట్టాలనుకొని... ‘‘నేను బాగానే తింటున్నానమ్మా’’ అన్నాడు\వేణు. ‘‘ఆ ముఖం చూస్తూనే తెలుస్తుందిరా... పదపదా’’ అని బలవంతంగా కొడుకును ఇంటికి తీసుకెళ్లింది అమ్మ. ఇంట్లో... ‘‘బాబూ! నీకు అర్షలు అంటే ఇష్టంగా. అన్నం ఉడికేలోపు ఇవి తిను’’అమ్మ చేతుల్లో నుంచి అర్షలు తీసుకొని తినబొయ్యాడో లేదో... లోపలి నుంచి అన్నల వెటకారాలు మొదలయ్యాయి... ‘‘తమ్ముడూ వేణు! అర్షలు తింటున్నావా! తిను. బాగా తిను. అర్షలతో పాటు అమ్మ ప్రేమ కూడా బాగా తినమ్మా. ఒరేయ్ ధనూ... పెట్టే వాళ్లకు లేకపోయినా తినేవాళ్లకయినా ఉండాలి బుద్ది’’ ఈమాటలు విని ఆ అమ్మ తట్టుకోలేకపోయింది. ‘‘మీరు మనుషులా రాక్షసులా? విరోధి అయినా ఆకలి అంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోబుట్టినవాడు, మీ కంటే చిన్నవాడు ఇన్నాళ్లకు ఇంటికొస్తే రెండు అర్ష ముక్కలు పెట్టానని మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారా’’ అని ఆ కొడుకుపై మండి పడింది.‘‘తేరగా తినడానికి ఇది ధర్మసత్రం కాదు’’ అని సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు. ‘‘అయినా వాడికి కాళ్లు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించి కడుపు నిండా తినవచ్చు కదా. ఎవరొద్దాన్నారు?’’ అని తమ్ముడిపై విరుచుకుపడ్డాడు అన్న.‘‘అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా.కవిత్వం వెలగబెడుతున్నాడు కదా. దాన్నే తిని బ్రతకమను’’ అని వెటకారం చేశాడు చిన్న అన్నయ్య.మరో వైపు వేణు ఏదో వెదుకుతున్నాడు.‘‘వదినా! ఇక్కడ నాది ఒక ఫైలు ఉండాలి’’ అని వదినను అడిగాడు. మళ్లీ అందుకున్నాడు అన్నయ్య...‘‘ఆడవాళ్లను అడుగుతావేరా, నన్ను అడుగు చెబుతాను. అక్కడ ఉన్న ఫైలు, చెత్తకాగితాలు ఒక్క రూపాయికి అమ్మేశాను’’‘‘ఏమిటీ నా గేయాలను అమ్మేశారా! నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!’’ బాధను అణుచుకుంటూ అడిగాడు వేణు.‘‘అవును. ఆ కిరాణం కొట్టు సుబ్బయ్య మంచోడు కనుక ఆ రూపాయి అయినా ఇచ్చాడు’’ వెటకారపు కారాన్ని కళ్లలో చల్లాడు చిన్న అన్నయ్య.‘‘వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది!’’ ఆవేశంగా అన్నాడు వేణు.అంతే అన్నయ్యల కోపం ఆకాశాన్ని అంటింది.‘‘ఏమన్నావ్ మేము మూర్ఖులమా! ఏరా ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా ఆ చెత్త కుప్పలో తోస్తే కాని నీ రోగం కుదరదు. పదా పదా’’ అని మెడపట్టి తమ్ముడిని ఇంటి నుంచి గెంటేశారు. ప్రముఖ పత్రికాధిపతి ప్రసాద్ తన ఇంట్లో ఆరోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు.వచ్చిన అతిథులను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాడు ప్రసాద్.‘‘నమస్కారం ప్రసాద్గారు. ఈరోజు కవిసమ్మేళనం ఏర్పాటు చేశారట కదా అందుకే స్పెషల్గా వచ్చాను. అన్నట్లు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఈమధ్య నేను కవిత్వంరాస్తున్నాను’’ అని గర్వంగా అన్నాడు సూటుబూటులో వచ్చినయాక్టర్ రావు.‘దేవుడా! నువ్వు కూడా కవిత్వం రాస్తున్నావా!’ అన్నాయి ఆయన కళ్లు.నోరు మాత్రం...‘‘ఓహో అలాగా. గుడ్’’ అన్నది.అక్కడ కూర్చున్న ఇద్దరు సాహితీ దిగ్గజాలకు ఈ రావును పరిచయం చేస్తూ...‘‘వీరు యాక్టర్రావు గారు, నటించడం మానేసి కవిత్వం మొదలుపెట్టారు. వీరు వేటూరిగారు, వారు ఆరుద్రగారు’’ అన్నాడు.‘‘ఏమిటి మీకా పిచ్చిపట్టుకుందా?’’ గెడ్డంతో నవ్వుతూ అడిగారుఆరుద్ర.‘‘మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఆ జబ్బు నాకంటుకుంది’’ అన్నాడు యాక్టర్ రావు.‘‘అంటుకుందా! జబ్బుకు సరిౖయెన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి’’ అని యాక్టర్రావుకిసలహా ఇచ్చారు ఆరుద్ర.రావు పెద్దగా నవ్వి...‘‘అంత్యప్రాస! అందుకే మిమ్మల్ని ఆరుద్ర అన్నారు’’‘‘ఆరుద్ర గారు మీరొక కవిత చెప్పాలి’’ అడిగారు అభిమానులు.అప్పుడు ఆయన ఇలా చెప్పారు.‘కవిత కోసమే నేను పుట్టాను.క్రాంతి కోసమే కలం పట్టాను.ఎండమావులు చెరిపిపండువెన్నెల నిలిపిగుండెవాకిలి తలుపు తట్టాను కవిత కోసమే నేను పుట్టాను’ -
తెగులు.. దిగులు!
సాక్షి, దామరగిద్ద: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతున్నకు వేరుశనగ సాగులోనూ కష్టాలు తప్పడం లేదు. కృత్రిమ ఎరువుల వాడకం వాతవరణ పరిస్థితులు కలుపుమందులు వాడకంతో కొత్త తెగుళ్లు పంటలను ఆశిస్తూ తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. ఆకుమచ్చ తెగులు, పొగాకు లద్దెపురుగు, ఆకుముడత పురుగు లార్వా వంటి చీపపీడల నివారణలో రైతన్నలు తలమునకలౌతున్నారు. ఓ వైపు సరైన వర్షాలు లేక ఇప్పటికే బోర్లల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు చీడపీడలు సోకడంతో పంటలను కాపాడుకోవడంతో రైతులు అహర్నిషలు శ్రమిస్తున్నారు. అధికారుల సూచనమేరకే సాగు మండలంలోని దామరగిద్ద, మద్దెల్బీడ్, కాన్కుర్తి, ఉల్లిగుండం, క్యాతన్పల్లి, వత్తుగుండ్ల, కాంసాన్పల్లి, దేశాయ్పల్లి, ఆశన్పల్లి చాకలోన్పల్లి, లోకుర్తి నర్సాపూర్, మొగుల్మడ్క అన్నాసాగర్ తదితర గ్రామాల్లో వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేశారు. మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గత సెప్టెంబర్ 18న వేరు శనగ (కే6 రకం) విత్తనాలను పంపిణీ చేశారు. మండల రైతులకు 500 క్వింటాళ్లకు పైగా విత్తానాలను ప్రభుత్వం అందించిని 35 శాతం సబ్సిడీపై (బస్తా 30 కేజీలు రూ.1250 చొప్పున) కొనుగోలు చేశారు. మొత్తం 1600కు పైగా బస్తాల విత్తనాలతో పాటు రైతులు తాము సొంతగా నిల్వ చేసిని విత్తనాలను సైతం సాగు చేశారు. విత్తనాలు సకాలంలో అందడంతో ఆయా గ్రామాల రైతులు గత సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ మొదటి వా రాల్లో వేరుశనగ పంటను సాగుచేసుకున్నారు. పం ట సాగు చేసి 30 నుంచి 45 రోజులు గడుస్తుంది. పంటను ఆశిస్తున్న తెగుళ్లు సాధారణంగా పంట 25రోజుల లోపు ఉన్న సమయంలో పంటలపై తెగుళ్లు పరుగుల దాడి అధికం గా ఉంటుంది. ప్రస్తుతం ఇదే దశలో ఉన్న వేరుశనగ పంటను పొగాకు లద్దెపరుగు, ఆకుముడత ప రుగు లార్వా ఆకుమచ్చ తెగుళ్లు సోకడంతో పం టలు దెబ్బతింటున్నాయి. పోగాకు లద్దెపురుగు రాత్రి సమయంలో బయటకు వచ్చి లార్వా దశలో పంట ఆకులను మేస్తూ పంట ఎదుగుదలను దెబ్బతీస్తుంది. దీనికి తోడు ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి ఊడలు దిగకుండా గింజలు పట్ట కుండా పంటను దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు తీసుకోవల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులు స్పందించి తమ పంటలను కాపాడుకోవడంలో తగిన సలహాలు సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా రైతులు ఎన్నికల వి«ధులతో పాటు రైతులకు పెట్టుబడి సహాయం అందించడంతో బిజీగా ఉండటంతో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు చేసే వారు కరువయ్యారు. అధికారులు సలహా ఇవ్వాలి వేరుశనగ పంటలకు సోకిన తెగుళ్లు పురుగుల నివారణలో రైతులు అవసమైన సలహాలు సూచనలు అందజేయాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి ఏఏ చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏఏ మందులు పిచికారీ చేయాలో తెలపాలి. అధికారులు ఇతర పనులు పేరుతో పంటలను పరిశీలించడం లేదు. రైతులకు నష్టం వాటిల్లకుండా సకాలంలో స్పందించి పంటలను కాపాడుకోవడంలో రైతులకు అవగాహణ కల్పించాలి. – వెంకటప్ప, రైతు వత్తుగుండ్ల మందు పిచికారీ చేయాలి వేరుశనగ పంట సాగు చేసిన నలభై రోజుల వ్యవధిలో ఉన్న సమయంలో తెగుళ్లు పురుగులు అధికంగా ఆశిస్తుంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, పొగాకు లద్దెపరుగు, లార్వా దశలో రాత్రి వేళలో పంటను ఎక్కువగా నష్ట పరుస్తుంటాయి. వీటి నివారణకు ఎక్టాకొనెజోల్ ఎకరాకు 400ఎంఎల్ పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు క్లోరిఫైరీపాస్ ఎకరానికి 400ఎంఎల్ లేదా 300 ఎంఎల్ మోనోకొటాపాస్ను పంటలపై పిచికారీ చేయాలి. లార్వా«ను నాశనం చేసేందుకు అరకిలో బెల్లం, పావులీటలర్ మోనోకొటపాస్ను తగినంత వరితౌడులో కలిపి ముద్దలుగా చేసి పొలం ఉంచాలి. పంట దిగుబడి నాణ్యత కోసం సాగుచేసిన 40 రోజుల వ్యవధిలోనే ఎకరానికి 200కిలోల జిప్సంను పంట మొదల్లో చల్లాలి. – జాన్ సుధాకర్, ఏడీఏ, నారాయణపేట -
చిగుళ్ల వ్యాధికి చికిత్స.. మధుమేహానికి మేలు!
చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మధుమేహులకు మేలు జరుగుతుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా.. నోటి లోపలిభాగాలు, పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం కిడ్నీ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా రక్తనాళాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని లాన్సెట్ డయాబిటిస్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉన్న.. చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్న దాదాపు 250 మందిపై తాము అధ్యయనం చేపట్టామని పన్నెండు నెలల తరువాత పరిశీలన జరిపినప్పుడు చిగుళ్ల సమస్యలకు మెరుగైన చికిత్స తీసుకున్న వారి చక్కెర మోతాదులు కొంత నియంత్రణలో ఉండగా.. మిగిలిన వారి పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని అనుకునే వారికి నోటి సమస్యలకూ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన తొలి అధ్యయనం ఇదేనని ప్రొఫెసర్ ఫ్రాన్సెస్కో డి అటియో తెలిపారు. మరింత విస్తృత స్థాయి అధ్యయనాలు జరిపి ఈ విషయాలను రూఢి చేసుకుంటే మధుమేహంతోపాటు కొన్ని ఇతర వ్యాధుల చికిత్సకూ మెరుగైన మార్గం లభిస్తుందని చెప్పారు. -
పారని మంత్రం... లొంగని రోగం
ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు. విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లలను చేరదీసి వారికి నాలుగు అక్షరం ముక్కలు చెప్పి మంచిదారిలో పెట్టేందుకు ప్రయత్నించేవాడు.పూర్వులు ఆయుర్వేద వైద్యులు కావడంతో తన దగ్గరకు వచ్చే పేద వారి చిన్నాచితకా రోగాలకు ఉచితంగా మందులు ఇచ్చి, ఉపశమనంగా మంచిమాటలు చెప్పేవాడు. ఆయనిచ్చే మందులకన్నా, అనునయపూర్వకంగా ఆయన చెప్పే మాటలు వారికి ధైర్యాన్నిచ్చేవి. దాంతో ఆయా రోగాలు తొందరగా తగ్గిపోయేవి. ఓ రోజు ఆయన దగ్గరకు తేలుకుట్టిందని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్న ఒక బాలుణ్ణి తీసుకొచ్చారు ఊరిలో జనం. పంతులుగారు పూజామందిరంలోకెళ్లి దేవుళ్ల పటాల ముందు రాలిపడి ఉన్న పసుపు, విభూది, గంధం వంటివాటిని పోగుచేసి, బాలుడికి తొందరగా తగ్గించమని కోరుతూ దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చి ఏవో మంత్రాలు చదువుతున్నట్లు పెదవులు కదిలిస్తూ ఆ పిల్లాడికి తేలుకుట్టిన చోట రాసి, వెంటనే తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెప్పాడు. నిజంగానే కాసేపటికల్లా ఆ పిల్లాడికి నొప్పి తగ్గిపోవడంతో పిల్లాడి తల్లి, కూడా వచ్చినవాళ్లు వెళ్లి ఆ విషయాన్ని ఊరంతా చెప్పారు. అప్పటినుంచి ఆ పెద్దాయన తేలుకాటుకు మందు ఇస్తాడన్న పేరొచ్చింది. దాంతో ఎవరికి తేలుకుట్టినా సరే, ఆ పెద్దాయన దగ్గరకు తీసుకురావడం, ఆయన పూజామందిరంలోని విభూతి, పసుపు గాయానికి రాయడం, వాటినే ఓ చిటికెడు గ్లాసు నీటిలో కలిపి తాగించేవాడు. చిత్రంగా వారికి ఆ బాధ తగ్గిపోయేది. వారు ఆయనకు తృణమో పణమో ఇచ్చివెళ్లేవారు. ఆ మంత్రాన్ని తమకు చెప్పమని కొందరు, ఆ మందు తయారీ విధానాన్ని తమకు నేర్పమని పెద్దాయన చుట్టూ తిరిగేవారు. ఓ రోజున ఈ పెద్దాయనకు పాము కరిచింది. తనకు ఏ మంత్రమూ రాదని, ఏ మందూ తెలియదని, బాధితులకు త్వరగా నయం కావాలని కోరుకుంటూ ఉట్టి పసుపు నీళ్లే ఇస్తానని, తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ఊరిలో వాళ్లని బతిమాలుకుంటేగానీ జనాలు ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఆస్పత్రిలో ఇచ్చిన మందులతో తొందరలోనే కోలుకుని ఇంటికి వచ్చాడు పెద్దాయన. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా, తేలుకుట్టినా ఈయన దగ్గరకు తీసుకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ తీసుకు వచ్చినా కూడా వారికి తగ్గేది కాదు. అందుకే అన్నారు వైద్యం, మంత్రం, పూజ, జపం వంటివి నమ్మకం ఉంటేగానీ ఫలించవని... – డి.వి.ఆర్. -
యూరి ఉగ్రదాడి సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి
లాహోర్ : భారత్లో పలు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజార్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్ చీఫ్ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనట్టు హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. యూరి దాడికి బాధ్యుడైన మసూద్ అజార్ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కథనం పేర్కొంది. రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది.కాగా మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. భారత్, పాకిస్తాన్ సహా ఐరాస భద్రతా మండలి సభ్యుల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదని చైనా వాదిస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల జాబితాలో ఉంది. 2016లో పఠాన్కోట్ ఎయిర్బేస్లో దాడికి సంబంధించి జైషే చీఫ్ మసూద్ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్లో పేర్కొంది. గత ఏడాది నాగర్కోట దాడిలోనూ మసూద్ ఆజాద్ కీలకంగా వ్యవహరించడం గమనార్హం. -
అరటి పువ్వు
తరచుగా పశ్చాత్తాపమనే భావన నన్ను కుదిపివేస్తుంటుంది. నాకేదో జబ్బు చేసినట్లుంది. నాలో జ్ఞాపకాలేవీ మిగలడం లేదు. అందుకే ఈ డైరీ రాయడం మొదలుపెట్టాను. నా స్మృతులు పూర్తిగా చెదిరిపోతే, ఈ రాతల నుండి నన్ను నేను కనుగొనవచ్చని నా ఆశ. అయితే ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో నాకు తెలియదు. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారంతో పోరాడేందుకు చేసే చిన్న ప్రయత్నమిది. అయినా ఒక్కోసారి నన్ను బాధ కమ్మేస్తుంది. ఈ విశాలమైన, రంగురంగుల లోకానికి నేను త్వరలో పాతకాలపువాడిలా, పనికిరానివాడిలా, దండగమారిలా మారిపోతానని ఆ బాధ నాకు చెబుతుంది. ఈ ప్రశ్నే జవాబు దొరికేవరకూ నా మెదడును తొలిచేసింది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం నాకు నేనే మాత్రం ఊహించని వ్యక్తి నుంచి దొరికింది. కూరల రామయ్య. చిన్న చెక్క బండి మీద కూరలు తెచ్చి అమ్ముతుంటాడు. మా ప్రాంతానికి ఎప్పటి నుండి వస్తున్నాడో నాకు గుర్తు కూడా లేదు. నాకు గుర్తున్నంతవరకు... మేం ఈ నగరానికి వచ్చి, ఈ అపార్టుమెంట్లో దిగినప్పటి నుంచి నేను అతన్ని చూస్తున్నాను. అంటే నా చిన్నప్పటి నుంచి! కూరల రామయ్య మా హౌసింగ్ సొసైటీ నివాసులకు అప్పటి నుంచి కూరలు అమ్ముతూనే ఉన్నాడు. అతని వయసు ఎనభైకి పైగానే ఉంటుందేమో, చాలా ఏళ్ళ నుంచి మాకు కూరగాయలు అమ్ముతున్నాడు మరి! అయితే నిన్నటి వరకూ కూరల రామయ్య వచ్చి వెళ్ళడం గురించి నేనేమీ పట్టించుకోలేదు. మా ఇంటి చుట్టూ జరిగే అనేకానేక సాధారణ వ్యవహారాల్లో ఇదీ ఒకటి అని వదిలేశాను. అతని గురించి పెద్దగా ఆలోచించను కూడా లేదు. నేను అతన్ని దాదాపుగా ప్రతీ రోజూ చూస్తుంటాను. కూరలు నిండిన అతడి బండిని రోజూ చూస్తుంటాను. కానీ నేనెప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఈ రోజు ఉదయం నేను కిటికీ దగ్గర నిలుచున్నప్పుడు కూరల రామయ్యని చూశాను. నాలో ఏదో వింత కుతూహలం కలిగింది. అతన్ని ఆగమని చెప్పి, కిందకెళ్ళాను. రామయ్యని ఎప్పుడూ ఇంత నిశితంగా పరిశీలించలేదు. ఈ రోజు పరిశీలించాను. మనిషి కొద్దిగా పొట్టిగా ఉన్నాడు. బహుశా ఐదున్నర అడుగుల ఎత్తుంటాడేమో. బక్క పలచని శరీరం. వయోభారాన్ని మోస్తున్న కారణంగా అతని చర్మం ముడతలు పడింది. అయితే అతని శక్తి, ఆ ఉచ్ఛ స్వరం ఆ వృద్ధుడి ప్రత్యేకతలుగా ఎంచాలి. వీధుల వెంట అరుస్తూ అమ్మేటప్పుడు అతని కదలికలు, అతని హావభావాల శక్తికి నేను అబ్బురపడ్డాను. ‘‘రామయ్యా, నేను నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ వయసులో నీ శక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అన్నాను.రామయ్య చిన్నగా నవ్వి, నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు. అతని బండిలోని కొన్ని కూరలని అటూ ఇటూ కదిపాను. అతనితో సంభాషణ కొనసాగించాలి కదా మరి! కొన్ని కూరలు కొన్నాను కూడా. అతని ముఖంలో తృప్తి లీలగా దర్శనమిచ్చింది. ఉన్నట్టుండి నాకది గుర్తొచ్చింది. ‘‘రామయ్యా! ఓ విషయం గురించి నాలో నేను తెగ ఆలోచిస్తుంటాను కానీ ఈ రోజు నేను నిన్ను అడిగేస్తాను. ఎందుకు నువ్వు రోజూ అన్ని అరటి పువ్వులు తెస్తావు? నాకు గుర్తున్నంత వరకూ నీ బండిని ఏ రోజూ అరటి పువ్వులు లేకుండా చూడలేదు నేను. దీనికేదైనా ప్రత్యేకత ఉందా?’’ అని అడిగాను. నాకేసి చూసి నవ్వాడు రామయ్య. సావకాశంగా మాట్లాడసాగాడు. ‘‘బాబూ, ఈ అరటి పువ్వు వెనకాల ఓ కథ ఉంది. అది కేవలం ఓ కూరగాయ కాదు. వినాలని ఉందా?’’నాకు సరదాగా అనిపించింది. ఒప్పుకున్నాను. రామయ్య తన చిన్న ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ‘‘బాబూ, అరటి పువ్వు మనకెన్నో నేర్పిస్తుంది! దాన్ని రోజూ నేను అమ్మడానికి మాత్రమే బండిలో ఉంచను, నాకు స్ఫూర్తినివ్వడానికి ఉంచుతాను. అరటి చెట్టు ఈ అరటి పువ్వు నుంచే పుడుతుంది. అరటి చెట్టు ఎన్నటికీ వృథా కాదు. అరటి చెట్టులోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడేదే! పోషక విలువలు కావచ్చు లేదా ఇంటి అవసరాలకు కావచ్చు! పైగా కొత్త చెట్ల పుట్టుకకి కారణం, ప్రతీ అరటి చెట్టుకు పూసే ఈ అరటి పువ్వే! తను పుట్టి మళ్ళీ ఇంకో చెట్టుకి జన్మనిస్తుంది.’’అతని మాటలకి నా పెదవులపై చిరునవ్వు మొలిచింది. నేను మౌనంగా వినసాగాను. ‘‘బాబూ, ఇప్పుడు నాకు ఎనభై ఏడేళ్ళు. నేను ఐదేళ్ళ వయసు నుంచి నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. మొదట్లో మా అమ్మ కోసం, తర్వాత నా భార్యా పిల్లల కోసం... ఇప్పుడు నా కొడుకు పిల్లల కోసం...’’ అంటూ ఒక్క క్షణం ఆపాడు. మళ్ళీ చెప్పసాగాడు ‘‘నా కొడుకు సముద్రంలో చేపలు పట్టేవాడు. ఓ రోజు సముద్రం వాడిని మింగేసింది. భార్యని, ఇద్దరు పసిబిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు. నా భార్య కిందటేడు చనిపోయింది. అయితే నేనిప్పుడు విశ్రాంతి తీసుకోడానికి కుదరదు. నన్ను నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి. నేను పనికిరాకుండా పోకూడదు. నేను అరటి పువ్వులా ఉండి నా కోడలికి, మనవలకి జీవిక కల్పించాలి. నా బండిలో ఉంచే అరటి పువ్వులు నాకు నిరంతరం శక్తినీ, స్ఫూర్తిని ఇస్తాయి. నేనింకా పనికిరాకుండా పోలేదని గుర్తు చేస్తాయి. నేనలా ఎప్పటికీ కాలేను....’’ కూరల రామయ్య తన బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ నేనక్కడే ఫుట్పాత్పై నిలబడి రామయ్య చెప్పినదాని గురించి ఆలోచిస్తున్నాను. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారమనే ప్రతికూల భావన ఇప్పుడు నా మనసులోంచి తొలగిపోయింది. రామయ్య కథ, అరటి పువ్వు స్ఫూర్తి నా కళ్ళు తెరిపించాయి. ‘ఏమైనా కానీ, నన్ను నేను వృథా చేసుకోను. చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. నేను కూడా అరటి పువ్వు లాంటి వాడినే. ఏం జరిగినా నిరుపయోగం కాను!’రోడ్డు చివర్లో రామయ్య ఆకారం, అతని బండి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అతని కీచుమనే దృఢమైన గొంతు మాత్రం స్పష్టంగా వినబడుతోంది. నేను చిన్నగా నవ్వుకున్నాను. తృప్తి నిండిన మనసుతో ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆంగ్లమూలం : ప్రసూన్ రాయ్ అనువాదం: కొల్లూరి సోమ శంకర్ -
నీటి కాసులకు కర్కుమిన్ చికిత్స!
కళ్లకు వచ్చే జబ్బు నీటి కాసులకు సరికొత్త, మెరుగైన చికిత్సను అందుబాటులోకి తెచ్చారు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. పసుపులోని కర్కుమిన్ రసాయనాన్ని ద్రవ రూపంలో అందిస్తే నీటి కాసులకు మెరుగైన చికిత్స చేయవచ్చునని వీరు అంటున్నారు. ఇప్పటివరకూ కర్కుమిన్ను మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకుంటున్నారు. అయితే కర్కుమిన్ అంత సులువుగా రక్తంలో కలిసిపోదని.. దీంతో చాలా ఎక్కువ మోతాదులో మాత్రలు మింగవలసి వస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఈ నేపథ్యం లో తాము 24 కర్కుమిన్ మాత్రల స్థానంలో కంటిలోకి కొన్ని కర్కుమిన్తో కూడిన చుక్కలు వేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని నిరూపించామని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా కోర్డిరో తెలిపారు. పెద్ద ఎత్తున మాత్రలు మింగడం వల్ల వచ్చే జీర్ణసంబంధిత సమస్యలను కూడా రాకుండా చేసుకోవచ్చునని చెప్పారు. ద్రవరూప కర్కుమిన్, మాత్రల కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రభావవంతమైందని, ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని అన్నారు. ద్రవరూప కర్కుమిన్ కళ్లలోకి వేసిన ఎలుకల్లో కణాల నష్టం గణనీయంగా తక్కువ ఉందని, పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ కనిపించలేదని వివరించారు. -
శరీరాన్ని తినేస్తుంది.. తొందరగా చంపేస్తుంది
న్యూయార్క్ : ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్క రోజులో కళ్లు కోల్పోతారు.. శరీరాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది.. తొందరగా మనిషిని చంపేస్తుంది.. ఇది కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ భయంకరమైన వ్యాధి తాలూకా ప్రభావాలు. ‘‘జాకబ్స్ స్యూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ ఆట్ ద యూనివర్శిటీ ఆట్ బఫెలో’’ పరిశోధకులు థామస్ ఎ. రస్సో అతని బృందం‘‘ హైపర్వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా’’ అనే వ్యాధిని గుర్తించారు. చాలా అరుదుగా సోకే ఈ జబ్బు అత్యంత ప్రమాదకరమైనది. మందులకు సైతం లొంగని ఈ వ్యాధిని నిర్థారించటానికి ఇంత వరకూ ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. తీసుకునే ఆహారం, నీటి కారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నప్పటికి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. థామస్ ఎ. రస్సో మాట్లాడుతూ.. క్లెబ్సిల్లా నిమోనియా, హైపర్వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా రెండూ ప్రమాదకరమైనవి అయినప్పటికి హైపర్వైరలంట్ మరింత ప్రమాదకరమైనదని, శరీరంలోపల వ్యాప్తి చెంది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఎంత ఆరోగ్యంగా ఉన్న యువకులైనా ఈ వ్యాధి బారిన పడినప్పుడు లివర్, మెదడుపై కురుపులు రావటం, వ్యాధి శరీరాన్ని తొలిచి తినటం ద్వారా మరణం సంభవిస్తుందని తెలిపారు. ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు జరపటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. -
గుండెజబ్బుకు మరింత మెరుగైన చికిత్స
గుండెజబ్బులు వచ్చిన వారు తరువాతి కాలంలో గుండె పనిచేయకపోవడం వల్ల మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఇదేంటో తెలుసుకోవాలంటే ముందుగా గుండెపోటు తరువాత శరీరంలో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చిన తరువాత రక్తనాళాలు పూడుకుపోయిన చోట గుండె కణజాలం దెబ్బతింటుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గుండె తన ఆకారాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కాస్తా చాలా సందర్భాల్లో గుండెలోని ఒక వాల్వ్ పనిచేయకుండా పోయేందుకు కారణమవుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎంఐటీ, హార్వర్డ్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఐర్లాండ్), కొన్ని ఇతర సంస్థలు కలిసి థెరిపీ పేరుతో ఓ పరికరాన్ని అభివృద్ధి చేశాయి. శస్త్రచికిత్స ద్వారా దీన్ని గుండెపైభాగంలో అతికిస్తే.. ఆ తరువాత దాని ద్వారా మందులను నేరుగా కణజాలం దెబ్బతిన్న ప్రాంతానికి అందివ్వవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎల్లెన్ రోష్ తెలిపారు. పోటు కారణంగా గుండె దెబ్బతిన్నప్పటికీ ఈ పరికరం ద్వారా పరిస్థితి మరింత చేజారకుండా చూడవచ్చునని చెప్పారు. ఈ పని కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. థెరపీ ద్వారా వీటిని అధిగమించవచ్చునని వివరించారు. -
బాబూ.. నీ జబ్బుకు ఇండియాలో మందు లేదు!
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలంటూ డిమాండ్ చేశారు. తరచూ బాబు నిప్పు అని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని అన్నారు. బురద చల్లడం చంద్రబాబుకు కొత్తేం కాదని మండిపడ్డారు. సీఎం వద్ద ఆధారాలు వుంటే బయటపెట్టి తనని ముద్దాయిని చేయాలని.. అలా చేస్తే ఇద్దరి నిజస్వరూపం లోకానికి తెలుస్తుందని ముద్రగడ అన్నారు. ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని వెల్లడించారు. తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు. బాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాటు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందుచేత జబ్బు బాగా ముదిరిపోయిందని ముద్రగడ ఎద్దేవా చేశారు. లోకేష్ మంత్రి పదవి కోసం ఓ పూజారిని సంప్రదించారని, కానీ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని నిలదీశారు. వంశపారపర్యంగా అర్చకత్వం ఉండకూడదన్న చంద్రబాబు, తన రాజకీయ వారసుడిగా ఉన్న లోకష్కు ఈ నియయం ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. -
లూపస్ / ఎస్ఎల్ఈ కంచె చేను మేస్తే
లూపస్ (ఎస్ఎల్ఈ) అనేది దీర్ఘకాలం వేధించే ముఖ్యమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక కణాలు మన అవయవాలను కాపాడుతుంటాయి. అయితే ‘కంచే చేను మేసినట్లు’గా, ఈ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక కణాలు సొంత అవయవాల మీద దాడి చేస్తాయి. దాంతో శరీరంలోని అనేక భాగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీని పట్ల సరైన అవగాహన లేకపోవడంతో తొలిదశలోనే గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. దాంతో వ్యాధి ముదిరి ప్రాణాంతకం అవుతోంది. ఎందుకు, ఎలా వస్తుంది... ♦ జన్యులోపాల వల్ల ఈ వ్యాధి రావచ్చు. ♦ కొన్ని విటమిన్ లోపాల వల్ల రావచ్చు ♦ అంటువ్యాధుల వల్ల ♦ కొన్ని రకాలైన మందుల వల్ల (అయితే మందులు ఆపేసిన కొంత కాలానికి జబ్బు లక్షణాలు తగ్గుతాయి). ఎవరిలో వస్తుంది... లూపస్ ఏ వయసువారికైనా వస్తుంది. పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా 25 – 45 ఏళ్ల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో ఈ వ్యాధిని వెంటనే గుర్తించకపోతే గర్భస్రావాలు జరుగుతాయి. ప్రారంభ దశలోనే గుర్తించకపోతే... మూల్యం చెల్లించక తప్పదు... తొలిదశలోనే లూపస్ను గుర్తించడం కష్టమైన పని. ఈ దశలో గుర్తించకపోతే జబ్బు ముదిరి ప్రాణాంతకంగా మారుతుంది. తొలి దశలోనే గుర్తిస్తే దీన్ని చాలా త్వరగా, సమర్థంగా నియంత్రించవచ్చు. అంతేకాదు, తొలిదశలోనే ఉన్నప్పుడు ఈ వ్యాధి మందులకు తేలిగ్గా లొంగుతుంది. అందుకే ప్రతి ఒక్కరిలో అప్రమత్తత అవసరం. వ్యాధి లక్షణాలు : వ్యాధి లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. అలాగే అందరిలోనూ ఒకేలా ఉండవు. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, విపరీతమైన అలసట, ఒళ్లునొప్పులు, జ్వరం ఈ వ్యాధిలో కనిపిస్తాయి ♦ ఈ వ్యాధితో బాధపడేవారు సూర్యకాంతికి సున్నితంగా ఉంటారు. ఎండలోకి వెళ్లినప్పుడు బుగ్గల మీద ఎర్రటి మచ్చలు (బటర్ ఫ్లై రాష్) రావడం, ఒళ్లంతా మంట, దురద రావడం జరుగుతుంది. ♦ కీళ్లనొప్పులు, వాపులు వస్తాయి ♦ తరచూ నోటిలో పూత వస్తుంది ♦ అధికంగా జుట్టురాలడం, చల్లటి వాతావరణంలో వేళ్లు రంగులు మారడం వంటివి కూడా జరుగుతాయి. ♦ జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ రక్తహీనత రావడం; తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ తగ్గడం ♦ ఎముకలు బలహీనమై తేలిగ్గా విరిగిపోవడం జరుగుతాయి. ♦ వ్యాధి నిర్ధారణ జరిగిన రెండు లేదా మూడేళ్లలో మూత్రపిండాలపై దీని ప్రభావం పడుతుంది. ఒళ్లంతా వాపు రావడం, బీపీ పెరగడం, మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోవడం జరుగుతాయి. ♦ ఈ జబ్బు వల్ల ఊపిరితిత్తులు ప్రభావితం అయినప్పుడు దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం లాంటివి జరుగుతాయి. ♦ గుండెపై ప్రభావం వల్ల ఛాతీనొప్పి, గుండె చుట్టూ నీరు చేరి గుండెను నొక్కేయడం, చిన్నవయసులోనే గుండెపోటు రావడం జరుగుతాయి. ♦ నాడీవ్యవస్థ ప్రభావితం అయినప్పుడు విపరీతమైన తలనొప్పి, వాంతులు, చూపుపోవడం, ఫిట్స్ రావడం, జ్ఞాపకశక్తి తగ్గడం, యుక్తవయసులో పక్షవాతం రావడం, మెదడులో రక్తపు గడ్డలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. ♦ దీని ప్రభావం కాలేయం, ప్లీహం (స్పీ›్లన్) పై కూడా ఉంటుంది. ♦ దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నొప్పితో కూడిన ఎర్రని మచ్చలు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటివి రక్తనాళాలపై లూపస్ ప్రభావం పడినప్పుడు జరుగుతాయి. ♦ ఈ జబ్బుతో బాధపడే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. గర్భిణుల్లో లూపస్... లూపస్ వల్ల గర్భిణుల్లో జరిగే హాని ఎక్కువ. గర్భస్రావాలు కావచ్చు. నెలలు నిండకముందే ప్రసవం, తక్కువ బరువున్న శిశువు జన్మించడం, గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ చాలా ఎక్కువగా పెరిగి, ఫిట్స్ రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. గర్భం దాల్చి ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రుమటాలజిస్టులతో వివరంగా సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే గర్భవతిగా ఉన్న సమయంలో మందులు ప్రభావం శిశువు మీద పడకుండా రుమటాలజిస్టులు సూచించిన మందులు వాడాలి. లూపస్ నిర్ధారణ ఎలా? లూపస్ను గుర్తించడం రుమటాలజిస్టులకు ఒక సవాల్ వంటిది. వీరు రోగిని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధి నిర్ధారణ కోసం ఏఎన్ఏ వంటి కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. జబ్బు తీవ్రతను తెలుసుకోడానికి యాంటీ డీఎస్డీఎన్ఏ వంటి మరికొన్ని రక్తపరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే లూపస్ ప్రభావం ఏ అవయవం మీద పడుతుందో కూడా తెలుసుకోడానికి, మరి కొన్ని పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. లూపస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ రుమటాలజిస్టులను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి, వారు సూచించిన మందులు వాడాలి. ♦ వైద్యులను సంప్రదించకుండా హఠాత్తుగా మందులు మానేయకూడదు. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరిగి తీరని నష్టం జరుగుతుంది. ♦ ఈ రోగులు సూర్యకిరణాల పట్ల సున్నితంగా ఉంటారు.కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సూర్యరశ్మి ఒంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. సన్స్క్రీన్, గొడుగు కాటన్ దుస్తులు ఉపయోగించడం వల్ల చర్మంపై సూర్యకాంతి ప్రభావం తగ్గించవచ్చు. ♦ వీరు ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. దాంతో అవి అంత తేలిగ్గా విరగవు. ♦ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా వంటి ప్రక్రియలతో ఒత్తిడి తగ్గించుకోవడం వంటి మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. చికిత్స: వ్యాధిగ్రస్తులకు చికిత్స అనేది ఒకప్పుడు సవాలుగా ఉండేది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అత్యాధునిక మార్పుల వల్ల ఈ జబ్బుకు చికిత్స లభ్యమవుతోంది. ♦ తొలిదశలో స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. కానీ చాలామందికి ఈ మందులపై అవగాహన లేక, వాటివల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అపోహపడి మానేస్తారు. నిజానికి ఈ మందులే ఇలాంటి ఆటోఇమ్యూన్ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను నిలబెడతాయి. రోగి బరువును, వయసును స్టెరాయిడ్ మోతాదును డాక్టర్లు నిర్ణయిస్తారు. వ్యాధి తగ్గుముఖం పట్టిన వెంటనే వైద్యులు మందులు మోతాదును తగ్గిస్తారు. అలాకాకుండా భయం వల్లగానీ. ఇతరుల సలహా వల్ల గానీ వాటిని మధ్యలోనే ఆపేస్తే, వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. ఈ కథనంలో పేర్కొన్న లక్షణాలను గమనించిన వెంటనే అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులను కలిసి, చికిత్స విధానాల గురించి చర్చించి, వారి సలహా మేరకు మందులు తీసుకోవడం వల్ల సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా జీవించవచ్చు. ముఖ్యంగా జరగాల్సింది... ఈ జబ్బు అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి... కొన్ని లక్షణాలను గమనించిన వెంటనే, ఆ అవయవానికి చికిత్స అందించడం మాత్రమే కాకుండా నిర్దిష్టంగా ఎస్ఎల్ఈని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. – డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రోగ శంకితులు
మాటవరసకు తుమ్ము వస్తుంది. దానిని హెచ్1ఎన్1బి1సి1 ఇన్ఫ్లూయెంజా అని భయపడిపోయి ఆ పూటకు లీవ్ పెట్టి డాక్టర్ దగ్గరకు పరిగెట్టడమే.పొద్దున బ్రష్ చేస్తుంటే అందరికీ వచ్చినట్టే చిగుళ్ల నుంచి కొంచెం రక్తం కారుతుంది. ఓరి బాబోయ్... ఇది కేన్సరే. ఆ పూట మోషన్ డిలే అవుతుంది. ఇది పెద్ద పేగు కేన్సర్కు చిహ్నమే తప్ప మరొకటి కాబోదు. రోగం... రోగం... రోగం.... రోగం ఉందనుకోవడమే అన్నింటికన్నా చెడ్డరోగం. దానికి ఓ పేరు కూడా ఉంది. అదే ‘ఇల్నెస్ యాంగై్జటీ డిజార్డర్’ రోగభయంతో బాధ పడటమే అన్నింటికన్నా పెద్దబాధ నీడకు భయపడటం మానండి. వెలుతురులోకి రండి. రమేశ్ వయసు కేవలం 35 ఏళ్లు.ఎందుకో ఉదయం పూట తలనొప్పిగా అనిపించింది. ముఖం కడుక్కుంటున్నప్పుడు నోట్లోకి వేళ్లుపెట్టుకొని శుభ్రం చేసుకోవడం రమేశ్ అలవాటు. రాత్రి అజీర్తి చేసిందేమో వాంతిలో కాస్త అన్నం మెతుకులు కూడా కనిపించేసరికి రమేశ్ గుండె ఆందోళనతో కొట్టుకుంది. అంతే. అన్ని పనులూ పక్కన బెట్టి నేరుగా న్యూరాలజిస్ట్ను కలిశాడు. రమేశ్ ఆందోళనకు కారణం కూడా ఉంది. అదే విషయం డాక్టర్కు చెప్పాడు రమేశ్. ‘సర్... వినోద్ కూడా నా ఈడువాడే. అతడికీ ఉదయం వేళల్లో తలనొప్పి వచ్చేది. వాంతులూ అయ్యేవి. ఒకసారి డాక్టర్ను కలువురా అన్నాను. అయినా వాడు విన్లేదు. తలనొప్పికి డాక్టర్ను కలవడం ఏమిట్రా అంటూ నా సలహాను తీసిపారేశాడు. కానీ ఆ తర్వాత తేలింది– వాడికి బ్రెయిన్ క్యాన్సర్ అని. మామూలు తలనొప్పే కావచ్చునంటూ నిర్లక్ష్యం చేయడం వల్ల వాడి బ్రెయిన్ క్యాన్సర్ కాస్తా అడ్వాన్స్డ్ దశకు చేరుకుంది. ఈమధ్యే వాడు పోయాడు. నా పరిస్థితీ అంతేకావచ్చేమోనని భయంగా ఉంది డాక్టర్’ అంటూ వాపోయాడు రమేశ్. డాక్టర్ కొన్ని సాధారణ పరీక్షలు చేశారు. రెండు మూడు రోజుల్నుంచి ఏం తిన్నారంటూ అడిగారు. ‘ఫంక్షన్లు ఉండటంతో వరసగా మూడురోజులూ బిర్యానీలూ, బగారా అన్నం తిన్నా’ అంటూ జవాబిచ్చాడు రమేశ్. డాక్టర్కు కేసు అర్థమైంది. ‘రమేశ్ గారూ... మీకు కేవలం అజీర్తి. వరసగా మసాలాలతో భోజనం చేయడం వల్ల ఈ ప్రాబ్లం. అసలు మీకు ఎలాంటి సమస్యా లేదు’ అనిమందులు రాశాడు. నమ్మలేదు రమేశ్. ‘నాకు అయిన వాంతి బ్రెయిన్ క్యాన్సర్కు సంబంధించిందా? లేక... కడుపులో అల్సర్లూ గట్రా ఏమైనా అయ్యాయా? లేదా క్యాన్సర్ మెదడు నుంచి కిందికి పాకుతూ కడుపు వరకూ వచ్చిందా?’ అనే సందేహాలు రమేశ్ను నిలవనివ్వలేదు. అట్నుంచి అటు మరో న్యూరాలజిస్టు దగ్గరకు వెళ్లడంతో పాటు... పనిలోపనిగా ఎందుకైనా మంచిదని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టునూ కలిశాడు. ఆ ఇద్దరూ క్షుణ్ణంగా పరీక్షలు చేశారు. న్యూరాలజిస్టు ఎందుకైనా మంచిదని బ్రెయిన్ సీటీ, ఎమ్మారైలు తీయిస్తే... గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారు. ఎలాగూ ఈ పరీక్షలు చేయిస్తున్నాను కదా పనిలో పనిగా అనుకుంటూ టోటల్ బాడీ చెకప్ చేయించాడు రమేశ్. రిజల్ట్స్ అన్నీ నార్మల్. కాకపోతే... రక్తపరీక్షల్లో తెల్లరక్తకణాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. అది కూడా నార్మలేననీ... దాన్ని అంతగా సందేహించక్కర్లేదనీ అన్నారు డాక్టర్లిద్దరూ. బ్లడ్ క్యాన్సర్లలో తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉంటాయని ఎక్కడో చదివాడు రమేశ్. తనకు బ్లడ్ క్యాన్సర్ కూడా ఉందేమోనంటూ అతడిలో మరో సందేహం. వెంటనే హీమటాలజిస్ట్ను కలిశాడు. అక్కడ హీమటాలజిస్ట్ ఆయన రిపోర్టు చూసి నవ్వి... ‘రమేశ్గారూ... బ్లడ్ క్యాన్సర్లో తెల్లరక్తకణాలు పెరుగుతాయన్న మాట నిజమే. కానీ... వాటి కౌంట్ చాలా అనూహ్యమైనంత ఎక్కువగా ఉంటుంది. ఇలా కొద్దిగా కాదు. మీరు న్యూస్పేపర్లలో చదివో, టీవీల్లో చూసో ఇలాంటి అపోహలు పెంచుకుంటారు. కానీ ఇలా కొద్దిగా పెరిగిన తెల్లరక్తకణాల కౌంట్ బ్లడ్క్యాన్సర్దో కాదో మాకు ఇట్టే తెలిసిపోతుంది. మీకు ఎలాంటి సమస్యా లేదు. నిశ్చింతగా ఉండండి’అంటూ ఆందోళన తగ్గడానికి కొన్ని మందులు రాసి ఇచ్చారాయన. అయినా రమేశ్లో ఆందోళన తగ్గలేదు. ‘డాక్టర్లు అలాగే చెబుతారు. ఆయన మాటలు నమ్మి రేప్పొద్దున నేను చచ్చిపోతే... నా భార్య, చిన్న చిన్న పిల్లల పరిస్థితేమిటి?’... అనుకుంటూ స్వయంగా గూగుల్లో ఆయా వ్యాధుల గురించి తెలుసుకోడానికి చేసే ప్రయత్నంలో భాగంగా విపరీతంగా రకరకాల హెల్త్ వెబ్సైట్స్ చూడటం మొదలుపెట్టాడు. అంతకు ముందు ఉన్న కొండంత డౌట్లకు మరికొన్ని తోడయ్యాయి. ఆ తాజా సందేహాలు ఆకాశమంత ఎత్తున్న పర్వతాలుగా పెరిగిపోయి డాక్టర్లను చూస్తూ... పరీక్షలు చేయిస్తూ... అనవసరంగా మందులు మింగుతూ నిజంగానే పేషెంట్లా మారిపోయాడు. మునపటిలా హుషారుగా కాకుండా ఎంతో కుంగిపోయి ఉన్న రమేశ్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు స్నేహితులు. అతడి పరిస్థితి క్షుణ్ణంగా విన్న డాక్టర్ కొన్ని ప్రశ్నల తర్వాత అతడి జబ్బును తెలుసుకున్నారు. ‘మీ రమేశ్కు ఎలాంటి వ్యాధీ లేదు. అతడికి ఉన్న జబ్బు పేరు ‘ఇల్నెస్ యాంగై్జటీ డిజార్డర్’. గతంలో దీన్నే ‘హైపోకాండ్రియాసిస్’ అనేవారు. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే ‘లేని వ్యాధుల గురించి ఆందోళన పడే రుగ్మత’గా అనుకోవచ్చు’ అన్నారు డాక్టర్. ఇల్నెస్ యాంగై్జటీ డిజార్డర్కు ఇవే కారణాలు... ♦ తమ కుటుంబంలోని లేదా అతి దగ్గరి వ్యక్తులు చిన్న వయసులో జబ్బు పడి వ్యాధి ముదిరాక ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లడం లేదా మృతి చెందడం. ♦ వైద్యానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం కోసం గూగుల్ వంటి సమాచార మా«ధ్యమాలను ఆశ్రయించడం. అక్కడి విస్తృతమైన సమాచారాన్ని చదువుతూ, తమకు సంబంధించిన అంశాలను తమకు ఆపాదించుకోవడం. ♦అధునాతన పరీక్షలు చేయిస్తే తప్ప తమకు వచ్చిన జబ్బు కరెక్టో కాదో నమ్మలేని స్థితికి వెళ్లడం... దగ్గరిలోని చిన్న ల్యాబ్ల పట్ల నమ్మకం లేకపోవడం... ♦తాము ఎలాంటి ఛాన్సూ తీసుకోడానికి ఇష్టపడని వైద్యులు 100 శాతం నమ్మకం కోసం ఇప్పుడు అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటినీ చేయిస్తున్నారు. అలా రాసి పరీక్షల ద్వారా ఏమీ లేదని చెప్తే తప్ప నమ్మలేని స్థితికి వెళ్లడం. ఒకవేళ పరీక్షల్లో ఏమీ లేదని తేలినా జబ్బే లేకపోతే లక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయంటూ వాదిస్తుంటారు. ♦క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల్లోనూ సాధారణ జబ్బులకు ఉండే లక్షణాలు ఉంటాయి. ఆ సాధారణ చిన్న లక్షణాలను ప్రమాదకరమైన జబ్బుకు సంబంధించినవిగా అనుమానించి డాక్టర్లచుట్టూ, డయాగ్నస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగడం. ♦ ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల టీవీల్లో, పత్రికల్లో కేవలం ప్రాథమిక అవగాహన కోసం ఇస్తున్న కథనాలతో బెంబేలెత్తుతూ... అవన్నీ తమకు ఆపాదించుకొని అనవసరమైన ఆందోళనకు గురవుతుండటం. మరికొన్ని సామాజిక సమస్యలకూ కారణం ఇలా ‘రోగులు కాని రోగుల’తో చాలా సమస్యలు సామాజికంగానూ వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవి... ♦ ఈ ‘రోగులు కాని రోగుల’ అపాయింట్మెంట్ల వల్ల నిజంగా జబ్బుతో బాధపడుతున్న అసలు రోగికి చికిత్స అందడంలో ఆలస్యం అవడం. మన వైద్యసేవల వ్యవస్థపై భారం పడటం. మన దగ్గర వేల సంఖ్యలో రోగులకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కూడా అందుబాటులో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు కాని రోగుల వల్ల టెరిషియరీ వైద్యసేవల వద్ద అనవసరమైన భారమూ పడుతోంది. ♦ తాము సంపాదించే డబ్బునే తమ నమ్మకం కోసం డాక్టర్లకూ, డయాగ్నసిక్ పరీక్షలకూ ఖర్చు పెడుతున్నామంటూ వీరు వాదిస్తుండవచ్చు. నిజానికి వీళ్లు చేసేది పదే పదే పరీక్షలతో డబ్బు వృధా చేయడం. ఈ అనుమాన గుణం నుంచి బయటపడితే ఆ విలువైన సంపాదనను మరికొన్ని ఇతర ముఖ్యమైన అవసరాలకు ఖర్చు చేయవచ్చు. చికిత్స : ♦ ఒక మంచి డాక్టర్ను తన ఫ్యామిలీ ఫిజీషియన్గా ఎంచుకోవాలి. ఏ చిన్న లక్షణం కనిపించినా ఆయనను సంప్రదిస్తూ ఉండాలి. ఇలా దీర్ఘకాలంలో రోగికి తన వైద్యుడిపై నమ్మకం పెరగడం వల్ల ఆయన మాటపై భరోసాతో అనవసరమైన ఆందోళనలు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించగలుగుతారు. ♦ రోగి తనకు చాలా పెద్ద సమస్య ఉందని చెబుతూ ఉంటే, అతడి మాటలు కొట్టేయకుండా నెమ్మదిగా నచ్చజెప్పి, సైకియాట్రిస్ట్కు చూపించాలి. రోగికి జబ్బు వల్ల కలిగే మానసిక ఒత్తిడినీ, యాంగై్జటీని తొలగించడానికే సైకియాట్రిస్ట్ను కలుస్తున్నామనీ, రోగికి ఉన్న (అతడు అనుమానిస్తున్న) వ్యాధికీ, అతడి మానసిక స్థితికీ ఈ రెండింటికీ ఏకకాలంలో చికిత్స చేయిస్తున్నామనే విశ్వాసాన్ని రోగిలో పాదుగొల్పాలి. మందులు : ఇలా మాటిమాటికీ అవే ఆలోచనలు పదే పదే వస్తుండే రోగుల్లో అలాంటి ఆలోచనలు రాకుండా నియంత్రించే మందులు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి రోగులకు అలాంటి మందుల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కౌన్సెలింగ్ : మందులతో పాటు రోగికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా కూడా అతని పరిస్థితిని మరింత చక్కబరచవచ్చు. రోగికి ఉన్న తీవ్రతను బట్టి తగిన ట్రీట్మెంట్ ప్లాన్తో ఈ సమస్యను నయం చేయవచ్చు. డాక్టర్ షాపింగ్ ఈ రోగుల ప్రత్యేకత... ఇల్నెస్ యాంగై్జటీ డిజార్డర్ వ్యాధి ఉన్నవారు వరసబెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. న్యూరాలజిస్టు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, పల్మనాలజిస్టు, ఈఎన్టీ, ఆంకాలజిస్ట్, హిమటాలజిస్టు, ఇలా అన్నిరకాల స్పెషలిస్టులనూ మార్చిమార్చి కలుస్తుంటారు. వారు చెప్పిన పరీక్షలు చేయిస్తుంటారు. ఆ పరీక్షలు నార్మల్గా వచ్చినా డాక్టర్ ఏమీ లేదని చెప్పినా వాళ్లు నమ్మరు. పైగా వయసును బట్టి వైద్యపరీక్షల్లో వచ్చే కొద్దిపాటి తేడాలను పట్టుకొని ఆ తేడా ఎందుకుందంటూ ప్రశ్నిస్తుంటారు. మరోడాక్టర్... ఇంకోడాక్టర్... వేరే డాక్టర్ అంటూ పలువురు వైద్యులను కలిసి ఆర్థికంగానూ, మానసికంగానూ నష్టపోతుంటారు. ఇలా మార్చిమార్చి డాక్టర్స్ దగ్గరకు వెళ్లడాన్ని ‘డాక్టర్ షాపింగ్’గా నిపుణులు పేర్కొంటుంటారు. వ్యాధి ఉన్నట్లు అనుమానించే చాలామంది రోగులు ఇలాంటి డాక్టర్ షాపింగ్ చేస్తుంటారు. ఇక ఇల్నెస్ యాంగై్జటీ డిజార్డర్ ఉన్నట్లయితే చెప్పనక్కర్లేదు. - డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా బైపోలార్ క్లినిక్, ఆశా హాస్పిటల్స్, హైదరాబాద్ -
కృత్రిమ గుండె రెడీ!
హమ్మయ్యా... ఎట్టకేలకు మనిషికి గుండె అందుబాటులోకి రానుంది.. వ్యాధి లేదా పోటు వంటి కారణాలతో గుండె బాగా బలహీనపడితే ఇప్పటివరకూ కృత్రిమ గుండెను వాడేవారు గానీ.. అదంతా తాత్కాలికమే. అవయవ దానం ద్వారా ఇంకో గుండె దొరికేంత వరకూ రోగిని బతికేలా చేస్తుంది ఈ గుండె. అయితే ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. డాక్టర్ రిచర్డ్ వాంప్లర్ అనే శాస్త్రవేత్త 2014 నుంచి ఈ కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన కృత్రిమ గుండెల మాదిరిగా ఇందులో బోలెడన్ని భాగాలు ఉండవు. కచ్చితంగా చెప్పాలంటే ఒకే ఒక్క కదిలే భాగం ఉంటుంది. అలాగే మనిషి గుండెలో మాదిరిగా కవాటాలు లేకుండానే దీన్ని తయారుచేశారు. టైటానియం గొట్టం... అందులో అటుఇటు కదిలే గొట్టం లాంటి నిర్మాణం. ఇదీ ఒరెగాన్ గుండె స్థూల నిర్మాణం. కదిలే గొట్టం గుండె దిగువ భాగంలో ఉండే రెండు కవాటాల మాదిరిగా పనిచేస్తుందన్నమాట. రోగి తనతోపాటు మోసుకెళ్లే బ్యాటరీ ద్వారా శక్తితో పనిచేస్తుంది ఇది. ఆవులు, గొర్రెల్లో ఈ కృత్రిమ గుండెను ఇప్పటికీ విజయవంతంగా పరీక్షించారు. మూడు నెలలపాటు పనిచేయించిన తరవాత మానవులపై ప్రయోగాలు చేస్తామని ఒరెగాన్ యూనివర్శిటీ అంటోంది. -
గుంటూరులో విజృంభిస్తున్న అతిసారం..8మంది మృతి
-
‘ఇర్ఫాన్ఖాన్ చాంపియన్లా తిరిగివస్తాడు’
విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ఖాన్ అనారోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నఇర్ఫాన్ ఆ వ్యాధి గురించి తెలిసిన తరువాత తనే చెబుతానని సోమవారం ట్విటర్లో పేర్కొన్నాడు. అరుదైన వ్యాధి అని, దాని గురించి ఇంకా వివరాలు తెలియలేదని, ఇంకో వారం పది రోజుల్లో వివరాలు ప్రకటిస్తానని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై మీడియా తనకు తోచిన విధంగా కథనాలు ప్రచురిస్తుండటంతో నటుడు మనోజ్ బాజ్పేయ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...‘‘అందరినీ దయ చేసి వేడుకుంటున్నాను, మీరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. తన వైపు నుంచి అధికారికంగా విషయం వెల్లడించేవరకు వేచి చూడండి. తను ఆ వ్యాధిని కనిపెట్టి, ఎదురించి చాంపియన్లా తిరిగివస్తాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మనమంతా అతని ప్రైవసీని గౌరవిద్దాం’’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. -
గుంటూరులో ఘోరకలి ; ఇప్పటికి 8మంది మృతి
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు. మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం. -
డయేరియా అలజడి
గుంటూరు మెడికల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. మూడు రోజుల్లో 200 మంది వ్యాధిపీడితులుగా మారి ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో తీవ్ర అలజడి రేగింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డయేరియా ఒక్కసారిగా విజృంభించడానికి కారణాలు తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో రోగులు ఆస్పత్రులకు చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు 600 శాంపిళ్లు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నీరు కలుషితమైనట్లు తేలలేదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ డయేరియా విజృంభణకు కలుషిత నీరు లేదా ఆహారం విషతుల్యంగా మారడమా అనేది తేలాల్సి ఉందన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం పర్యటిం చారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ నేతృత్వంలో పది వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో డోర్ టూ డోర్ సర్వే చేయించి, బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. నగరంలో ఒక్కరోజు పాటు నీటి సరఫరా నిలిపివేసి, శాంపిళ్లు తీసిన అనంతరం పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసి తిరిగి నీరు విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసి డయేరియా బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లోనే నేరుగా ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. 200 మంది బాధితులు.. ముగ్గురు మృతి నగరంలో డయేరియా బారినపడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్, జ్వరాల ఆస్పత్రిలో సుమారు వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జ్వరాల ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడంతో వైద్యులు నేలపైనే రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్తున్నారనేది లెక్క తేలాల్సి ఉంది. జీజీహెచ్లో మెడికల్ ఎమర్జెన్సీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మంగళవారం మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. మూడు రోజులుగా ఆస్పత్రికి డయేరియా బాధితులు వస్తున్నారని, మంగళవారం ఒక్కరోజే 60 మందికి పైగా బాధితులు రావటంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో డయేరియా బాధితుల కోసం మంగళవారం 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. బాధితులకు వైద్యసేవలను అందించేందుకు స్టాఫ్ నర్సులు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, ఆర్ఎంఓలు, జూనియర్ డాక్టర్లను నియమించారు. డ్యూటీ లేని వారిని సైతం విధులకు హాజరుకావాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. బాధితులకు ఆస్పత్రి అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లు ఇచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగాలని సూచించారు. భయందోళనలో నగర ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పది డివిజ న్లలో ఒక్కసారిగా డయేరియా విజృంభించడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారంటూ రోగుల బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా ప్రాంతాల్లో 600 శాంపిళ్లు తీసి మరీ నీటి పరీక్షలు చేశామని, నీటిలో తేడా ఉన్నట్లు కని పించలేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. పాతగుంటూరు, ఆనందపేట, వినోభానగర్, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం కావడంతో బాధితుల్లో అధికశాతం మంది చికెన్, మటన్ తిన్నట్లు చెబుతున్నారు. నిల్వ ఉన్న మాంసం తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇంత పెద్ద ఎత్తున్న డయేరియా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో డయేరియా విజృంభించడంతో నగర వాసులకు కంటిపై కునుకులేకుండా పోయింది. వ్యాధి ప్రబలడానికి కారణం ఏమిటో తెలియకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. -
ప్రాణాలు పోతున్నాయ్..!
‘తెల్లందాక...పొద్దుందాక లారీలే. దుమ్ము, దూళీతో వసపడుతలేదు. దగ్గు, దమ్ము రోగాలొస్తున్నాయ్. కనీసం తిండి కూడా సరిగ్గా తినేటట్లు లేదు. నీళ్లన్నా సల్లిపీయమంటే ఇంటలేరు. ఇంట్లకెల్లి కాలు బయటపెడుదామంటే భయమైతంది. ఊల్లె సర్పంచ్కు చెప్పినం. కలెక్టర్కు కూడా చెప్పినం. అయినా పట్టించుకున్నోళ్లు లేరు’ అంటూ పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లారీలను నిలిపివేసి, గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బుధవారం రాస్తారోకో చేశారు. సాక్షి, పెద్దపల్లి: జిల్లా ప్రజానీకానికి లారీలు నిత్యం నరకం చూపిస్తున్నాయి. ఓవర్లోడ్, మితిమీరిన వేగంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తిరుగుతుండడంతో నిత్యం దుమ్ము, దూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్లు అధ్వానంగా మారాయి. షరామామూలుగానే అధికారులు లారీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా ప్రతి రోజు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యక్ష నరకం ఇసుక క్వారీలు, కంకర క్వారీలు, క్రషర్ల మూలంగా జిల్లాలో వేలాది లారీలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, పెద్దపల్లి, రామగిరి, కమాన్పూర్, మంథని మండలాలకు చెందిన ప్రజలకు లారీలతో కంటిమీద కునుకులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లా కాసిపేట, సిరిపురం, గోలివాడ, మేడారంలలో పంప్హౌస్, బ్యారేజీలు, టన్నెల్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు అవసరమైన కంకర, ఇసుకను సరఫరా చేసేందుకు ప్రతి రోజు వందలాది లారీలు తిరుగుతున్నాయి. అలాగే జిల్లాలోని జయ్యారం, కన్నాల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, జగిత్యాల జిల్లా వెల్గటూర్లలో కంకరక్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వందలాది లారీలు నిత్యం కంకరలోడ్తో వెళ్తుంటాయి. ఓవర్లోడ్పై నియంత్రణేది? జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 90శాతం మితిమీరిన వేగం, ఓవర్లోడ్తోనే కావడం గమనార్హం. ఓవర్లోడ్తో లారీలు వెళ్లడంతో రోడ్లు అధ్వానంగా మారడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారితోపాటు పాలకుర్తి, పెద్దపల్లి శివారు గ్రామాల్లో తరచూ లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్లోడ్, అతివేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓవర్లోడ్తో వెళ్తున్న ఒక్క లారీకి జరిమానా విధించిన సంఘటనలు లేవు. ఓవర్లోడ్ నియంత్రణకు స్పెషల్డ్రైవ్ లారీల ఓవర్లోడ్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. సాధారణ చెకింగ్లతోపాటు, ఈ స్పెషల్ డ్రైవ్ గురువారం నుంచి జిల్లాలో అమలవుతుంది. ఎక్కడా ఓవర్లోడ్తో లారీలు దొరికినా, కేసులు బుక్ చేస్తాం. ఓవర్లోడ్ను ఖచ్చితంగా నియంత్రిస్తాం. – వై.కొండాల్రావు, జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీవో) దుమ్ముతోటి రోగాలత్తాన్నయి లారీల తిరుగుతుండడంతో రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేస్తోంది. రోడ్డును ఆనుకుని ఉన్న ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దగ్గు, దమ్ము వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రుల్ల వేల రూపాయలు ఒడుస్తున్నయి. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలి. కొత్త రోడ్డు పనులు త్వరగా చేయాలి. – బత్తిని లక్ష్మి, పుట్నూర్ తిండి తినలేకపోతున్నాం రహదారికి ఇరువైపులా పొక్లెయిన్తో తవ్వి వదిలేశారు. మా గ్రామం మీదుగా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తున్న వందలాది లారీలతో తీవ్రమైన దుమ్ము వస్తున్నది. దీనిపైన గ్రామ సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినం. దుమ్ముతో కనీసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నాం. మా బాధ పట్టించుకున్నోళ్లు లేరు. – బద్రి లక్ష్మి, పుట్నూర్ -
కడపటి కోరిక
‘‘బాగా యెవరైనా బతుకుతారు. కాని బాగా చనిపోయేవాళ్లు తక్కువ. వాళ్లే ధన్యులు’’ అంటుండేవారు ఆత్రేయ. ఆయన మాట అక్షరాలా నిజమని వెంకటేశ్వర్లు విషయంలో రుజువయింది.’’ బయట నుంచి వస్తూనే సానుభూతితో నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు నారాయణ.‘‘అలా అంటారేమిటండీ? ఆయన రోగం రొష్టూ లేకుండా సునాయాసంగా పోయాడట కదా?’’ భర్త మాటలకు ఆశ్చర్యపోయింది రమ.‘‘పోవడం వరకు నువ్వు విన్నది నిజమే. భోంచేసి పడక కుర్చీలో చేరబడి కొంచెం ఆయాసంగా వుందని భార్యను పిల్చాడట. ఆమె చెయ్యి కడుక్కొని వచ్చేలోగా ప్రాణాలు వదిలేశాడట. నలుగురూ కూడి హాస్పిటల్కి తీసుకెళ్దామని హడావిడి చేసే సరికి అనుభవజ్ఞుడెవరో నాడి చూసి యింక ఆ అవసరం లేదని, మనిషిని కిందకు దింపించేశాడట! అదిగో, అక్కడే ప్రారంభమైంది అసలు కథ. శవాన్ని యింట్లో వుంచడానికి వీల్లేదని యింటి యజమాని గొడవ చేస్తుంటే కొందరు దగ్గర్లోనే వున్న కొడుకు యింటికి శవాన్ని తీసుకెళ్దామని ప్రతిపాదించారట. కాని కొడుకు సోమేశం శవాన్ని తీసుకెళ్లడానికి ససేమిరా అనడమే కాకుండా అసలు కర్మకాండే చెయ్యను పొమ్మన్నాట్ట...’’‘‘అయ్యో.. అతనికేం పొయ్యేకాలం? సొంత తండ్రే కదా? పైగా సోమేశానిది సొంత యిల్లేనేమో!’’ రమ ముక్కున వేలేసుకొంది. ‘‘నిజమే. వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకోవడం పిల్లలకిష్టం లేదు. ఆ కోపంతో సోమేశం తండ్రి అంత్యక్రియలు చెయ్యనన్నాడు.’’‘‘అవును మరి వెంకటేశ్వర్లు మాష్టారిది మాత్రం తప్పుకదా? రిటైర్మెంట్కి దగ్గరగా వున్నప్పుడు కదా ఆయన రెండో పెళ్లి చేసుకొన్నాడు. ఆ వయసులో రెండో పెళ్లి అంత అవసరమా? ఆ వయసులో భర్త పోయిన ఆడది మరో మనువుకి సిద్ధమైతే లోకం దుమ్మెత్తి పోసేది. ఈ కాలంలో కూడా ఆడామగా మధ్య యింత తేడానా? చచ్చినోళ్లను తిట్టకూడదు కాని వెంకటేశ్వర్లు మాష్టారికి తగిన శాస్తి జరిగింది.’’‘‘రమా. వెంకటేశ్వర్లును నీలాగే చాలమంది ఆడాళ్లు అపార్థం చేసుకొని కొడుకును సమర్థిస్తున్నారు. కాని మాష్టారు మీరనుకుంటున్నంత దుర్మార్గుడు, కాముకుడు కాదు. మనం చాలా సార్లు చర్చించుకునే సమస్యే మొదటి భార్య పోయినప్పుడు అతనికీ యెదురయ్యింది. అదే – భర్తపోయిన తర్వాత భార్య జీవితం దుర్భరమని నువ్వూ, భార్యపోయిన మగాడి బతుకు నరకమని నేనూ వాదించుకొంటుంటాం కదా. నా అభిప్రాయం నిజమని భార్యావియోగం వల్ల యేర్పడిన వెలితినీ, వేదననూ అనుభవిస్తూ వెంకటేశ్వర్లు యెన్నోసార్లు అనేవాడు. తన మనోభావాలను పట్టించుకోని పిల్లల అనాదరణ గురించి నాతో చెప్పుకొని యేడ్చేవాడు. తోడు–నీడ లేని మోడు లాంటి బతుకు వెళ్లదీసే కంటె చావు వస్తేనో, ఆత్మహత్య చేసుకొంటేనో నయమని వాపోయేవాడు. అతని బాధ చూడలేక మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహించిన స్నేహితుల్లో నేనొకణ్ని. అయితే అతని పెన్షన్ కోసం ఆశపడి భార్య స్థానంలో వచ్చిన కృష్ణవేణి ఆ లోటును భర్తీ చెయ్యలేకపోవడమే కాదు – తన గొంతెమ్మ కోరికలతో అతనిని హింసించేది. సోమేశాన్ని, అతని చెల్లెలను దగ్గరకు చేరనిచ్చేదికాదు. అలా వెంకటేశ్వర్లు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి దూకినట్టయింది. ఈ పెళ్లి వల్ల తనెంతగా నలిగిపోతున్నాడో నాకు చెప్పుకొని బాధపడేవాడు. నేను, మరికొందరు ఆత్మీయమిత్రులు అతణ్ని ఓదార్చడం తప్ప ఆ సమస్యను పరిష్కరించలేకపోయాం. ఆ మానసిక వేదన వల్లే హార్టెటాక్ వచ్చి అతనంత హఠాత్తుగా చనిపోయాడు. కృష్ణవేణి లాంటి పెంకిఘటం రెండో పెళ్లాంగా రావడం అతని దురదృష్టం తప్ప, గతి లేని స్థితిలో రెండో పెళ్లి చేసుకోవడం తప్పుకాదని యిప్పటికీ నా దృఢమైన అభిప్రాయం..’’ ‘‘మీ మగబుద్ధి పోనిచ్చుకొన్నారు కాదు. రేపు నాకేమైనా జరిగితే వెంకటేశ్వర్లు మాష్టారిలాగే మీరూ పెళ్లికొడుకవడానికి సిద్ధపడతారా?’’‘‘అలాంటి పరిస్థితి చస్తేరాదు. నువ్వే ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను. అయినా నీకెన్నోసార్లు చెప్పాను. నీ కంటె నేను వయసులో పెద్ద. అందువల్ల ముందు ముందే వెనుక వెనుకే అన్న న్యాయంగా మనం కళ్లు మూసేలా అనుగ్రహించమని ఆ దేవుణ్ని కోరుకుంటుంటానని...’’‘‘అసురసంధ్యవేళ ఈ పాడుమాట లేమిటండీ? మీరు మళ్లీ మళ్లీ యిలా మాట్లాడితే మీ కళ్లెదుటే ప్రాణం తీసుకొంటాను...’’ రమ మొహం ఆకస్మికంగా మేఘావృతమైన ఆకాశంలా మారిపోయింది.‘‘ఛ! ఊరుకో రమా. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా పిచ్చిదానా? ఈ చావుల్ని చూస్తుంటే నేను కూడా చివరికొచ్చేశానని అనిపిస్తోంది–అంతే! వెంకటేశ్వర్లు నాకంటె రెండేళ్లు చిన్న. ఈ సంవత్సర కాలంలో నాతో పనిచేసిన యిద్దరు ముగ్గురు మాష్టర్లు పోయారు. ఇలా ఒక్కొక్కరూ వెళ్లిపోతుంటే నాకు బ్రతుకుతున్న ప్రతిరోజు బోనస్లా అనిపిస్తోంది. ఈ మధ్య కలల్లో తరచుగా చనిపోయిన మా కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే...’’ నారాయణ స్వరంలో వైరాగ్యధోరణి. ‘‘ఏవండీ. మీరీ చావుకబుర్లు చాలిస్తారా? నన్నొచ్చి మీ నోరు ముయ్యమంటారా? చావుకి వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి టైమొస్తే వాళ్లు వెళ్లిపోతుంటారు. వాళ్లతో మీరెందుకు పోల్చుకుంటారు? మీ కంటె పదేళ్లు ముందు రిటైరయిన వాళ్లు రాళ్లలా లేరూ? ఆ వైపు చూడకుండా నెగెటివ్ థాట్స్తో నన్నెందుకు భయపెట్టి చంపుతారు? నేనెన్నోసార్లు చెప్పాను. మళ్లీ చెపుతున్నాను. మీరు నిండు నూరేళ్లు బతుకుతారు. నేను పండు ముల్తైదువుగా పుణ్య స్త్రీగా మీ వొళ్లో కళ్లు మూస్తాను. మీరు లేంది నేను ఒక్కక్షణం కూడా బ్రతకను.’’‘‘నువ్వు తోడు లేనిది నేను మాత్రం బ్రతకగలనా? మా పెన్షనర్స్లో కొందరం మార్నింగ్ వాక్ తర్వాత, అప్పుడప్పుడూ సాయంత్రాలు పార్క్ దగ్గర కూర్చొని కాలక్షేపానికి కబుర్లు చెప్పుకొంటుంటాం. మాలో యిటీవల భార్యలను కోల్పోయిన వాళ్లు ప్రసంగవశాత్తు వాళ్ల యిక్కట్లను చెపుతుంటే మేమంతా జాలితో సానుభూతితో స్పందిస్తుంటాం. వాళ్ల హృదయవిదారకమైన అనుభవాలు విని భర్తవియోగం కంటే భార్యావియోగం కష్టతరమనే అభిప్రాయానికొచ్చాం. అది స్త్రీకి మేమిచ్చే గౌరవమే కాని, చులకన చేయడం కాదు. భర్త దూరమైన భార్య రెండు పాత్రలనూ తానే పోషిస్తూ యింటిని చక్కదిద్దగలదు. పురుషుడికి ఆ సమర్థత లేదు. ఇలా మా మిత్రబృందం చర్చల ప్రభావంతో వృద్ధాప్యంలో మగాడు ఏకాకిగా సంసారాన్ని ఈదలేడని నీతో వాదిస్తుంటాను కాని, మన విషయం మాత్రం దీనికి భిన్నమని నేను అనుక్షణం భయపడుతుంటాను. అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టు అనుకోకుండా నాకేమైనా జరిగితే సహజంగా ఆవేశపరురాలివి, అమాయకురాలివి అయిన నువ్వు నా తర్వాత యెలా బతుకుతావో అని కూడా అప్పుడప్పుడూ...’’‘‘అయ్యా, మీకు పుణ్యముంటుంది. ఆ పార్క్ దగ్గరకెళ్లి యెక్కువగా ఆలోచించి మీ బుర్రపాడు చేసుకోకండి. నా బుర్ర తినకండి. పుణ్యం కొద్దీ పురుషుడన్నట్టు మీలాంటి మంచి భర్తనిచ్చిన భగవంతుణ్ని నేను సుమంగళిగా కన్నుమూసే అదృష్టాన్ని కూడా యిమ్మని నిత్యం ప్రార్థిస్తుంటాను. ఒకవేళ దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించి మన అన్యోన్యతని గమనించి యిద్దర్నీ ఒకేసారి తీసుకొనిపోతే అది యింకా అదృష్టం. ఇంతకీ వెంకటేశ్వర్లుగార్ని అనాథ ప్రేతంలా వదిలేశారా? దహన సంస్కారం చేయించారా?’’ ‘‘ఇంతమంది మిత్రుల ముండి యెలా వదిలేస్తాం? సోమేశాన్ని బ్రతిమలాడి, వినకపోతే సమాజమనీ, పాపమనీ భయపెట్టి కర్మ వరకు చెయ్యడాని కొప్పించాం...’’‘‘పోన్లెండి. తక్కిన ఖర్చులకు ప్రభుత్వం డబ్బిస్తుందట కదా. మీరా ఆలోచనల నుంచి తేరుకొని ఏ టీ అయినా తాగండి. మీరసలే డయాబెటిక్. ఇంతసేపు ఏమీ తినకుండా తాగకుండా వుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదం కదా? ఇంతకీ స్నానం చేసి బట్టలు మార్చుకొన్నారా?’’‘‘అన్నీ అక్కడే పూర్తిచేశా. లోపలకు పద... వస్తున్నాను..’’ అంటూ దండెం మీద తడి బట్టలు ఆరెయ్యడానికి వెళ్లిన నారాయణ, ‘దబ్’మనే శబ్దం విని కంగారుగా పరుగెత్తుకొని వెనక్కి వచ్చాడు – నేల మీద స్పృహ లేకుండా రమ...!అంతవరకు తనతో లక్షణంగా మాట్లాడిన రమను హఠాత్తుగా ఆ స్థితిలో చూసేసరికి నారాయణకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణికిపోతూ తడబడుతున్న కాళ్లతో దగ్గరగా వెళ్లి ‘రమా... రమా’ అని పిలిచాడు. ఆమె కళ్లలో నిస్తేజం తప్ప నోట మాటలేదు. శ్వాస మాత్రం ఆడుతున్నట్టు గమనించి ఇరుగుపొరుగు వాళ్లను పిలిచి, వాళ్ల సహాయంతో హాస్పిటల్లో జాయిన్ చేశాడు.రమకు తెలివి వచ్చేసరికి హాస్పిటల్ వాతావరణాన్ని, పక్కనే ఆందోళనతో నిల్చుని తనకేసి చూస్తున్న భర్తనూ, పరీక్షలు చేస్తున్న డాక్టర్ని చూసి గాబరాపడింది.‘‘ఏమ్మా, కొంచెం సులువుగా వుందా? ఇలా పడిపోవడం యిదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఈ కంప్లైంట్ వుందా?’’ డాక్టర్ గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు.‘‘ఈ మధ్య యెప్పుడైనా నీరసంగా వున్నప్పుడు, మనస్సు బాగోలేనప్పుడు ఫిట్స్లా వచ్చి యిలా పడిపోతున్నాను’’ రమ స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. ఆమె తన శరీరంలోకెక్కుతున్న సెలైన్ బాటిల్ వేలాడ దీసిన స్టాండ్కేసి చూస్తోంది. ‘‘ఈరోజు ఈమె మనస్సు గాయపడే సంఘటన ఏదైనా జరిగిందా మాష్టారూ?’’ నారాయణకేసి చూసి అడిగాడు డాక్టర్.‘‘అలాంటిదేం కాదు కాని...’’ అని నసుగుతూ తమ మధ్య జరిగిన సంభాషణను వివరించాడు నారాయణ. అంతా విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన డాక్టర్ తన అనుమాన నివృత్తి కోసం కొన్ని టెస్ట్లు చెయ్యాలన్నాడు. రమ యిష్టపడకపోయినా నారాయణ నచ్చజెప్పి దగ్గరుండి టెస్ట్లన్నీ చేయించాడు. అతని మనసులో ఒక అపరాధ భావన – తను మూర్ఖంగా వాదించడం వల్లనే రమకీ అనర్థం జరిగిందని!అన్ని టెస్ట్లూ పరిశీలించిన తర్వాత డాక్టర్ తోటి వైద్యులతో కూడా చర్చించి రోగ నిర్ధారణను చేశాడు. నారాయణను పక్కకు పిలిచి జాలిగా చూస్తూ – ‘వెరీ సారీ మాష్టారూ’ అంటూ ప్రారంభించగానే నారాయణ ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని వణికిపోయాడు.రమకున్న కంప్లైంట్ టోటల్ కెరోటిడ్ బ్లాక్ అనీ, అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకం యేర్పడ్డం వల్ల మెదడుకు రక్తం సరఫరా కావడంలో తేడా వస్తోందనీ, చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం వుందనీ, అందువల్ల ఆమెకు మెడ దగ్గర సర్జరీ చెయ్యాల్సివుంటుందనీ, దానికి రెండు మూడు లక్షల వరకూ ఖర్చవుతుందనీ డాక్టర్ విశదంగా చేప్పేసరికి నారాయణకు గుండెదడ కొంత తగ్గింది, ‘‘ఖర్చు యెంతయినా వెనుకాడను. రమకు ఏ ప్రమాదమూ జరక్కుండా మామూలు మనిషిని చెయ్యండి. దయచేసి ఆమెకు మాత్రం వ్యాధి తీవ్రత గురించి చెప్పకండి..’’ అంటూ డాక్టర్ చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు నారాయణ.రమ మాత్రం యెంత సర్దిచెప్పినా సర్జరీకి సుముఖత చూపలేదు. ‘‘ఆ దేవుడు నా మొరాలకించాడు. ఈ కుంకుమతో ఈ గాజులతో పుణ్యస్త్రీగా కడతేరడానికి ఆ స్వామి అనుజ్ఞ అయింది. మీరు అప్పుచేసి అవస్థలు పడి నన్ను బతికించకండి. బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా! ఇంకా నేను బతికి యెవర్ని ఉద్ధరించాలి?’’ అంటూ మొండికేసింది.‘‘నిన్ను బతికించడానికి మాత్రమే కాదు. పక్షవాతంతో మంచానపడి జీవచ్ఛవంలా నరకం అనుభవించకుండా ఉండడానికి కూడా ఈ సర్జరీ...’’ అంటూ నారాయణ మొత్తుకొని, కావలసిన వాళ్లందరి చేత చెప్పించేసరికి రమ అయిష్టంగానే ‘సరే’ అంది.హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి రమ క్రమంగా కోలుకొంటున్న కొద్దీ ఆమెలో కృతజ్ఞతాభావం, మృత్యు ముఖం నుంచి బయటపడిన ఆమె పట్ల నారాయణ భద్రతాచర్యలు ఆ దంపతుల అనుబంధాన్ని అన్యోన్యతను దృఢతరం చేశాయి. జీవితంలో చివరి మజిలీకి చేరుకున్న ఆ దంపతుల మధ్య పరస్పర ఆరోగ్య పరిరక్షణ ప్రయత్నాల్లో వింతకోపాలు, చిత్రమైన అంతర్యుద్ధాలు ఆరంభమయ్యాయి.వైద్యుల సూచన ప్రకారం రమ సమయానికి మందులు వేసుకోకపోతే నారాయణ మందలిస్తాడు. అతను చక్కెర వ్యాధిని లెక్కచెయ్యకుండా చాటుమాటుగా తీపి పదార్థాల కోసం కక్కుర్తిపడితే ఆమె కళ్లెర్ర జేసి వాటిని బలపవంతంగా లాక్కుంటుంది. ఆమె వంట వార్పులతో అలసిపోతుందని పనిమనిషిని పెట్టుకోమని అతను పోరుతుంటాడు. అతను కూరగాయలకో కిరాణా సరుకులకో యెండలో నడిచివెళ్తుంటే అంత పొదుపు తగదని ఆమె రుసరుసలాడుతుంది. ఆమె అర్ధరాత్రి వరకు టీవీ దగ్గర నుంచి లేవడం లేదని అతను బలవంతంగా స్విఛాఫ్ చేస్తాడు. అతను పొద్దుటపూట నడకను నిర్లక్ష్యం చేస్తే ఆమె డాక్టర్ సలహాను గుర్తుచేసి అతణ్ని విసిగిస్తుంటుంది. ఇక అతని మీద ఈగ వాలినా కంగారు పడిపోయి అతను వద్దని వారిస్తున్నా ఆమె దగ్గర కూర్చొని కాళ్లూవేళ్లూ నొక్కి సపర్యలు చేస్తుంది. ఆమె శరీరం జ్వరంతో కాగిపోతున్నా అతను తలనొప్పి మందు కూడా రాయడానికి వీల్లేదని ఆమె చేతులడ్డం పెడుతుంది – ఇలా మగని చేత సేవలు చేయించుకోవడం పతివ్రతా లక్షణం కాదట! పెళ్లయిన కొత్తలో చీటికీ మాటికీ తన మీద అలిగి పుట్టింటికి పరుగెత్తిన రమేనా ఈమె అని అతను, తనవాళ్లను వీసమెత్తు మాటన్నా వీరావేశంతో చెయ్యి చేసుకొన్న భర్తేనా యితనని రమ – తమలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతున్నారు. వయసులోని దాహం కేవలం మోహమనీ, వార్ధక్యంలో పడిన ముడి నిజమైన ప్రేమ అనీ అనుభవపూర్వకంగా తెలుసుకొన్న రమా నారాయణులు – యముణ్ని మెప్పించి పతిప్రాణం దక్కించుకొన్న సావిత్రినీ, పాముకాటుతో మరణించిన ప్రమద్వరను సగం ఆయువును ధారపోసి బ్రతికించుకొన్న రురుణ్నీ స్ఫూర్తిగా తీసుకొని పరస్పరం పార్ట్నర్ కోసం ప్రాణం పెడుతున్నారు. ఒకరికొకరు మాత్రమే సాయంగా సంసారసాగరాన్ని ఈదుతూ ఎడబాటు యెరక్కుండా యిద్దర్నీ ఒకేసారి తీసుకుపొమ్మని భగవంతుణ్ని వేడుకొనే ఆ దంపతులు యెప్పుడైనా కొడుకు వరప్రసాద్నూ, కూతురు సుమతినీ, మనవల్నీ తల్చుకొని వాళ్ల ముచ్చట్లను చెప్పుకుంటుంటారు. వరప్రసాద్ ఆ దంపతుల ఏకైక సంతానం. అతని భార్య మోహిని మొదట్నుంచీ అత్తరికాన్ని అసహ్యించుకోవడం వల్ల వూళ్లోనే దూరంగా కాపురముంటున్నాడు. పంచాయతీ సెక్రటరీ వుద్యోగాన్నడ్డెట్టుకొని బాగానే సంపాదిస్తున్నట్టు జనం చెప్పుకొంటారు. అతను మాత్రం సంతానమిద్దరూ ఆడపిల్లలు కావడం వల్ల అడ్డదారులు తప్పవని సమర్థించుకుంటాడు. సుమతి రమానారాయణులు దత్తత తీసుకొన్న కూతురు. రమ ఆడపిల్ల మీద మక్కువతో ఆమెను చేరదీసి సొంత కూతురులా పెంచి పెళ్లి చేసింది. సుమతికి ఓ కొడుకూ, కూతురూ భర్త వుద్యోగం దృష్ట్యా వాళ్లు బెంగళూరులో ఉండడం వల్ల పెంచిన తల్లి తండ్రుల మీద ప్రేమవున్నా, సుమతి తరచుగా రాదు. రమకు సర్జరీ జరిగినప్పుడు మాత్రం వచ్చి చూసి రెండ్రోజులుండి వెళ్లింది. వరప్రసాద్ హాస్పిటల్కి ఒకటిరెండుసార్లు రాగా, మోహిని ఆ మర్యాదను కూడా దక్కించుకోలేదు!వరప్రసాద్ చాలాకాలం తర్వాత తల్లిని చూడ్డానికి యింటికి రావడం రమ, నారాయణలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే మాట తండ్రంటే, వాళ్లు మర్చిపోయిన పెళ్లిరోజును గుర్తుచేద్దామని వచ్చానన్నాడు. తల్లి చచ్చిబతికింది గనుక వారం రోజులు మాత్రమే గడువున్న తల్లిదండ్రుల పెళ్లిరోజును అట్టహాసంగా జరపాలని ప్రతిపాదించాడు. అయితే ఆ యేడు రమ చికిత్సకోసం అయిన ఖర్చును, వచ్చేయేడు జరుపుకోదగిన వైవాహిక స్వర్ణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ కొడుకు ప్రతిపాదనను కాదన్నాడు. తన మాటకు యెప్పుడు మాత్రం విలువిచ్చారని వరప్రసాద్ యెదురు తిరిగి తల్లిదండ్రులను దులిపేశాడు. పెన్షన్ మీద అప్పుతీసుకొని అన్ని లక్షలు పెట్టి ముసలావిడకు వైద్యం చేయించడం అవసరమా? అని కడిగేశాడు. తండ్రికేమన్నా అయితే ఆ అప్పు తనమీదే పడుతుంది కదా అని ప్రశ్నించాడు. తనకిద్దరు ఆడపిల్లలుండగా తల్లి తదనంతరం ఆమె బంగారాన్ని పెంపుడు కూతురు కూతురికిస్తాననడం యెంతవరకు న్యాయమని నిలదీశాడు. తల్లిదండ్రులుంటున్న యింటిని తనకు విల్లుగానో గిఫ్ట్గానో రాయకపోతే రేపు చెల్లెలు ఆస్తిలో వాటాకొస్తే తన గతేమిటని వాపోయాడు. కొడుకు ప్రశ్నలన్నిటికీ నారాయణ దీటుగా ఘాటుగా సమాధానాలు చెప్పిన తర్వాత అతను కాళ్లబేరానికొచ్చాడు. తను లంచం తీసుకొంటుండగా ఏసీబీకి దొరికిపోయి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాననీ, తనను ఆర్థికంగా ఆదుకోపోతే సంసారం వీధిన పడుతుందనీ తల్లిదండ్రులను కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడాడు. పాండురంగడిలా తనలో మార్పు వచ్చిందనీ, తను పశ్చాత్తాపపడుతున్నాననీ, ఇకముందు వ్యసనాలను విడిచిపెట్టి తల్లిదండ్రులను తన రెండు కళ్లలా చూసుకొంటాననీ నమ్మబలికాడు. కొడుకు దైన్యానికి కరిగిపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని డబ్బు తెచ్చుకోమని తన నగలిచ్చిన రమ మాతృ ప్రేమకు నారాయణ ఆశ్చర్యపోయాడు. వరప్రసాద్ కృతజ్ఞతతో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, నామమాత్రంగా జరిగినా సరే పెళ్లిరోజున వస్తానని మొహమాటపెట్టినా నారాయణ రావద్దన్నాడు. ‘‘ఈ భ్రష్టుడిలో నిజంగా మార్పు వచ్చిందంటావా? లేక ఏదో దురాలోచనతో వచ్చి నటిస్తున్నాడంటావా?’’ వరప్రసాద్ వెళ్లగానే అనుమానంగా అడిగాడు నారాయణ.‘‘అలా అనకండి. స్నేహాల వల్ల చెడిపోయాడు గాని మనవాడు బంగారమే. వాడు కన్నీళ్లు పెట్టుకొంటే చూడలేక ఆ నగలిచ్చాను.’’ రమ గిల్టీగా బదులిచ్చింది.‘‘గొప్పపని చేశావ్. నీతో అతివృష్టి, అనావృష్టి! ఇన్నాళ్లూ కోడలి మీద కోపంతో వాణ్ని గడప తొక్కొద్దన్నావ్. ఇప్పుడేమో వాడి అవస్థ చూసి, వెనకా ముందూ ఆలోచించకుండా...’’‘‘ఏం చెయ్యమంటారు? కడుపుతీపిని చంపుకొని వాడి కర్మకు వాణ్ని వదిలెయ్యమంటారా? మీరు మాత్రం? వాడెగిరినంతసేపు యెదురుదాడి చేశారు కాని, కాళ్లు పట్టుకోగానే కరిగిపోలేదూ! రేపు మనవరాళ్లను తీసుకొచ్చి మీ ఒళ్లో కూర్చోబెడితే ముద్దు చెయ్యకుండా వుండగలరా?’’‘‘అదే ఆలోచిస్తున్నాను రమా. వరం మీద ఆంక్షలు పెట్టి దూరంగా వుంచటం కంటేæ పాజిటివ్గా దగ్గరకు తీసుకుంటేనే వాడిలో క్రమంగా మార్పు వస్తుందనుకుంటున్నాను.’’‘‘ఏవండీ, మీరేనా ఈ మాటంటున్నది?’’ నారాయణకు దగ్గరగా జరిగి ఆనందంగా ఆశ్చర్యంగా అతని కళ్లలోకి చూసింది రమ.‘‘అవును రమా. డబ్భైకి దగ్గరవుతున్న ఈ వయసులో యింకా పంతాలూ, పట్టింపులూ దేనికి? నీ అనంతరం వాడి పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు సంక్రమించేలా విల్ రాసేద్దామనుకుంటున్నాను.’’‘‘మాటాడితే ‘నీ’ అనకండి ‘మన’ అనండి. మీరు లేకుండా నేనెక్కడుంటాను?’’ రమ గొంతు గాద్గదికమైంది.‘‘పిచ్చి రమా. నీపాత పాట విడిచిపెట్టు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీ సెక్యూరిటీ’ గురించి ఆలోచించి అలా అన్నాను. పోనీ, ఓ పని చేద్దాం. లాయరుగార్ని సంప్రదించి ఆయన సలహా తీసుకుందాం. లే. నువ్వు తయారయితే లాయరు గారింటికి వెళ్దాం.‘‘లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడా? మనం బాగా ఆలోచించుకొని రేపు వెళ్దాం లెండి’’‘‘అలాక్కాదు. వరాన్ని మ్యారేజ్ డేకి రావద్దంటే చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. అందువల్ల వాణ్ని ఆ రోజున పిల్చి, ‘విల్’ గిఫ్ట్గా యిచ్చి సర్ప్రయిజ్ చేద్దామని...’’భర్త మాటకు యెప్పుడూ యెదురు చెప్పని రమ నిమిషాలమీద రెడీ అయింది. వాళ్లిద్దరూ మెయిన్రోడ్ వరకు వెళ్లి ఆటోను ఆపి లాయరు గారింటికి బేరమాడుకొని ఆటో యెక్కారు. ఆటో నేలమీద వెళ్తున్నట్టు లేదు. ఆటో వేగానికి భయపడి ఆందోళనతో నారాయణ ఎన్నిసార్లు హెచ్చరించినా, జాగ్రత్తలు చెపుతున్నా ఆటో డ్రైవర్ వినిపించుకోవడం లేదు. పైగా విసుక్కొంటున్నాడు కూడా. ఒక దశలో ఆటో నుంచి దిగి పోదామని నారాయణ ఆటోను ఆపమంటుండగానే అది అదుపు తప్పి యెదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ భయంకరమైన శబ్దానికి అదిరిపడిన చుట్టుపక్కల జనం యాక్సిడెంట్ జరిగిన స్థలం చుట్టూ చేరేసరికి ఒక పక్క నుజ్జునుజ్జయిన ఆటో భాగాలు, మరో పక్క నెత్తుటి మడుగులో రమానారాయణల మృతదేహాలు! మృత్యుముఖంలో కూడా చేతులు వీడని ఆ జంటను చూసి చెమర్చని కళ్లు లేవు!. డా. పైడిపాల -
పొద్దున్నే లేస్తా.. కొత్త భాష మాట్లాడుతా!
ఉదయం నిద్ర లేచిన వ్యక్తి రాత్రి పడుకునే వ్యక్తి వేర్వేరు అని అంటుంటారు. అలా ఎలా అంటే ఆ రోజు మొత్తం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకుంటాం కాబట్టి ఓ కొత్త వ్యక్తిగా పడుకుంటాం అన్నమాట. అయితే రాత్రి పడుకుని ఉదయం లేచే సరికి అదే మార్పు ఉంటుందా.. సాధారణంగా అందరి సంగతేమో కానీ అమెరికాలోని అరిజోనాకు చెందిన 45 ఏళ్ల మిషెల్ మైర్స్ మాత్రం పూర్తిగా మారిపోయింది! మారిపోవడం అంటే ఆమె రూపురేఖలు మారడం కాదు. ఆమె భాష..! ఆ అందులో విశేషం ఏముంది.. స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్లకో.. లేదా 30 రోజుల్లో వేరే భాష నేర్చుకునే పుస్తకం చదువుతోందో అని పొరపడకండి. అది కూడా కనీసం ఆ భాషలు.. యాసలు ఉంటాయని కూడా ఆమెకు తెలియదట. ఓ రోజు రాత్రి తనకు నొప్పిగా ఉందని పడుకోవడం.. తెల్లారి లేచే సరికి వేర్వేరు భాషలు, యాసల్లో మాట్లాడటం.. ఇలా 2015 నుంచి జరుగుతోందట. ఆస్ట్రేలియన్, ఐరిష్, బ్రిటిష్ యాసలు మాట్లాడుతోందట. ఇలా వేరే భాష మాట్లాడటం వారం.. రెండు వారాల పాటు ఉండేదట. బ్రిటిష్ యాస మాత్రం రెండేళ్లుగా మాట్లాడుతోందట. ఇదో వింత వ్యాధి. దీని పేరు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. మెదడులోని బేసల్ గాంగ్లియాన్ భాగానికి దెబ్బ తగిలినప్పుడు కానీ.. షాక్ తగిలినప్పుడు కానీ ఇలా భాషలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని షెలియా బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే బాధపడుతాం.. కానీ ఈ వ్యాధి వచ్చినందుకు మిషెల్ సంతోషపడుతోంది కావొచ్చు.. ఎంతైనా కోచింగ్ లేకుండా.. పైసా ఖర్చు లేకుండా కొత్త భాషలు నేర్చుకోవడమంటే కాస్త అదృష్టమే కదూ! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారు 60 మంది మాత్రమే ఉన్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ పేర్కొంది. -
చెక్క్కెర
అమ్మో... ఎంత అమాయకంగా కనబడుతుంది! తెల్లగా నిగనిగలాడుతూ... స్ఫటికంగా స్వచ్ఛంగా మెరుస్తూ! కానీ... అమ్మో... వైట్ పాయిజన్ అట. సైలెంట్గా ప్రాణం మీదికి తెస్తుందట. అందుకే... బీ కేర్ఫుల్ ఆఫ్ ష్ష్ష్షు...గర్. అండ్ చెక్ ద చక్కెర!! చక్కెర... ఏ తినుబండారాన్నైనా తియ్యగా మార్చాలంటే చాలా తేలిగ్గా ఉపయోగించగల పదార్థం. చిన్న చిన్న స్ఫటికాలుగా చెంచాలో పట్టేలా ఉండటమే దీన్ని బాగా ఉపయోగంలోకి తెచ్చింది. అదే బెల్లం లేదా తేనె అనుకోండి. మొదటిది అచ్చులుగా ఉండి, కావాల్సిన పరిమాణంలో పడకపోవచ్చు. ఇక రెండోదైన తేనె విషయానికి వద్దాం. అదెంతో ఆరోగ్యకరమే అయినా చిక్కటి ద్రవం రూపంలో ఉండటంతో హ్యాండ్లింగ్ ఒకింత కష్టం. అందుకే చక్కెరకు అంత ప్రాచుర్యం. కానీ చక్కెర అంటే తెల్లటి విషం అంటున్నారు చాలామంది ఆహారనిపుణులు. పిల్లలెవరైనా సిగరెట్తో కనిపిస్తే తిడతాం. చెడ్డ అలవాటంటూ క్లాస్ తీసుకుంటాం. వాళ్లు మద్యం జోలికి వెళ్లారా... మన ప్రతిచర్య మరింత తీవ్రంగా ఉంటుంది. కానీ చేజేతులారా పిల్లలకు మనమే తీపి పదార్థాలూ, క్యాండీలు ఇస్తుంటాం. వాటిల్లో చాలావరకు చక్కెరతో తయారైనవే ఉంటాయి. చక్కెరతో తయారైన పదార్థాలు వాళ్లకు ఇవ్వడం అంటే చేజేతులారా సిగరెట్ లేదా మద్యం కంటే హానికరమైన పదార్థాలు వాళ్లకు సాక్షాత్తూ పెద్దలే అందించడం లాంటిది అంటున్నారు ప్రముఖ బయోకెమిస్ట్ రేమండ్ ఫ్రాన్సిస్. ఆయన రాసిన ‘నెవర్ బి సిక్ అగైన్’ (ఇంకెప్పుడూ జబ్బుపడకండి) అనే పుస్తకం చాలా ప్రఖ్యాతి పొందింది. చక్కెర గురించి ఆయన చెబుతున్న విషయాలివి... ‘‘చక్కెర తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించే ఒక తియ్యటి విషం. చాలారోజుల కిందట నేను జబ్బుపడ్డాను. స్వతహాగా బయోకెమిస్ట్ను కావడంతో ఆహారపదార్థాలు, అవి తినగానే మనలో జరిగే జీవరసాయన చర్యలపై నాకు అవగాహన ఉంది. దాంతో నా ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్త వహించాను. అంటే నా ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం, ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వంటి నియమాలు పాటించాను. దాంతో కిందటి సారి జబ్బు పడి కోలుకున్న తర్వాత గత 26 ఏళ్లలో మళ్లీ నేను కనీసం ఎప్పుడూ చిన్న జ్వరానికి కూడా గురికాలేదు. కాకపోతే ఒక్కసారి మాత్రం నాకు జలుబు చేసింది. దానికి కారణం కూడా నాకు తెలుసు ఒక సారి నేను చక్కెరతో చేసిన పదార్థం తినడమే ఇందుకు కారణం’’ అంటారాయన. చక్కెర ఎందుకు, ఎంత ప్రమాదం... మనం జీవితంలో ఎప్పుడూ జబ్బుపడకుండా ఉండాలంటే కేవలం చక్కెర తీసుకోకుండా ఉంటే చాలంటారు రేమండ్ ఫ్రాన్సిస్. ఆయన రాసిన ‘నెవర్ బి సిక్ అగైన్’, ‘నెవర్ బి ఫ్యాట్ అగైన్’, నెవర్ ఫియర్ క్యాన్సర్ అగైన్’, ‘నెవర్ ఫీల్ ఓల్డ్ అగైన్’, ‘ద గ్రేట్ అమెరికన్ హెల్త్ హోక్స్’... పుస్తకాలన్నీ జనాదరణ పొందాయి. ఆయన చెబుతున్న ప్రకారం కేవలం ఒక టీ స్పూన్ చక్కెర తీసుకుంటే చాలు.. రెండు గంటల్లో... అది మన దేహంలోని జీవ రసాయన చర్యల్లోని అసమతౌల్యత కలగజేస్తుంది. దాంతో మన వ్యాధి నిరోధక సామర్థ్యం 50 శాతం తగ్గుతుంది. ఈ లెక్కన ఏదైనా వ్యాధికారక క్రిములతో మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలప్పుడు రెండు రెట్లు పెరుగుతాయి కదా. అలా మనం జబ్బు పడే అవకాశాలు ఎక్కువ అంటారు రేమండ్ ఫ్రాన్సిస్. ఇక ఆయన కోలా సాఫ్ట్డ్రింక్స్ను ఎంతగా నిరసిస్తారంటే... కేవలం ఒక టీ స్పూన్ చక్కెరతోనే ఇంత ప్రమాదం ఉందంటే... ఒక సాఫ్ట్డ్రింక్లో 10 – 12 టీస్పూన్ల చక్కెరకు తక్కువ ఉండదు. అలాంటిప్పుడు అదెంత హానికరమో ఆలోచించండి... అంటారు. - రేమండ్ ఫ్రాన్సిస్, బయో కెమిస్ట్, ‘నెవర్ బి సిక్ అగైన్’ పుస్తక రచయిత చక్కెర ఎందుకు హానికరమంటే... కేవలం రేమండ్ ఫ్రాన్సిస్ చెప్పడం మాత్రమే కాదు... చక్కెర హానికరం అని చెప్పే పరిశోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అనేక అధ్యయనాలను బట్టి ఆరోగ్యకరమైన బెల్లం, తేనె వంటి స్వీటెనర్లతో పోలిస్తే చక్కెర ఎందుకు హానికరమో చెప్పడానికి ఒక దృష్టాంతమిది... చక్కెరను ప్రాసెస్ చేసే ప్రక్రియలో గంధకం (సల్ఫర్) ఒక ప్రధానమైన రసాయనం. అంటే మనం బాణాసంచాలోనూ, టపాకాయల్లోనూ ఉపయోగించే రసాయనాన్నే చక్కెర ప్రాసెసింగ్లో ఉపయోగిస్తున్నామన్న మాట. కేవలం గంధకం మాత్రమే కాకుండా... మానవులకు హానికరమైన మరో 23 రసాయనాలను చక్కెర ప్రాసెసింగ్లో వాడతారు. చక్కెర తెచ్చే అనర్థాల్లో కొన్ని ప్రధానమైనవి... ∙చక్కెరతో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరుగుతాయి. తద్వారా అది గుండెజబ్బులకు తావిస్తుంది. ∙చక్కెర వినియోగం పెరిగితే అది ఊబకాయాన్ని కలిగిస్తుంది. ఊబకాయంతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావన్నది తెలిసిందే. ∙ఊబకాయం పెరగడం వల్ల వచ్చే అనర్థాల్లో ముఖ్యమైనది అధికరక్తపోటు. అంటే పరోక్షంగా చక్కెరతో మనం హైబీపీని తెచ్చిపెట్టుకుంటున్నామన్నమాట. ∙ఒక్కోసారి మరణానికి... లేదా మరణం తప్పినా జీవితాంతం వైకల్యంతో బాధపడేలా చేసే పక్షవాతానికి ప్రధాన కారణం చక్కెర. ∙చక్కెర తినడం వల్ల డయాబెటిస్ రాకపోయినా... ఒకసారి డయాబెటిస్ వచ్చాక చక్కెర తినడం ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలిసిన విషయమే. ∙చాలామంది పచ్చళ్లు, వంటకాల్లో మితిమీరిన కారం లేదా మసాలాలు మాత్రమే కడుపులోని అల్సర్లకు కారణం అనుకుంటారు. కానీ చక్కెర కూడా కడుపులో అల్సర్స్ వచ్చేందుకు అంతే సమానంగా దోహదం చేస్తుంది. నిపుణులు చెప్పే మాటలివి... ‘సెయింట్ విత్ స్టెతస్కోప్’ అంటూ ఆదరంగా పిలుచుకునే కేరళకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.వి. గంగాధరన్తో పాటు చాలామంది క్యాన్సర్ చికిత్సా నిపుణులు చక్కెర గురించి చెప్పే మాటలివి... ∙మీరు చక్కెరకు దూరంగా ఉండగలిగితే చాలు... క్యాన్సర్ కణం దానంతట అదే నశిస్తుంది. ∙ ప్రతిరోజూ కాస్తంత గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకొని పరగడుపున తాగండి. అది కీమోథెరపీ కంటే 1000 రెట్లు ప్రభావవంతమైనది. ఇది మేరీల్యాండ్ కాలేజీ నిపుణుల అధ్యయన ఫలితాలు తేల్చిన వాస్తవం. మరి చెక్కెర లేకపోతే జీవితంలో తియ్యదనం ఎలా? తియ్యదనానికి చక్కెర ఒక్కటే కేరాఫ్ అడ్రస్ కాదు. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మంచి పరిశుభ్రమైన బెల్లం, తేనె వంటివి. వాటితో పాటు మరికొన్ని స్వీటెనర్లూ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఆ స్వాభావిక, ప్రాకృతిక తీపి పదార్థాలు ఇవి కొన్ని మాత్రమే... ఉన్నాయిగా మనకు స్వాభావిక స్వీటెనర్లు... స్టీవియా : ఈ తీపి పదార్థాన్ని స్టీవియా రెబౌడినా అనే మొక్క నుంచి సేకరిస్తారు. ఇది స్వాభావికమైన చక్కెరతో పోలిస్తే 290 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. దీన్ని స్వాభావిక చక్కెర (సుక్రోజ్)తో కలిపి మనకు వాణిజ్య ప్రయోజనాలకోసం ‘సీఎస్ఆర్ స్మార్ట్’ పేరిట మార్కెట్లో లభ్యమయ్యేలా చూస్తున్నారు. సార్బిటాల్ : దీన్నే గ్లూసిటాల్ అంటారు. ఇది కొన్ని రకాల పండ్లను పాకం పట్టినప్పుడు చక్కెర పాకంలా తయారైన పదార్థాం నుంచి సేకరిస్తారు. స్వాభావిక చక్కెరతో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్తంత తక్కువ. స్వీటెనింగ్ ఆపిల్ ఎక్స్ట్రాక్ట్స్: ఇక కొన్ని ఆపిల్స్ నుంచి తీసే పదార్థాలు (ఆపిల్ ఎక్స్ట్రాక్ట్స్) నుంచి సేకరించిన పదార్థాలు స్వాభావికం కావడంతో ఇవి తియ్యదనాన్ని, రుచినీ, ఆరోగ్యాన్నీ ఒకేసారి ఇస్తాయి. స్వాభావిక తీపి పదార్థాలతో ప్రయోజనాలు : ∙స్టీవియా తీపి పదార్థం మొక్క నుంచి సేకరిస్తారు కాబట్టి అది హానికరం కాదు. ఆ తీపి వల్ల రక్తంలోని చక్కెర పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్ రోగులకు స్టీవియా మంచిది. అగేవ్ నెక్టర్ : ఇది మెక్సికోలో పెరిగే ఒక రకం మొక్క నుంచి సేకరించే పాకం. దీనిని తినడం వల్ల సాధారణ చక్కెర తీపి తిన్నప్పటికంటే తక్కువ తీపి శరీరంలో విడుదలవుతుంది. అందుకే రక్తంలో షుగర్ పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్ రోగులు తినే తీపి పదార్థాలకు ఇది చక్కెర కంటే మంచి ప్రత్యామ్నాయం. డేట్ షుగర్ : దీని ఉపయోగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. డేట్ షుగర్ అంటే మరేదో కాదు. ఎండబెట్టిన ఖర్జూరాలను పొడిలా చేసి, తీపిని ఇచ్చేందుకు దాన్ని పంచదారలా వాడుకోవచ్చు. అయితే ఇది వేడి పదార్థాలలో కరగదు. ఉదాహరణకు వేడి వేడి టీలో దీన్ని చక్కెరలా వేసుకోవడం సాధ్యం కాదు. అయితే బేకింగ్ ఉత్పాదనలకు స్వీటెనింగ్ అడిటివ్లా మాత్రం వాడుకోవచ్చు. తేనె : తీపిని ఇచ్చేందుకు వాడే పదార్థంగా దీని ప్రాధాన్యం, ప్రాచుర్యం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక రుచిని ఇచ్చే ఆహారంగానే కాక... ఔషధ గుణాలు కలిగి, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పరిమిత మోతాదులో దీన్ని ఎంతకాలమైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. - సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్ ,మలక్పేట, హైదరాబాద్ ► అందుకే ఇకపై చక్కెరకు బదులు ఈ స్వాభావికమైన తీపి పదార్థాలు వాడుకోండి. లేదా చక్కెరే తప్పనిసరిగా వాడుకోవాలంటే దాని ఉపయోగాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. -
కఫన్
తెల్లవారుతూ ఉంది. అప్పుడే మర్కస్ మసీదు మీనారాల నుండి అల్లాహు అక్బర్ – అంటూ అజా రాగయుక్తంగా వినిపిస్తూ ఉంది. సకీనాబీ పరివారం అజా వినబడగానే నిదురనుండి లేచింది. సకీనాబీ, అత్త ఖాసింబీ, కూతురు షాహినాను ‘‘అజా ఇచ్చారు లేవండి’’ అని నిదుర లేపింది. అందరూ లేచి వజూ చేసుకుని, రెండు రకాతులు సున్నత్ నమాజ్, రెండు రకాతులు ఫర్జ్నమాజులు చదివి చేతులు పైకెత్తి జబ్బుపడ్డ తమ ఇంటి పెద్దను ఆరోగ్యవంతునిగా చేయమని దీనంగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించి, ఒక మూల మంచంపై అచేతనంగా పడివున్న హుసేన్ను శరీరంపై నిమిరి ఊదారు. ఇంటి యజమాని హుసేన్కు పక్షవాతము వచ్చి కుడికాలు, కుడిచేయి, నోరు పడిపోయి సరైన వైద్య సదుపాయం లేక రోజులు లెక్కిస్తున్నాడు. అత్త ఖాసింబీ.. కుమారుని దీనావస్థను చూసి, ‘‘బేటా ఎట్లా ఉంది?’’ అని అడిగింది. హుసేన్ కళ్లు తెరిచి చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. కళ్లవెంట కన్నీరు కారుతున్నాయి. భార్య సకీనాబీ భర్త కన్నీళ్లు తుడిచింది. ‘‘క్యాజీ నీళ్లు కావాలా?’’ అంటూ లేపి, నీళ్లు తాగించి మరలా పడుకోబెట్టింది. అత్తా కోడళ్లు హుసేన్ దీనావస్థను చూసి కన్నీరు కారుస్తూ కూచున్నారు. కూతురు షాహినా ఖురాన్ షరీఫ్ తీసి అందులోని యాసీన్ సూరాను ఎంతో భక్తి ప్రపృత్తులతో పఠించి తండ్రి ఆరోగ్యానికై చేతులెత్తి దీనంగా అల్లాహ్ను ప్రార్థించి, తన తండ్రి హుసేన్పై మూడు మార్లు ఊదింది. ఏమీ చేయలేని అసహాయస్థితిలో అచ్చటే ఒక మూల ఖురాన్ షరీఫ్ చదువుతూ కూర్చుంది. తూర్పున ప్రభాకరుడు అరురారుణ కాంతులతో ఎర్రని పొత్తిళ్ల నుండి ప్రభవిస్తూ తన కాలగమన రహస్యాన్ని చాటుతూ వెలుగు చిమ్ముతున్నాడు. సకీనాబీ ఇళ్లలో పాచి పని చేయడానికి వెళ్లిపోయింది. అత్త ఖాసింబీ తజ్బీ తిప్పుతూ, కుమారుడు హుసేన్ మంచం దగ్గర కూచోని ఉంది. హుసేన్ కాస్తో కూస్తో సంపాదిస్తున్న రోజుల్లో షాహినాను శ్రద్ధగా చదివించాడు. పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో పాస్ అయింది. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజ్ వాళ్లే తమ కాలేజీలో చదివించారు. రీయింబర్స్మెంటు పుణ్యమా అని, ఇప్పుడు బీఈ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అప్పటివరకు ఎంతో కొంత సహాయం చేసే తండ్రి మంచం పట్టాడు. ఇప్పుడు పూట గడవడానికి ఇతర ఇళ్లలో ఏదో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. షాహినా చినిగిపోయిన పంజాబీ డ్రస్సు కుట్టుకుంటోంది. అది చూసి దాది ఖాసింబీ, ‘‘షాహినా! ఏం చేస్తున్నావమ్మా’’ అని అడిగింది. ‘‘దాదీ! ఈరోజు పరీక్షలు. పరీక్షలకు వెళ్లడానికి ఈ చినిగిపోయిన పంజాబీ డ్రస్సును కుట్టుకుంటున్నా’’.ఆ మాటలకు దాది మనసు చివుక్కుమంది. మళ్లీ షాహినా దీనంగా అంది, ‘‘దాదీ! ఒక బురఖా అయినా కొనిస్తే, లోపల ఎట్లా ఉన్నా పైన అది వేసుకొని పోవచ్చు. ఒక బురఖా కొనివ్వు..’’. ‘‘అమ్మా! నీకు పంజాబీ డ్రెస్సే కొనివ్వలేకపోయాం. ఇంక ఐదారొందలు పెట్టి బురఖా ఏం కొనిస్తాను తల్లీ! మూడు నెలలనుండి పింఛను రాలేదు. అది వస్తే నీకు గుడ్డలు కొనిస్తా తల్లీ! చూస్తున్నావుగా మన పరిస్థితి. అబ్బాజాన్కు సరైన మందులు ఇప్పించలేక ఇబ్బందులు పడుతున్నాం..’’ అంటూ చెమ్మగిల్లిన కన్నీళ్లను తన చినిగిపోయిన చెంగుతో తుడుచుకుంది. సంభాషణ అంతా అచేతనంగా పడివున్న హుసేన్ వింటున్నాడేమో, తన కుటుంబం దీన స్థితి, తన ముద్దుల కూతురు షాహినా స్థితి చూసి కన్నీళ్లు ధారగా కారసాగాయి. అది చూసి షాహినా తన కుట్టడం ఆపివేసి తండ్రి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి బోరున విలపించింది. దాదీ షాహినాను ఓదార్చుతూ పక్కకు తీసుకొని పోయింది. ఉదయం 9 గంటలకు అమ్మ సకీనాబీ ఇళ్లలో పాచి పనిచేసి మిగిలిన తినుబండారాలు తీసుకొనివచ్చి వారి ముందు పెట్టింది. ఆ పాచి అన్నం అందరూ తిన్నారు. షాహిని పంజాబీ డ్రస్సు వేసుకుని చినుగులు కనబడకుండా ఉండడానికి చుట్టూ ఓణి కప్పుకొని, పుస్తకాలు తీసుకొని తండ్రి దీవెనలకై హుసేన్ దగ్గరకు వెళ్లింది. హుసేన్ కూతురుని చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. తన మనసులోని ఆవేదనకు గుర్తుగా కనుల చివర నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఇదే ఆఖరు చూపేమో అనుకున్నాడు హుసేన్. షాహినాను అదే పనిగా చూస్తున్నాడు. సైగలతో దగ్గరకు పిలిచాడు. ఎత్తలేక ఎత్తలేక ఎడమచెయ్యి ఎత్తి షాహినా తలపై పెట్టాడు. ‘‘అమ్మా! బాగా చదివి కుటుంబాన్ని ఆదుకో తల్లి!’’ అని దీవించాడు. ఆరోజు తండ్రి ప్రవర్తన అదో రకంగా ఉండడం షాహినా గమనించింది. తండ్రి కన్నీరు తుడుస్తూ ‘‘అబ్బా జాన్! నేను విప్రో కంపెనీ వాళ్ల ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. హైద్రాబాద్లో ఉద్యోగం. నెలకు నలభై వేలు ఇస్తారట. పరీక్షలు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగంలో చేరి నీకు మంచి మంచి మందులు ఇప్పిస్తా. అమ్మా! దాదీని బాగా చూస్తా. అధైర్యపడకు’’ అంటూ కన్నీళ్లు కారుస్తూ తండ్రి దగ్గర సెలవు తీసుకొని కాలేజీకి వెళ్లిపోయింది. కొత్తగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొబెషనరీగా షేక్ ఫజులుల్లా ఒంగోలు పట్టణానికి వచ్చాడు. ఆయన రోజూ తన సిబ్బందితో ఆ ఇంజనీరింగ్ కాలేజీ మార్గం గుండా వెళుతుంటే, ఆ దారిలో చుట్టూ ఓణి కప్పుకొని వెళుతున్న షాహినాను చాలాసార్లు చూశాడు. అతనికెందుకో అందరు అమ్మాయిలు రకరకాల దుస్తులు వేసుకుని, ఫ్యాషన్ వెళ్లబోస్తూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ, వెళ్తూ ఉంటే, ఏంది ఈ అమ్మాయి! వోణి కప్పుకొని కాలేజ్కు వెళ్తుందని ఆయన మనసులో ఒక రకమైన ఆలోచన కలిగింది. ఏదో ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకుందామని అనుకున్నాడాయన. వెంటనే ఆయన బండిని ఆపి కానిస్టేబుల్ను పంపి, ‘‘ఆ పోయే అమ్మాయిని పిలుచుకొనిరా!’’ అని పంపాడు. ఆ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని, ‘‘మా దొరగారు పిలుస్తున్నారు’’ అని పిలుచుకొని వచ్చాడు. వాళ్ల సిబ్బందికి ఇదంతా అర్థం కావడం లేదు. ఎందుకు బండి ఆపారు, ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తున్నాడని. షాహినా వచ్చి నిలబడింది. కమిషనరుగారు, ‘‘నీ పేరేంటి? నువ్వు ఎక్కడుంటున్నావ్? అందరి పిల్లల్లాగా కాకుండా ఎందుకు ఓణి చుట్టూ కప్పుకున్నావ్?’’ అడిగారు. ముందు షాహినా చెప్పడానికి జంకింది. తరువాత, ‘‘మాది కోటవీధి. నా పేరు షాహినా. మాది పేద కుటుంబం. మా నాన్న జబ్బు పడ్డాడు. నా పంజాబీ డ్రెస్ చినిగిపోతే అది కనబడుతుందని ఇలా ఓణి కప్పుకున్నాను’’ అని చెప్పింది. ఆమెకు తెలియకుండానే కళ్లవెంట కన్నీరు ఆమె లేత బుగ్గలను వొరుసుకుంటూ కారసాగాయి. ఆ మాటలకు కమిషనరు గారికి కూడా చెప్పకుండా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి చెప్పిన మాటలకు అక్కడి సిబ్బంది కూడా చలించిపోయారు. వెంటనే కమిషనరు వెయ్యి రూపాయలు తీసి షాహినాకు ఇచ్చి, ‘‘ఈ డబ్బులతో బట్టలు కుట్టించుకో’’ అని చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి వెళ్లిపోయారు. షాహినా ఆ డబ్బులు తన పుస్తకంలో పెట్టుకొని పరీక్షలు రాసి తండ్రికి బాగా రాశానని చెప్పడానికి త్వరత్వరగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. షాహినా పుస్తకాలు అక్కడ పడేసి, ‘‘నాన్నా!’’ అంటూ నాన్న శరీరంపై పడిపోయింది. ఇల్లంతా రోదనలతో, విషాదంగా నిలబడిపోయింది. మయ్యత్ (ఖననము) చెయ్యడానికి డబ్బులు లేవు ఎట్లా అని తల్లి విలపిస్తూంటే, షాహినా తన దగ్గరున్న వెయ్యి రూపాయలు తీసి ఇచ్చి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లీకూతుళ్లు ఒకరిని ఒకరు పట్టుకొని తనివితీరా విలపించారు. ఆ డబ్బులతో కఫన్ (శవానికి చుట్టే గుడ్డ), వగైరాలు తెప్పించి హుసేన్కు ఆచారం ప్రకారం ఖననం చేశారు. ఒక దీపం మలిగింది. మిగిలిన దీపాలకు అల్లాహ్నే నూనె పోస్తాడని ఆశిద్దాం.ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. హాజీ షేక్ మహబూబ్ జాన్ -
వాల్వ్ మార్చాల్సిందేనా?
నా వయస్సు 57 ఏళ్లు. ఒకసారి మాకు దగ్గర్ల ఉన్న కార్డియాలజిస్ట్ను సంప్రదించాను. నా హార్ట్ వాల్వ్స్లో (గుండె కవాటాల్లో) సమస్య ఉందని అంటున్నారు. ఈ సమస్యకు గల కారణాలను తెలపండి. వాల్వ్ మార్చాల్సిందేనా? – రమేశ్బాబు, గుంటూరు గుండె కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1. వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్) 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్) వీటికి గల కారణాలు : ∙కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ∙కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల ∙మరికొందరిలో ఈ సమస్య పుట్టుకతోనే రావచ్చు ∙కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజరేటివ్) వచ్చే సమస్యగా రావచ్చు వాల్వ్స్ సమస్యలకు చికిత్స : ఈ సమస్యలను కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్ను రిపేర్ చేయడానికి అప్పుడు వైద్యులు అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్లు అయితే రిపేర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండెపోటును గుర్తుపట్టేదెలా? మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. మా నాన్నగారికి ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులు కూడా లేవు. ఇలా ఎందుకు జరిగింది? ఎవరిలో ఎక్కువగా వస్తుంది. ముప్పు ఉన్నప్పుడు దాన్ని ముందుగానే తెలుసుకోవడం ఎలా? – జీవన్రెడ్డి, వరంగల్ మీరు చెప్పినదాన్ని బట్టి నాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం కుటుంబ సభ్యులో, స్నేహితులో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటివి సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగిన వారిలో కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది... ∙గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు ∙గుండె కండరం బలహీనంగా ఉన్నవారు ∙కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు ∙కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు ∙గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు. ముప్పు ఉన్నా... రక్షించే మార్గమూ ఉంది... క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య ఇది. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి. గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మునరీ రిససియేషన్–సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణంపోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్పై శిక్షణ ఉంటుంది.గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ఆంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం. కరొనరీ హార్ట్ డిసీజ్ అంటే...? ఇటీవల మా బంధువుల్లో ఒకరికి కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అంటే ఏమిటి? అది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. తిరుమలమూర్తి, చిత్తూరు శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరకాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయమమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్ను చాలావరకు నివారించుకోవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
అంపశయ్యపై ‘శిరీష’
దుగ్గొండి (నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రేగుల శోభన్–సౌందర్య దంపతులది నిరుపేద కుటుంబం. వారికి ప్రశాంత్, శిరీష ఇద్దరు సంతానం. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్లి వచ్చిన దాంతో పిల్లలను పోషించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ప్రశాంత్ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురు శిరీష డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఆమె కొన్నేళ్ల నుంచి రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో తల్లిదండ్రులు వరంగల్, హన్మకొండలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రూ.3 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో 6 నెలల క్రితం ఇదే మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వైద్యానికి, వివాహానికి అప్పులు చేయడంతో ఉన్న 2 ఎకరాల భూమి రూ.8 లక్షలకు అమ్మి వేశారు. శిరీష పెళ్లి అయిన 3 రోజులకే వ్యాధి తిరగబెట్టింది. కాళ్లు, ముఖం వాచిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలు పాడైపోయాయని తప్పనిసరిగా మార్చాలని చెప్పారు. 6 నెలలుగా హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. మంచం పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న శిరీష డయాలసిస్తో కాలం గడుపుతోంది. తల్లి ముందుకొచ్చినా.. శిరీషకు కనీసం ఒక కిడ్నీ మారిస్తేనే బతుకుతుం దని డాక్టర్లు చెప్పడంతో తల్లి సౌందర్య తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రక్త పరీక్షలు సరిపోలడం తో కిడ్నీ మార్చడానికి ఇబ్బందులు తొలగాయి. ఆపరేషన్కు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. తన కిడ్నీ ఇచ్చి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురిని బతికించుకుందామన్నా ఆపరేషన్కు డబ్బులు లేక కన్నపేగు తల్లడిల్లుతోంది. మానవతావాదులు సాయం అందించి శిరీషను ఆదుకోవాలని తల్లి వేడుకుంటోంది. సాయం చేయాలనుకునే వారు సెల్ నంబర్ 7732045246 ఫోన్ చేయాలని కోరారు. -
చితిమంటల్లో చీకటి
వెలుతురు కత్తులు చీకటిపై దాడి చేస్తున్నాయి. కసిగా పొడుస్తున్నాయి. పొద్దు పొడవక ముందే రాత్రిని చంపేస్తున్నాయి. రాత్రి.. ఆ చితిమంటల్లో మండుతుంటే... గ్లోబు గుడ్లప్పగించి చూస్తోంది! నిద్ర గర్భంలోకి వెలుతురు వంతెనపై జబ్బులు కవాతు చేస్తున్నాయి. పహారా హుషార్! రాత్రిని ఎత్తుకుపోతున్నారు!! వెలుతురు.. చీకట్లను చిదిమేస్తోంది! వెలుగు చీకటిని మింగేస్తోంది. రాత్రి చీకటిని పారదోలుతూ పగటి వెలుగుల మాదిరిగా విద్యుత్ వెలుగులు మరింత విస్తరించడం మానవాళికి సంకటంగా మారుతోంది. దాంతో ఏడాదికేడాది కొత్త ప్రాంతాలను కాలుష్య కాంతులు ఆవరిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న కాంతి కాలుష్యంరాత్రి వేళల్లో అవసరానికి మించి ఉపయోగిస్తున్న విద్యుత్ లైట్ల వల్ల ‘కాంతి కాలుష్యం’ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 2.2 శాతం (భారత్లో 7.4 శాతం) మేర లైట్ల వినియోగంలోని వృద్ధితో ఈ కాలుష్యం మరింత విస్తరిస్తోంది. ఇది మానవాళి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ మూడు రెట్లు ఎక్కువగా రాత్రులను కోల్పోతున్నట్లు 2012–2016 మధ్యలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘లైట్ ఎమిటింగ్ డయోడ్స్’ (ఎల్ఈడీ) కాంతుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా కాకపోగా ఈ కాలుష్యం పెరుగుదలకు దారితీస్తోంది! విద్యుత్ ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లోనే ఈ కాలుష్యం పెరుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల సహాయంతో స్పష్టమైంది. జర్మనీలోని ‘జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్’లో ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యంపై కాంతి కాలుష్య ప్రభావాల మీద పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తున్న క్రిస్టఫర్ కైబా ఈ అధ్యయనం నిర్వహించారు. వెలుగు కాటే స్తోంది మన శరీరాల్లోని జీవక్రియల్లో కీలకమైనవి కొన్ని.. వెలుగు, చీకట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ కాంతి కాలుష్య ప్రభావం సకల జీవరాశితో పాటు మానవాళిపై కూడా ఉంటుంది. ఈ వెలుగులతో మన మెదడులోని జీవగడియారం గతి తప్పుతుంది. దాంతో వెలుగు, చీకట్లకు అనుగుణంగా ప్రవర్తించాల్సిన సర్కేడియన్ రిథమ్ సైతం దెబ్బతింటుంది. అది ఇన్సోమ్నియా, కుంగుబాటు, గుండెకు సంబంధించిన సమస్యల వంటి వాటికి కారణమవుతుంది. కృత్రిమ వెలుగులు చిందించే లైట్లు రొమ్ము కాన్సర్, ప్రొస్టే్టట్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయని గతంలో నిర్వహించిన మరో అధ్యయనంలోనూ తేలింది. లైట్ల వెలుగుల వల్ల శరీరాలు అయోమయానికి గురై స్వతహాగా నిర్వహించాల్సిన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఉదయం సమయాల్లో సూర్యుడి వెలుగు ఆరోగ్యవంతమైంది. అదే.. రాత్రి సమయాల్లో లైట్ల కాంతి అనారోగ్యానికి కారణమవుతోంది. రాత్రి సమయాల్లో లైట్ల వల్ల నిద్ర దూరమై ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. రాత్రుళ్లు పడక గదుల్లోకి సైతం వీధి లైట్ల వెలుగులు ప్రసరిస్తుండడంతో నిద్రపై ప్రభావం చూపే పరిస్థితులున్నాయి. చాలా జీవక్రియలకు నిద్ర కీలకం. వెలుతురు కాలుష్యంతో ప్రధానంగా దెబ్బతినేది నిద్ర. దాంతో మరెన్నో ఆరోగ్యపరమైన అనుబంధ సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు శరీరంలోని అన్ని వ్యవస్థలు నిద్రలేమి వల్ల దెబ్బతింటాయి. అదీ తీవ్రస్థాయిలో. ఉదాహరణకు నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా.. ∙ఏకాగ్రత లోపించడం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె వేగం / గతిలో మార్పు ∙తక్షణం స్పందించలేకపోవడం (అవసరమైనది ఏదీ తక్షణం స్ఫురించకపోవడం) ∙హుషారు / ఉత్సాహం తగ్గుదల ∙తమ పని తాము సక్రమంగా చేయలేకపోవడం ∙మబ్బుగా / దిగులుగా ఉండటం ∙చిరాకు, కోపం ఎక్కువ కావడం ∙మానవసంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం ∙ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక నష్టాలు ∙మతిమరపు ∙మెదడు ఎదుగుదలలో లోపం ∙పిల్లల ఎదుగుదలలో లోపం ∙అధిక రక్తపోటు ∙గుండెజబ్బులు ∙స్థూలకాయం ∙డయాబెటిస్, ∙జీర్ణకోశ సమస్యలు ∙రోగనిరోధక శక్తి తగ్గడం ∙గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం ∙జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం. నిద్రలేమితో మానసిక సమస్యలు నిద్రలేమి వల్ల ప్రత్యేకించి మానసిక సమస్యలు పెరుగుతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్ (భావోద్వేగ సమస్యలు), యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల్లో... ∙అటెన్షన్ డెఫిసిట్ హెపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం జ్ఞాపకశక్తి లోపించడం పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్ (ఆందోళన వల్ల కలిగే సమస్యలు) ∙డిప్రెషన్ ∙సైకోసిస్ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం పరోక్షంగా అనేక ఆరోగ్య అంశాలపై నిద్రలేమి ప్రభావం ఉండటం, దానికి వెలుగు కాలుష్యం దోహదపడుతుండటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది. వెలుగు కాలుష్యాన్ని అధిగమించడం ఎలా? ‘విద్యుత్ వెలుగుల నియంత్రణ’కు సాంకేతికతను జోడించి విద్యుత్ ఆదాతో పాటు కాంతి కాలుష్యాన్ని తగ్గించవచ్చునంటున్నారు. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ద్వారా లైట్లు ఏ దిశలో వెలగాలో కూడా నిర్ణయించవచ్చునని, భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే అంతగా అవసరం లేని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో లైట్ల కాంతిని తగ్గించడం లేదా ఈ అధిక వెలుగుల సమయాన్ని కుదించడం చేయవచ్చునని చెబుతున్నారు. లైట్లను అమర్చే విధానం వల్ల కూడా అనుకున్న ఫలితాలను సాధించవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. భారత్లో పరిస్థితి భారత్లోని ఒక చిన్నగ్రామంలో అయిదారు విద్యు™Œ స్తంభాలతో విద్యుత్ వెలుగులను అందిస్తే దాంతో పెద్ద ప్రమాదం ఉండదు. కానీ పట్టణాల్లో వీధులన్నీ లైట్లతో నిండిపోతే అది కాలుష్యానికి తప్పక కారణమవుతోంది. గత అయిదేళ్లలో దాదాపు అన్ని పట్టణాల్లో విద్యుత్ బల్బుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. అలాగే కొత్తగా శివారు ప్రాంతాల విస్తరణతో ఈ లైట్ల వినియోగం మరింత అధికమైంది. మొత్తంగా చూస్తే మనదేశంలోని దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కాంతులు పెద్దమొత్తంలో పెరిగాయి. మనదేశంలో పదిశాతం ప్రాంతాలు అత్యంత ప్రకాశవంతంగా ఉన్నట్లు, ఇతర ప్రాంతాల్లో 25 శాతం వరకు పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. ఎవరికి ఎంత నిద్ర అవసరం? నిజానికి ఎవరికి ఎంత నిద్ర కావాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా... చాలా అధ్యయనాల ఏకాభిప్రాయం ప్రకారం ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే: ఏ వయస్సు వారు? ఎంత నిద్ర? రోజుల పిల్లలు పద్దెనిమిది గంటలు ఆ పైన 1 నుంచి 12 నెలల పిల్లలు 14 నుంచి 18 గంటలు 1 ఏడాది నుంచి 3 ఏళ్లు 12 నుంచి 15 గంటలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 11 నుంచి 13 గంటలు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు 9 నుంచి 11 గంటలు కౌవూరంలో (12–19 ఏళ్లు) 9 నుంచి 10 గంటలు 21 ఏళ్లకు పైబడ్డవారిలో 7 నుంచి 8 గంటలు 50 ఏళ్లు పైబడిన వారిలో 5 నుంచి 7 గంటలు – కె. రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కీబోర్డు డాక్టర్లు
లండన్: జలుబు, దగ్గు నుంచి ఛాతీ ఇన్ఫెక్షన్ల వరకూ వైద్య నిపుణుల సాయం లేకుండా బ్రిటన్ పౌరులు తామే నయం చేసుకుంటున్నారు.వ్యాధి లక్షణాలను గూగుల్లో శోధించి ఇంటర్నెట్లోనే నివారణకు మార్గాలు అన్వేషిస్తున్నారు.చిన్న,చిన్న అనారోగ్యాల నుంచి ఓ మాదిరి వ్యాధులకూ డాక్టర్ వద్దకు వెళ్లేందుకు పదిమందిలో ఏడుగురు నిరాకరిస్తున్నారని బ్రిటన్లో నిర్వహించిన ఓ అథ్యయనం తేల్చింది.మూడింట రెండు వంతుల మంది సొంత వైద్యానికే మొగ్గుచూపుతున్నారని ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది. వైరస్లు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి వైద్య నిపుణుల చేయి పడకుండానే స్వస్ధత పొందగలమని భావించే వారి సంఖ్య పెరుగుతోంది.దీంతో ఏడాదికి ఒకటి రెండు సార్లు మించి ఎవరూ వైద్య నిపుణుడిని సందర్శించడం లేదని వెల్లడైంది.చిన్నపాటి అనారోగ్యాలకు ఇప్పుడు చాలావరకూ విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యకర ఆహారంతో పాటు రాత్రివేళల్లో కంటి నిండా నిద్ర పోతే చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం బలపడిందని ఈ అథ్యయనం నిర్వహించిన ఫ్యూచర్యూ ప్రతినిధి చెప్పారు. ఇంటి చిట్కాతో గతంలో అనారోగ్యం దూరం చేసుకున్నామని 75 శాతం మంది చెప్పినట్టు అథ్యయనం పేర్కొంది. ఇక ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్న తర్వాత తమ ఆరోగ్యం బాగా కుదుటపడిందని 70 శాతం మంది వెల్లడించారు. మరికొందరు డాక్టర్ వద్దకు వెళ్లే లోగానే తమ వ్యాధి లక్షణాలను గూగుల్లో శోధిస్తున్నారని తేలింది. ఇక జలుబుకు సంబంధించి 78 శాతం మంది వైద్యుడు ఊసే ఎత్తడం లేదు. జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, డయేరియా, పంటినొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, ఇన్సోమ్నియా, హెమరాయిడ్స్, అలర్జిక్ రియాక్షన్, అర్ధరైటిస్, జాయింట్ పెయిన్, ఛాతీ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు నెట్టింట్లోనే పరిష్కారం వెదుక్కుంటున్నట్టు వెల్లడైంది. -
కళ్లలోనే నీటికాసులకు చికిత్స
వయసుతో పాటు కళ్లకు వచ్చే వ్యాధి నీటికాసులకు మరో వినూత్నమైన చికిత్సను సిద్ధం చేశారు కాలిఫోర్నియా యూనివర్శిటీ (శాన్ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్త తేజల్ దేశాయి! ప్రస్తుతానికి ఈ వ్యాధికి చుక్కల మందు ఒక్కటే చికిత్స. వ్యాధిని తొందరగా గుర్తించి.. రోజుకు మూడు సార్లు చుక్కల మందు వేసుకుంటే శాశ్వత అంధత్వం రాకుండా నివారించవచ్చు. అయితే క్రమం తప్పకుండా మందు వేసుకోవడం ఒక సమస్యకాగా.. వేసుకున్న మందులో ఎక్కువభాగం రక్తంలో కలిసిపోవడం వల్ల వ్యాధి నయమమ్యేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తేజల్ దేశాయి ఓ వినూత్న పరికరం ద్వారా నీటికాసులకు నేరుగా మందు అందించడంలో విజయం సాధించారు. రెండు పొరల బయోఫిల్మ్ మధ్యలో చుక్కల మందును ఏర్పాటు చేయడం.. దాన్ని కంట్లో ఉంచినప్పుడు నెమ్మదిగా మందు విడుదల కావడం ఈ వినూత్న పరికరం తాలూకూ ముఖ్య లక్షణాలు. ఈ పరికరాన్ని ఇప్పటికే జంతువులపై ప్రయోగించి చూశామని, దాదాపు 24 వారాల పాటు పరిశీలించిన తరువాత ఇది బాగానే పనిచేస్తున్నట్లు గుర్తించామని తేజల్ దేశాయి వివరించారు. మరింత పెద్ద స్థాయిలో జంతు పరీక్షలు జరిపిన తరువాత ఈ పరికరాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. -
ఆశ.. నిరాశల మధ్య..
కష్టాలొస్తే... కన్నీళ్లొస్తాయి. ఆమెకు మాత్రం ఆ కన్నీళ్లే రక్తధారలవుతాయ్..స్వేదం.. రుధిర బిందువులుగా మారుతుంది. వైద్యులకే అంతుచిక్కని ఈ వింత వ్యాధితో ఆ యువతి నరక యాతన అనుభవిస్తోంది. తాత్కాలిక మందుల సేవనంతోనే జీవన పయనం సాగిస్తోంది. గాజుబొమ్మలా మారిన తన జీవన పయనం సాగేదెలా అంటూ దాతల సాయం కోసం వేయికళ్లతో ‘ఆశ’గా ఎదురుచూస్తోంది. ఇది ఒక వైపు.. మరోవైపు..ఆశ అక్క మేరీరత్నం ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన పక్కా భవన నిర్మాణం నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయింది. అక్కున చేర్చుకున్న బావ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. డిగ్రీ చదువుకోవల్సిన అనూష ఇదే బైక్ ప్రమాదంలో ఎడమ చేయి విరిగి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అక్క కొడుకు వీసా ప్రయత్నంలో మరో అక్క మేరీరత్నం ఎడమ కాలు విరిగిపోయింది. ఇంటర్ చదువుతున్న అక్క కొడుకు కుటుంబపోషణ కోసం ఆటో డ్రైవర్గా మారాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మర్రిపూడి (రంగంపేట): మర్రిపూడి గ్రామానికి చెందిన గంధం ఆశ. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కామరాజు, దయామణిలు ఐదేళ్ల క్రితం తనువులు చాలించారు. ఆదరించాల్సిన అన్నలిద్దరూ ఆ ఏడాదే ఊరువిడిచి వెళ్లిపోయారు. కనీసం ఎక్కడ ఉన్నారో తెలియని దుస్థితి. ముగ్గురు అక్కల్లో రెండో అక్క ఏడిద ఎలుసమ్మ మర్రిపూడిలో నివాసం ఉంటూ ఐదేళ్ల నుంచి చెల్లి ఆశ(22)ను ఆదరిస్తోంది. తన చెల్లికి అంతుచిక్కని రోగంతో అన్ని అవయవాల నుంచి స్వేద రక్తంలా కారుతుంటే ఆమె తిరగని ఆసుపత్రి అంటూ లేదు. మరోవైపు మూడో అక్క మేరీరత్నం కూడా దుబాయిలో పనిచేస్తూ కుటుంబపోషణకు సొమ్ములు పంపేది. ఆశ శరీరం నుంచి రక్తం కారుతుండడంతో ప్రస్తుతం రాయవెల్లూరులో వైద్య పరీక్షలు చేసి రోగాన్ని గుర్తించడానికి సుమారు రూ.15–20 లక్షల వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టే స్థోమత వారికి లేక తాడేపల్లిగూడేనికి చెందిన వైద్యులు పల్లా వెంకటేశ్వరరావు వద్ద ఉచితంగా ఇచ్చే హోమియో మందులు వాడుతూ, తాత్కాలిక ఉపశమనం పొందుతోంది. చెల్లి ఆశ బాధను చూడలేక దుబాయ్ నుంచి సుమారు పది నెలల క్రితం వచ్చిన మేరీరత్నం సుమారు రూ.ఐదు లక్షలు అప్పు చేసి, ప్రభుత్వ మిచ్చిన గృహ నిర్మాణ నిధులు రూ.38 వేలతో పక్కా భవనానికి శ్లాబ్ వేయించగలిగింది. ఆశ ఉండేందుకు వీలుగా గృహనిర్మాణం పూర్తి కావడానికి మరో రూ.రెండు లక్షలు అవసరం ఉంటుంది. మరోవైపు బావ నాగేశ్వరరావు, వీరి కుమార్తె అనూష ప్రమాదాల బారినపడి ఇంటికే పరిమితమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. అక్క కొడుకు సుబ్రహ్మణ్యం ఆటో నడిపి తెచ్చే కాస్త సొమ్ముతో తొమ్మిది మంది కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాతలు దయ చూపాలి.. చెల్లికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో శతవిధాలా శ్రమిస్తున్నా. మా అక్క ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావులు ఆమెను ఆదరిస్తున్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నారు. వారికి భారం కాకుండా చెల్లిని అసంపూర్తిగా ఉన్న భవనంలోనే ఉంచి సపర్యలు చేస్తున్నారు. డబ్బు సంపాదనకు మళ్లీ దుబాయ్ వెళతాను. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల పాటు ఉంచినా ఫలితం కానరాలేదు. కనీసం రూ.20 లక్షలు ఉంటే గాని, వైద్య పరీక్షలు చేయించలేం. దాతల సాయం తప్ప వేరే గత్యంతరం లేదు. – కాలు విరిగి మూల పడ్డ మూడో అక్క మేరీ రత్నం మంచానికి పరిమితమయ్యా.. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని, అందరిలానే తిరగాలని, ఆరోగ్యంగా గడపాలని ఉన్నా, అంతు లేని అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాను. మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తే, అక్క పిల్లల సహకారంతో కిరాణా వ్యాపారం చేయాలని ఉంది. దాతలు, అక్కలు దయ చూపితే మెరుగైన వైద్యసేవలు పొందాలని ఆశ పెంచుకున్నాను. – మంచానికే పరిమితమైన ఆశ ప్రతిపాదనలు పంపాం.. ఆశ గృహనిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిధులు విడుదలకు, మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల చేయాల్సి ఉంది. – ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్, రంగంపేట దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న ఆశ, ఆమె కుటుంబ సభ్యులు -
బోధ వ్యాధితో కొండపల్లి గ్రామస్తుల ఇక్కట్లు
-
సురక్షిత నీటి ఖరీదు ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీః మానవాళి అంతటికి సురక్షిత నీరు అందించాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏటా రూ 95 లక్షల కోట్లకు పైగా వెచ్చించాలని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. చిన్నారులను వ్యాధుల బారి నుంచి కాపాడి, అకాల మరణాలను నిరోధించాలంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ముఖ్యంగా పేదలు సరైన నీరు, పారిశుద్ధ్య వసతులకు దూరంగా ఉన్నారని, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణం పూనుకోవాలని వరల్డ్ బ్యాంక్కు చెందిన గ్లోబల్ వాటర్ ప్రాక్టీస్ సీనియర్ డైరెక్టర్ గాంజె చెన్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన నీటి సరఫరా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో 2030 నాటికి అందరికీ సురక్షిత నీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. అరక్షిత నీటితో డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పిల్లల ఎదుగుదలపై ఇది పెనుప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాధులను, పోషకాహార లేమిని అధిగమించేందుకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలతో నీరు, పారిశుద్ధ్య మెరుగుదలను అనుసంధానించాలని వరల్డ్ బ్యాంక్ నివేదిక సూచించింది. -
మత్స్యేంద్రజాలం
-
బీమా లేదు..ధీమా లేదు
రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న రోజులివీ.. కాసింత పెద్ద జబ్బు చేస్తే.. ముందు వైద్యానికయ్యే బిల్లు చూసి గుండె గుభేల్మనే రోజులివీ.. వీటికి చేసిన అప్పులు తీరక.. వడ్డీలు కడుతూ నడ్డి విరగ్గొట్టుకుంటున్న రోజులివీ.. అసలు మన దేశంలో ఎంతమందికి వైద్య బీమా ఉంది? ఇందులో ప్రభుత్వం తాలూకు వాటా ఎంత అంటే 32% మాత్రమే అని ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏ) చెబుతోంది. అదే బ్రిటన్లో ప్రజారోగ్య బీమా రంగంలో ప్రభుత్వ వాటా 83.5 శాతం అట.. అసలు మన దేశంలో ఎంతమందికి బీమా ధీమా ఉంది.. ఎంత మందికి లేదు అన్న వివరాలను ఓసారి పరిశీలిస్తే.. -
జల..'భద్రం'
బాత్రూమ్లో షవర్ ఆన్ చేసుకుందామంటే అలాంటి బాత్రూములు మనకెక్కడుంటాయ్? పోనీ... అలాంటి బాత్రూములు సంపాదించామే అనుకోండి! ట్యాంకులో నీళ్లెక్కడుంటాయ్? ఏ షవర్నైనా మైమరపించే మాన్సూన్ షవర్ వస్తుంటే జరభద్రం... కొంచెం జాగ్రత్త... అంటూ ఈ విసుర్లేంటి? ఇప్పటి వానలు... ఒకప్పటి వానల్లా కాదు. సేదదీర్చే వర్షంతో పాటు కుట్టే, కొరికే, అంటించే జబ్బులు వస్తాయి. అదిగో వాన వస్తోంది... ఇదిగో దోమ, ఈగ, ఎలుక వచ్చేశాయి. జర భద్రం... జల భద్రం! నీరు కలుషితం కావడం వల్ల ఈ సీజన్లో నీరు కలుషితం కావడం వల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ప్రధానంగా వస్తుంటాయి. ఇలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే కొన్ని ప్రధాన వ్యాధులు... టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇందులో నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ప్రత్యేకమైన ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోయి, ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. షిజెల్లోసిస్ జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ–కొలై నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. వర్షాకాలం వ్యాధుల నివారణ ⇒ఈ సీజన్లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం. ⇒కుండల్లో/బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకండి. అలా నిల్వ ఉన్న నీరు తాగకండి. ⇒మరీ వీలుకానప్పుడు మినహా ఈ సీజన్లో బయట వండిన ఆహార పదార్థాలు తినకపోవడమే మేలు. ⇒తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని మాటి మాటికీ వేడి చేసి తినవద్దు. ⇒మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. అయితే వ్యాధిని వ్యాప్తి చేసే ఈగల వంటి కీటకాలు ముసరడానికి మాంసం కారణమవుతుంది. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్లనే ఈ అవకాశం ఎక్కువ. ఇక మాంసాహార ప్రియులు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ సీజన్లో మాంసాహారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం. ⇒పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైపెచ్చులు ఊడిపోయిన సన్షేడ్కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించండి. దోమ తెరలు వాడటం మేలు. ⇒ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ⇒ఇంటి కిటికీలకు మెష్లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే వెల్క్రో వంటి ప్లాస్టిక్ మెష్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ⇒వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ⇒ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ⇒వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి. ⇒కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు లేదా డిష్వాషింగ్ డిటర్జెంట్స్ వూత్రమే వాడాలి. ⇒అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు... వానలో అతిగా తడిస్తే నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్వాష్తో గానీ, సబ్బుతోగాని కడుక్కోని శుభ్రంగా ఉంచుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారించుకోవచ్చు. ఈగలతో వచ్చే వ్యాధులు వర్షాల సీజన్ మొదలుకాగానే ఈగలు మూగడం మొదలవుతుంది. ఈగల కారణంగా వచ్చే వ్యాధుల సంఖ్య దాదాపు వందకు పైగానే ఉంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లోనే ఎక్కువ. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలవు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ప్రోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, పోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్లనూ ఈగ వ్యాప్తి చేస్తుంది. ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... అమీబియాసిస్ ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములివి. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. జియార్డియాసిస్ ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఆహారాన్నంతా జియార్డియా జీవులే తీసుకోవడం వల్ల ఆహారం ఒంటికి పట్టదు. దోమలతో వచ్చే వ్యాధులు మలేరియా ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా ఈ వ్యాధిని కలిగిస్తుంది. ప్లాస్మోడియమ్లో ఒక్కో రకం (స్పీïసీస్) వల్ల ఒక్కోరకం మలేరియా వస్తుంది. అయితే వీటిన్నింటిలోనూ సెరిబ్రల్ మలేరియా తీవ్రమైనదీ, ప్రాణాంతకమైనది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు. చికన్ గున్యా ఈ వ్యాధి ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ దోమ కాటు వల్ల జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఆ కీళ్లనొప్పులు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా భరించలేనంతగా ఉంటాయి. డెంగ్యూ ఈ వ్యాధికి కూడా ఏడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. మామూలుగా వచ్చే డెంగ్యూవ్యాధిని క్లాసికల్ డెంగ్యూ అంటారు. ఈ వ్యాధిలోని మరో దశ అయిన డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్లో అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్కు గురికావచ్చు. దీన్ని ‘డెంగ్యూ షాక్ సిండ్రోమ్’ అంటారు. ఎలుకల వల్ల... వర్షాలకు బయటి ఎలుకలు ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది. డా.ఎమ్. గోవర్థన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
బిడ్డని గెలిపించి..గెలిచిన అమ్మ
-
మన్యంలో మృత్యు ఘంటికలు
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు లేనట్టేనా? రంపచోడవరం/వీఆర్ పురం : ఏజెన్సీలో మళ్లీ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మృత్యువాత పడుతున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతునే ఉంది. విలీన మండలం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వీఆర్ పురం మండలం కుంజంవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక ధర్మయ్య ( 30) పది రోజులుగా కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. ఒకే వ్యాధి లక్షణాలతో అనేక మంది చనిపోతున్నా అధికార యంత్రంగంలో కదలిక రావడం లేదు. వ్యాధి కారణాలు, నివారణ, చికిత్స గురించి ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. రేఖపల్లిలో ప్రారంభమై... వీఆర్పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో తొలి మరణం సంభవించింది. తరువాత క్రమంలో ఇతర మండలాల్లో కాళ్లవాపు లక్షణాలతో గిరిజనులు మృత్యువాత పడడం ప్రారంభమైంది.కాళ్లవాపుతో ఇప్పటి వరకు విలీన మండలాల్లో మొత్తం 13 మంది గిరిజనులు మరణించారు. వీఆర్పురం మండలంలో 8 మంది, చింతూరు మండలంలో నలుగురు, కూనవరంలో ఒకరు మృత్యువాతపడ్డారు. కాళ్లవాపుతో బాధపడుతున్న వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నేటికీ అందని పౌష్టికాహారం కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. ప్రభావిత గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం మాటలు చెప్పి వెళ్లారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహారం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ అరుణ్కుమార్ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల ఆరోగ్యంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. విలీన మండలాల్లో రక్షిత నీరు లేకపోవడం వల్ల వ్యాధులకు కారణమవుతుందని భావించారు. రక్షిత నీరు అందించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా మరో గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో మృతి చెందడంతో అధికారుల హడావుడి మళ్లీ మొదలైంది. ఇప్పటికీ గుర్తించని మూలాలు కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మరణించి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించలేకపోయారు. విలీన మండలాల నుంచి ఈ వ్యాధి బారిన పడిన సుమారు 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్కు వెళ్లి చికిత్స పొందారు. వ్యాధి బారిన పడిన వారికి కిడ్నీలు పనిచేయకపోవడంతో చింతూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. డయాలసిస్ అవసరమైన రోగులను కాకినాడ జీజీహెచ్కు తరలిస్తున్నారు. మన్యంలో మృత్యుఘంటికలు ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా?
ఫ్లూ అంటే ఏమిటి? ఫ్లూకి టీకాలు, మందులు ఉన్నాయా? స్వైన్ ఫ్లూ కూడా ఒక రకమైన ఫ్లూయేనా? ఆర్నెల్ల లోపు పాపకు ఫ్లూ టీకా ఇవ్వవచ్చా? – కమల, చిత్తూరు ఫ్లూ అంటే శ్వాసకోశానికి ఇన్ఫెక్షన్ను సంక్రమింపజేయడం వల్ల వచ్చే ఒక రకం వ్యాధి. ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్లు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు హానిచేయవచ్చు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి... ఈ వ్యాధి లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. ప్రతి ఫ్లూకీ జ్వరం రావాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి వ్యాధి ముదిరితే అది ప్రాణాంతకం కావచ్చు. ఫ్లూ జ్వరం వచ్చిన వాళ్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఉమ్ము ద్వారా ఈ వ్యాధి వేరేవారికి సంక్రమిస్తుంది. రోగి ఉమ్ము, ముక్కు నుంచి వచ్చే స్రావాలను ముట్టుకొని మళ్లీ మన ముఖాన్ని ముట్టుకున్నా ఈ వ్యాధి రావచ్చు. ఫ్లూ మొదలైన తర్వాత ఒక వారం వరకు వేరేవాళ్లకు దూరంగా ఉంటే మంచిది. కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడవచ్చు. కర్చిఫ్లు, గ్లాసులు, ప్లేట్లు ఒకరివి మరొకరు వాడకూడదు. సాధారణంగా 65 ఏళ్లు పైబడినవారు, నర్సింగ్హోమ్లో పనిచేసేవారు / ఉండేవారు, గర్భంతో ఉన్న మహిళలు, హెచ్ఐవీ / ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులు ఉన్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది వ్యాధి విషమించడం వల్ల వచ్చే పరిణామాలూ వీళ్లలో చూస్తుంటాం. హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్స్, నర్స్లతో పాటు ఆస్తమా జబ్బు ఉన్నవాళ్లు ఫ్లూకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే రెండేళ్లలోపు పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం మరింత ఎక్కువ. వీళ్లంతా ఫ్లూ టీకా తీసుకుంటే మంచిది. ఆరు నెలల లోపు పిల్లలకు ఫ్లూ టీకా ఇవ్వకూడదు. అయితే ఈమధ్య పిల్లలకు ఇస్తున్న ఫ్లూ టీకాలో స్వైన్ఫ్లూ టీకా కూడా ఉంటోంది. నివారణ : టీకాలు ద్వారా ఫ్లూను నివారించవచ్చు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఫ్లూ ఉన్నవారి నుంచి కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండటం, వారు ఉపయోగించిన కర్చిఫ్లు వాడకపోవడం, ఒకరి ప్లేట్లు మరొకరు వాడకుండా ఉండటం, ఫ్లూ ఉన్నవారు స్కూల్స్కు, ఆఫీసులకు వెళ్లకుండా ఉండటం ద్వారా దీన్ని నివారించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. ఫ్లూ జ్వరం వచ్చినవారు జ్వరం మందు సరిగా తీసుకోవాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం. ఒకవేళ అప్పటికే స్వైన్ఫ్లూ బారిన పడితే అందుకు మంచి మందులు కూడా ఉన్నాయి. అయితే నిపుణులైన వైద్యుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలోనే వీటిని వాడాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం. బాబు సరిగా తినడం లేదు... ఏం చేయాలి? మా బాబు వయసు ఏడేళ్లు. వాడు సరిగా అన్నం తినడం లేదు. ఈ వయసులో వాడు అలా అన్నం తినకపోవడం మాకు కాస్త ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – సరళ, నిడదవోలు ఈ వయసులో ‘మా పాప సరిగా అన్నం తినడం లేదు’, ‘మా బాబు తన తిండి విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టడు’ అని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు తరచూ డాక్టర్లు వింటుంటారు. పిల్లలు సరిగా తినకపోవడానికి కారణాలలో ముఖ్యమైనవి... 1. మలబద్ధకం 2. శరీరంలో ఇనుము (ఐరన్) తక్కువగా ఉండటం 3.పొట్టలో నులిపురుగులు 4. తల్లిదండ్రులు పిల్లలకు స్వాతంత్య్రం ఇవ్వకుండా బలవంతంగా తాము అనుకున్నట్లుగా తినిపించడం. ఇవి కాకుండా పేగుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. పిల్లలు సరిగా తినడం లేదన్న సమస్యతో తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మేము (డాక్టర్లం) ముందుగా ఆ చిన్నారి ఎదుగుదల ఎలా ఉంది; చర్మం, జుట్టు, పళ్లు, కళ్లు నోటిచిగుర్లు, గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా, లేదా అని చూస్తాం. వీటిలో ఏ లోపం కనిపించినా, దానికి తగిన పరీక్షలు చేయిస్తాం. అలాగే ఒంట్లో ఇనుము (ఐరన్) శాతం ఎంత ఉందో చెక్ చేస్తాం. మలబద్ధకం లేదా నులిపురుగులు ఉన్నట్లు తెలిస్తే, వాటిని నిర్మూలించే మందులు ఇస్తాం. తల్లిదండ్రులకు ఆ విషయాల గురించి అవగాహన కల్పిస్తాం. ఐరన్ లోపం ఉందని అవగతమైతే ఆ లోపాన్ని సరిచేస్తాం. ఇదిగాక చాలా సందర్భాల్లో పిల్లవాడు సరిగా తింటున్నా తల్లిదండ్రులకు తృప్తి ఉండదు. దాంతో వాడి చేత బలవంతంగా తినిపిస్తారు. ఫలితంగా పిల్లలకు ఊబకాయం వస్తుంది. దాని కారణంగా అనర్థాలు ఎదురవుతాయి. ఇక తల్లిదండ్రులంతా పిల్లలకు ఆహారం ఇచ్చే విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే... వారికి మంచి పోషకాహారం ఇవ్వాలి. అంటే ఆ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి. పిల్లల ఆహారంలో నట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఉండేటట్లుగా చూసుకోవాలి. పిల్లలు ఎంత మోతాదులో తింటారనేది చూసి, అంతే ఆహారం ఇస్తుండాలి. అంతేగానీ.. పిల్లల చేత ఎక్కువగా తినిపించాలనే ఉద్దేశంతో వాళ్లకు గాడ్జెట్స్ ఆశపెట్టడం, టీవీ చూపిస్తూ తినిపించడం వంటివి చేయకూడదు. పిల్లలు తమ సొంతంగా తినే అలవాటును మొదటినుంచీ చేయించాలి. ఎప్పుడూ ఒకేరకమైన ఆహారం తినిపించకుండా, రకరకాల వెరైటీలు చేస్తూ, ఆహారం పట్ల వాళ్లకు ఆసక్తి కలిగించాలి. ఇంట్లో చేసిన పదార్థాలే ఆహారంలో భాగం కావాలి. బలవంతంగా అస్సలు తినిపించకూడదు. వేళకు తినే అలవాటు చేయాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి.