తమిళనాడులోని నీలాంగరైలో విహార యాత్రకు వెళ్లిన ఓ నర్సు అదృశ్యం కావడంతో ఆమె అపహరణకు గురైందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హాస్టల్లో బసచేసిన యువతులు 90 మంది ముట్టుకాడు తదితర ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారిలో మెర్సీ కనిపించలేదు. వెంటనే కానత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.