ఉపఎన్నిక తర్వాత భారీగా వలసలు
కడప: కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక తర్వాత వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి వలసలు తధ్యమని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి చెప్పారు. కడపలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆకెపాటితో పాటు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకెపాటి మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునే దమ్మూ ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పారు.