పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం? | 2 terrorists killed in Puttur! | Sakshi
Sakshi News home page

పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?

Published Sat, Oct 5 2013 10:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

2 terrorists killed in Puttur!

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. కాల్పులు జరిపిన నివాసంలో వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం కాసేపట్లో పుత్తూరుకు చేరుకోనున్నారు. మృతులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


కాగా 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో పేలుళ్లు జరిగాయి. 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement