ఎండలో ఎలా వెళ్తావు తల్లీ.. | Anantapur Police Helps Pregnant Woman | Sakshi
Sakshi News home page

ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..

Published Tue, Apr 21 2020 8:18 AM | Last Updated on Tue, Apr 21 2020 8:18 AM

Anantapur Police Helps Pregnant Woman - Sakshi

బాలింతకు వాహనం ఏర్పాటు చేసి పంపుతున్న పోలీసులు

కళ్యాణదుర్గం టౌన్‌: లాక్‌డౌన్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు బాలింతకు వాహనం సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ వెంకటరమణ.. ఓ బాలింత ద్విచక్రవాహనంపై వెళ్లడం చూసి చలించిపోయారు. వెంటనే వారిని ఆపి తమ వాహనం సమకూర్చి ఇంటికీ క్షేమంగా పంపారు. మండల పరిధిలోని ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ ఈనెల 13న కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు డిశ్చార్జ్‌ చేయడంతో భర్త ప్రసాద్‌తో కలిసి బిడ్డతో ఎండలో ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. గమనించిన డీఎస్పీ వెంకటరమణ తన వాహనంలో బాలింతను   క్షేమంగా ఇంటికి చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement