విజయవాడ లీగల్ : కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్రావు ముందస్తు బెయిలు కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఏపీపీ నోటీసు నిమిత్తం ఈ నెల 18కి వాయిదా వేశారు.
కృష్ణలంకలో గల స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్
Published Wed, Dec 16 2015 12:13 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement
Advertisement