Adulterated alcohol
-
కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు?!
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే! అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి. మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు. వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం. అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది. మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు. ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన. నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు. నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం? ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కల్తీ మద్యం కలకలం?
నాగర్కర్నూల్ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్కర్నూల్ బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ వద్ద కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ పరమేశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని మోతీ వైన్స్లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్ ఈఎస్ ఫయాజుద్దీన్ను వివరణ కోరగా మోతీ వైన్స్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. -
AP: రాష్ట్రంలో కల్తీ మద్యం లేనేలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేనేలేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశంతోనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 90 వేల మద్యం నమూనాలే పరీక్షించేవారని చెప్పారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా ఏటా 1.50 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల నమూనాలను ఐదు ప్రాంతీయ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగిన ప్రమాణాల మేరకు ఉన్నవాటినే మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. అక్కడ మృతుల్లో ఎవరూ కల్తీ మద్యం వల్ల మరణించలేదని వైద్య పరీక్షల నివేదికలు కూడా స్పష్టం చేశాయని చెప్పారు. కొత్త డిస్టిలరీలకు అనుమతివ్వలేదు 2018 తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మద్యం బ్రాండ్లను తయారు చేస్తున్న డిస్టిలరీలకు గత ప్రభుత్వ హయాంలో 2018లోనే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. సారా తయారీ, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ చేపట్టిందన్నారు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించడంతోపాటు 4,380 పర్మిట్ రూమ్ల అనుమతులను రద్దు చేసినట్టు తెలిపారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని వాటి సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించినట్టు వివరించారు. మద్యం విక్రయ సమయాలను కూడా కుదించామన్నారు. దాంతో రాష్ట్రంలో 2018–19తో పోలిస్తే 2019–20లో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్ విక్రయాలు 59 శాతం తగ్గాయని వివరించారు. ఇక 2020–21లో అయితే మద్యం విక్రయాలు 40 శాతం, బీర్ విక్రయాలు 77 శాతం తగ్గాయని చెప్పారు. సారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో సారా, అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను వినియోగించి ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలు, జియో ట్యాగింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామన్నారు. 2020లో సెబ్ను ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేసి, 70 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. సారా, అక్రమ మద్యం అరికట్టేందుకు గతంలో ‘ఆపరేషన్ నిఘా’ నిర్వహించగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ పరివర్తన్–2.ఓ’ నిర్వహిస్తున్నామన్నారు. గడచిన 10 రోజుల్లోనే 2,051 కేసులు నమోదు చేసి 1,260మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 26,375 లీటర్ల సారా, 89 వాహనాలను జప్తు చేసి 10.05 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వివరించారు. సారా, అక్రమ మద్యం విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. -
సారాయి సాధ్యమేనా?
ఏమైనా లాజిక్ ఉందా...? నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతం.. పోలీస్స్టేషన్తో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలున్న జంగారెడ్డిగూడెం లాంటి చోట అందరి కళ్లుగప్పి నాటు సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? ఎక్కడో మారుమూలన, నిర్జన ప్రాంతంలో అలా జరుగుతోందంటే నమ్మవచ్చేమో..! విపక్షం కాస్త లాజిక్గా ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాటుసారా కాసేవారికి అండగా నిలిచే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎస్ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో సీఎం స్పందిస్తూ అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యులు నాగరికంగా ప్రవర్తించాలని, సభ జరగకూడదనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. లాజిక్గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని, వారు ప్రస్తావిస్తున్న అంశాలపై తాను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కళ్లుగప్పి సారా తయారీ సాధ్యమేనా? దాదాపు 55 వేల జనాభా నివసిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా సారా కాయగలరా? అని సీఎం ప్రశ్నించారు. పైగా అది ఒక మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. 2011 లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉండగా ప్రస్తుతం దాదాపు 55 వేల మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు, మహిళా పోలీస్లున్నారని చెప్పారు. వారందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మవచ్చని, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో సారా కాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు పొంతన ఉందా? ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుతోందంటూ మరోవైపు జనం సారా తాగుతున్నారని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా అనే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు మరో రూ.25 వేల కోట్లు రుణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చంద్రబాబు అంటున్నారు. మద్యం విక్రయాలు బాగా పెంచి ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాటు సారా తాగి మనుషులు చనిపోయారని చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు’ అని మండిపడ్డారు. ‘ఈనాడు’ వక్రభాష్యం ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని తాను వ్యాఖ్యానించినట్లు ఈనాడులో వ్యంగ్యంగా రాశారని సీఎం పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 44 వేలు కాగా పదేళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇప్పుడు దాదాపు 55 వేల మంది ఉన్నట్లు చెప్పామన్నారు. దేశంలో 2 శాతం మరణాల రేటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, ఆ మరణాలు.. వృద్ధాప్యం, అనారోగ్యం, మరే ప్రమాదం వల్లైనా కావచ్చన్నారు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటుగా తీసుకుంటే ఏటా దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారని, అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుందన్నారు. ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకరించి రాసిందన్నారు. నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదన్నారు. వేర్వేరు చోట్ల వారం వ్యవధిలో చోటు చేసుకున్నాయని, మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయన్నారు. అప్పుడు ఏ రాద్ధాంతం జరగలేదన్నారు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి పాతిపెట్టిన భౌతిక కాయానికి పోస్టుమార్టమ్ నిర్వహించిందన్నారు. నిజంగానే అది సారా మరణం అయితే ప్రభుత్వం పోస్టుమార్టమ్ నిర్వహిస్తుందా? అని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారం... ‘ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఢంకా భజాయించాలి... ఆ విధంగా గోబెల్స్ ప్రచారం చేయాలి. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు విశ్వసిస్తారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు.. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదేపదే అదే విషయాన్ని చెబుతారు. కొన్ని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు కలసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..’ అని సీఎం జగన్ మండిపడ్డారు. జరగని దాన్ని జరిగినట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయడానికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతే కానీ ఇలాంటి ప్రవర్తనతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని టీడీపీ సభ్యులకు సూచించారు. బడ్జెట్ చర్చల్లో విపక్షం పాలుపంచుకోవాలని, సలహాలు ఇస్తే నోట్ చేసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే వ్యవహరిస్తూ కొత్త రూల్ ప్రకారం సస్పెండ్ కాదలచుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. -
CM YS Jagan: ‘కల్తీ’ మాటలేల!
మరోసారి స్పష్టంగా చెబుతున్నా... కల్తీ మద్యం తయారీదారులను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను తీసుకొచ్చాం. అక్రమ, కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఎస్ఈబీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కానీ.. లేని విషయాన్ని ఉన్నట్టుగా, సహజ మరణాలనూ అక్రమ మద్యం వల్ల చనిపోయినట్లుగా భ్రమలు కల్పిస్తూ యాగీ చేయడం తప్పని టీడీపీ సభ్యులకు ఈ సభ ద్వారా చెబుతున్నా. ఇప్పటివరకు అక్రమ మద్యంపై ఎస్ఈబీ 13 వేల కేసులను నమోదు చేసింది. అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే తపనతో కఠినంగా వ్యవహరిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ కల్తీ మద్యం వల్ల చనిపోయారనే భ్రమలు కల్పించేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్య సమస్యలతోపాటు సహజ మరణాల పాలైన వారిని కల్తీ మద్యం మృతులుగా పేర్కొంటూ టీడీపీ సభ్యులు సోమవారం శాసనసభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి జగన్ స్పందించి విపక్షం ఆరోపణలను తిప్పికొట్టారు. కల్తీ మద్యం, అక్రమ మద్యం దందాకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే... ఏమిటీ ‘అసహజ’ ధోరణి? 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994. దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు 12 శాతం అని పరిగణిస్తే ప్రస్తుతం అక్కడ 54,880 మంది ఉండవచ్చు. మొత్తం మున్సిపాలిటీలో వారు చెబుతున్న మరణాలే 18. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఆ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సహజ మరణాలు నెలకు 2 శాతం వరకు ఉంటాయని అంచనా వేసుకున్నా... నెలకు కనీసం 90 మంది సహజంగానే అంటే అనారోగ్యం, వయోభారం, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడటం మనం ఇక్కడే చూస్తున్నాం. చంద్రబాబు హయాంలోనూ.. కల్తీ మద్యం తయారీదారులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది...? గతంలో చంద్రబాబు హయాంలో అక్రమ మద్యం తయారీ జరిగింది. అది ఇప్పుడే కొత్తగా జరుగుతున్నదీ కాదు. అప్పుడూ జరిగింది... ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. నేను కాదనడం లేదు. కాబట్టే... స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్ను తీసుకొచ్చాం. ఎక్కడైనా కల్తీ మద్యం తయారీ లాంటివి గుర్తిస్తే ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మాకు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పాం. తాగుడు తగ్గించడమే లక్ష్యం మా ఉద్దేశం, తపన అంతా.. మద్యం వినియోగాన్ని తగ్గించాలన్నదే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన 43 వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేశాం. చంద్రబాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉండేవి. అంతేకాకుండా ఆ మద్యం షాపులకు అనుబంధంగా పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చారు. 50 మంది నుంచి 60 మంది వరకు అక్కడే కూర్చొని మద్యం తాగేవారు. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి రాగానే పర్మిట్ రూమ్ల అనుమతులను రద్దు చేశాం. గతంలో బడి పక్కన, గుడి పక్కన ఇలా గ్రామంలో ఎక్కడపడితే అక్కడే మద్యం దొరికేది. రాత్రి 12 గంటలు.. ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టం వచ్చినట్లు తాగించేవారు. లాభాపేక్షే ధ్యేయంగా ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా అమ్మేవారు. అందువల్లే ప్రభుత్వం చేపట్టింది.. మద్యం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను నివారించడం దాదాపుగా అసాధ్యం. గతంలో ఎటు చూసినా బెల్టు షాపులే. పల్లెల్లో అనధికారికంగా ఏర్పాటు చేసి విక్రయాలు సాగించేవారు. ధనార్జనే ధ్యేయంగా నడిచే ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలుంటే మద్యం వినియోగాన్ని తగ్గించలేమనే ఉద్దేశంతో ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసింది. మద్యం షాపులను కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫలానా సమయానికి మూసివేయాలంటే కచ్చితంగా అదే సమయానికి మద్యం షాపులు మూసి వేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని తీసుకొచ్చాం. దీనివల్ల ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా అడ్డుకోగలిగాం. వాటివల్ల తలెత్తే దుష్పరిణామాలను అడ్డుకోగలిగాం. కల్తీకి ఆస్కారం లేకుండా.. వీటితోపాటు షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం తగ్గింది. కానీ ఈ రకంగా రేట్లు అధికంగా నిర్ణయించడంతో అక్రమ మద్యానికి ఆస్కారం లభిస్తోందని కొంతమంది చెప్పారు. ధరలను తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అరికట్టగలుగుతామని ఎస్ఈబీ నివేదిక నివేదిక ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అదే అభిప్రాయం చెప్పాయి. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకుని మళ్లీ ధరలు తగ్గించాం. ఇక అప్పటి నుంచి మన ధరలు ఎక్కువని, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి అవకాశం లేదు. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది? -
తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
40కి చేరిన కల్తీ మద్యం మరణాలు
సమస్తిపూర్/పట్నా: బిహార్లో కల్తీమద్యం తాగి మూడు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్తీపూర్, గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురు, శుక్రవారాల్లో గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో 33 మంది చనిపోయారు. తాజాగా, శనివారం సమస్తీపూర్ జిల్లా పటోరీ పోలీస్స్టేషన్ పరిధి రుపౌలీ పంచాయతీలో ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ మానవ్జీత్ ధిల్లాన్ చెప్పారు. బిహార్లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. -
‘నకిలీ’ ప్రతాపం
కేఈ బ్రదర్స్. ఈ పేరు చెప్పగానే దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకు గుర్తొచ్చేది మద్యం వ్యాపారం. దీని ద్వారానే వారు ఆర్థికంగా ఎదిగి.. రాజకీయాల్లో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంతో పాటు నకిలీ మద్యం కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. డోన్ మండలం ఉడుములపాడులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ పేరు చేర్చారు. ఆయనతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో టీడీపీ నాయకులు..అది కూడా కేఈ అనుచరులే ఎక్కువగా ఉండడం గమనార్హం. గోవా, కర్ణాటక కేంద్రంగా నకిలీ మద్యం తయారీ వీరి కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. కేసులను పరిశీలిస్తే మద్యం రాకెట్ గోవా నుంచి కర్నూలు వరకూ విస్తరించినట్లు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో నకిలీ మద్యం వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతోంది. గోవా, కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. గోవాలోని ఓ బేవరేజస్లో నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుళ్లు అతికించి వేల కేసులను ‘సీమ’కు సరఫరా చేసేవారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాలకు కూడా ఇది సరఫరా అయ్యేది. కంటైనర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసేవారు. దీంతో పాటు నాటుసారా ఎక్కువగా కాసేవారు. ఈ దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. తాజాగా డోన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును పరిశీలిస్తే ఏళ్ల తరబడి నకిలీ మద్యం దందా ఎలా సాగిందో స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో వారికి కొందరు ఎక్సైజ్ అధికారుల అండ కూడా ఉండేది. ఫలితంగా భారీ ముడుపులు స్వీకరించేవారని తెలుస్తోంది. ఐదేళ్ల కిందటే గుట్టురట్టు నకిలీ మద్యం కర్నూలు జిల్లాకు సరఫరా అవుతోందని 2014 డిసెంబర్ 7న అనంతపురం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. 8వ తేదీ రాత్రి నిఘావేసి గుత్తి హైవేలో ఓ కంటైనర్ను పట్టుకున్నారు. అందులో వేల సంఖ్యలో మెక్డొవెల్స్, ఇతర బ్రాండ్ల పేరిట ఉన్న మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని ల్యాబ్కు పంపించి పరీక్షించగా మొత్తం నకిలీ మద్యమని తేలింది. ఈ కేసులో అప్పట్లో ఎనిమిది మందిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. ఏ1గా గోవాలోని డ్రైవర్ గుల్జార్ హుస్సేన్, ఏ2గా జమ్మూకశ్మీర్కు చెందిన మహిందర్లాల్, ఏ3గా బెంగళూరు వాసి కార్గో రమేశ్, ఏ4గా బంటిసింగ్(గోవా), ఏ5గా రమేశ్సింగ్(హర్యానా), ఏ6, ఏ7, ఏ8గా బెంగళూరు వాసులు రామయ్య, శివన్న, రాకేశ్లపై చార్జ్షీటు వేశారు. అప్పటి మంత్రి జోక్యంతో కేసు తారుమారు కంటైనర్ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గోవాకు వెళ్లి అక్కడి బేవరేజస్ను పరిశీలించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తేలడంతో రామయ్య అనే వ్యక్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కర్నూలు జిల్లా డోన్కు తీసుకెళుతున్నట్లు అప్పట్లో నిందితులుచెప్పినట్లు తెలిసింది. తాజాగా డోన్ పరిధిలో నమోదైన నకిలీ మద్యం కేసులో పేర్కొన్న వ్యక్తుల్లోని కొందరు అప్పట్లో ఈ కంటైనర్ను రప్పించారు. ఈ విషయం విచారణలో తేలింది. అయితే అప్పటి ప్రభుత్వ ‘పెద్ద’ జోక్యంతో కేసును తారుమారు చేశారని తెలుస్తోంది. కంటైనర్ను పట్టుకున్న పోలీసులు అది ఎక్కడికి వెళుతోంది? ఎవరు తెప్పించారనేది చార్జ్షీట్లో పొందపరచలేదు. ‘గుత్తికి కంటైనర్ చేరిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ స్థలానికి తీసుకురండి’ అని డ్రైవర్ చెప్పినట్లు పేర్కొని కేసును మూసేశారు. కంటైనర్ ఎక్కడికి వెళుతోందనేది తెలుసుకోవాలని ఎక్సైజ్ పోలీసులు భావించి ఉంటే ఫోన్కాల్ ఆధారంగా పట్టుకోలేరా అనేది తేలాల్సిన ప్రశ్న. కాగా ఈ కేసు ఎఫ్ఐఆర్ 2014లో నమోదు కాగా చార్జ్షీట్ మాత్రం 2018లో వేశారు. తరచూ నకిలీ మద్యం సరఫరా గోవా, కర్ణాటక నుంచి నకిలీ మద్యం తరచూ సరఫరా అయ్యేది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటం, జిల్లాలో కేఈ బ్రదర్స్ హవా నడవడంతో ఎక్సైజ్ పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో నకిలీ దందా యథేచ్ఛగా సాగింది. అలాగే ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్ను కూడా వీరు సరఫరా చేసేవారు. మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా నూట్రల్ ఆల్కహాల్)బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటకలో ఆర్ఎస్(రెక్టిఫై స్పిరిట్)బేస్డ్తో తయారు చేస్తారు. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్, ఆర్ఎస్ సింగిల్ఫిల్టర్. ఆర్ఎస్తో పోలిస్తే ఈఎన్ఏ బేస్డ్ మద్యం తయారీకి వాడే స్పిరిట్ ధర ఎక్కువ. దీంతో ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్ తక్కువ ధరతోనే లభిస్తుంది. దీంతో క్వార్టర్, డిప్లు ఎక్కువగా కర్ణాటక, గోవా నుంచి దిగుమతి చేసుకుంటారని తెలుస్తోంది. ట్యాక్స్ భారం కూడా ఉండదు. దీంతో వాటికి స్టిక్కర్లు అంటించి ఇక్కడి వైన్షాపుల్లో విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు. సెకండ్స్, థర్డ్తోనే థ్రెట్ బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్షాపుల్లో విక్రయిస్తారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చేది ‘సెకండ్స్’. స్పిరిట్, మరిన్ని రసాయనాలతో ఇక్కడే తయారుచేసేది థర్డ్. సెకండ్స్తో పాటు థర్డ్ విక్రయాలు జోరుగా సాగించారు. వీటిని సేవించి ఆరోగ్యం గుల్ల చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపడంతో ‘డోన్’లోని ‘నకిలీ ముఠా’ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తే జిల్లాతో పాటు కర్ణాటక, గోవాలోని నకిలీ మద్యం తయారీ స్థావరాలు, ఇంకొందరు పెద్దమనషుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అయ్యప్పగౌడ్ అరెస్ట్ డోన్ టౌన్: నకిలీ మద్యం కేసులో 3వ నిందితుడిగా ఉన్న అయ్పప్పగౌడ్ను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గత ఐదేళ్లుగా డోన్లోని మద్యం సిండికేట్ కార్యాలయ వ్యవహారాలు చూసేవాడు. ఇతనితో నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇంకా 24 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కూడా ఉన్నారు. -
నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్
టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డోన్ : సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్ లాభాల్లో కేఈ ప్రతాప్కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలింది గత డిసెంబర్ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్ రెడ్డి, కంబాలపాడు సింగిల్విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్ ఖలాల్ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది. నిందితులు వీరే 1.వినోద్ఖలాల్ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్ గౌడ్ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్ (టీడీపీ)10. రోహిత్ ఖలాల్ (హుబ్లీ) 11.రాకేష్ ఖలాల్ (హుబ్లీ) 12.సునీల్ ఖలాల్ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్ గౌడ్ (టీడీపీ) 25.డీలర్ రాము గౌడ్ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్ (నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్) 27.టీఈ కేశన్న గౌడ్ (మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ) 28.చిట్యాల లోకనాథ్ గౌడ్ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త) 30.కంబాల పాడు కేఈశ్యామ్ (మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్గౌడ్ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.) సిండికేట్ ఇష్టారాజ్యం మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి. -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
కర్నూలు, డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఉప్పరి రాంబాబు తన ఇంటిలో అండర్గ్రౌండ్లో బంకర్ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి, ఇతర ప్రదేశాలకు తరలిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గత నెల 29న సోదాలు చేసి నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుకు తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన శ్రీనివాసగౌడ్, ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీనివాసరావులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటక నుంచి ముడిసరుకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి స్పిరిట్, క్యారామిల్, మూతలు తదితర ముడి సరుకు తెప్పించి నకిలీ మద్యాన్ని రాంబాబు తయారు చేసేవాడు. వీటి కొనుగోలుకు ఉడుములపాడుకు చెందిన ఈడిగ నాగభూషణం, డోన్ పట్టణానికి చెందిన ఫజల్, ఈడిగ రవి ఆర్థికంగా డబ్బు సమకూర్చేవారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని బనగానపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, శివ, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మురళీధర్గౌడ్, కొత్తపల్లెకు చెందిన రాజశేఖర్ తదితరులతో పాటు మరికొంత మంది ద్వారా విక్రయించేవాడు. రూ.8 లక్షల విలువ చేసే ముడిసరుకు స్వాధీనం నిందితుడి నుంచి పోర్డ్ ఐకాన్ ఏపీ 21ఏఈ 3007 నంబరు కారు, 720 క్వాటర్ బాటిళ్లతో పాటు రాంబాబు ఇంటిలోని బంకర్లో 17 బస్తాల్లో ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు, 245 లీటర్ల స్పిరిట్, 4 వేల మ్యాక్డోల్ బ్రాంది, 2 వేల ఇంపీరియల్ బ్లూ మద్యం బ్రాండ్ ఖాళీ మూతలు, 10 వేల గోలా క్యాప్స్, క్యారమిల్, ఏస్సేన్, మద్యం మీటర్, 19 ఖాళీ క్యాన్లు, 2 డ్రమ్ములు, 800 ఖాళీ క్వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాంబాబుతో పాటు ఉడుములపాడుకు చెందిన నాగభూషణం, రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ముడి సరుకు రవాణా అసలు సూత్రధారుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీసీ చెప్పారు. సమావేశంలో నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, స్టేట్ టాస్క్ఫోర్స్ డీఎస్పీ క్రిష్ణకిషోర్రెడ్డి, కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శివశంకర్రెడ్డి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐలు శ్రీధర్రావు, రమణారెడ్డి, సిబ్బంది లక్ష్మినారాయణ, సుధాకర్రెడ్డి, లాలప్ప, శంకర్నాయక్, ధనుంజయ ఉన్నారు. -
టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ
కర్నూలు డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు. అండర్గ్రౌండ్ కేంద్రంగా.. ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్ గ్రౌండ్లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్డోల్ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్ పౌడర్, కెమికల్ ఫ్లేవర్ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. అన్నీ బ్రాండ్లు ఇక్కడే ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్ కలార్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడించలేం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్పోర్స్ సీఐ శిరీషాదేవి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐ రమణారెడ్డి, హెడ్కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్ నాయక్తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. -
కాస్టిలీ బాటిల్...చీప్ మిక్సింగ్!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి. 01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్కు సమీపంలో బెల్ట్షాప్పై టాస్క్ఫోర్స్ అధికారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ నంబర్లు ఆధారంగా ఆరా తీశారు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వచ్చినట్లు తేలింది. అంతేకాదు ల్యాబ్లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢీ అయ్యింది. దీంతో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారులు ఈ నెల 15వ తేదీన సీజ్ చేశారు. రాజధాని స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తేనో, ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తేనో ఈ రెండు అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి! అసలే మద్యం మహమ్మారి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తుంటే మరోవైపు చాపకింద నీరులా కల్తీ మద్యం మరింత ప్రమాదకర స్థాయిలో పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరిస్తోంది. గత నెల రోజు వ్యవధిలోనే 11 మద్యం దుకాణాలను ఇదే కారణంతో సీజ్ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కల్తీ భూతం విస్తరణకు బెల్ట్షాపులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. నెల రోజుల్లో 210 బెల్ట్షాపులపై దాడులు చేసి 192 మంది నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోకి తీసుకున్నా ఏమాత్రం నకిలీ మద్యం జోరు తగ్గట్లేదు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికికారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న విపరీత ధోరణిపై విమర్శలు వస్తున్నా తీరు మారట్లేదు! చంద్రబాబు సంతకం చేసినా.... బెల్ట్ షాపులు మూసేయిస్తానని చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తొలిరోజే చేసిన సంతకం చెల్లుబాటు కావట్లేదు! బెల్ట్షాపులు మూతపడలేదు సరికదా కల్తీ మద్యం అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. అక్రమార్కులు బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్లిక్కర్, తక్కువ ఖరీదు మద్యం కల్తీ చేసి నకిలీ మూతలను టాంపరింగ్ చేస్తున్నారు. ఈ సరుకు బెల్ట్షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో కోటబొమ్మాళి, శ్రీకాకుళం, పాతపట్నం కూడా భారీఎత్తున నకిలీ మూతలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ మూతల రంగు, టైటిల్, లెటరింగ్, లేబుళ్లు... అన్నీ మక్కీకిమక్కీగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ నకిలీ మూతల తయారీకే ఒక పరిశ్రమ నడుస్తోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మూతకు రూపాయి చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లాకు తీసుకొచ్చి మద్యం అక్రమార్కులకు రూ.3 నుంచి రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. షాపుల్లో, ఇళ్లల్లో కల్తీ.. టాస్క్ఫోర్స్ తనిఖీల్లో పట్టుబడిన నకిలీ మూతలను బట్టిచూస్తే మద్యం కల్తీ అంతా వైన్ షాపుల్లో లేదంటే అక్రమార్కుల ఇళ్లల్లో జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి. మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో కీలక నాయకుడి అనుచరులు మామ్మూళ్లు వస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్ మిక్సింగ్కు తెగిస్తున్నారు. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను తొలగించి అందులోనుంచి కొంత మద్యం తీసేస్తున్నారు. ఆ మేరకు తక్కువ ఖరీదు మద్యం, చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నారు. కొన్నిచోట్ల నీళ్లు కలిపేస్తున్నారు. ఇటీవల రాజాంలో ఈ తరహా ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాటిళ్లకు నకిలీమూతలను బిగించేసి యథావిధిగా నకిలీ సీళ్లనే వేసేస్తున్నారు. ఈ కల్తీ సరుకు విక్రయాలు బెల్ట్షాపుల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో బెల్ట్షాపుల్లో విక్రయాలు ఎక్కువగా రాత్రిపూట జరుగుతున్నాయి. వెలుతురు సరిగా లేని ఆ దుకాణాల్లో నకిలీ మూతలను మందుబాబులు గుర్తించలేకపోతున్నారు. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమా? కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు తరచుగా తనిఖీలు నిర్వహించాలి. వైన్షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్ శాఖలో ఈ తరహా చర్యలు కనిపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు, మామూళ్ల వ్యవహారాలే ఈ అలక్ష్యానికి కారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు రూ.4.50 లక్షల భారీ మొత్తాన్ని పట్టుకున్న వ్యవహారమే దీనికి పరాకాష్ట. గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం కార్యాలయానికి కూడా జిల్లాలో అక్రమ మద్యం వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తున్నట్లు తెలిసింది. -
కల్తీ కిక్కు
అనకాపల్లి కేంద్రంగా నిర్భీతిగా తయారీ జిల్లాలోని పలు ప్రాంతాల్లోవిచ్చలవిడిగా అమ్మకాలు సూత్రధారులుఅధికార టీడీపీ నేతలే పాత్రధారులు మద్యం వ్యాపారులు బడుగు జీవితాలతో ఆటలు పట్టించుకోని ఆబ్కారీ అధికారులు ఏడాది క్రితం.. విజయవాడలో ఐదుగురు బడుగులను కల్తీ మద్యం కాటేసింది.. అక్కడి దాకా ఎందుకు.. మన జిల్లాలోనే పది నెలల క్రితం ఎలమంచిలిలో ఓ నిండు జీవితం కల్తీ కాటుకు బలైపోయింది.. ఇలా వెలుగు చూస్తున్న ‘కల్తీ’ విషాదాలు ఒకటో రెండో మాత్రమే.. వెలుగు చూడకుండానే మలిగిపోతున్న జీవితాలెన్నో.. మత్తుకు బానిసలై.. కల్తీ బారిన పడి మగవారు ప్రాణాలు కోల్పోతుంటే.. వారిపైనే ఆధారపడిన కుటుంబాలకు దిక్కులేకుండాపోతోంది.. వీటిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం కల్తీబాబులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారు.. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మళ్లీ మామూళ్ల మత్తులోకి జారుకోవడం పరిపాటిగా మారింది. సరిగ్గా ఇదే.. కల్తీ మద్యం వ్యాపారులకు అవకాశంగా మారుతోంది.. అనకాపల్లి కేంద్రంగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్దీ ఇదే పరిస్థితి.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువులే ఈ రాకెట్ సూత్రధారులు.. వారి అండతో చీప్ లిక్కర్ లాభాల రుచి మరిగిన మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వైన్షాపులు.. వాటికి అనుబంధంగా పెట్టుకున్న బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేస్తున్నారు. విశాఖపట్నం: అనకాపల్లి పరిసరాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. కశింకోట మండలం ఎన్జీపాలెంలోని టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ ఇల్లు కల్తీ మద్యం తయారీ కేంద్రంగా మారింది. నూతనగుంటపాలెం గ్రామంలో టీడీపీ ప్రజాప్రతినిధి బంధువైన ఓ వైన్ షాపు యజమాని, ఆయన బావమరిది పక్కా ప్రణాళికతో ఆ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలు, అనకాపల్లి పట్టణంలోని కొన్ని వైన్ షాపులకు, బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కల్తీ మద్యం తయారీ ఇలా ప్రభుత్వ డిపో నుంచి వచ్చిన మద్యం బాటిళ్ల కప్పులను టెస్టర్ ద్వారా తొలగిస్తారు. బాటిళ్లలోని మద్యాన్ని ఒక బకెట్లో వేసి.. అందులో చీప్లిక్కర్, మరికొంత నీరు కలిపి మళ్లీ యధావిధిగా బాటిళ్లలో నింపుతారు. అనంతరం మూతలు అమర్చి వాటికి సపోర్టుగా ఉండే సిల్వర్ రేకును టెస్టర్తో నొక్కి పెడతారు. సరిగ్గా గమనిస్తే కల్తీ మద్యం బాటిళ్ల కప్పులు టెస్టర్తో నొక్కినట్లు కనిపిస్తాయి. మద్యం తాగే వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే చీప్ లిక్కర్ కలుపుతారు. దీంతో కల్తీ మద్యమని ఎవరికీ అనుమానం రాదు. రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఓసీ, డీఎస్పీ బ్రాండ్ల మద్యం ఎక్కువగా కల్తీ అవుతున్నట్టు తెలుస్తోంది. సీల్, స్టిక్కర్లపై పొరపాటున సందేహం వచ్చి ఎవరైనా అడిగినా.. మద్యం బాటిల్ తెరిస్తే స్పిరిట్ వాసన గుప్పుమంటోందని కొనుగోలుదారులెవరైనా ప్రశ్నించినా.. షాపుల యజమానులు వారిపై కలబడిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? అనకాపల్లి పరిసరాల్లో కల్తీమద్యం ఏరులైపారుతున్నట్టు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చినా మామూళ్లు తీసుకుని ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ఎక్సైజ్ అధికారికి కల్తీ మద్యం వ్యాపారులు కారు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీదారులు టీడీపీ నేతకు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రతి నెలా నజరానాలు సమర్పిస్తుండటంతో తనిఖీలు చేపట్టాల్సిన సదరు అధికారి ఏమాత్రం పట్టించుకోకుండా కల్తీ మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపినట్టు చెబుతున్నారు. గతంలో అనకాపల్లిలోని ఏఎంఏఎల్ కళాశాల జంక్షన్ వద్ద ఉన్న ఓ వైన్షాపులో, ఓ సినిమా థియేటర్ సమీపంలోని బార్లోనూ, అనకాపల్లి మార్కెట్యార్డు ముందున్న మరో బార్లో నకిలీ మద్యం అమ్మకాలు జరగ్గా.. అప్పట్లో ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నాళ్లు కల్తీ, నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట పడింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. మళ్లీ ఇటీవల కాలంలో కల్తీ విక్రయాలు పెచ్చుమీరిపోయాయి. కాగా, మామూలుగా పంచాయతీకి ఒక వైన్షాపుతోపాటు ఒక బెల్టు షాపు ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అలాంటిది అనకాపల్లి పరిసరాల్లో ఒక్కో పంచాయతీలో ఐదారు బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. -
కల్తీ మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఓ షాపుపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ వైన్ షాపులో సీల్ వేసి ఉన్న మద్యం బాటిళ్ల నుంచి కొంత మేర మద్యాన్ని వేరు చేసి ఆ మేరకు నీరు కలిపి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. నీరు కలిపిన తొమ్మిది బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపుపై, నిర్వాహకులు నర్సింగ్ గౌడ్, బాబులపై కేసులు నమోదు చేశారు. -
‘సిట్’ దర్యాప్తు పూర్తి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కల్తీ మద్యం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సిట్ బృందం సభ్యులు మాత్రం ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతున్నారు. సంఘటన జరిగి మూడు నెలలైంది. కల్తీ మద్యం వల్ల మృతి చెందిన కుటుంబాలను రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలు పరామర్శించారు. కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మృతుల కుంటుంబాలకు సాయం చేస్తున్నామని ప్రకటించి తూతూమంత్రంగా సాయం చేసి చేతులు దులుపుకున్నారు. కల్తీ మద్యం కాటుకు గురైన వారు ఇంకా కొందరు చావలేక, బతకలేక మంచంలోనే ఉన్నారు. సుమారు 50మంది వరకు ఈ కల్తీ మద్యం బారిన పడ్డారు. అధికారికంగా 35మంది వరకు కల్తీ మద్యం బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. చాలామంది కల్తీమద్యం బారిన పడినవారిని కూడా సిట్ దర్యాప్తు బృందం విచారించింది. అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నవారిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పోలీస్ కస్టడీకి నిందితులను తీసుకొని విచారించిన తరువాత కూడా కేసు కొలిక్కి రాలేదు. సిట్ దర్యాప్తు పూర్తయినా కేసు మాత్రం ముగియలేదని సమాచారం. ఎందుకంటే మద్యం కల్తీ జరిగిందా? లేదా? అనేది సిట్ దర్యాప్తు బృందం నిర్ధారించలేదు. కేసును సంపూర్ణంగా దర్యాప్తు చేపట్టిన సిట్ బృందానికి రెండు అనుమానాలు నేటికీ తీరలేదు. బార్లో వారు ఇచ్చిన నీళ్లు కలుపుకొని మద్యం సేవించిన వారు మృతి చెందారు. బయట మినరల్ వాటర్ కలుపుకొని మద్యం సేవించిన వారు కూడా మృతిచెందిన వారిలో ఉన్నారు. బార్లో నీళ్లు, బయట మినరల్ వాటర్ కలుపుకొని తాగిన వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. మద్యంలో ఎవరో కావాలని కల్తీ కలిపి ఉంటారనేది బార్ వారు, నిందితుల వాదన. అదే నిజమనుకుంటే బార్లో నీటిని మద్యంలో కలిపి తాగినవారు మాత్రమే చనిపోవాలి. లేదా అస్వస్థతకు గురికావాలి. కానీ మద్యం బయటకు తెచ్చుకొని మినరల్ వాటర్ కలిపి తాగిన వారు కూడా బాధితులు కావడం వల్ల మద్యంలోనే కల్తీ జరిగి ఉంటుందని భావించాల్సి వస్తున్నది. ఈ అనుమానాలకు పోలీసుల వద్ద సరైన సమాధానాలు లేవు. ఈ అనుమానాలు నివృత్తి అయితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. మద్యం కల్తీ జరిగిందంటే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేసిందని, బాట్లింగ్ కంపెనీల్లోనే మద్యం కల్తీ జరిగిందని సిట్ బృందం సభ్యులు నిర్ధారించే పరిస్థితుల్లో లేరు. పై వివరాలు పోలీస్ కమిషనర్కు ఇప్పటికే సిట్ బృందం సభ్యులు వివరించారు. అంటే దీనిని బట్టి సిట్ బృందం పోలీస్ కమిషనర్కు నివేదిక ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా నివేదిక రాలేదని సీపీ గౌతం సవాంగ్ చెబుతున్నారు. -
కల్తీ కాటుకు ఒకరు బలి
వినుకొండ (గుంటూరు) : కల్తీ మద్యానికి మరో వ్యక్తి బలయ్యాడు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పకొండ గ్రామానికి చెందిన నూలి సుబ్బయ్య(40) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ బెల్ట్ షాపులో మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. కల్తీ మద్యం తాగడం వల్లే సుబ్బయ్య మృతిచెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. -
కల్తీ మద్యం తాగి.. ఇద్దరు అస్వస్థత
చర్ల : ఖమ్మం జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఇద్దరు గిరిజనులు అస్వస్థత గురైయ్యారు. చర్ల మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన భాస్కర్, కోయం త్రిమూర్తులు శనివారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్షాపులో మద్యం సేవించారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
'నేనెక్కడికీ పోలేదు.. కోర్టుకు హాజరవుతా'
-
'నేనెక్కడికీ పారిపోలేదు.. కోర్టుకు హాజరవుతా'
విజయవాడ: కల్తీ మద్యం ఘటన జరిగిన తర్వాత తాను పరారీలో ఉన్నమాట అవాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. తాను రేపు కోర్టుకు హాజరు అవుతానని చెప్పారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే మల్లాది విష్ణు కనిపించకుండా వెళ్లారు. తాజాగా అజ్ఞాతం వీడిన ఆయన తాను పరారీలో ఉన్నది అవాస్తవం అని చెప్పారు. కొన్ని కార్యక్రమాల దృష్ట్యా తాను వెళ్లాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. మద్యం కేసులో తనకు నోటీసులు అందాయని చెప్పిన ఆయన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విష్ణు సమావేశం నిర్వహించారు. -
విజయవాడలో సంచలనాలు
► ఈ ఏడాది జనవరి 30న భవానీపురంలో విద్యుత్ షాక్కు గురై ఐదుగురు మృతిచెందారు. వన్టౌన్లోని కేఎల్రావునగర్లో సిలిండర్ పేలి నలుగురు అశువులుబాశారు. ► ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గాచేస్తున్న మచిలీపట్నంకు చెందిన అనూహ్య హత్యాచార ఘటనలో నిందితుడు చంద్రభానుకు అక్టోబర్లో ముంబయి కోర్టు ఉరిశిక్ష విధించింది. ► రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఆగస్టు 19న తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి 15 రోజులు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ► జులైలో మాచవరం స్టేషన్ పరిధిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ► హిమబిందుపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, జులై 28న ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ► సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న సూర్యారావుపేటను హై సెక్యూరిటీ జోన్గా పోలీసులు ప్రకటించారు. అక్కడ ఆగస్టు 1న రెండు గంటల్లో ఆరు దొంగతనాలు జరిగాయి. ► అంతర్రాష్ట దొంగ సాహును విజయవాడ పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. ► విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ సాయికుమార్ను నియమించారు. ► కృష్ణలంక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► విజయవాడలో బయటపడిన కాల్మనీ సెక్స్ రాకెట్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు పలువురు నేతలకు సంబంధాలు ఉండటం విశేషం. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళా టైలర్ జ్యోత్స్నరెడ్డి తన వ్యాపార అవసరాల కోసం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పంటకాలువ రోడ్డులో ఉన్న కాల్మనీ వ్యాపారులను ఆశ్రయించింది. రోజువారీ వడ్డీకి వీరు డబ్బులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమెను వారు లొంగదీసుకున్నారు. ఆమె సీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడంతో కాల్మనీ, సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి. ► విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. -
కక్షలు కన్నీళ్లు
గుంటూరు జిల్లాలో ఘటనలు రాజధానిగా రూపాంతరం చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతించిపోతున్న 2015 నేరపరంగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందడం, సంవత్సరం మొదట్లోనే విజయవాడలోని భవానీపురంలో విద్యుత్ షాక్కు గురై ఐదుగురు మృతిచెందడం, కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు ప్రాణాలొదలడం, కాల్మనీ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అష్టకష్టాలు పడటం, ఏఎన్యూలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి, పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో జిల్లావాసులు కన్నుమూయడం కన్నీటి జ్ఞాపకాలే. ఇక చోరీలు ఈ ఏడాది విచ్చలవిడిగా జరిగాయి. మన రాష్ర్ట దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు చెలరేగిపోయాయి. చైన్స్నాచింగ్లు ఊహకందనంత రీతిలో జరిగాయి. గ్రూపు తగాదాలు, ముఠా కక్షలు పెచ్చుమీరాయి. ఇక రాజధాని నేపథ్యంలో ఏర్పడిన భూతగాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపి అన్నదమ్ములను కోర్టుకు లాగాయి. ెుుత్తంమీద 2015 సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాలపై రక్తచరిత్రనే లిఖించింది. గుంటూరు : గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరాలు అనేకం జరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, మోసాలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు, నమ్మక ద్రోహాలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాలతో 2015లో రాజధాని రక్తసిక్తంగా మారింది. తుళ్లూరులో భూ కబ్జాలు పెరిగి వివాదాలు చెలరేగాయి. రక్తసంబంధాలు కూడా చూడకుండా దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో రిషితేశ్వరి, జీజీహెచ్లో ఎలుకల దాడిలో చిన్నారి మృతి వంటి సంఘటనలు, విజయవాడలో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్మనీ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దొంగల హల్చల్ గత రెండేళ్లతో పోలిస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దొంగల ముఠాలు స్వైర విహారం చేశాయి. చైన్స్నాచింగ్, ఇళ్లల్లో జరిగే దొంగతనాలకు లెక్కే లేకుండాపోయింది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టి పక్కకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా ఇరాని, పార్ధివ్, బిహారీ ముఠాలు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ►చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై మంత్రి అనుచరులు దాడిచేసి హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ►గుంటూరు జీజీహెచ్లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో వైద్యం కోసం చేరిన పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపాయి. సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కాంట్రాక్టర్లపై వేటు పడింది. ►తుళ్లూరులో చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన చెరుకు పంటను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. ►లింగాయపాలెంలో రాజేష్ అనే రైతుకు చెందిన ఏడు ఎకరాల భూమిలో వేసిన అరటి తోటను సీఆర్డీఏ అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. ►మంగళగిరిలో రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన సంచలనం కలిగించింది. ►మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంఘటన ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ►ఏసీబీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లకుపై అక్రమ ఆస్తులను గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం కలిగించింది. ► గుంటూరు నగరంలో ఒకేరోజు గంట వ్యవధిలో ఎనిమిది చైన్స్నాచింగ్లు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► గుంటూరు-విజయవాడల్లో సిమీ ఉగ్రవాదులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సూర్యాపేట ఎన్కౌంటర్ ఉదంతంతో బయటకు రావడంతో అంతా హడలిపోయారు. ►గుంటూరు జీజీహెచ్లో సిబ్బంది అవినీతి వల్ల ఇద్దరు తల్లులు తనకు మగబిడ్డ పుట్టాడంటూ గొడవకు దిగి ఆడశిశువును పట్టించుకోకపోవడంతో మృతిచెందిన దారుణ సంఘటన సంచలనం కలిగించింది. ►బాపట్ల మండలం చుండూరుపల్లిలో సాంబశివరావు అనే ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.5 కోట్ల సొత్తు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. దొంగను పట్టుకుని చోరీ సొత్తును పోలీసులు వారం వ్యవధిలోనే రికవరీ చేయడం మరో సంచలనం. ఏఎన్యూలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కలిగించింది. రిషితేశ్వరి సంఘటన జరిగిన నాలుగు రోజులకే వట్టిచెరుకూరు మండలంలో ఓ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ర్యాగింగ్ విషయంలో తనపై చర్యలు తీసుకుంటారేమోననే భయంతో కళాశాల భవనం పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెల్దుర్తి మండలానికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని తనపై కొంతమంది విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద వెంకటరమణ అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది సుత్తితో దాడిచేసి తలపై కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. -
కల్తీ మద్యం బాధితులకు ఇంకా అందని సాయం
-
కల్తీ మద్యానికి మరొకరు బలి
అమరావతి(గుంటూరు): కల్తీ మద్యానికి మరొకరు బలయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండమూడి లింగారావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు బుధవారం మృతిచెందాడు. ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కల్తీ మద్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. -
జనజీవనంలో ‘మందు’ పాతర
విశ్లేషణ విజయవాడలో ఇటీవల జరిగిన కల్తీ మద్యం దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఐదుగురు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇది మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ దుర్ఘటనలు సృష్టించే విషాదం ఎప్పటికీ కదలిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించారు. వారి గోడుతో స్పందించి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. దీనితో ఈ అంశానికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. విజయవాడ తాజా దుర్ఘటన అనేక సామాజిక అంశాలను ఎత్తి చూపింది. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉన్న మానవ వనరులు విలువైనవని, 35 సంవత్సరాల లోపు యువతరం 60 శాతం ఉందని, ఈ వనరు దేశం ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ఎందరో మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది అతిశయోక్తి కాదు. కాకపోతే దేశంలో మానవ వనరులు ఏ తీరులో ఉన్నాయి? వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? తగిన నైపుణ్యం లేకపోవడం ఒక లోపం కాగా, మద్యపానంతో ఈ వనరులు అధికశాతం నిర్వీర్యం కావడం మరో వాస్తవం. గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యసనం కారణంగా 65 శాతం ప్రజలు పూర్తిగా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అమాయకత్వం, బలహీనతలను ఆసరా చేసుకుని సాగుతున్న కల్తీ మద్యం అమ్మకాలకు అధికార యంత్రాంగం మద్దతు, రాజకీయ జోక్యం తోడై పేదల రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే ‘స్వర్ణబార్’ తరహా ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం మద్యం ఇచ్చే ఆదాయం మత్తుకు బానిసలవుతున్నాయి. మద్యం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల కుటుంబాలు రకరకాల ఇక్కట్లకు గురి అవుతున్నాయని ‘సామాజిక సర్వే’ చెబుతున్నది. సంపాదన మొత్తం మద్యం పైనే వెచ్చించే వారు 5 శాతం ఉండగా, 50 శాతం ఆదాయాన్ని తగలేస్తున్నవారు 40 శాతం మించి ఉన్నారు. దీనికి బానిసలైన వారి సగటు ఆయుర్దాయం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. కాగా, గత రెండు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారు 25 శాతం పెరిగిన సంగతి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మద్యంలో 5 శాతం మన దేశంలోనే వినియోగిస్తున్నారు. అయితే దేశంలో తాగుతున్న మొత్తం మద్యంలో 2/3 వంతు వరకు రికార్డులలోకి ఎక్కడం లేదు. అంతర్జాతీయ బెవరేజెస్ వినియోగం గురించి వివరించే ‘లాన్సెట్’ పత్రిక ఈ విషయం వెల్లడించింది. ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే కల్తీ కల్లు, కాపుసారా, గుడుంబాల వినియోగం కూడా భారత్లో ఎక్కువేనని ఆ పత్రిక పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవహారాల మీద తాజా నివేదికలు అందించే ‘అసోసియేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ నివేదిక ప్రకారం మద్యం పరిశ్రమ దేశంలో ఏటా 30 శాతం మేర విస్తరిస్తున్నది. 2015 చివరకు చూస్తే దేశంలో ఖర్చయిన మద్యం 20 బిలియన్ లీటర్లనీ, వీటి మీద ప్రజలు పెట్టిన ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్తో (ఐఎంఎఫ్ఎల్) పాటు, దిగుమతి చేసుకుంటున్న విదేశీ మద్యానికి కూడా డిమాండ్ పెరుగుతున్నదని పారిశ్రామిక వర్గాల అధ్యయనంలో తేలింది. మద్యం అమ్మకాలతో ఖజానాకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తున్నది. దీనితో అధికారంలోకి ఎవరు వచ్చినా, ఎన్నికల ముందు మద్య నిషేధం మీద హామీ ఇచ్చినా దీని జోలికి వెళ్లడం లేదు. గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ (తిరువనంతపురం) వెలువరించిన నివేదిక ప్రకారం, చాలా రాష్ట్రాల ఆదాయాలలో 20 శాతం మద్యం ద్వారానే సమకూరుతున్నది. ఈ ఆదాయం రెండు దశాబ్దాల నుంచి పెరుగుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు సమకూరిన ఆదాయం రూ. 21,800 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-05 నాటి మద్యం ఆదాయం రూ. 2,367 కోట్లు. ఇదే పదేళ్ల వ్యవధిలో 2013-14 నాటికి రూ. 10,923 కోట్లకు చేరుకుంది. అంటే 460 శాతం పెరుగుదలతో, సగటు సంవత్సర వృద్ధి 46 శాతమన్నమాట. ఈ పెరుగుదల మరే ఇతర వనరుల్లోను కనిపించకపోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఆదాయం రూ. 10,927 కోట్లు. ఆపై 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మన రాష్ట్రానికి సమకూరిన ఆదాయం రూ. 5,544 కోట్లు. అంటే 2015-16 చివరి వరకు లెక్కిస్తే మరో రూ. 3000 కోట్లు ఆదాయం ఆర్జించనున్నది. వెరసి ఈ సంవత్సరం ఆదాయం రూ. 8,544 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే మద్యం ఆదాయం మత్తులో ప్రభుత్వం కూరుకుపోయిందా? ఆదేశిక సూత్రాల ప్రకారం సంక్షేమ రాజ్యస్థాపన రాజ్యాంగం ప్రధాన లక్ష్యం. పేదలకు పెద్దపీట వేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని అంతా ప్రకటిస్తారు. అయితే ఒక పక్క పింఛన్లు, సబ్సిడీ బియ్యం, గృహ నిర్మాణం, ఆరోగ్య పథకాలు వంటివి ఇస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసే మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేయిస్తున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సెన్సైస్ కర్ణాటకలో జరిపిన అధ్యయనంతో తేల్చింది. ఇలాంటి ఆదాయాన్ని పౌర సేవలకు వినియోగించడం నేరమని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇది కొన్ని సందర్భాలలో తప్ప ప్రభుత్వాలు గుర్తుంచుకోలేదు. మద్యం మీద ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తే, దామాషా ప్రకారం ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం రూ. 2 ఖర్చు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు మద్య నిషేధం విషయంలో మీనమేషాలు లెక్కించడం సరికాదు. అయినా మద్య నిషేధం సాధ్యం కాదని వాదించేవారూ ఉన్నారు. ఇదొక పలాయన వాదమే. మద్యం ఆదాయం లేకుండా మనుగడ సాగిస్తున్న, వృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఆదాయం లేకున్నా గుజరాత్ 10 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నది. నిషేధం ప్రయత్నం ఇక్కడా జరిగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేకోద్యమం ఆరంభించారు. నిషేధించడం, మళ్లీ ఎత్తివేయడం జరిగింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు కూడా తన ఎన్నికల ప్రణాళికలో నిషేధం అమలును చేర్చారు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించిన ఫైలు మీద తొలిరోజే ముఖ్యమంత్రి సంతకం చేసినా, క్షేత్ర స్థాయిలో వాటి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారానికి పూనుకున్నది. ఫోన్ చేస్తే డోర్ డెలివరీ సౌకర్యం కూడా వచ్చిందని కూడా వినికిడి. పైగా ధరలు తగ్గించి, విక్రయాలు పెంచి అధికారులకు లక్ష్యా లను కూడా నిర్దేశిస్తున్నారు. ఇదేమి సంక్షేమం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో ద్వితీయ స్థానం మద్యానిదే. 2014-15 సంవత్సరంలో అన్ని రకాల వస్తువుల మీద సమ కూరిన మొత్తం ఆదాయం రూ. 35,126.60 కోట్లు. అందులో మద్యం ద్వారా లభించినది రూ. 11,480 కోట్లు. కాగా 2015-16 సంవత్సరం రాబడిలో ఇందులో 15 శాతం పెరుగుదల ఉండవచ్చునని అంచనా. ‘మద్యం రాబడి పెరుగుతున్నదంటే అర్థం, పేద కుటుంబాల పిల్లలకు పోషకాహారం తగ్గిపోతున్నట్టు లెక్క’ అని సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేర్కొంది. మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే, అసమానతలు కూడా అంత తీవ్రంగా పెరుగుతాయని కూడా ఆ సంస్థ వెల్లడించింది. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జన జీవితాన్ని ‘మందు’ పాతర ధ్వంసం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు పంచు తున్న ఉచిత మద్యం పాఠశాలలకు వెళ్లే బాలలను కూడా ఆ వ్యసనానికి బానిస లయ్యేటట్టు చేస్తున్నదని కొన్నేళ్ల క్రితం లోక్సత్తా చేపట్టిన అధ్య యనం ద్వారా వెల్లడైంది. సమాజంలో విషమ పరిస్థితులు సృష్టిస్తున్న మద్యాన్నీ, దాని మీద వచ్చే ఆదాయాన్నీ ఒక పెద్ద వనరుగా ప్రభుత్వాలు పరిగణిం చడం సమంజసం కాదు. ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజారోగ్యమే మిన్న. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి. మొ. 9989024579) -
మాజీ ఎమ్మెల్యే విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్
విజయవాడ లీగల్ : కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్రావు ముందస్తు బెయిలు కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఏపీపీ నోటీసు నిమిత్తం ఈ నెల 18కి వాయిదా వేశారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు.