
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్లో ఉంచింది. శ్రీకాకుళం - బి.రామారావు, విజయనగరం - పీఏ శోభా, విశాఖ - ప్రవీణ్ కుమార్, తూర్పుగోదావరి - అరుణ్కుమార్, పశ్చిమగోదావరి - హిమాన్షు శుక్లా, కృష్ణా - శ్రీకేష్ బాలాజీరావు, గుంటూరు - కాంతిలాల్ దండే, ప్రకాశం - వివేక్ యాదవ్, నెల్లూరు - పి.బసంత్ కుమార్, చిత్తూరు - సిద్ధార్థజైన్, అనంతపురం - కె.హర్షవర్థన్, కర్నూలు - టి.బాబూరావునాయుడు, వైఎస్సార్ కడప పి.రంజిత్ బాషా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి: ఏపీలో మోగిన పుర భేరీ)
(‘ఆయనను ఎదుర్కునే దమ్ములేకే.. ఇవన్నీ’)
(కాకినాడలో జనసేనకు ఝలక్)
Comments
Please login to add a commentAdd a comment