Kidnapped
-
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడిని కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.మరో ఘటనలో వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది.ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్లో ఉందని నిర్ధారించుకొని హయత్నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్నగర్లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పిడుగురాళ్లలో పోలీసులు -టీడీపీ నేతలు కుమ్మక్కు: కాసు
-
అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
సాక్షి, తిరుపతి జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేత రవి నాయుడు.. దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది.తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ల మధ్య కోరం లేక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది.కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ను టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ సతీమణి కిడ్నాప్నకు యత్నంతిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ రాయల్ సతీమణి మమతను కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తిరుపతిలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వారిలో అనీష్ రాయల్ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్ రాయల్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.సమాచారం తెలసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతను ఆర్సీ రోడ్డులోని రాయల్ నగర్లో పారీ్టకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.వెంటనే అభినయ్ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్లపై దాడి చేయగా, అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు. -
పెళ్లయినా పిల్లలు పుట్టరని..
మహబూబ్నగర్ క్రైం: పెళ్లయినా పిల్లలు పుట్టరని తెలుసుకొని.. ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. సమీప బంధువు కుమారుడిని కిడ్నాప్ చేశా డు. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతండాకు చెందిన పాత్లవత్ లాలు కొన్ని రోజులుగా జిల్లాకేంద్రంలోని పద్మా వతి కాలనీలో ఉంటూ మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే లాలు వద్ద సమీప బంధువు ఖిల్లాఘనపురం మండలం తిర్మాలయి పల్లికి చెందిన సభావత్ రాజు రెండు నెలలగా మేస్త్రీ పని చేస్తున్నాడు. అయితే సభావత్ రాజుకు లైంగిక సమస్యలు ఉండటంవల్ల పెళ్లి కాదని, ఒకవేళ పెళ్లి అయినా పిల్లలు పుట్టరని తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని భావించి పథకం ప్రకారం.. లాలు కొడుకు మూడేళ్ల విక్కీని చాక్లెట్లు, ఇతర తినుబండారాలు ఇప్పిస్తూ దగ్గర చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పద్మావతి కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న విక్కీని స్కూటీపై ఎక్కించుకుని జడ్చర్లకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత రాజుకు పరిచయం ఉన్న సావిత్రిని కలిసి, జరిగిన విషయం చెప్పకుండా ఆమెను కూడా తీసుకుని విజయవాడ వెళ్లాడు. రాజు వాడుతున్న మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడు విజయ వాడలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక టీం రాజును అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
మడకశిర మండలం బేగార్లపల్లిలో బాలిక కిడ్నాప్
-
చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం
చీమకుర్తి: గంజాయి రవాణా విషయంలో పదో తరగతి విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్లు గంజాయి వ్యాపారంలో ఆరితేరారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. ఈ విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్ వద్ద పని చేస్తున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వారు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుని గంజాయి కావాలని అడిగారు. ఆ విద్యార్థి తన బంధువుకు తొలి విడతగా రూ.50 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు పోగా, గంజాయి కూడా రాకపోవడంతో వారు నేరుగా అరకు ప్రాంతానికి వెళ్లి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.లక్ష ఇస్తే విడిచి పెడతామని చెప్పారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం చీమకుర్తి మీదుగా కారులో వినుకొండ తీసుకెళ్లారు. రాత్రి అక్కడి గాంధీనగర్లోని శ్రీనాథ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు.బాడుగ కోసం కారు డ్రైవర్ గొడవ చేయడంతో అతన్ని పంపించేశారు. అనంతరం కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండటాన్ని గమనించిన ఈ విద్యార్థి తప్పించుకున్నాడు. రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి చెప్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అంతలో వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంట పడిన క్రమంలో ఆటో ఒక చోట బోల్తా పడింది. యాసిన్ పోలీసులకు పట్టుబడగా, మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్కు వచ్చి విద్యార్థిని, కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. కాగా, ముగ్గురు కిడ్నాపర్లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15–20 కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. -
బాలుడిని కిడ్నాప్ చేసి.. ఆస్తి కోసం మేనమామ దారుణం
-
పాక్లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్పుర్ఖాస్కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి -
చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు
భోపాల్: వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బెత్మాలో జరిగింది.కిడ్నాప్కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ -
స్కూటర్పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్ను 1998లో అహ్మదాబాద్లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్. -
పచ్చబ్యాచ్ ఆగడాలు.. లిక్కర్ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్ -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. -
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్లోని వాల్మార్ట్ స్టోర్లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
HYD: టీవీ ఛానల్ యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్లో నిర్వహిస్తున్న పీస్ఫెస్టివల్పై హమాస్ ఉగ్రవాదులు.. అరమణి(25) అనే యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెను మిలిటెంట్లు బైక్పై బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైక్పై తీసుకెళ్తున్న క్రమంలో మిలిటెంట్లను వేడుకుంటోంది అరమణి. ప్లీజ్ నన్ను చంపకండి.. దయచేసి వదలిపెట్టండి అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్ఫ్రెండ్ నాథన్ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza. Noa is held hostage by Hamas. She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ — Hen Mazzig (@HenMazzig) October 7, 2023 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి.. -
సికింద్రాబాద్ లో బాలుడి కిడ్నాప్ కలకలం
-
కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేమిస్తే.. అగ్గి పెట్టేస్తారు
యశవంతపుర: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తరఫు వ్యక్తులు ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటన సిలికాన్ సిటీలోనే చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు ఆర్ఆర్ నగరకు చెందిన రంగనాథ, సత్యప్రేమ దంపతుల కుమారుడు శశాంక్ (18) బాధితుడు. అతడు నగరంలోని ఒక కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సమీప బంధువు కూతురిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. ఇన్నోవాలో వచ్చి, కాళ్లు చేతులు కట్టేసి శనివారం ఉదయం ఏసీఎస్ కాలేజీకి వచ్చాడు, తరగతులు లేవని చెప్పడంతో బయట నడిచి వెళుతుండగా శశాంక్ను ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. ఆరుమంది దుండగులు అతనిని నోరు, కాళ్లు చేతులను బట్టతో కట్టేశారు. బెంగళూరు– మైసూరు రహదారిలో కణమిణికె టోల్ గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అతికష్టంపై అగ్గిని ఆర్పుకొని శశాంక్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇటీవలే గొడవ యువతిది చామరాజనగర జిల్లా హరదనహళ్లి. యువతి బెంగళూరుకు రాగా శశాంక్ ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు శశాంక్ ఇంటికి వచ్చి గలాటా చేయగా, మీ అమ్మాయికి దూరంగా ఉంటానని శశాంక్ హామీనిచ్చాడు. ఇంతలోనే కిడ్నాప్ చేసి హత్యాయత్నం జరిగింది. కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరదనహళ్లిలో యువతి కుటుంబం తాళం వేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి పరమేశ్వర్ ఆదేశించారు. -
బీజేపీ నేత కిడ్నాప్?
అల్వాల్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్, బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు చర్చనీయాంశమయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయిగూడ చర్లపల్లిలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. తిరుపతిరెడ్డికి అల్వాల్ పరిధిలోని పాకాలకుంటలో ఓ వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతిరెడ్డి తన స్థలానికి సంబంధించి అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు. డ్రైవర్ వేరే పనిమీద వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరుపతిరెడ్డి కన్పించకుండా పోయారని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భార్యతో పాటు అతని సోదరుడు కరుణాకర్రెడ్డి తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మామిడి జనార్ధన్రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటోలో వెళ్లి..అదృశ్యమై.. మండల కార్యాలయం నుంచి తిరుపతిరెడ్డి ఒక్కడే ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన అనంతరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటకేసర్ వద్ద ఆటో దిగి సమీపంలోని దుకాణ సముదాయంలోకి వెళ్లాడని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు వెల్లడించారు. తిరుపతిరెడ్డి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఆందోళన.. కిడ్నాప్కు గురైన తిరుపతిరెడ్డి ఆచూకీని తెలుసుకోవడంంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య, సోదరుడు ఆరోపించారు. ఆయన అదృశ్యమై దాదాపు రెండురోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత పోలీస్స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాటమార్చి ఫుటేజీలు ఉన్నాయంటున్నారని చెప్పారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని సుజాత పేర్కొన్నారు. పోలీస్స్టేషన్ ముందు బైఠాయింపు తిరుపతిరెడ్డి కిడ్నాప్కు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, బీజేపీ నాయకులు, పోలీస్స్టేషన్ ముందు బైఠాయించారు. జనగామ, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతిరెడ్డి శ్రేయోభిలాషులు కూడా పెద్దసంఖ్యలో అల్వాల్ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. అదుపులో తిరుపతిరెడ్డి స్నేహితుడు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్కేసర్ ప్రాంతంలో తిరుపతిరెడ్డిని వదిలిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుపతిరెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆయన గత కొన్ని రోజులుగా తరచూ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. శుక్రవారం కూడా వేరే ఫోన్ ద్వారా మాట్లాడని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అల్వాల్లో రియల్టర్ తిరుపతిరెడ్డి కిడ్నాప్.. రూ.700కు ఆటో మాట్లాడుకుని..
హైదరాబాద్: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు. తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
చిన్న పిల్లలను ఇలా ఎత్తుకుపోతున్నారు
-
కిడ్నాప్ కథా చిత్రమ్ : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు
-
బాలికపై సామూహిక అత్యాచారం
మీర్పేట: జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. మీర్పేట లెనిన్నగర్ ప్రశాంత్నగర్ ఫేజ్–2కు చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 5న రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఉండే జిరాక్స్ షాప్నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రతన్ (22) కలిశాడు. నేనూ మీ ఇంటి వైపే వెళ్తున్నాను.. డ్రాప్ చేస్తానంటూ బాలికను బైక్పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక మరో బాలుడు (17) కూడా బైక్పై ఎక్కాడు. బాలికను ఇంటి వద్ద దించకుండా రైతుబజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను ఎక్కించుకున్న చోటే వదిలేశారు. కాగా, జిరాక్స్ కోసమని బయటకు వెళ్లిన కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు మీర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లగా.. బాలిక ఇంటికి వచ్చిందని చెప్పడంతో వెనక్కి వచ్చారు. మరుసటి రోజు బాలికను ఈ విషయమై అడగగా.. రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బైకుపై తిప్పి తిరిగి వదిలేశారని మొదట చెప్పింది. అనుమానం కలిగిన తల్లిదండ్రులు మరోసారి గట్టిగా నిలదీయడంతో వారిద్దరూ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సోమవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు రతన్, బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రతన్ పాత నేరస్తుడని అతనిపై నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. వారిపై పోక్సో, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని చెప్పారు. -
ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్.. విషాద ముగింపు
కాలిఫోర్నియా: యూఎస్లో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం.. విషాదంగా ముగిసింది. ఎనిమిది నెలల పసికందుతో సహా అంతా మృతదేహాలుగా కనిపించారని కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఓ పండ్ల తోట నుంచి వీళ్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్ని జస్లీన్ కౌర్(27), జస్దీప్ సింగ్(36).. వీళ్ల ఎనిమిది నెలల పాప అరూహీ ధేరి, బంధువు అమన్దీప్ సింగ్(39)గా గుర్తించారు. సోమవారం నార్త్ కాలిఫోర్నియాలోని మెర్స్డ్ కౌంటీ నుంచి వీళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఇంతలో.. బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్& హచిన్సన్ రోడ్లోని ఓ పండ్ల తోటలో పని చేసే వ్యక్తి.. వీళ్ల మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించాడని మెర్స్డ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్కె తెలిపారు. ఆ సమయంలో ఆ అధికారి భావోద్వేగానికి లోనయ్యారు. నిందితుడికి నరకమే సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారాయన. ఇదిలా ఉంటే.. జస్దీప్ తన కుటుంబంతో సెంట్రల్ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన సౌత్హైవే 59లోని 800 బ్లాక్ వద్ద కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి వీళ్లను అపహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబం కిడ్నాప్కు గురైన మరుసటి రోజే.. అనుమానితుడు మాన్యుయెల్ సల్గాడోను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణ్దీర్ సింగ్, కృపాల్ కౌర్ల స్వస్థలం పంజాబ్. కిడ్నాప్ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడి విచారణలో కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పిల్లల దగ్గు, జలుబు సిరప్లో కలుషితాలు! -
కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి
పెగడపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లాలో కిడ్నాప్కు గురైన మత్తమల్ల శంకరయ్య (50)ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు గురువారం అతడి కుమారుడు హరీశ్కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్నెట్ ద్వారా అతడి కుమారుడు హరీశ్ వాట్సాప్కు గురువారం పంపించారు. ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లా డారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకర య్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు. మధ్య తరగతి కుటుంబా నికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అనంతపురంలో యువతి కిడ్నాప్.. గంటలోనే ఛేదించిన పోలీసులు
-
2 వేల మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా: ఉక్రెయిన్
ఉక్రెయిన్పై రష్యా బలగాలు దాడులను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్లుతున్నాయి. ఉక్రెయిన్లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా.. బాంబలు వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమారు 2,389 మంది ఉక్రెయిన్ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా తమ దేశ చిన్నారులను అపహరించినట్లు వెల్లడించింది. రష్యా ఆక్రమించిన డాన్బాస్ ప్రాంతంతో సుమారు 2వేల మంది చిన్న పిల్లలు కనిపంచడం లేదని.. వారిని రష్యానే కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు ఓడరేవు నగరమైన మారియుపోల్ను చుట్టుముట్టామని, అక్కడ ఉన్న ఉక్రెయిన్ బలగాలు లొంగిపోవాలన్న రష్యా డిమాండ్ను ఉక్రెయిన్ అధికారులు తిరస్కరించారు. మారియుపోల్లో ఆదివారం సుమారు 400 మంది తలదాచుకుంటున్న ఓ ఆర్ట్ స్కూల్పై రష్యా బలగాలు దారుణంగా బాంబలు కురిపించిన విషయం తెలిసిందే. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ⚡️ Ukraine accuses Russia of kidnapping children from occupied Donbas. According to the Foreign Ministry, 2,389 children from Russian-controlled Donbas were “illegally deported” to Russia. — The Kyiv Independent (@KyivIndependent) March 21, 2022 -
అన్యాయమని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల కిడ్నాప్కు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ను మరో రాయలసీమ ప్రాంతంగా మార్చడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 23న నాగరాజు, 24న విశ్వనాథ్, యాదయ్య కిడ్నాప్ కాగా, ఈ నెల 25న హైదరాబాద్లోని బషీర్బాగ్ పోలీసులు రిమాండ్ చేశారన్నారు. గులాం హైదర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్లో ఎస్వీఎస్ లాడ్జి సమీపంలో అరెస్టు చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహబూబ్నగర్లో ఓ వీఐపీకి గులాం హైదర్ సన్నిహితుడని.. రాఘవేందర్రాజు చేసే అక్రమాలను హైదర్ ఎత్తి చూపుతున్నందుకు ఆయనను హత్య చేసేందుకు వచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చారని, ఇది సరికాదన్నారు. గులాం హైదర్కు, యాదయ్య, విశ్వనాథ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 23న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అమర్ కొడుకును పోలీసులు తీసుకెళ్లారని.. 24న అమర్ తండ్రి దొరికాడని కొడుకును విడిచిపెట్టారని ఆరోపించారు. అన్వర్ అనే వ్యక్తి ఈనెల 24న కిడ్నాప్ అయ్యారని తెలిపారు. వీళ్లు దేశ ద్రోహులా, లేక టెర్రరిస్టులా..ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఈనెల 23న తన భర్త కిడ్నాప్ అయ్యాడని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే.. సదరు సీఐ ‘‘నీ భర్త రెండు రోజుల్లో వస్తాడని, పెద్దపెద్ద రాజకీయ నేతలతో మీకు ఎందుకు’’అని ప్రశ్నించినట్లు నాగరాజు భార్య గీత చెప్పారు. మళ్లీ తర్వాత రోజు స్టేషన్కు వెళితే మీ భర్తను చర్లపల్లి జైలుకు పంపించారని చెబితే, జైలు దగ్గరికి నేను వెళ్లి కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వలేదని, రాత్రి 9 గంటలకు భర్తతో మాట్లాడించారని చెప్పింది. -
కలికాలం..!! బరితెగించిన భార్య
-
విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్
రాంగోపాల్పేట్(హైదరాబాద్): ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. మూడు గంటల్లో కేసును ఛేదించిన మార్కెట్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2012 సంవత్సరంలో మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ వాజీద్, అప్షియా బేగం(24)లకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. షేక్ వాజీద్ (31) బస్టాప్ ప్రాంతంలోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. అప్షియాబేగం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో ముషీరాబాద్కు చెందిన క్యాటరింగ్ నిర్వ హించే ఆసిఫ్ పరిచయం అయ్యాడు. ఆయనకు గతంలో రెండుసార్లు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ►ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా ప్రియుడి దగ్గరకు వెళ్లిపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని భర్తకు అప్పగించారు. ►మరోమారు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. అత్తామామల సహాయంతో భర్త ప్రియుడి వద్ద ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. తన భర్త నుంచి శాశ్వతంగా విడిపోవాలనే ఉద్దేశ్యంతో పలుమార్లు విడాకుల కోసం భర్తపై ఒత్తిడి తెచ్చింది. పిల్లలు ఉండటంతో విడాకులు ఇచ్చేందుకు భర్త అంగీకరించ లేదు. దీంతో అప్షియా బేగం ఎలాగైనా ప్రియుడిని పెళ్లి చేసుకుని అతడితో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. ►విడాకులు ఇచ్చేందుకు భర్త ఒప్పుకోకపోవడంతో ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ కలిసి భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కిడ్నాప్ పథకాన్ని రచించారు. ముషీరాబాద్లో ఖాజీ ఎదుట విడాకుల కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా షేక్ వాజీద్ను కిడ్నాప్ చేసేందుకు ముషీరాబాద్కు చెందిన ఇమ్రాన్ అహ్మద్(31), పార్శీగుట్టకు చెందిన జాఫర్(33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్లను ఆసిఫ్ సిద్ధం చేశాడు. ►సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ నలుగురు కలిసి 31 బస్టాప్ వద్ద చెప్పుల దుకాణంలో ఉన్న షేక్ వాజీద్ను బలవంతంగా ద్విచక్ర వాహ నాలపై కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. వాజీద్ను ముషీరాబాద్కు తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టి విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. 3 గంటల్లోనే.. వాజీద్ సాయంత్రం 6గంటల సమయంలో కిడ్నాప్నకు గురికాగా 8గంటల సమయంలో షాపు యజమాని మార్కెట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాప్ తీరును పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాధితుడి సెల్ఫోన్ టవర్ను ఆధారంగా వాజీద్ను బంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ముషీరాబాద్లో వాజీద్ను గుర్తించి రక్షించారు. అప్షియాతో పాటు ఇమ్రాన్ అహ్మద్, జాఫర్ను పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు ఆసిఫ్తో పాటు ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్ పరారీలో ఉన్నారు. -
కాబుల్లో భారత సంతతి వ్యాపారి అపహరణ!
-
నిర్మల్లో రియల్టర్ కిడ్నాప్ కలకలం
నిర్మల్: నిర్మల్లో రియల్టర్ కిడ్నాప్ ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. మంచిర్యాల రోడ్డులోని తన్వి అపార్ట్మెంట్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లగా నిర్మల్ పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల ఆటకట్టించారు. సమస్యాత్మక భూములు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్లోని తన్వి అపార్ట్మెంట్లో ఉంటున్న విజయ్చందర్రావు దేశ్పాండే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కుటుంబం హైదరాబాద్లో ఉంటుండగా, ఇక్కడ తల్లి వసుంధరరాణితో కలిసి ఉంటున్నారు. ఆయన ఉండే అపార్ట్మెంట్కు ఆదివారం ఉదయం 7.30 సమయంలో ఐదుగురు దుండగులు రెండు కార్లలో వచ్చారు. ఫ్లాట్నంబర్ 408లో ఉంటున్న విజయ్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. పక్కఫ్లాట్లో ఉండే శ్రీకాంత్రావు అటకాయించగా, దుండగుల్లో ఒకరు ‘నా పేరు కృష్ణారావు, మాది సంగారెడ్డి. విజయ్ డబ్బులివ్వాలి. అందుకే తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. అనంతరం విజయ్ను బలవంతంగా తీసుకెళ్లి కారులో ఎక్కించుకుపోయారు. వెంబడించి పట్టుకుని.. బాధితుడి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. టీఎస్15ఎఫ్బీ 1226, టీఎస్07హెచ్పీ 6365 నంబర్ల కార్లలో కిడ్నాపర్లు హైదరాబాద్ రోడ్డులో వెళ్తున్నట్లు తెలుసుకుని.. మెదక్ జిల్లా తూప్రాన్ సీఐకి సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు 44వ నంబర్ హైవే టోల్ప్లాజా వద్ద ఆపి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పోలీసులు అక్కడికి చేరుకున్నాక బాధితుడిని, దుండగులను అప్పగించారు. కృష్ణారావు, గన్ని కృష్ణ, సయ్యద్ అబ్దుల్ఖాదర్, యూసఫ్ సయ్యద్, మహమ్మద్ అబ్బాస్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. -
యాక్షన్ సినిమా స్టైల్లో రియల్టర్ కిడ్నాప్.. పోలీసుల అప్రమత్తతతో..
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో రియల్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దివ్యానగర్ లో గల తన్వి అపార్ట్మెంట్లో స్థిరాస్తి వ్యాపారి విజయ్ చందర్ దేశ్పాండేను ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్నకు పాల్పడ్డారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయనను బలవంతంగా లాక్కొని అపహరించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. స్థానికులు తెలిసిన సమాచారం మేరకు గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల వివరాలు గుర్తించారు. నిందితులు హైదరాబాద్ మార్గంలో వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలోని పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం పట్టుబడగా మరో వాహనం తూప్రాన్ వద్ద పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు విజయ్ చందర్ దేశ్పాండేను స్టేషన్కు తరలించారు. సంగారెడ్డి కి చెందిన కృష్ణారావు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి తెలిపారు. -
బేగంపేట్లో కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: బేగంపేట్లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ -
ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం
సాక్షి, కర్నూలు: ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ.. పసి పాపను కిడ్నాప్ చేసింది. అలసంద గుత్తి గ్రామానికి మహిళకు నిన్న డెలివరీ కాగా, పసిపాపకు ఇంజక్షన్ ఇస్తానంటూ ఓ మహిళ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు -
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవితకాల కఠిన కారాగారశిక్షతో సహా మూడు శిక్షలు, జరిమానాలు విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా, పోక్సో కోర్టు జడ్జి శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. తెలంగాణ కు చెందిన బెలిదే వేణుగోపాల్ గుంటూరులోని ఒక హోటల్లో పనులు చేస్తూ రైలుపేటలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పక్కింట్లో ఉంటున్న నేపాల్ దంపతుల ఐదేళ్ల కుమార్తెను వేణుగోపాల్ కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు 2019 డిసెంబర్ 18న ఐపీసీ సెక్షన్లు 363, 366, 323, 376 (ఏబీ), పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో దిశ చట్టానికి రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఈ కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ సుప్రజ, సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వారంలో పూర్తిచేసి 10 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన జడ్జి.. బాలిక కిడ్నాప్, కొట్టడం, లైంగికదాడి ఇలా మూడు నేరాలకు మూడు రకాల శిక్షలను విధించారు. కిడ్నాప్నకు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.500 జరిమానా, బాలికను కొట్టినందుకు ఒక సంవత్సరం సాధారణ జైలు, లైంగికదాడికి జీవితకాల కఠిన కారాగారశిక్ష, రూ.2,500 జరిమానా విధించారు. -
మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్!
సాక్షి, హస్తినాపురం: బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు కిడ్నాప్కు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వనస్థలిపురం ఎస్సై చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలంలోని కేసీఆర్కాలనీకి చెందిన సంకు శ్రీసౌమ్య ఆటోనగర్లోని నవతా ట్రాన్స్పోర్టులో పనిచేస్తూ మన్సురాబాద్లోని చిత్రసీమకాలనీలో అద్దెకు ఉంటోంది. రెండు నెలల నుంచి తన చెల్లెలు సంకు శ్రీదేవి(17) తన దగ్గరే ఉంటుండగా ఈనెల 24రోజున భద్రాచలం గ్రామానికి చెందిన చెట్ల తరున్కుమార్ (20) మాయమాటలు చెప్పి కిడ్నాప్కు చేశాడని సౌమ్య వనస్థలిపురం పోలీసులకు 25న ఫిర్యాదు చేసింది. కిడ్నాప్కు గురైన శ్రీదేవి సెల్ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని తెలిపారు. గతంలో కూడా తరున్కుమార్పై భద్రాచలం పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య మాడ్గుల: ఓ మైనర్ బాలిక (16).. తండ్రి మందలించాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై బద్యానాయక్ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని కూబ్యాతండాకు చెందిన మైనర్బాలిక అదే తండాకు చెందిన ఓ యువకుడితో మాట్లాడినందుకు గాను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్లోయువతి కిడ్నాప్ కలకలం -
సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ
ముంచంగిపుట్టు (అరకు): విశాఖ ఏజెన్సీ ముంచం గిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కిల్లో రాజమ్మ భర్త కిల్లో నాగేశ్వరరావును ఆదివారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. మూడో విడతలో రేపు (బుధవారం) ఈ పంచాయతీకి జరగనున్న ఎన్నికల్లో రాజమ్మ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆదివారం రాత్రి బూసిపుట్టు పంచాయతీ డి.కంఠవరం గ్రామానికి వచ్చి నాగేశ్వరరావును తీసుకెళ్లారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మావోయిస్టులు నాగేశ్వరరావును తీవ్రంగా కొట్టి సోమవారం మధ్యాహ్నం ప్రాణాలతో విడిచిపెట్టారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికతో ఈ ప్రాంత గిరిజనులు ఓటు వేసేందుకు భయాందోళనలకు గురవుతున్నారు. బూసిపుట్టు సర్పంచ్ అభ్యర్థి రాజమ్మ ఇప్పటివరకు డి.కంఠవరంలో అంగన్ వాడీ కార్యకర్తగా పని చేశారు. ఇటీవలే రాజీనామా చేసి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీకి దిగారు. పోలింగ్ యథావిధిగా జరుగుతుందని, బూసి పుట్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుమడ పంచాయతీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశా మని ఎస్సై పి.ప్రసాదరావు చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. (చదవండి: కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్) విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో -
నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది?
ముంబై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్కు గురైన నౌకాదళ అధికారి సూరజ్ కుమార్ దుబేని ముంబైలో సజీవదహనం చేయడంతో హత్యకు గురైన సంగతి తెలిసందే. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మృతి చెందిన సూరజ్కుమార్ దుబే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాడని.. ఈ క్రమంలో బ్యాంక్, స్నేహితుల దగ్గర భారీగా అప్పు చేశాడని తెలిసింది. మరో విషాదకర అంశం ఏంటంటే దూబేకి గత నెల 15న నిశ్చితార్థం జరిగింది.. ఈ ఏడాది ఏప్రిల్లో ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన సూరజ్ కుమార్ దుబే బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు అతడు చనిపోవడానికి ముందు బ్యాక్ నుంచి 8 లక్షల రూపాయల లోన్, ఓ కొలిగ్ వద్ద నుంచి 5.75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఇదే కాక కాబోయే మామగారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. ఇంత భారీ మొత్తం అప్పుగా తీసుకున్నప్పటికి ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 392 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సూరజ్ దూబే అప్పు చేసిన ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక అప్పు ఇచ్చిన స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా దూబేపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక జనవరి నెల మొత్తం సెలవుల్లో ఉన్న దూబే విధుల్లో తిరిగి చేరడం కోసం జనవరి 30న ఉదయం 8 గంటలకు రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కాడు. దిగాక తన కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దూబే చెన్నైలో దిగగా ముగ్గురు వ్యక్తులు అతడిని గన్తో బెదిరించి కిడ్నాప్ చేశారు. మూడు రోజులు దూబేని చెన్నైలో ఉంచారు. ఇక దుబే నుంచి జనవరి 30 తర్వాత ఎలాంటి కాల్ రాకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 1న దూబే మూడు ఫోన్లలో ఒక నెంబర్ రింగ్ అయినట్లు అతడి స్నేహితుడు తెలపడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దూబే ఈ నంబర్ని షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కోసం వినియోగించేవాడని దర్యాప్తులో తెలిసిందన్నారు పోలీసులు. మరో నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దుండగులు దూబేని పహల్గఢ్లోని ఎతైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి లాభం లేకపోయింది. మరణించాడు. ఈ క్రమంలో జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్యన ఆ ఆరు రోజుల పాటు ఏం జరిగి ఉంటుందనే విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ చిక్కు ముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, భారీ మొత్తంలో డబ్బు అప్పు చేయడం వంటి అంశాలే దూబే మరణానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దూబే మొబైల్కి ఓ నంబర్ నుంచి వరుసగా 13 కాల్స్ రావడంతో అది ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కొద్ది రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇక దూబేకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉందని కానీ.. అతడి దగ్గర మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయనే విషయం కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు.. చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్నకు గురైన నౌకాదళ అధికారి ముంబైలో సజీవదహనం చేసి హత్యకు గురయ్యారు. జార్కండ్ రాష్ట్రం రాంచికి చెందిన సూరజ్కుమార్ దుబే కోయంబత్తూరు ఐఎన్ఎస్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 31న ఆయన జార్కండ్ వెళ్లే నిమిత్తం చెన్నైకు వచ్చారు. అయితే, ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. రూ.పది లక్షల కోసం డిమాండ్ చేసిన ఆ ముఠా, చివరకు ఆ అధికారిని హతమార్చింది. రోడ్డు మార్గంలో చెన్నై నుంచి ముంబైకు ఆయన్ను తీసుకెళ్లిన ఆ ముఠా సజీవదహనం చేసింది. చెన్నై, ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. -
బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..
రాపూరు(నెల్లూరు జిల్లా): బెంగళూరులో ఓ వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు అభయారణ్యంలో పూడ్చిపెట్టారు. హత్యకు గురైన వ్యక్తి కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం ధరమ్సింగ్ సమీప బంధువు కావడంతో పోలీసులు శరవేగంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటక పోలీసుల సమాచారం మేరకు.. బెంగళూరు నగరం దాసరహల్లి స్టే అబోడా కోలేమాన్ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 402లో సిద్ధార్థ్ దేవేంద్రసింగ్ (27) నివాసం ఉంటున్నారు. (చదవండి: ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..) ఆయన గతనెల 19న ఉదయం 5 గంటల ప్రాంతంలో స్నేహితుడిని కలిసేందుకు అమెరికా వెళుతున్నానని తన తండ్రికి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చారు. అప్పటినుంచి అతడి ఫోను స్విచ్చాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో గతనెల 25న అమృతహళ్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్ కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. (చదవండి: ప్రేమవివాహం : పెళ్లికొడుకు ఇంటికి నిప్పు) చివరి కాల్ తిరుపతికి చెందిన వినోద్కు వెళ్లిందని గుర్తించారు. దీంతో బెంగళూరుకు పోలీసులు తిరుపతి చేరుకుని వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిద్ధార్్థను కిడ్నాప్ చేసి హత్యచేసి మృతదేహాన్ని రాపూరు మండలం వెలుగోను అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వినోద్ చెప్పాడు. ఆదివారం అటవీ ప్రాంతానికి చేరుకున్న బెంగళూరు పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. వినోద్ను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఆస్తి విభేదాల నేపథ్యంలోనే సిద్ధార్థ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. -
డెంటల్ డాక్టర్ కిడ్నాప్
సాక్షి, రాజేంద్రనగర్/అత్తాపూర్: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ డెంటల్ డాక్టర్ను దుండగులు కిడ్నాప్ చేశారు. కిస్మత్పూర్ ప్రాంతంలోని ప్రెస్టేజ్ విల్లాలో నివసిస్తున్న డాక్టర్ హుస్సేన్ (50) ఇదే ప్రాంతంలోని ఎక్సైజ్ పోలీస్ అకాడమీ పక్క కాలనీలో ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పనులు పరిశీలించేందుకు తన కారులో డ్రైవర్తో కలిసి వచ్చాడు. అపార్ట్మెంట్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తుండగా, బురఖా వేసుకున్న ఆరుగురు వ్యక్తులు అపార్ట్మెంట్ ప్రాంతానికి చేరుకున్నారు. (సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..) రెండవ అంతస్తులో కార్మికులతో మాట్లాడుతున్న హుస్సేన్ను బంధించి బలవంతంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. దీంతో డ్రైవర్, బిల్డింగ్లో పనిచేస్తున్న కార్మికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. హుస్సేన్ కుటుంబ సభ్యులు 100 నంబర్కు ఫోన్ చేయడంతో పాటు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తితో పాటు శంషాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను, వాహనం వెళ్లిన ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. హుస్సేన్కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. -
28 రోజుల తర్వాత.. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
సంతబొమ్మాళి: పొట్టకూటి కోసం లిబియా దేశానికి వెళ్లి అదృశ్యమైపోయిన శ్రీకాకుళం యువకులు ఎట్టకేలకు 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి బయటపడ్డారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో వారు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియాకు వెళ్లారు. కొంతకాలం పాటు అక్కడి ఓ కంపెనీలో పనిచేశారు. గత నెలలో తిరిగి ఇండియా వచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. 14వ తేదీన తమ కంపెనీ ఏర్పాటు చేసిన వాహనంలో త్రిపాలి ఎయిర్పోర్టుకు బయల్దేరారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు వీరి వాహనాన్ని ఆపి కిడ్నాప్ చేశారు. మూడు రోజుల తర్వాత దుండగులు వీరిని మరో గ్యాంగ్కు అప్పగించారు. ఆ గ్యాంగ్ సభ్యులు తాము కిడ్నాప్ చేసిన వారిని విడిచిపెట్టాలంటే 20 వేల డాలర్లు చెల్లించాలని కంపెనీ ప్రతినిధుల్ని డిమాండ్ చేశారు. అయితే వారు తర్జనభర్జనల్లో మునిగిపోయారు. ఈ సమాచారం తెలిసిన బాధితుల కుటుంబసభ్యులు డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి సీదిరి అప్పలరాజు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇండియన్ ఎంబసీని సంప్రదించి త్వరగా బాధితులను కిడ్నాపర్ల నుంచి విడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ ఆ సొమ్మును చెల్లించడంతో సీతానగరం యువకులతో పాటు యూపీకి చెందిన ముగ్గురు, గుజరాత్కు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో ఉన్న వారంతా త్వరలో స్వదేశానికి రానున్నారు. శ్రీకాకుళం యువకుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సత్వరం స్పందించి తమ పిల్లల గురించి వాకబు చేసి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సినీ ఫక్కీలో కిడ్నాప్: తెల్లవార్లూ కారులో తిప్పి..
నల్లజర్ల(పశ్చిమగోదావరి): ఓ వ్యాపారిని దుండగులు కారులో కిడ్నాప్ చేసి అతని నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు అపహరించి గుంటూరు జిల్లా కాజ టోల్గేట్ వద్ద విడిచి పరారయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూబచర్లకు చెందిన కలగర రామకృష్ణ నల్లజర్లలో సూర్య రెడీమెడ్ షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో షాపు మూసి స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. పుల్లలపాడు వీరమ్మ చెరువు సమీపంలోకి వచ్చేసరికి అటుగా ఇన్నోవా కారులో వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమలకు ఎటువెళ్లాలంటూ అతనిని అడిగారు. రామకృష్ణ సమాధానం చెప్పేలోపే అతని స్కూటీని వారిలో ఒక వ్యక్తి లాక్కోగా, మరో ముగ్గురు అతని నోరునొక్కి కారులోకి బలవంతంగా ఎక్కించారు. (చదవండి: వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి..) వ్యాపారి బ్యాగులో ఉన్న రూ.1 లక్షా 35 వేల నగదు, 28 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, సెల్ఫోన్, మూడు ఏటీఎం కార్డులు లాక్కున్నారు. పిన్ నంబర్ కూడా తెలుసుకున్నారు. కారు వెళుతుండగానే ఈ తతంగం అంతా జరిగింది. ముగ్గురు కారులో ఉండగా, మరోక వ్యక్తి రామకృష్ణ స్కూటీపై వెనక అనుసరించాడు. గుండుగొలను జంక్షన్లో మరో ఇద్దరిని కారులో ఎక్కించుకున్నారు. దూబచర్ల, కైకరం, భీమడోలు చుట్టూ మూడు సార్లు తిప్పారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించడమే కాక రాడ్డుతో కొట్టడంతో రామకృష్ణ ముఖంపై గాయమైంది. (చదవండి: ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..) దారిలో ఓచోట ఏటీఎం వద్ద ఆగి రామకృష్ణ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో పరిశీలించారు. చివరిగా తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్గేట్ సమీపంలో కారు ఆపి రామకృష్ణకు రూ.500 ఇచ్చి ‘ఇంటికి పో.. పోలీసు కేసు పెట్టినా, ఎవరికైనా చెప్పినా చంపేస్తాం’ అని బెదిరించి గుర్తు తెలియని దుండగులు పరారయ్యారు. రామకృష్ణ అక్కడ ఒక వ్యక్తి సెల్ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు గుంటూరు వెళ్లి రామకృష్ణను ఇంటికి తీసుకువెళ్లారు. గురువారం ఉదయం నల్లజర్ల పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం రామకృష్ణ ఏటీఎం కార్డు నుంచి ఒంగోలులో దుస్తులు కొనుగోలు చేసినట్లు అతని సెల్ఫోన్కు సమాచారం రావడంతో ఈ దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బందరులో అదృశ్యం.. తెలంగాణలో హత్య
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బందరులో అదృశ్యమైన మహిళ తెలంగాణలో హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి అదృశ్యంపై కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. కూరగాయల వ్యాపారం చేసుకునే మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన పల్లపోతు పద్మజ (45) గత నెల 31వ తేదీ తెల్లవారుజామున వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన విషయం పాఠకులకు విదితమే. అలా బయటికి వెళ్లిన ఆమె ఆ రోజు తిరిగి ఇంటికి చేర లేదు. అనుమానం వచ్చిన ఆమె భర్త ఈనెల ఒకటో తేదీన పద్మజ అదృశ్యంపై ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళను దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు మహిళ మృతదేహం పద్మజదిగా నార్కట్పల్లి పోలీసులు గుర్తించారు. విషయాన్ని ఇనగుదురుపేట పోలీసులకు తెలిపారు. పద్మజ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు నార్కట్పల్లి పోలీసులు తెలిపిన ఆధారాల ప్రకారం మృతదేహం పద్మజదిగా గుర్తించారు. పద్మజ హత్యకు గురికావడంతో రంగంలోకి దిగిన ఇనగుదరుపేట పోలీసులు కిడ్నాప్ కేసుగా పరిగణనలోకి తీసుకుని అనుమానితులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. పద్మజ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెను దగ్గరి బంధువులు, ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బందరు డీయస్పీ మహబూబ్బాషా, ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించే నిమిత్తం శుక్రవారం నార్కెట్ పల్లి వెళ్లారు. -
కిడ్నాపైన బాలుడికి కరోనా పాజిటివ్
చాదర్ఘాట్ (హైదరాబాద్): తల్లి పొత్తిళ్ల నుంచి రెండు రోజుల కిందట కిడ్నాప్నకు గురైన చిన్నారికి కరోనా పాజిటివ్ అని తేలింది. భర్త చనిపోవటంతో ఓ మహిళ ఏడాదిన్నర వయసున్న కుమారుడితో భిక్షాటన చేస్తూ చాదర్ఘాట్ సమీపంలో రోడ్డుపక్కన జీవిస్తోంది. దీంతో తలాబ్కట్టకు చెందిన ఆటో డ్రైవర్ ఇబ్రహీం ఆమె పొత్తిళ్ల నుంచి చాకచక్యంగా బాలున్ని కిడ్నాప్ చేశాడు. దీన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి ఇబ్రహీంను అరెస్ట్ చేశారు. తనకు సంతానం లేకపోవటం వల్లే రోడ్డుపక్కన ఉంటున్న బాలున్ని మూడు, నాలుగు రోజులుగా రెక్కీ చేసి కిడ్నాప్ చేశానని అతను అంగీరించాడు. దీంతో ఇబ్రహీం ఇంటి నుంచి బాలున్ని తీసుకువచ్చి పోలీసులు తిరిగి తల్లికి అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైరస్ ఎలా సోకిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. తల్లితో పాటు కిడ్నాపర్, బాలున్ని రక్షించిన టాస్క్ఫోర్స్ పోలీసులకు కూడా కరోనా టెస్ట్లు నిర్వహించారు. బాలునికి కింగ్కోఠి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే బాలునికి వైరస్ అంటించిన వారి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య
-
కేజీహెచ్లో కిడ్నాప్ కలకలం
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ బిడ్డ కిడ్నాప్ అయ్యిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేజీహెచ్లో కలకలం రేగింది. అయితే కుటుంబ సమస్యల వల్ల తల్లే బిడ్డను తీసుకుని వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సమీప కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన ప్రియాంక తన నాలుగు నెలల బిడ్డను కేజీహెచ్ పిల్లల వార్డులో ఈ నెల 23న వైద్య సేవల నిమిత్తం చేర్చింది. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను పిల్లల వార్డులోని ఆరోగ్యశ్రీ సిబ్బంది నుంచి తీసుకుని వెళ్లిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె భర్తకు సంబంధించిన వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డ కిడ్నాప్ అయ్యిందని ఆందోళనకు దిగారు. అయితే బిడ్డకు కేటాయించిన పడక మీద మొత్తం సామగ్రితోపాటు పాల డబ్బా కూడా వదిలి వెళ్లిపోవడంతో వార్డులో కలకలం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో బిడ్డను తీసుకుని ప్రియాంక వెళ్లిపోయి ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై కేజీహెచ్లోని పోలీస్ అవుట్ పోస్ట్లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఫోన్ నెంబరు పనిచేయకపోవడంతో ఎటువంటి సమాచారమూ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భర్త, అతని కుటుంబ సభ్యులపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రియాంక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
బాలిక కిడ్నాప్, బలవంతంగా పెళ్లి
అనంతపురం,బొమ్మనహళ్: ప్రేమ పేరుతో వంచించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఉదంతం నేమకల్లులో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాలివీ.. నేమకల్లు గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక అనంతపురం జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు దోణప్ప కుమారుడు తిప్పేస్వామి ఆ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. చివరకు తండ్రీకుమారులు ఇద్దరూ పథకం ప్రకారం అనంతపురంలోని మట్కా బీటర్ బసవరాజు సాయంతో శుక్రవారం మధ్యాహ్నం బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక సరిహద్దులోని బెంచికొట్టాల వద్దనున్న ఆంజినేయస్వామి దేవాలయానికి తీసుకెళ్లి మైనర్ బాలికకు తిప్పేస్వామితో బలవంతంగా వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ దోణప్ప ఇంటికి వెళ్లి బాలికను ఉజ్వల హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘గాంధీ’ లో 11 నెలల బాలుడు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో కలిసి ఉంటున్నారు. రాధిక భర్త నేరం చేసిన కేసులో చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీంతో రాధిక గాంధీ ఆస్పత్రిలోని వెయిటింగ్ రూమ్లో బాలుడితో కలిసి ఉంటున్నారు.గురువారం తెల్లవారు జామున 4 గంటలకు గుర్తుతెలియన వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి పరారయ్యారు. కాసేపటి తర్వాత నిద్రలేవగా పక్కన బాబు కనిపించలేదు. దీంతో ఆమె కంగారుపడిన ఆమె చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఉదయం 7.36గంటల సమయంలో బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా గాంధీ ఆస్పత్రిలోని సీసీ టీవి పుటేజ్లో ద్వారా కనుగొన్నారు. మెయిన్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో అనుమానితున్ని సరిగా గుర్తించలేకపోతున్నామని పోలీసులు పేర్కొన్నారు. అదృశ్యమైన బాలుణ్ణి వెతికేందుకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ రూట్లలలో మరిన్ని సీసీటీవీలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
శిశువు కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. కిడ్నాప్కి పాల్పడిన ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు. కోట మండలానికి చెందిన లక్ష్మీ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ ఏడవడం లేదని అత్యవసర విభాగంలో చేర్చారు. కొద్ది సేపటి తర్వాత ఆ శిశువు తల్లిని అంటూ అత్యవసర విభాగంలోని వచ్చిన ఓ మహిళ బిడ్డను తీసుకొని పరారైంది. బిడ్డను చూసేందుకు లక్ష్మీ కుటుంబ సభ్యులు అత్యవసర విభాగంలోకి వెళ్లగా అక్కడ శిశువు కనిపించలేదు. దీంతో లక్ష్మీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కిడ్నాప్కు పాల్పడిన మహిళను గుర్తించారు. సదరు మహిళ తనకు తెలుసునని ఓ యువకుడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై కోవూరు ఉన్న మహిళను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో మహిళను కూడా అరెస్టు చేశారు. బిడ్డను లక్ష్మీకి అప్పగించారు. -
‘కల్వకుర్తి’లో మావోల పోస్టర్లు
కల్వకుర్తి: మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని తాండ్ర, పోతేపల్లి, బైరాపూర్ గ్రామాల్లో మావోయిస్టుల పేర్లతో పోస్టర్లు వెలిశాయి. ఏకంగా సీఎం కేసీఆర్కు హెచ్చరిక చేస్తూ ‘ఖబడ్డార్ సీఎం కేసీఆర్.. ఉరికొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు..’అని సీపీఐ మావోయిస్టు పేర ఎర్ర సిరాతో వాల్పోస్టర్లు వేశారు. తాండ్ర స్టేజీ వద్ద, వెల్దండ మండలంలోని పోతేపల్లి, బొల్లంపల్లిలో ఒకటి చొప్పున అంటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టర్లు వెలియడంతో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయా.. అనే అనుమానం వ్యక్తమవుతుంది. చాపకిందనీరులా మళ్లీ మావోయిస్టులు పార్టీని విస్తృత పరిచి యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే పోస్టర్లు వేశారని భావిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీïసీ ఎన్నికల సమయంలో ఈ పోస్టర్లు వేయడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా.. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. మావోల చెర నుంచి గిరిజనుల విడుదల చర్ల: భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేశారు. ఈనెల 2న మండలంలోని బోదనెల్లికి చెందిన కుంజా బుచ్చిబాబు అనే యువకుడితో పాటు చింతగుప్పకు చెందిన మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. వారికి ఏ హానీ తలపెట్టకుండా విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి వారిని విడుదల చేసినట్లు తెలిసింది. అయితే, విడుదలకు సంబంధించి కుటుంబసభ్యులు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. వాహనాల దహనం.. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో రోడ్డు పనులకు వినియోగిస్తున్న ఐదు వాహనాలను మావోయిస్టులు ఆదివారం దహనం చేశారు. సుకుమా జిల్లా గొల్లపల్లి నుంచి వంజలవాయి మీదుగా కుంట వరకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులతో రోడ్డు పనులు చేస్తుండగా, వాటిని నిలిపివేయాలంటూ మావోయిస్టులు కాంట్రాక్టర్ను, గుమస్తాలను హెచ్చరించినట్లు తెలిసింది. అయితే, వారు ఆ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా పనులు కొనసాగిస్తుండడంతో ఆదివారం పనులు చేస్తున్న ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు డ్రైవర్లను చితకబాదారు. అనంతరం వారిని దూరంగా తీసుకెళ్లి వాహనాల ట్యాం కుల్లోని డీజిల్ను పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు జేసీబీలు, రెండు పొక్లెయినర్లు, ఒక ట్రక్కు దగ్ధమయ్యాయి. -
కలకలం; బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్!
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్పూర్కు చెందిన సుప్రభాత్ బత్యబయాల్ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్ కూతురిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం గురించి సుప్రభాత్ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్ అవడంతో లబ్ధ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు. ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్భూమ్ జిల్లా ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది. -
జమ్మూకశ్మీర్లో పోలీసుల కుటుంబసభ్యుల కిడ్నాప్
-
డిస్కౌంటే దెబ్బతీసింది
వాళ్లు 20 అడిగారు వీళ్లు 10 పోగు చేశారు వాళ్లు అడ్జస్ట్ అయిపోయారు కిడ్నాప్ ఫుల్గా చేశారు విడుదలకు 50% డిస్కౌంట్ ఇచ్చారు ఈ డిస్కౌంటే దెబ్బతీసింది ఆశ మనిషిని అందలం ఎక్కిస్తుంది.అత్యాశ అగాధానికి తోసేస్తుంది.2005, అక్టోబరు 12. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంసాయంత్రం 5 గంటల సమయంస్టీల్ ప్లాంట్ గేటులోంచి హోండాసిటీ కారు బయల్దేరింది. మెయిన్ రోడ్డు ఎక్కి అనంతపురం వెళ్లే రోడ్డు మీదుగా రయ్మంటూ దూసుకుపోతోంది కారు. ఉదయం నుంచి పని ఒత్తిడితో ఉన్న ఇంజనీర్ అనిరు««ద్(పేరు మార్చడమైనది) వెనుక సీట్లో చేరగిలబడ్డాడు.కార్ డ్రైవర్ రఘు మ్యూజిక్ ఆన్చేశాడు. స్పీకర్స్ నుంచి వస్తున్న పాటలు పని ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తున్నట్టుగా అనిపించింది అనిరు«ద్కి. ‘ర ఘూ..వాల్యూమ్ పెంచు’ అన్నాడు అనిరు«ద్. వాల్యూమ్తో పాటు కారు స్పీడ్ కూడా పెంచాడు రఘు. హైవే కావడంతో ప్రయాణంలో కుదుపులు లేవు. సీట్కి తల ఆన్చి, కళ్లు మూసుకుని పాటలను ఆస్వాదిస్తున్నాడు అనిరు«ద్. ఇంకో అరగంటలో అనంతపురం వస్తుందనగా కార్ స్లో అయ్యింది. కారు అద్దాలు ధడేల్ ధడేల్మని కొడుతున్నారెవరో.. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు అనిరు«ద్. కారు ఆగిపోయింది. కారు అద్దాలు కిందకు దించాడు రఘు. నలుగురు ఆగంతుకులు కారును చుట్టుముట్టి ఉన్నారు. వాళ్ల ముఖాలకు మంకీ క్యాప్స్ వేసున్నాయి. ఎవరన్నది తెలియడం లేదు. మొదటివాడు రఘు కణతికి రివాల్వర్ ఎక్కుపెట్టాడు కారు డోర్ తెరవమన్నట్టు. రఘు భయంగా కారు డోర్ తెరిచాడు. రఘు ముఖం మీద, వీపు మీద బలంగా కొట్టాడతను. అనిరు«ద్ వణికిపోయాడు.‘ఏయ్..! ఎవరు మీరు, ఏం కావాలి..’ అరుస్తుండగా మిగతా డోర్లు తెరుచుకున్నాయి. అనిరుద్ నోరు నొక్కేశారు వాళ్లు. అనిరు«ద్ని ఊపిరి తీసుకోనివ్వంతగా కొడుతూనే ఉన్నారు. డ్రైవర్కి పిస్టల్ ఎక్కుపెట్టిన అతను ‘చెప్పిన ప్లేస్కు పోనివ్వు. లేదంటే ఇద్దరూ ఛస్తారు’ అన్నాడు. వాళ్లు చెప్పినట్టు వినాల్సిన తప్పనిస్థితి. కారును ఎటు తిప్పమంటే అటు డ్రైవ్ చేస్తున్నాడు రఘు.మెయిన్ రోడ్ వదిలి ఓ సన్నని మట్టి రోడ్డు మీదుగా కారు బయల్దేరుతోంది. రెండు రోజులు గడిచాయి. పావని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అనిరు«ద్ ఫోన్ ‘నాట్ రీచబుల్’ అనే వస్తోంది. వెంటనే ఈ విషయం ఫోన్ చేసి తన తమ్ముడికి చెప్పింది. ‘నాకు భయంగా ఉందిరా! మీ బావగారు ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు’ ఏడుస్తూ చెబుతున్న అక్కకు ధైర్యం చెబుతూ ఊరి నుంచి బయల్దేరాడు పావని తమ్ముడు వివేక్. అతను చండీగడ్లో ఉంటాడు. రావడానికి ఎంత లేదన్నా రోజుకు పైగా పడుతుంది. ‘అమ్మా..! నాన్న ఎప్పుడొస్తాడు’ అని అడుగుతున్న పిల్లలకు నచ్చచెబుతూ బిక్కు బిక్కుమంటూ క్షణాలను యుగాలుగా గడుపుతోంది పావని.మూడవ రోజు పావని ఇంట్లో ఫోన్ మోగింది. ‘నీ మొగుడు నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు నువ్వు వినాలి’ అన్నది అవతలి కంఠం.వణుకుతున్న గొంతుతోనే ‘ఏమిటో చెప్పండి’ అంది పావని.‘నీ మొగుడు మా దగ్గరే ఉన్నాడు. ఇరవై లక్షలు ఇస్తే సరే, లేదంటే చంపేస్తాం..’ ఆ మాటలకు పావని గొంతు తడారిపోయింది. ‘ఈ విషయం పోలీసులకు చెప్పావో.. నీ మొగుడ్ని ఇప్పుడే చంపేస్తాం’ అన్నాడతను.‘ఏర్పాటు చేస్తా! ఎవరికీ చెప్పను. ఆయన్నేం చేయద్దు ప్లీజ్..’ ఫోన్లోనే వేడుకుంది పావని. ‘డబ్బు సిద్ధం చేసి ఉంచు. మళ్లీ ఫోన్ చేస్తాం. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో చెబుతాం’ అన్నాడు అతను.‘సరే!’ అనగానే ఫోన్ కట్ అయ్యింది.పావనికి ఏం చేయాలో అర్ధం కాలేదు. కాసేపు అలాగే స్తబ్దుగా కూర్చుండిపోయింది. పోలీసులకు చెబితే.. అమ్మో! అనిరు«ద్కి ఏమైనా జరిగితే... ఆ ఊహే భరించలేకపోయింది. తమ్ముడితో చెబుదామనుకుంది. ‘వాడు.. ఊరుకోడు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు, వద్దు’ అనుకుంది.ఇంట్లో ఉన్న క్యాష్ లెక్కించింది.. బ్యాంకులోని అమౌంట్ తీసుకొచ్చింది., మార్వాడీ కొట్టులో బంగారం తాకట్టు పెట్టింది. తెలిసినవారిని అడిగి డబ్బు తీసుకుంది. అంతా కలిపితే పది లక్షలు అయ్యాయి. 20 లక్షలు అంటే మాటలు కాదు. ఎలా? ఆ కిడ్నాపర్స్ ఈయన్ని చంపేస్తారేమో! వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్నే చూస్తూ కూర్చుంది. కిడ్నాపర్ చెప్పిన టైమ్కి ఫోన్ మోగింది. పావని కంగారుగా ఫోన్ ఎత్తింది. ‘డబ్బు సిద్ధం అయ్యిందా!’ కరుకుగా వినపడింది అవతలి గొంతు.‘అంత ఇచ్చుకోలేను. ఉన్నదంతా ఊడ్చి, తెలిసినవారిని అడిగితే అంతా కలిపి పది లక్షలు జమ అయ్యింది’ ఏడుస్తూనే చెప్పింది పావని. కాసేపు అటు నుంచి మౌనం.. ‘సరే, ఆ డబ్బు మాకు అందజేయి. నీ మొగుడ్ని వదిలేస్తాం’ అన్నారు అవతలివాళ్లు. ‘ఎలా ఇవ్వాలి?’ వెక్కుతూనే అంది పావని.‘మీ కారు డ్రైవర్నే పంపిస్తాం, అతనికివ్వు. ఎవరికీ అనుమానం రాదు’ ‘అలాగే’ అంది పావని. మరో గంట తర్వాత డ్రైవర్ రఘు వచ్చాడు. అతన్ని చూసిన పావని భయపడింది. రఘు ముఖం వాచిపోయి ఉంది. ఒక చేయికి కట్టు వేసి ఉంది. కుంటుతూ నడుస్తున్నాడు. పావని ఇచ్చిన సూట్కేస్ తీసుకొని రఘు వెళ్లిపోయాడు. పావని తమ్ముడు వివేక్ తాడిపత్రి చేరుకున్నాడు. తమ్ముడిని చూస్తూనే వెక్కుతూ జరిగిందంతా చెప్పింది పావని. అక్క చెప్పినా వినకుండా పోలీస్స్టేషన్కి దారి తీసాడు వివేక్. పోలీస్ స్టేషన్లో తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని తమ్ముడి బలవంతమ్మీద చెప్పింది పావని. కిడ్నాపర్స్ గురించి చెప్పకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు. పావని ఇంటికి చేరేసరికి ఫోన్ అదేపనిగా మోగుతోంది. ‘పావనీ.. నేను అనిరు«ద్ని. అనంతపురం రైల్వేస్టేషన్లో ఉన్నాను. ఇంటికి వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు చెబుతాను’ అన్నాడు. అతని గొంతు నీరసంగా ఉంది. భర్త కోసం పావని కళ్లలో ప్రాణాలు పెట్టుకొని ఎదురుచూస్తోంది. అనిరుద్ ఇల్లు చేరేసరికి పోలీసులు వచ్చి ఉన్నారు. ‘ఏమైంది?!’ అడిగారు పోలీసులు అనిరు«ద్ని.‘సార్, ఈవెనింగ్ ఆఫీస్ నుంచి అనంతపురం బయల్దేరాను. దారిలో ఎవరో నలుగురు దుండగులు మంకీ క్యాపులు వేసుకొని ఉన్నారు. డ్రైవర్ని, నన్ను కొట్టి, ఏదో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాను. ఈ రోజు వదిలిపెట్టారు’ అన్నాడు అనిరు«ద్ ఇంకా వదలని భయంతో.‘పది లక్షలు ఇస్తే వదిలేశారు. లేకపోతే చంపేసేవారే’ ఏడుస్తూ అప్పుడు నిజం చెప్పింది పావని. ఆ మాట వినడంతోనే పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ‘మాకు ముందు ఎందుకు చెప్పలేదు.ఎప్పుడెప్పుడు ఫోన్లు వచ్చాయి. ఎవరు డబ్బు తీసుకెళ్లారు?’ విచారించడం మొదలుపెట్టారు పోలీసులు.‘వాళ్లు నిజానికి 20 లక్షలు అడిగారు. కానీ, పది లక్షలే పోగయ్యాయి అంటే, సరే అన్నారు.కిడ్నాపర్లు మా కారు డ్రైవర్నే పంపించారు. అతనికే ఇచ్చి పంపించాను’ అంది పావని. ‘కారు డ్రైవర్కి డబ్బులిచ్చారా?! కిడ్నాపర్లు అడిగినంత డబ్బు ఇచ్చినా మరో పది లక్షలు డిమాండ్ చేస్తారు. అలాంటిది పది లక్షలు తగ్గించారా! సగం రేటుకి రిలీజ్ చేయడానికి ఇదేమైనా డిస్కౌంట్ ఆఫ్రా! తెలిసినవారి పనే అయ్యుండాలి. ఇదే అసలైన క్లూ. అయితే, అది ఎవరో నిర్ధారించాలి?’ పోలీసులు ఆలోచనలో పడ్డారు. అంతలో డ్రైవర్ రఘు అనిరు«ద్ ఇంటికి వచ్చాడు. రఘును, అనిరు«ద్ని అన్నిరకాల ప్రశ్నించారు పోలీసులు. రఘు, అనిరు«ద్లు ఇద్దరూ ఒకే మాట.. ‘ఆ కిడ్నాపర్లు ఎవరో తెలియదు’ అని. కేసులో ఏ విధమైన పురోగతి కనిపించడం లేదు. ఆ కిడ్నాపర్లను పట్టుకోవడం ఎలా?! ‘రఘూ, కిడ్నాప్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించగలవా?’ అన్నారు పోలీసులు. ‘గుర్తించగలను సార్’ అనడంతో పోలీసులు అతన్ని తీసుకొని బయల్దేరారు. ‘రఘూ.. నువ్వే డ్రైవ్ చేయ్’ అన్నారు పోలీసులు. వాళ్లు చెప్పింది చెప్పినట్టు ఆచరించాడు రఘు. కారు హైవే వీదుగా స్పీడ్గా వెళుతూ ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గరకు రాగానే కారు స్లో చేశాడు. అప్పుడే నలుగురు ఆగంతుకులు కారు మీదకు రావడంతో కారును ఆపకుండా స్పీడ్గా పోనిచ్చాడు రఘు. ఆ ఆగంతుకులు కారును అందుకోలేకపోయారు. ‘సార్! ఎవరో వాళ్లు మీరుండగానే ఇలా జరిగింది... నేను స్పీడ్గా డ్రైవ్ చేయబట్టి సరిపోయింది. లేకపోతే...’ అంటూ ఆగిపోయాడు రఘు. పోలీసులు ఏదో అర్ధమైనట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘ఇక్కడే సార్! ఈ స్పీడ్ బ్రేక్స్ దగ్గరకు రాగానే కారుని స్లో చేశాను. వీళ్లలాగే ఆ కిడ్నాపర్లూ వచ్చారు. పిస్టల్ నా తలకు పెట్టి కారును ఆపమన్నారు. నన్ను బాగా కొట్టి చెప్పిన చోటుకి కారు డ్రైవ్ చేయమన్నారు. మా సార్ని కూడా కొట్టారు సార్. అసలు వాళ్లు మమ్మల్ని చంపకుండా వదిలేస్తారని అనుకోలేదు. ఇప్పుడు ఇలా వచ్చిన వీళ్లెవరో..’ రఘు ఒకదాని వెంట ఒకటి చెబుతూ ఉన్నాడు. ఎస్సై తన సిబ్బంది వైపు చూశారు. తమ బాస్ కనుసైగ వారికి అర్ధమైంది. బేడీలు తీసి రఘు చేతికి తగిలించారు. రఘు షాక్ తగిలినట్టుగా పోలీసుల వైపు చూశాడు.‘నిజం చెప్పు.. జరిగిందేమిటో మాకర్ధమైంది. నువ్వుగా చెబితే శిక్ష తగ్గుతుంది. లేదంటే.. తెలుసు కదా!’ లాఠీ ఊపుతూ అన్నాడు. ‘నిజం .. సార్! స్పీడ్ బ్రేక్స్ దగ్గర బండి స్లో చేశాను.. వాళ్లు మా మీద దాడి చేశారు’ మొరపెట్టుకున్నాడు రఘు. ‘మరి ఇప్పుడూ వాళ్లలాగే నలుగురు ఆగంతుకులు (మఫ్టీలో ఉన్న పోలీసులు వారు) అడ్డు వచ్చినా నువ్వు వారిని క్రాస్ చేస్తూ స్పీడ్గా డ్రైవ్ చేశావు కదా! మరి అప్పుడు ఎందుకు చేయలేదు? స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసినా కారు మూవ్ అవుతూనే ఉంటుందిగా. కిడ్నాపర్లు నీ తలకు పిస్టల్ ఎంత స్పీడ్లో వచ్చి పెట్టి ఉంటారు?! నువ్వే కారు ఆపావని తేలిపోయిందిగా!’ ఎస్సై ఆ మాట అనడంతో రఘుకి తను దొరికిపోయానని అర్ధమైంది. విషయమంతా చెప్పడం మొదలుపెట్టాడు. ‘అనిరుద్ ఇంజనీర్. వేరే రాష్ట్రం నుంచి వచ్చి మూడేళ్లుగా ఇదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద జీతగాడు. డబ్బు ఉన్నవాడు. అతని దగ్గర ఏడాది నుంచి కారు డ్రైవర్గా చేస్తున్నాను. డబ్బున్నవారిని కిడ్నాప్ చేస్తే సొమ్ము చేసుకోవచ్చు అని నా స్నేహితులు అంటుంటే ఈ ఇంజనీర్ విషయం చెప్పాను. వాళ్లు అతన్ని కిడ్నాప్ చేసి, డబ్బు చేసుకుందామన్నారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను ఈజీగా డబ్బు వస్తుంది కదా అని. ఆ రోజు కారులో మేం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళతున్నది నా స్నేహితులకు ముందే చెప్పాను. అనుకున్న చోటుకి నా స్నేహితులు వచ్చి ఉన్నారు. స్పీడ్ బ్రేక్స్ దగ్గర నేనే కారు ఆపాను. వెనుక సీట్లో కూర్చున్న సార్ ఇది గమనించలేదు. అక్కడే వున్న నా స్నేహితులు మా మీద విరుచుకుపడ్డారు. ఇరవై లక్షలు వస్తాయని అనుకున్నాం. కానీ, పదిలక్షలే పోగయ్యాయి అనడంతో దాంతోనే సరిపెట్టుకుందామనుకున్నాం. అనుమానం రాకుండా ఉండేందుకు నా మీద కూడా దాడి జరిగినట్టు నమ్మించాను’ విషయం చెప్పాడు రఘు. రఘు ద్వారా మిగతా నలుగురు నిందితులు ఎక్కడ ఉంటారో తెలుసుకొని, వారినీ పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఎవరికీ తెలియకుండా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నాం అనుకునే నేరస్తులు ఎన్ని నైపుణ్యాలను ప్రదర్శించినా ఏదో ఓ చిన్న క్లూ ద్వారా అయినా పోలీసులకు దొరికిపోతారు. శిక్ష అనుభవిస్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ద్రోహి రఘు. తన యజమాని ముందు తలదించుకున్నాడు. జైలు గోడల మధ్య శిక్షను అనుభవిస్తున్నాడు. – నిర్మలారెడ్డి -
రెడ్ హ్యాండెడ్
ఎక్కడి నుంచో ఏడుపు. పిల్లాడి ఏడుపు. గుక్కపట్టి ఏడుస్తున్న ఏడుపు. గుండెల మీద బాదుతున్న ఏడుపు. జైలు గదిలో అతడు ఉలిక్కిపడి లేచాడు. చిన్న నేరమే అనుకున్నాడు. కానీ... జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లి. సాయంకాలం. పోలీస్స్టేషన్కు ఒకతను వచ్చాడు. ఆందోళనగా ఉద్వేగంగా ఉన్నాడు.‘సార్... మా అబ్బాయి కృష్ణ. ఐదేళ్ల పసివాడు. ఇంటిముందు సైకిల్ తొక్కుతున్నాడు. అంతసేపూ వాడి అమ్మ అక్కడే ఉండి లోపలేదో చిన్న పని ఉండి వెళ్లొచ్చింది. చూస్తే వీడు లేడు. అంతటా వెతికాం. ఎక్కడా లేడు. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకొచ్చాం’ అన్నాడు. ‘మీ పేరు’ అడిగాడు ఎస్.ఐ. ‘లక్ష్మయ్య’వెంట అతడి భార్య కూడా వచ్చింది. కంటికి మింటికి ధారగా ఏడుస్తూ ఉంది. పోలీసులు వివరాలు రాసుకున్నారు. లక్ష్మయ్య వెంట వెళ్లిన పోలీసులు అతడి ఇంటి చుట్టుపక్కల ప్రశ్నించారు. అనుమానం ఉన్న చోటల్లా వెతికారు.అందరి సమాధానం ఒకటే ‘మాకు తెలియదు.’ చీకటి పడినా వెతుకుతూనే ఉన్నారు. కానీ, ఆ పసివాడి ఆచూకీ తెలియలేదు. లక్ష్మయ్యకు ఎవరైనా శత్రువులు ఉన్నారా! అనుమానంతో ఈ దిశగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు పోలీసులు.లక్ష్మయ్యకు కిరాణాకొట్టు ఉంది. చిరువ్యాపారి. అతడికి ఆ ప్రాంతంలో మంచివాడన్న పేరుంది. ఎవరితోనూ తగాదాలు లేవు. వ్యాపారంలో ఇబ్బందులూ లేవు. పెళ్లయిన పదేళ్లకు పుట్టాడు కృష్ణ. దాంతో వాడిని కళ్లలో వత్తులు వేసుకొని చూసుకుంటున్నారు తల్లిదండ్రి. సో... ఎవరైనా ఎత్తుకెళ్లే అవకాశం లేదు. మరి ఆ పిల్లాడే ఎటైనా వెళ్లి నూతిలోనో గొయ్యిలోనో పడ్డాడా? ఎందుకంటే వాడు తొక్కిన సైకిల్ అక్కడే ఉంది. ఇలా అనుకుంటూ ఇండ్లు, ఆటస్థలాలు, బావులూ పరిశీలించారు. ఏం తేలలేదు.తిండి తిప్పల్లేకుండా బిడ్డ కోసం పలవరిస్తున్న ఆ తల్లిదండ్రి బాధ చూడలేకపోయారు పోలీసులు. మరుసటి రోజు ఉదయం కిరాణాకొట్టులో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది. లక్ష్మయ్య ఎత్తాడు. మీ పిల్లవాడిని కిడ్నాప్ చేశాం. 5 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఈ విషయం పోలీసులకు చెబితే పిల్లవాడ్ని చంపేస్తాం’... ఆ మాటలు వింటూనే లక్ష్మయ్య హడలిపోయాడు.‘అయ్య, పిల్లవాడిని ఏమీ చేయద్దు. మీరడిగిన డబ్బు ఎలాగోలా ఇచ్చుకుంటా!’ మొరపెట్టుకున్నాడు. పిల్లవాడి ఆచూకీ గురించి వాకబు చేయడానికి అప్పుడే అక్కడకు వచ్చిన ఎస్సై లక్ష్మయ్య ద్వారా విషయం అంతా విన్నాడు. ‘భయపడకండి. వాళ్లు చెప్పిన టైమ్కి చెప్పిన చోటుకి మీరు డబ్బుతో వెళ్దురుగానీ’ ధైర్యం చెప్పాడు. పోలీసులు ఇచ్చిన ‘సూట్కేసు’ను తీసుకొని కిడ్నాపర్ చెప్పిన చోటుకి వెళ్లాడు లక్ష్మయ్య.పోలీసులు మఫ్టీలో లక్ష్మయ్యను అనుసరించారు.కొంత దూరంలో పనులు చేస్తున్నట్టు ఉండిపోయారు. కిడ్నాపర్ చెప్పిన చోట సూట్కేస్ను ఉంచాడు లక్ష్మయ్య. పనులు నటిస్తూ లక్ష్మయ్య వెళ్లినవైపే చూస్తున్న ఎస్సైకి కాసేపటికి ఓ వ్యక్తి తమ ముందు నుంచే నడిచి వెళ్లడం చూశాడు. మామూలు వ్యక్తిగానే అనిపించాడు. అతని చేతి నుంచి ఏదో జారి కింద పడింది. ఎర్రటి రంగులో ఉన్న రిబ్బన్. దాన్ని ఆ వ్యక్తి తిరిగి తీసుకుని చేతికి చుట్టుకున్నాడు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కట్టెలున్న ఒక బండి అటుగా వెళ్లింది. ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతకుమించి ఎవరూ రాలేదు. అంతగా సంచారం ఉండని చోటు కాబట్టే కిడ్నాపర్లు ఈ ప్లేస్ చెప్పినట్టున్నారు అనుకున్నారు పోలీసులు.చీకటి పడేవరకు అక్కడే ఉన్నారు కానీ ఎవరూ ఆ సూట్కేసును తీసుకువెళ్లడానికి రాలేదు. చూసి చూసి తిరుగు ముఖం పట్టారు లక్ష్మయ్య, పోలీసులు. కిరాణ కొట్టులో ఉన్న ఫోన్ మోగింది.లక్ష్మయ్య ఫోన్ ఎత్తాడు. ‘నువ్వు పోలీసులకు చెప్పలేదు. నిన్ను నమ్మాం. నిన్ను పరీక్షించడానికే మేం అక్కడికి రాలేదు. రేపు సాయంకాలం మొదటి ఆట సినిమా మొదలవగానే శ్రీనివాస థియేటర్ దగ్గరకు డబ్బులు తీసుకొని రా! అక్కడ మేం చెప్పిన చోట ఆ సూట్కేస్ ఉంచి వెళ్లిపో! సూట్కేస్ తీసుకున్నాక పిల్లవాడిని మీ ఇంటి వద్ద వదులుతాం’ అన్నార‘సరే!’ అన్నాడు లక్ష్మయ్యకిడ్నాపర్లు చెప్పిన టైమ్కి శ్రీనివాస థియేటర్కి చేరుకున్నాడు లక్ష్మయ్య.ఫోన్లో చెప్పిన సమాచారం మేరకు థియేటర్కి ఓ పక్కగా ఉన్న జనరేటర్ దగ్గర సూట్కేస్ ఉంచి బయటకు వచ్చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు అటే చూస్తున్నారు. సూట్కేసును తీసుకెళ్లడానికి వచ్చినవారిని పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు గొడవపడుతూ వచ్చారు. గట్టిగట్టిగా అరుచుకుంటున్నారు. ఉన్నట్టుండి కొట్టుకోవడం మొదలుపెట్టారు. వారిని విడదీయడానికి అక్కడున్న జనం గుమికూడడం వెంటవెంటనే జరిగిపోయాయి.జనరేటర్కి పోలీసులకు మధ్య జనం. జనం సర్దిచెప్పడంతో ఆ ఇద్దరూ కాసేపటికి దూరం జరిగారు. జనరేటర్ దగ్గరున్న సూట్కేస్ పోలీసులకు కనిపించలేదు. గొడవపడుతున్న వారిద్దరిని పరిశీలనగా చూశాడు ఎస్.ఐ. అనుమానంగా అనిపించలేదు. కాని ఒక్క క్షణం మళ్లీ గమనించాడు. అందులో ఒక మనిషి చేతికి మణికట్టు మీద ఎర్ర రిబ్బన్ ఉంది. ఎర్ర రిబ్బన్. క్షణం ఆలస్యం చేయలేదు. పులిలా లంఘించి అతన్ని పట్టుకున్నాడు. తోడుగా నాటకం ఆడిన మరో వ్యక్తిని కూడా. ‘మాకేం తెలియదు సార్! అసలు ఆ పిల్లవాడెవరు? మేమెందుకు కిడ్నాప్ చేస్తాం! మా ఇద్దరికి డబ్బులకు సంబంధించిన సమస్య ఉంది. అందుకే గొడవపడ్డాం’ అన్నారు ఇద్దరూ.‘నిన్న.. ఎర్రటి రిబ్బన్ సూట్కేసును వెతుక్కుంటూ అక్కడికొచ్చింది. ఈ రోజు ఈ ఎర్రటి రిబ్బన్ ఇక్కడ గొడవపడుతుంది. మా కంతా తెలిసిపోయింది. అనవసరంగా తాత్సారం చేయకుండా విషయం చెప్పేస్తే ఎక్కువ కష్టపడరు. మా సహనాన్ని పరీక్షించద్దు’ అన్నారు పోలీసులు. విచారణలో విషయం అంతా విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు.‘ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసింది నేనే సార్’ అన్నాడు ఎర్రటి రిబ్బన్ కట్టుకున్న వ్యక్తి. అతని పేరు కిశోర్.‘నాకు సాయపడింది నా స్నేహితులు’ అన్నాడు. తోడుగా గొడవ పడిన వ్యక్తి కాకుండా సూట్కేసుతో ఉడాయించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు క్షణాల్లో పట్టుకొచ్చారు. మొత్తం ముగ్గురు చేసిన పని. కిశోర్ వివరాలు చెప్పడంమొదలుపెట్టాడు...ఓ రోజు టౌన్ నుంచి మా అక్కవాళ్లింటికి వచ్చాను. సిగిరెట్ కొనుక్కోవడానికి లక్షయ్య షాప్ ముందు ఆగాను. మధ్యాహ్న సమయం. కొట్టు దగ్గర లక్ష్మయ్య ఒక్కడే ఉన్నాడు. సిగరెట్ తీసివ్వడానికి అతను వెనక్కి తిరిగాడు. గల్లాపెట్టెలో డబ్బులు బాగా కనిపించాయి. నా చేయికి అందినంత తీసుకున్నాను. అప్పుడే లక్ష్మయ్య నన్ను చూశాడు. నన్ను తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడు. ఊళ్లో వాళ్లను పిలిచి వారందరి ముందు నన్ను తిట్టాడు. దొంగ అన్నాడు. నాకు చాలా అవమానం వేసింది. సిగ్గుతో చచ్చిపోయాను. అప్పటికి వెళ్లిపోయాను. ఈ సంఘటన జరిగి ఆరునెలలకు పైగానే అయ్యింది. అందరూ మర్చిపోయుంటారు. కానీ, నేను మర్చిపోలేదు. మొన్న మళ్ళీ ఈ ఊరికి వచ్చాను. లక్ష్మయ్య కంటపడ్డాడు. తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. కొట్టుకు కొంత దూరంలో ఉన్న వీళ్ల ఇంటి ముందు పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. వాడిని దూరం చేస్తే వీడికి తగిన శాస్తి కలుగుతుందని అనుకున్నాను. ఎత్తుకెళ్లిపోయాను’ అన్నాడు. ‘మరి, ఆ పిల్లవాడిని ఎక్కడ ఉంచారు?’‘చంపేశాను’‘వ్వాట్...!’ ‘అవున్సార్! వాణ్ణి చంపేస్తే నా పగ తీరుతుందనుకున్నాను. నా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఆ పిల్లవాడి గొంతు పిసికి చంపేశా. ఓ ఇంకుడుగుంత ఖాళీగా కనిపించింది. దాంట్లో పిల్లవాడిని వేసి, మట్టితో కప్పేశాం..’‘పిల్లవాడిని చంపేసింది చాలక డబ్బులు ఎందుకు డిమాండ్ చేశావ్!’‘లక్ష్మయ్యకు కొడుకు బలహీనత ఉంది కాబట్టి, క్యాష్ చేసుకుందామనుకున్నాను’ అన్నాడు కిశోర్. కిశోర్ చెప్పిన ఇంకుడుగుంత దగ్గర తవ్వించారు. పిల్లవాడి బాడీని వెలికి తీసి, పోస్ట్మార్టం చేసి తల్లిదండ్రికి అప్పగించారు. ఆ తల్లిదండ్రి కడుపుకోత ఎవరూ తీర్చలేనిది. పసివాడిని కిడ్నాప్ చేసినందుకు, చంపినందుకు, డబ్బుల కోసం వేధించినందుకు... నిందితులను జైలుకు పంపించారు పోలీసులు. పసివాడిని మట్టుపెట్టునందుకు జీవితఖైదును అనుభవిస్తున్నారు వారిప్పుడు. తాము చేసిన నేరం ఎవరికీ తెలియదనుకున్నారు. కానీ, చేతికి చుట్టుకున్న ఓ ఎర్రరిబ్బన్ కూడా తమని పోలీసులకు పట్టిస్తుందని, కటకటాల వెనక్కి నెడుతుందని గుర్తించలేకపోయారు. – నిర్మలారెడ్డి -
ఆగని అపహరణలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరిగింది.. సామాజిక మాధ్యమాలు అవగాహన కూడా కల్పిస్తున్నాయి.. అయినా చిన్నారుల అపహరణలు ఆగడంలేదు. పైగా మరింతగా పెరుగుతున్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. 2016లో ఏకంగా 54,723 మంది చిన్నారులు కిడ్నాప్ అయ్యారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. ఇంత భారీస్థాయిలో అపహరణలు జరిగినా.. దాఖలైన కేసులు(ఎఫ్ఐఆర్) కేవలం 40.4 శాతమే. ఈ కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొని, శిక్షపడిన కేసులు కేవలం 22.7 శాతమే. 2015లో 41,893 కేసులు నమోదు కాగా 2014లో 37,854 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాతో గందరగోళం..: ‘చిన్నారుల కిడ్నాప్లకు సంబంధించి చాలా కేసులు తొందరపాటు, సమాచారం లేకపోవడం వల్లే నమోదయ్యాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలే కారణం. పిల్లల్ని అపహరించుకుపోయేవారు తిరుగుతున్నారని, అవయవాల కోసం కిడ్నాప్ చేస్తున్నారంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిని వాట్సాప్, ఫేస్బుక్లలో చూసిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇంటికి రావడం ఏమాత్రం ఆలస్యమైనా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండడం అవసరమే అయినప్పటికీ నిజానిజాలను ముందుగా నిర్ధారించుకోవాల’ని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
ఆనంతపురం: హిందూపురంలో కిడ్నాప్ కలకలం
-
పసికందు కిడ్నాప్ కేసులో మహిళ అరెస్ట్
-
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాపైన పాప సురక్షితం
-
నా కూతురు నాకు కావాలి: విలపించిన తల్లి
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఈ విషయం గురించి సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ‘శిశువును అపహరించిన మహిళ తొలుత బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించాము. అనంతరం ఆమె ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను విచారించగా ఆమె బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగినట్లు చెప్పారు. అక్కడి నుంచి ఆమె ఆటోలో వెళ్ళి ఉండవచ్చని అనుమానిస్తున్నాము. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విచారిస్తున్నాము. కాని ఈ మహిళకు పాత కేసుల్లో ఉన్న వారితో ఎలాంటి పోలికలు లేవ’ని తెలిపారు. అంతేకాక శిశువును అపహరించిన మహిళ పాప తల్లితో మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడిందని, కండక్టర్తో మాట్లాడినప్పుడు మాత్రం కన్నడలో మాట్లాడిందని సీఐ శివశంకర్ చెప్పారు. శిశువును అపహరించిన మహిళను పట్టుకునేందుకు మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏడు తెలంగాణకు చెందినవి కాగా, మరో నాలుగు బీదర్ పోలీసు బృందాలని తెలిపారు. నా కూతురు నాకు కావాలి: తల్లి విజయ ‘ఆ మహిళ నాతో తెలుగులోనే మాట్లాడింది. టీకా వేయించాలని నా కూతుర్ని తీసుకెళ్లింది. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురు నాకు కావాలి, ఎక్కడ ఉన్నా నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి’ అంటూ బాలిక తల్లి విజయ కన్నీరుమున్నీరైంది. -
కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్
-
ఆయాలా వచ్చి శిశువు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నవజాత శిశువు అపహరణకు గురైంది. ఇటీవల నిలోఫర్లో శిశువు కిడ్నాప్ ఘటన మరిచిపోక ముందే సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మరో పసికందు అపహరణకు గురైంది. ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని బాలింతను నమ్మబలికి శిశువుతో ఉడా యించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సబావతి విజయ కాన్పు కోసం జూన్ 21న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. జూన్ 27న సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆయానంటూ పరిచయం చేసుకొని... తల్లీబిడ్డలను ఆస్పత్రి నుంచి మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనుండగా సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ తనను తాను ఆయాగా పరిచయం చేసుకొని బాలింత విజయ వద్దకు వచ్చింది. ఆమెతో చనువుగా మాట్లాడింది. పాపకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువును వెంటతీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆ మహిళ శిశువును తీసుకురాకపోవడంతో విజయ తన భర్త నారీకి విషయం చెప్పింది. ఆయన ఆస్పత్రి పరిసరాలన్నీ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. మహిళా కిడ్నాపర్ బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఏడు పోలీసు బృందాల్లో మూడు బృందాలు బీదర్ వెళ్లాయి. సీసీ ఫుటేజీ దృశ్యాలను ఇతర పోలీస్ స్టేషన్లకు పంపినట్లు సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్రావు తెలిపారు. అడుగడుగునా అదే నిర్లక్ష్యం... ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన నిఘా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల పిల్లలు తారుమారు కావడం, అపహరణకు గురికావడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రి నుంచి చికిత్స కోసం నిలోఫర్కు తీసుకొచ్చినఓ శిశువు అపహరణకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆయా ఆస్పత్రుల్లో భద్రతను రెట్టింపు చేసింది. వైద్యులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల ప్రధాన ద్వారాల వద్ద పోలీసు ఔట్పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయితే పలుచోట్ల సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీనికితోడు సెక్యురిటీ కాంట్రాక్టు దక్కించుకున్న ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ... నిర్ధేశించిన దానికంటే తక్కువ మందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెక్యురిటీ గార్డులకు నెల నెలా వేతనాలు చెల్లించకపోవడంతో వారు రోగుల వద్ద చేతివాటానికి పాల్పడుతున్నారు. రూ. పది చేతిలో పెడితే చాలు తనిఖీలు లేకుండానే లోనికి అనుమతిస్తున్నారు. ఇది అగంతకులకు అవకాశంగా మారింది. ఎప్పటికప్పుడు ఆయా విభాగాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కూర్చున్న చోటి నుంచి కదలకపోవడం కూడా ఇందుకు మరో కారణం. -
పరిటాల అనుచరుల రౌడీరాజ్యం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు భాస్కర్ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్ టౌన్ పీఎస్కు బదిలీ చేశారు. పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. -
పరిటాల అనుచరుల దౌర్జన్యం..
-
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
-
అదృశ్యమైన కాసేపటికే శవమై కనిపించింది
-
ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం
కణేకల్లు : ఓ ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం చేరవేయడంతో 45 నిమిషాల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. రాయదుర్గానికి చెందిన యువతి కణేకల్లు మండలం ఆలూరులోని ప్రైవేట్ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. విధినిర్వహణలో భాగంగా గురువారం ఉదయం 7గంటలకు రాయదుర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. సరిగ్గా 7.40గంటలకు ఆలూరు వద్ద బస్సు దిగి స్కూలు వద్దకు నడుచుకుంటూ వెళుతోంది. కణేకల్లులోని ద్విచక్రవాహన షో రూం యజమాని ముగ్గురు స్నేహితులతో కలిసి ఏపీ31 సీజే 2349 నంబర్ గల ఇన్నోవా కారులో వచ్చి టీచరును బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారు. నన్ను కాపాడండి అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంకా ముందుకు కదలని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు గమనించి వచ్చేలోపు కారు స్పీడుగా వెళ్లిపోయింది. వెంటనే జరిగిన విషయాన్ని ఎస్ఐ రామరావుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఆయన సమీపంలోని బెళుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గంతోపాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లనూ అప్రమత్తం చేశారు. దుండగులు కణేకల్లువైపు వచ్చి షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద కుడివైపున కొత్తపల్లి మీదుగా వెళ్లారు. కళ్యాణదుర్గం వెళ్లే అవకాశముండటంతో అక్కడి పోలీసులు వాహనానికి ఎదురుగా వచ్చారు. అంతలోనే రాయదుర్గం ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వాహనాన్ని ఛేజ్ చేయగా.. రమనేపల్లి వద్ద దుండగులు పట్టుబడ్డారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ రామరావులు ఘటనస్థలానికెళ్లిన దుండగులను అదుపులో తీసుకున్నారు. అక్కడే గంటన్నర సేపు విచారణ చేపట్టారు. అనంతరం కణేకల్లు పోలీసుస్టేషన్కు బాధితురాలిని, కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని తీసుకొచ్చారు. కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ క్లీన్చిట్ ప్రైవేట్ స్కూల్ టీచర్ది కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ వెంకటరమణ క్లీన్చిట్ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్.. సదరు అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే అబ్బాయికి ఇదివరకే పెళ్లయ్యిందని, భార్యకు విడాకులిస్తున్నాడని తెలిపారు. రెండో పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడేందు కోసమే టీచర్ను కారులో తీసుకెళ్లాడని చెప్పారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ టీచర్ కూడా చెప్పడంతో కేసును ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇరువురి స్టేట్మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్లను ఇళ్లకు పంపారు. భారీ ప్యాకేజీ! కిడ్నాప్ ఘటన విషయమై ఓ మంత్రి సోదరుడు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. కిడ్నాప్ చేసినోడు తమకు కావల్సిన వాడేనని కేసుల్లాంటివి లేకుండా చూడాలని హకుం జారీ చేసినట్లు తెల్సింది. అంతేకాక ఈ కేసులో హెల్ప్ చేసిన పోలీసులకు మంత్రి సోదరుడు కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని నుంచి భారీ ప్యాకేజీ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ రామరావును వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. -
అడవిలో అదృశ్యం
మూడు దిక్కులు అబద్ధాలు చెబుతున్నాయి ఒక దిక్కు కనపడ్డం లేదు ఆ భార్య ఇప్పుడు ఏం చేయాలి? క్రిమినల్స్ కనికట్టు చేస్తారు అది వాళ్ల పని. ఆ కనికట్టులో ఉన్న కట్టును విప్పడమే స్మార్ట్ పోలీస్ పని. మానవ హక్కుల సంఘం నిర్వహించిన ప్రెస్మీట్. నిందితులు ముగ్గురూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. పొదయ్యను కిడ్నాప్ చేసింది మావోయిస్టులు కాదు పోలీసులు అయి ఉంటారని వాళ్ల తాజా స్టేట్మెంట్. అవును. మూడు దిక్కుల నుంచి అబద్ధాలు వినపడుతున్నాయి. నాలుగో దిక్కు చీకటిగా ఉంది.వెలుతురు ఎప్పుడు వస్తుంది.ఆమె ఏమి చేయాలి?మొగుడూ పెళ్లాల మధ్య ఉన్న ప్రేమ వాళ్లు ఒకరికొకరు దూరమైనప్పుడే బయటకు వస్తుంది కాబోలు. ఇప్పుడు ఆమెలో అటువంటి ప్రేమ, ఆతురత, అక్కర కనిపిస్తున్నాయి. ఆందోళన, భయం కూడా ఉంది. ఆమెకు సమాధానం కావాలి. సమాధానంచెప్పాల్సింది పోలీసులు.‘ఏం కావాలమ్మా?’ కానిస్టేబుల్ అడిగాడు.స్టేషన్ వాతావరణం చూసి ఆమె భయపడకుండా ఉండేలా అతడు గొంతులో స్నేహాన్ని ప్రదర్శించాడు.‘అయ్యా... మా ఆయన..’ ఆమె ఏదో చెప్పబోతుండగా లంచ్కి వెళ్లిన సీఐ ప్రసాద్ అప్పుడే స్టేషన్కు వచ్చాడు. ఆమె చూసి కానిస్టేబుల్తో ‘ఏంటి విషయం’ అడిగాడు. ‘అదే అడుగుతున్నాను సార్! ఏంటో నీ విషయం పెద్ద సారుకు చెప్పు’ అన్నాడు కానిస్టేబుల్ టేబుల్ మీద ఫైళ్లు సరిగ్గా పెడుతూ. ఆమె రెండు చేతులు కట్టుకుంది. ముప్పై ఐదేళ్లు ఉంటాయి. ‘సారూ.. నా పేరు ముత్తమ్మ. మా ఇంటాయన నెల రోజుల్నుంచి కనిపించడం లేదు. నా మీద అలిగి సుట్టాలింటికి Ðð ళ్లాడేమోలే అని అనుకున్నా. సుట్టాలింట్లోనూ లేడని తెలిసింది. ఊరోళ్లు తలో మాట చెబుతున్నారు. నాకేమీ తెలియడం లేదు. మాకిద్దరు చిన్న పిల్లలున్నారయ్యా.. నాయిన మీద బెంగెట్టుకున్నారు! మా ఆయన ఏడున్నాడో మీరే కనుక్కొని చెప్పండి’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది.సీఐ కానిస్టేబుల్ వైపు చూశాడు. అప్పటికే అతడు ముత్తమ్మ దగ్గర నుంచి వివరాలు రాసుకోవడం మొదలుపెట్టాడు. మిస్సింగ్ కేస్. తేదీ: 20 నవంబర్, 2004పేరు: మిడియం పొదయ్యవయసు : 40గ్రామం: గోపాలపురం, చింతూరు మండలం, తూ.గో.జిల్లా.పని: పోడు వ్యవసాయంముత్తమ్మను పంపించేశాక సి.ఐ ఆలోచనలో పడ్డాడు– పొదయ్య ఏమైనట్టు అని. మరుసటి రోజు ఉదయం.సీఐ, ఎస్ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గోపాలపురం వెళ్లారు. పోలీసుల జీప్ శబ్దం, బూట్ల అలికిడికి ఊరు కుతూహలంగా, భయంగా సమీపించింది.‘పొదయ్య ఎక్కడ?’ సి.ఐ అడిగారు.అందరూ మౌనంగా ఉన్నారు.‘చివరిసారి ఎవరు చూశారు... ఎవరితో చూశారు?’ మళ్లీ అడిగారు.పొదయ్య కాలు కుదురుగా నిలవని మనిషి. ఎప్పుడు ఎటు వెళతాడో ఎవరికీ తెలియదు. చివరిగా ఎప్పుడు కనిపించాడో ఎవరికీ గుర్తు లేదు. ఎంత సేపున్నా ఏం తెలిసేలా లేదు. ఇంకాసేపట్లో జీపు కదలబోతోంది. ఆ ఊళ్లోని చెంచులయ్య వచ్చి ‘సార్ అతగాడు గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలతో వెళ్లడం నేను చూశా’ అన్నాడు.‘వాళ్లెవరు?’ సి.ఐ అడిగాడు.‘పొదయ్య నేస్తులే’ అన్నాడు చెంచులయ్య. ఊళ్లో వాళ్లు అవునన్నారు.ఆ ముగ్గురినీ పిలిపించారు పోలీసులు. ‘పొదయ్య ఎక్కడ?’ అడిగాడు సీఐ. ‘మాకేం తెలుసు సారూ!’ అన్నారు ముగ్గురూ. ‘ఈ ముగ్గురునీ జీపెక్కించండి’ అన్నాడు సీఐ..వచ్చినంత వేగంగా ఆ ముగ్గురినీ జీపులోకెక్కించుకొని పోలీసుస్టేషన్కి తీసుకెళ్లారు. ఇంటరాగేషన్ మొదలయ్యింది. ‘పొదయ్య ఎక్కడ..’ పోలీసులు అడుగుతూనే ఉన్నారు. వాళ్లు హాహాకారాలు చేస్తున్నారు.‘మాకేం తెలియదు సారూ. ఆ రోజు రాత్రి పొదయ్య మా వెంట ఉన్నాడు నిజమే. మేమంతా ఊరి బయట ఉన్న గుట్ట దగ్గర మందు కొట్టాం. అప్పుడే ‘అన్నలు’ (మావోయిస్టులు) బిలబిల వచ్చారు. పొదయ్యతో పాటు మా నలుగురు కళ్లకు గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లిపోయారు. ఆ రోజంతా వాళ్లతోపాటే ఉంచుకున్నారు. మేం ముగ్గురం వదిలిపెట్టమని వాళ్ల కాళ్లావేళ్లా పడ్డాం. పొదయ్య మాత్రం ఏమీమాట్లాడలేదు. తర్వాత ఏమనుకున్నారో ఏమో మా ముగ్గురినీ విడిచిపెట్టారు. పొదయ్యను వాళ్ల వెంట తీసుకెళ్లిపోయారు. అంతకు మించి మాకేం తెలియదు సారూ. మమ్మల్ని నమ్మండి’ అన్నారు.పోలీసులు షాక్ అయ్యారు. పొదయ్యను మావోయిస్టులు తీసుకెళ్లారా? మావోయిస్టులు ఇన్ఫార్మర్లను లిఫ్ట్ చేయడం ఆనవాయితే. పొదయ్య ఇన్ఫార్మరా? వీళ్ల మాటల్ని ఎలా నమ్మాలి. లాఠీలకు పని చెప్పారు. గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలు పెడబొబ్బలు పెట్టారు. రెండు మూడు రోజులకు ఈ విషయం బయటకు పొక్కింది. మానవ హక్కుల సంఘానికి సమాచారం అందింది. అమాయకులను పట్టుకుని హింసిస్తున్నారని అంతటా పోలీసులపై విమర్శలు ప్రారంభమయ్యాయి.వీళ్లు అమాయకులైతే నిందితులు ఎవరు? పొదయ్య ఏమయ్యాడు. క్లూ ఏమిటి? మరుసటి రోజు బాంబు పేలింది. మానవ హక్కుల సంఘం నిర్వహించిన ప్రెస్మీట్. నిందితులు ముగ్గురూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. పొదయ్యను కిడ్నాప్ చేసింది మావోయిస్టులు కాదు పోలీసులు అయి ఉంటారని వాళ్ల తాజా స్టేట్మెంట్.‘సార్, మీకూ తెలుసు కదా. మన పక్కనే బలిమెల వద్ద (ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతం) జరిగిన మావోయిస్టుల దాడిలో 36 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది చనిపోయారు. ఈ అటాక్కు సమాచారం అందించాడన్న అనుమానంతో పోలీసులే పొదయ్యను కిడ్నాప్ చేసుంటారు. నేరాన్ని మా మీద నెట్టి వీళ్లు తప్పించుకోవాలని చూస్తున్నారు’ అన్నాడు లక్ష్మయ్య.అటూ ఇటూ తిరిగి ఈ పిడిగు తమ మీద పడటంతో పోలీసులు ఖంగు తిన్నారు. ప్రెస్లో అంతా గోలగోల అయ్యింది. పొదయ్య ఏమయ్యాడో తేలలేదు. గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్య వాళ్ల పనుల్లో వాళ్లు పడ్డారు. ముత్తవ్వ ఆమె పిల్లలు పొదయ్య రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెండున్నర నెలలు గడిచిపోయాయి పొదయ్య కనిపించక. పై అధికారుల నుంచే కాదు బయట నుంచి కూడా ఒత్తిడి పెరిగింది– పోలీసులు దాచిపెట్టిన పొదయ్యను బయటకు తీసుకురావాలని. ఈలోపు పోలీసులు ఎందుకైనా మంచిదని గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యల మీద నిఘా పెట్టారు. పెద్దగా ఏమీ దొరకలేదు. ముగ్గురి ఇళ్లల్లో హటాత్ మరణాలు సంభవించాయి. అవన్నీ అనారోగ్య మరణాలే. కనుకవాటికీ పొదయ్యకు సంబంధం ఉండే అవకాశం లేదు. కనుక వీళ్లు అమాయకులే అయి ఉండాలి. మరైతే పొదయ్య ఏమైనట్టు? మావోయిస్టులే చంపేసి ఉండాలి.అప్పుడే మావోయిస్టుల నుంచి ఓ లేఖ మీడియాకు చేరింది. ‘పొదయ్య అదృశ్యానికీ మాకూ ఎలాంటి సంబంధం లేదు’ అని ఉంది అందులో. అంతే. పోలీస్ జీప్ రయ్యిన గోపాలపురం వైపుగా దూసుకెళ్లి్లంది. గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలను అరెస్ట్ చేశారు. వాళ్లు చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. మూఢవిశ్వాసాలు ఇంత పని చేస్తాయా? ‘పొదయ్యకు చేతబడి వచ్చు. మంత్రాలు, పూజలు విపరీతంగా చేస్తాడు. మా అక్క కొడుకు పొదయ్య చేతబడి చేయడం వల్లే చనిపోయాడు. అందుకే వాడ్ని మట్టుపెటాలనుకున్నాను’ అన్నాడు గంగయ్య. ‘మా దగ్గరి సుట్టాల్లో ముగ్గురు పొదయ్య చేతబడి వల్ల చచ్చిపోయారు. అదీ నెల తేడాతోనే. పొదయ్య బతికుంటే చేతబడితో ఇంకెంతమందిని చంపుతాడో అని మేమే∙చంపాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు లక్ష్మయ్య, ముత్తయ్య. ‘మూడు నెలల కిందట ఓ రోజు చీకటి పడుతుండగా పనుందంటూ పొదయ్యను గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి తీసుకెళ్లాం. అక్కడే కర్రలతో కొట్టి చంపేశాం. తర్వాత శవాన్ని బండరాళ్ల నడుమ పడేసాం’ చెప్పారు ముగ్గురూ!తాము పట్టుబడకండా వుండేందుకు ఓసారి మావోయిస్టులు, మరోసారి పోలీసులు కిడ్నాప్ చేసారని కేసును తప్పుదోవ పట్టించామని ముగ్గురూ నేరం అంగీకరించారు. తమకు సంబంధం లేదంటూ మావోయిస్టులు రాసిన లేఖ క్లూ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమను ముప్పుతిప్పలు పెట్టిన నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేసారు. మరుసటి రోజు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడి బండరాళ్ల నడుమ లభ్యమైన పొదయ్య అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. – మొహమ్మద్ షౌకత్ అలీ, సాక్షి ప్రతినిధి, చింతూరు, తూర్పుగోదావరి జిల్లా, -
ప్రాణం తీసిన డేటింగ్ ఆప్
న్యూ ఢిల్లీ : ఈ నెల 22న కిడ్నాప్కు గురయిన ఢిల్లీ విద్యార్థి ఆరు రోజుల తర్వాత బుధవారం నాడు శవమై కనిపించాడు. ఈ కిడ్నాప్-మర్డర్ కేసును పరిష్కరించినట్లు, ఈ కేసులో 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ అజయ్ చౌదరి కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మృతి చెందిన 21 సంవత్సరాల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆయుష్ నౌథియాల్కు డేటింగ్ ఆప్ ద్వారా సాంప్లింగ్ మేనేజర్గా పనిచేస్తున్న ఇష్తాక్ అలీతో పరిచయం ఏర్పడింది. విద్యార్థి మరణించడానికి 10 రోజుల ముందు అతడిని కలిసాడు. ఈ సంఘటన జరిగిన రోజు అనగా మార్చి 22 మధ్యాహ్నం ఇద్దరు కలిసి భోజనం చేయడానికి ద్వారకా సెక్టార్ 13వద్ద కలుసుకున్నారు. అదే రోజు రాత్రి వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగింది. కోపంతో విద్యార్థిని ఇష్రత్ సుత్తితో కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ద్వారకా సెక్టార్ 13వద్ద ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తర్వాత ఆయుష్ నౌథియాల్ తండ్రికి వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి మీ కుమారున్ని కిడ్నాప్ చేశానని, రూ.50 లక్షలు ఇస్తే వదిలిపెడతానని బెదిరించాడు. ఆయుష్ నౌథియాల్ కాళ్లు, చేతులు కుర్చికి కట్టివేసి ఉన్న ఫోటోను కూడా పంపించాడు. తన కుమారుడు కాలేజీ నుంచి సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి మార్చి 22నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తనకు వచ్చిన వాట్సాప్ కాల్ గురించి, 50 లక్షలు డిమాండ్ చేసిన విషయం గురించి కూడా పోలీసులకు చెప్పాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆయుష్ నౌథియాల్ గురించి చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా అతన్ని మెక్డొనాల్డ్స్ వద్ద చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా దానిలో ఆయుష్ నౌథియాల్తో పాటు ఇష్తాక్ కూడా ఉన్నాడు. ఇష్తాక్ను పట్టుకోవడానికి పోలీసులు ఆయుష్ నౌథియాల తండ్రితో డబ్బులు ఇస్తామని అతడికి ఫోన్ చేయించి ఉత్తమ్నగర్ రమ్మని చెప్పారు. కానీ అతడు రాలేదు. తర్వాత నుంచి అతడి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. చివరకు గురువారం నాడు పోలీసులు ఇష్తాక్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నేరస్తుడు హత్య కేసును కిడ్నాప్ కేసుగా చిత్రించి పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కిడ్నాపర్కు ఇవ్వడానికి 10 లక్షల రూపాయలను సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా పోలీసులు తమకు సూచించారని ఆయుష్ నౌథియాల కుటుంబ సభ్యులు ఒక న్యూస్ పేపర్తో చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయుష్ నౌథియాల్ చనిపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. -
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
రెచ్చిపోయిన మానవమృగాలు
పినపాక: ఓ గిరిజన బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు శనివారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపింది. పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక(15) ఎనిమిదో తరగతి చదువుతూ 4 నెలల క్రితం మధ్యలోనే మానేసింది. తల్లి వెంకటమ్మతో కలసి కూలి పనులకు వెళుతోంది. ఈ నెల 11న తన పుట్టిన రోజు సందర్భంగా చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేందుకు షాపు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి జానంపేట అమరారం శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారితోపాటు మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి మరో నలుగురు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై దుగినేపల్లి పంచాయతీ శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడా మరో నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అమరారంలోని ఒక ఇంట్లో ఉంచారు. 12న ఉద యం ఐదు గంటలకు మెలకువ వచ్చిన బాలిక జానంపేట నుంచి నేరుగా భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వెంకటమ్మ 14న ఏడూళ్ల బయ్యారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో కలిసి పినపాక మండలం పాండురంగాపురం వచ్చి విషయం తల్లికి చెప్పింది. ఈ ఘటనపై ఏఎస్ఐ కె.లక్ష్మయ్యను వివరణ కోరగా.. బాలిక ఆచూకీ కనిపించడం లేదని వెంక టమ్మ 14న ఫిర్యాదు చేసిందని, దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోరగా కేసు వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చచ్చేవరకూ జైల్లోనే..
2016 మార్చి 16.. నగరాన్ని కుదిపేసిన ఓ సంఘటన.. అభంశుభం తెలియని ‘అభయ్’ అనే పదోతరగతి విద్యార్థి దారుణ హత్య.. సినీ ఊహల్లో తేలియాడుతూ.. తమ కోర్కెలను నెరవేర్చుకునేందుకు ముగ్గురు యువకులు కలిసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. తొలుత స్నేహం చేసి.. తర్వాత మాటలతో మభ్యపెట్టి ఆ విద్యార్థిని గదికి తీసుకెళ్లి ప్రాణం తీశారు. పోలీసులకు సవాలు విసిరిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ శాఖ అధికారులు తక్కువ సమయంలోనే హత్యకు పాల్పడిన ఐ.శేషుకుమార్ అలియాస్ సాయి, పి.రవి, ఎన్.మోహన్ను అరెస్టు చేసి బోనులో నిలబెట్టారు. 2018 జనవరి 25.. అత్యంత పాశవికంగా అభయ్ ప్రాణం తీసిన ముగ్గురినీ నాంపల్లి న్యాయస్థానం దోషులుగా తేల్చింది. హంతకులను చచ్చేదాకా జైల్లోనే (యావజ్జీవ శిక్ష) ఉంచాలని కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. సాక్షి,సిటీబ్యూరో: సినిమాలపై ఆసక్తితో, వాటి స్పూర్తితో పదో తరగతి విద్యార్థి అభయ్ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను బతికున్నన్నాళ్లు జైల్లోనే ఉంచాలని నాంపల్లి న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందిన ముగ్గురు నిందితులు సినిమాల్లో చేరాలనే ఆశతో, ఓ సినిమా ఇచ్చిన ఐడియాతో కిడ్నాప్ ప్లాన్ చేశారని పోలీసులు తేల్చా రు. అనుకోని పరిస్థితుల్లో అభయ్ తమ చేతిలో చనిపోవడంతో మృతదేహంతో సహా పారిపోవాలనుకున్నా సాధ్యంకాకపోవడంతో మృతదేహాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వదిలేసి రైలులో తప్పించుకున్నారని చార్జ్షీట్ లో పేర్కొన్నారు. 2016 మార్చిలో చోటు చేసుకున్న ఈ çఘాతుకానికి సంబంధించిన కేసును షాహినాయత్గంజ్ పోలీసులు ప్రత్యేక ట్రయల్ నిర్వహించేలా కోర్టు నుంచి అనుమతి పొం దడంతో 22 నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాంచీలో కలిసిన నిందితులు... తూర్పు గోదావరి జిల్లా కుటుకలూరు, శ్రీకాకుళం జిల్లా జడుపల్లి, రత్తకన్న ప్రాంతాలకు చెందిన ఐ.శేషుకుమార్ అలియాస్ సాయి, పి.రవి, ఎన్.మోహన్ రాంచీలోని ఓ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఉద్యోగంలో ఆశించిన సంపాదన లేకపోవడంతో ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. తరచు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ చూసే వీరికి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. రాంచీ తర్వాత ఒడిశాలోని బరంపురం, ఆదిలాబాద్ల్లోనూ పని చేసిన సాయి కార్తికేయ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ వచ్చాడు. 2015 ఆగస్టులో గోషామహల్ జ్ఞాన్బాగ్ కాలనీకి చెందిన వృద్ధుడు హనుమాన్ దాస్కు సపర్యలు చేసేందుకు నెలకు రూ.7వేల జీతానికి కుదిరాడు. కాలనీలో పిల్లలతో కలుపుగోలుగా ఉండే సాయి రాజ్కుమార్ కుమారుడు అభయ్ మోదానీతో సన్నిహితంగా ఉండేవాడు. ఫేస్బుక్ పరిచయం చూపిన ‘మార్గం’... అతడికి ఫేస్బుక్ ద్వారా బాలు పౌల్ అనే నటుడితో పరిచయం ఏర్పడింది. ‘కుర్ర తుఫాన్’ అనే సినిమాలో నటించిన అతడిని నేరుగా కలిసిన సాయి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లే మార్గాన్ని చెప్పమని కోరారు. ఇందులో రాణించడానికి నటనతో పాటు డబ్బు కూడా ఉండాలంటూ బాలు పౌల్ చెప్పడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చేరదామంటూ రవి, మోహన్లకు ఫోన్లు చేసిన సాయి వారిద్దరూ సైతం విశాఖపట్నం, హైటెక్ సిటీ సమీపంలో చేస్తున్న ఉద్యోగాలు వదిలేసేలా చేశాడు. 2016 ఫిబ్రవరి 18 నుంచి పూర్తి స్థాయిలో ‘సినిమా పని’లోనే నిమగ్నమైన వీరు హిందీ నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాయి అదే ఏడాది మార్చి 9న ఉద్యోగం మానేసి వారి వద్దకు చేరాడు. ‘క్రైమ్ కథ’ స్ఫూర్తితో స్కెచ్... సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్న వీరు 2016 మార్చి 14 రాత్రి యూ ట్యూబ్లో ‘ఓ రొమాంటిక్ క్రైమ్ కథ’ అనే సినిమా చూశారు. స్నాచింగ్స్, కిడ్నాపింగ్స్ ద్వారా డబ్బు సంపాదించే ఇతివృత్తంలో సాగే ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే కిడ్నాప్ చేయడం ద్వారా సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. సాయికి అప్పటికే అభయ్తో పరిచయం ఉండటం, అతను తాము ధనవంతులమంటూ పలుమార్లు చెప్పడంతో సాయి.. ఈ విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి అతడిని టార్గెట్గా ఎంచుకున్నారు. అభయ్ను కిడ్నాప్ చేసి తమ గదిలోనే బంధించడం ద్వారా అతడి కుటుంబీకుల నుంచి డబ్బు గుంజాలని పథకం వేశారు. ఇందుకు అవసరమైన టేపు, బోగస్ వివరాలతో రెండు సిమ్కార్డులు, ఓ సెల్ఫోన్ తదితరాలను కొనుగోలు చేశారు. అభయ్ను అపహరించిన తర్వాత ‘క్రైమ్ కథ’లో చూపినట్లే టేపులతో కట్టేసి ‘పని’ పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వద్దని వేడుకున్నా వినలేదు... 2016 మార్చి 16న టిఫిన్ సెంటర్కు వచ్చిన అభయ్ను అక్కడే కలిసిన సాయి.. సమీపంలో ఉన్న తన రూమ్ వద్ద డ్రాప్ చేయాల్సిందిగా కోరారు. కొద్దిదూరం వెళ్లే సరికి అభయ్కి ఫోన్లు రావడంతో డ్రైవింగ్ తీసుకున్న సాయి అతడిని గది వద్దకు తీసుకువెళ్లాడు. అతడు వేడుకున్నా వినకుండా అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న టేపుతో బాలుడి చేతులు వెనక్కు విరిచి కట్టేసిన దుండగులు... అతడి నోటికీ ప్లాస్టర్ వేయాలని భావించారు. టేపు పొరపాటుగా ముక్కు మీదుగా వెళ్లడంతో ఊపిరాడక అభయ్ చనిపోయాడు. దీంతో నిందితులు శవాన్ని అట్టపెట్టెలో పెట్టి ఆటోట్రాలీలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్ళారు. ఆటోడ్రైవర్ వాహనాన్ని రైల్వేస్టేషన్ పార్కింగ్లోకి తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో ‘పార్శిల్’తో సహా ఆల్ఫా హోటల్ వద్ద దిగి, అక్కడే వదిలేశారు. అక్కడి సిమ్కార్డు దుకాణంలో ఎక్కువ మొత్తం చెల్లించి గుర్తింపు కార్డులు లేకుండానే సిమ్కార్డులు తీసుకున్నారు. వీటిని ఉపయోగించి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అభయ్ కుటుంబీకులకు ఫోన్లు చేసి బేరసారాలు ప్రారంభించిన ఈ త్రయం విజయవాడలో దిగిన తర్వాత సిమ్స్, ఫోన్లు పడేశాడు. అక్కడ నుంచి హౌరా ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఒకరు ఇచ్ఛాపురం, ఇద్దరు బరంపురం చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు 2016 మార్చ్ 23న నిందితులను పట్టుకున్నారు. వీరిపై అదే ఏడాది సెప్టెంబర్లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు పై విధంగా శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. -
అందరూ దుర్మార్గులే..!
‘‘రాంబాబూ, నా పెళ్లిని ఓ కోటీశ్వరుడితోనే జరపాలనుకుంటున్నాడు మా నాన్న. అందుకే నీకు బాగా ఆస్తిపాస్తులున్నాయని నాన్నకి అబద్ధం చెప్పాను. కానీ నువ్వు పేదవాడివని ఆయనకి తెలిస్తే మన పెళ్లికి అసలు ఒప్పుకోడు. ఇప్పుడేం చేద్దాం? ’’ దిగులుగా అడిగింది రాణి. ప్రేయసి మాటలు విని రాంబాబు నిరాశగా నిట్టూర్చాడు.‘‘ఇప్పుడు నేను హఠాత్తుగా కోటీశ్వరుణ్ని కావాలంటే రాత్రికి రాత్రే ఏదైనా బ్యాంకు లూటీ చేయాలి లేదా ఎవరైనా కోటీశ్వరుని బిడ్డను కిడ్నాప్ చెయ్యాలి’’ చిరాగ్గా అన్నాడు.ఆ మాట వినగానే రాణి ముఖం వెలిగిపోయింది. ‘‘ఎస్... నీ రెండో ఐడియా బాగుంది. ఒకర్ని కిడ్నాప్ చేస్తే చాలు. నువ్వు ఒక్కరోజులో కోటీశ్వరుడివైపోతావ్’’ ఉత్సాహంగా అంది.‘‘నీకు వేళాకోళంగా ఉందా? కిడ్నాపింగ్ అంటే చిన్నపిల్లలాట అనుకున్నావా?’’‘‘డోంట్ వర్రీ.. నువ్వు చెయ్యాల్సిన కిడ్నాపింగ్కి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు కిడ్నాప్ చెయ్యాల్సింది నన్నే! నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నని కోటి రూపాయలు అడుగు. వెంటనే ఇచ్చేస్తాడు.అలా నువ్వు కోటీశ్వరుడివయ్యాక మన పెళ్లి ఇట్టే జరిగిపోతుంది’’ అంది రాణి.‘‘ఒకవేళ మీ నాన్న పోలీస్ కంప్లెయింట్ ఇస్తే?’’ సందేహం వెలిబుచ్చాడు రాంబాబు. ‘‘ఆ అనుమానం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నేనాయనకు ఏకైక సంతానం. నా కన్నా ఆయనకు కోటి రూపాయలు ముఖ్యం కాదు. ఆయన ఇనప్పెట్టెలో ఎప్పుడు చూసినా నాలుగైదు కోట్లు మూలుగుతుంటాయి’’ అంది రాణి. ఆ మాట వినగానే రాంబాబు కళ్లు మెరిశాయి. ‘‘అలాగైతే నువ్వు చెప్పినట్టే చేస్తాను’’ హుషారుగా అన్నాడు.రాణి, రాంబాబులు ఒకే కాలేజీలో బీటెక్ చదివారు. కోటీశ్వరుడైన బిల్డర్ కాంతారావు ఏకైక కూతురు రాణి. అందుకే చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. కాలక్షేపం కోసం గ్రాడ్యుయేషన్ వరకు చదివింది. కాలేజీలో అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరిగేది. దుస్తుల్ని మార్చినట్టు బాయ్ఫ్రెండ్స్ని మార్చేది. అయితే రాంబాబుతో పరిచయమయ్యాక తొలిచూపులోనే అతనికి మనసిచ్చేసింది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంది. కానీ పేదవాడైన రాంబాబుతో తన పెళ్లి జరపడానికి తండ్రి ఒప్పుకోడు కాబట్టి రాంబాబుని అడ్డదారిలో కోటీశ్వరుణ్ని చేసెయ్యాలనుకుంది. దానికోసం తనను తాను కిడ్నాప్ చేయించుకోవడానికి సిద్ధపడింది. రాంబాబుది రాయలసీమకి చెందిన ఓ కుగ్రామం. చదువు కోసం నగరానికొచ్చాడు. తన స్నేహితుడు రమేశ్తో కలసి నగర శివారులోగల ఓ చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు. బీటెక్ చేసినా మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో అవసరార్థం ఓ కాల్సెంటర్లో పని చేస్తున్నాడు. నిజానికి రాంబాబు.. రాణిని ప్రేమించలేదు. ఆమె వెనుక ఉన్న ఆస్తిపాస్తుల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. తండ్రి ఆస్తికి ఆమె ఏకైక వారసురాలు కాబట్టి ఆమెను పెళ్లాడితే కష్టపడకుండానే కోటీశ్వరుడు కావచ్చుననుకుంటున్నాడు. అందుకే ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు.రాంబాబు ఒంటరిగా ఉన్న ప్రతిసారీ రాణి అతని గదికి వచ్చి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటుంది. ఈ రోజు కూడా అలా వచ్చినప్పుడు మాటల మధ్య కిడ్నాపింగ్ ప్లాన్ గురించి చెప్పింది. ‘‘రాంబాబూ, ఓ హాలీవుడ్ సిన్మా చూశాక నాకీ కిడ్నాపింగ్ ప్లాన్ తట్టింది. రిస్కు లేకుండా నువ్వు కోటీశ్వరుడు కావడానికి ఇదొక్కటే మార్గం. అయితే మన కిడ్నాపింగ్ డ్రామా ముగిసే వరకు నేను దాక్కోవడానికి ఓ స్థలం కావాలి’’ అంది. ‘‘ఈ గదికన్నా సురక్షితమైన చోటు నీకు ఇంకెక్కడ దొరుకుతుంది?’’ అన్నాడు రాంబాబు.‘‘కానీ ఇక్కడ నీతోపాటు నీ ఫ్రెండ్ రమేశ్ కూడా ఉంటాడు కదా. మన ప్లాన్ గురించి అతనికి తెలియడం మంచిది కాదు’’ అంది రాణి.‘‘డోంట్ వర్రీ.. అతను వచ్చేవారం సంక్రాంతి సెలవులు గడపడానికి తన ఊరికెళ్తున్నాడు. అయిదారు రోజుల వరకు తిరిగిరాడు. అతను ఊరికి వెళ్లాకే మన ప్లాన్ అమలు చేద్దాం’’ ఉత్సాహంగా అన్నాడు.‘‘ఓకే! రమేశ్ వచ్చే వేళయింది. నేనిక వెళతాను. మళ్లీ రేపు వస్తాను. బై.. బై’’ అంటూ రాణి అక్కడి నుంచి లేచి బయటికొచ్చింది.రమేశ్ సంక్రాంతి సెలవుల్లో తన ఊరికి వెళ్లిపోయాక రాణి, రాంబాబులు తమ పథకాన్ని ఆచరణలో పెట్టారు. ఆ రోజు ఉదయం రాణి ఇంట్లోవారికి షాపింగ్కి వెళ్తున్నానని చెప్పి రహస్యంగా రాంబాబు గదికి చేరుకుంది. వెంటనే తన ఫోన్ను స్విచ్చాఫ్ చేసింది. సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోయేసరికి కాంతారావు రాణికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావటం చూసి కంగారుపడి కూతురి కోసం ఎక్కడెక్కడో వెతికాడు.చీకటిపడ్డాక రాంబాబు, రాణి ఫోన్ను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అందులో ఉన్న సిమ్ను తీసేసి మరో కొత్త సిమ్ను వేశాడు. అందులో నుంచే కాంతారావుకి రింగ్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. ‘‘మిస్టర్ కాంతారావు.. నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఆమెను ప్రాణాలతో వదలాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి’’ అన్నాడు రాంబాబు. ఆ మాట వినగానే కాంతారావు హడలిపోయాడు. అయితే అతను బేరమాడకుండా డబ్బు ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు రాంబాబు ‘‘సరిగ్గా రాత్రి పది గంటలకు సిరిపురం శ్మశానం పక్కనగల పాడుబడ్డ శివాలయం మెట్లపై కోటి రూపాయలున్న బ్యాగుపెట్టి వెళ్లిపో, డబ్బు ముట్టగానే నీ కూతుర్ని వదిలేస్తాం’’ అన్నాడు. దానికి కాంతారావు ఒప్పుకున్నాడు.రాత్రి పదిగంటలకు కాంతారావు బ్యాగుపెట్టి వెళ్లిపోయాక అంతవరకు అక్కడే నక్కి ఉన్న రాంబాబు బ్యాగు తీసుకొని తన గదికి తిరిగొచ్చాడు. ఆ బ్యాగులో రెండువేల రూపాయల నోట్ల కట్టలు మొత్తం యాభై ఉన్నాయి. తమ పథకం సఫలం కావడంతో రాణి, రాంబాబులు ఆనందం పట్టలేక నాట్యం చేశారు. అప్పుడే రాంబాబు సెల్ మోగింది. స్క్రీన్పైన కొత్త నంబర్ కనిపించింది. ఫోన్ ఎత్తగానే ఓ అపరిచిత కంఠం వినిపించింది, ‘‘మిస్టర్ రాంబాబు, నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసిపోయింది. నీ రహస్యం బయటపెట్టకుండా ఉండాలంటే కాంతారావు ఇచ్చిన డబ్బులో సగం నాకివ్వాలి’’ కటువుగా అన్నాడా వ్యక్తి. ఆ మాట వినగానే రాంబాబు ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో, తమ ప్లాన్ గురించి అతనికెలా తెలిసిందో అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తను కాంతారావు వద్ద వసూలు చేసింది రెండు లక్షలే అని అబద్ధం చెప్పాడు. ఆ వ్యక్తి రాంబాబు మాటల్ని నమ్మాడు. ‘‘సరే, లక్ష నువ్వుంచుకొని లక్ష నాకివ్వు. నేను హైవేలో ఉన్న బ్లూమూన్ రెస్టారెంట్ బయట నీ కోసం ఎదురు చూస్తుంటాను. వెంటనే ఇక్కడికొచ్చెయ్. డబ్బు ముట్టాక నేను మళ్లీ నీ జోలికి రాను’’ అన్నాడతను. రాంబాబు సరేనన్నాడు.సూట్కేసులోంచి లక్ష రూపాయలు తీసుకొని ఓ ఆటోలో హైవే పక్కనున్న బ్లూమూన్ రెస్టారెంట్కి చేరుకున్నాడు. కానీ రెస్టారెంట్ బయట అతనికెవరూ కనపడలేదు. తనకొచ్చిన నంబర్కి ఫోన్ చేసి చూశాడు. కానీ ఆ నంబర్ స్విచ్చాఫ్ అని వచ్చింది. చాలాసేపు చూసి చివరికి విసుగొచ్చి తన గదికి తిరిగొచ్చాడు.కానీ ఆ గదిలోకి అడుగుపెట్టగానే అదిరిపడ్డాడు. రాణి నేల మీద రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. ఎవరో ఆమెను కత్తితో గొంతుకోసి, డబ్బున్న సూట్కేసును ఎత్తుకుపోయారు. రాంబాబుకి ముచ్చెమటలు పట్టాయి. కళ్లు బైర్లు కమ్మాయి. ఇక అక్కడ ఉండటం ప్రమాదమనుకొని బయటికి పారిపోబోయాడు. కానీ అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. రాంబాబు జరిగిందంతా నిజాయితీగా ఇన్స్పెక్టర్ విజయ్కుమార్కి చెప్పేశాడు. అంతా విన్నాక రాంబాబు హంతకుడు కాదనిపించింది విజయ్కి. బంగారు గుడ్లు పెట్టే కోడిలాంటి తన ప్రేయసిని చేజేతులా ఎందుకు చంపుతాడు? ఒకవేళ చంపాలనుకున్నా పోలీసులకు అనుమానం రాకుండా, ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేవాడు. తన గదిలోనే ఆ పని చేసి పోలీసులకు పట్టుపడేవాడు కాదు. ఈ హత్య కచ్చితంగా రాంబాబుకి ఫోన్ చేసిన అజ్ఞాతవ్యక్తి చేసిన పనే అయ్యుంటుంది. రాంబాబును బ్లూమూన్ రెస్టారెంట్ దగ్గరికి రమ్మని చెప్పి, పోలీసులకు ఫోన్ చేసి హత్య జరిగిన సమాచారమిచ్చి రాంబాబును ఇరికించాడని విజయ్కి అర్థమైంది.హత్య జరిగిన ప్రదేశం చుట్టుపక్కల జనసంచారం తక్కువ కనుక అర్థరాత్రిపూట హంతకుణ్ని ఎవరూ చూసే అవకాశం లేదు. ఇప్పుడతణ్ని పట్టుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం రాంబాబు సెల్లో రికారై్డన అతని ఫోన్ నంబరే. అయితే విచారణలో ఆ ఫోన్ నంబర్ అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ పబ్లిక్బూత్ నంబరని తెలిసింది. హంతకుడు తన ఆచూకీ దొరకకూడదని తన సెల్ఫోన్ వాడకుండా నిర్జన ప్రదేశంలో ఉన్న పబ్లిక్బూత్ నుంచి మాట్లాడాడు. ఘటనాస్థలంలో తీసిన శవం ఫొటోలను పరిశీలిస్తుంటే విజయ్ని ఓ విషయం ఆకర్షించింది. మృతురాలి కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకొని ఉన్నాయి. చనిపోయే ముందు ఆమె ఆశ్చర్యానికి గురైందంటే ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఆమెను చంపి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? విజయ్ తన పోలీసు బుర్రకి పదునుపెట్టాడు. హఠాత్తుగా అతని బుర్రలో మెరుపు మెరిసింది.వెంటనే హంతకుని ఊరికెళ్లి అతణ్ని అరెస్టు చేసి థర్డ్డిగ్రీ ప్రయోగించాడు. అప్పుడతను నేరాన్ని అంగీకరించి తన ఇంట్లో దాచిన తొంభై తొమ్మిది లక్షల్ని బయటికి తీశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రాంబాబు రూమ్మేట్ రమేశే! ఇంటరాగేషన్లో రమేశ్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. ‘‘రాణి, రాంబాబు కలసి కిడ్నాపింగ్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడం నేను చాటుగా విన్నాను. అప్పుడే నాలో దుర్బుద్ధి కలిగింది. వారు కాంతారావు నుంచి కోటి రూపాయలు వసూలు చేశాక, అందులో సగం నేను చేజిక్కించుకోవాలనుకున్నాను. అందుకే మా ఊరికి వెళ్లకుండా నగరంలోనే మరోచోట ఉన్నాను. రహస్యంగా వారి కార్యకలాపాల్ని గమనించసాగాను. ఆ రోజు రాత్రి రాంబాబు డబ్బున్న సూట్కేస్ తీసుకురావడం చూశాక ఓ పబ్లిక్బూత్ నుంచి అతనికి ఫోన్ చేశాను. గొంతు మార్చి మాట్లాడటం వల్ల నన్నతను గుర్తుపట్టలేదు. అయితే తను కాంతారావు నుంచి వసూలు చేసింది రెండు లక్షలే అని అబద్ధం చెప్పినప్పుడు నాకు కడుపు మండింది. మొత్తం డబ్బు దోచుకోవాలనిపించింది. అందుకే రాంబాబుని అక్కడికి దూరంగా ఉన్న బ్లూమూన్ రెస్టారెంట్ దగ్గరికి రమ్మని పిలిచాను. అతను బయటికి వెళ్లగానే నేను గదిలోకి దూరి రాణిని చంపి డబ్బు తీసుకొని పరారయ్యాను’’ అని ముగించాడు.రమేశ్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు రాంబాబుపై నకిలీ కిడ్నాపింగ్ కేసు పెట్టారు. తర్వాత రాణి తండ్రి కాంతారావుని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కాంతారావు, రాంబాబుకి ఇచ్చిన డబ్బంతా నకిలీ నోట్లే అని తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అతను దొంగనోట్ల వ్యాపారం చేసేవాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది.అంటే ఈ నకిలీ కిడ్నాపింగ్ కేసులో చేతులు మారిన డబ్బు కూడా నకిలీదే! మొత్తం మీద ఈ కేసులోని నిందితులతో పాటు బాధితులు కూడా దుర్మార్గులే...! మహబూబ్ బాషా -
లిఫ్ట్ ఇచ్చి.. తర్వాత అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: రాత్రిపూట బస్టాప్ వద్ద వేచి ఉన్న ఒంటరి మహిళకు లిఫ్ట్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి ఆదివారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. లాలాపేట్ శాంతినగర్కు చెందిన కందుకూరి నాగ మధుకిరణ్(29) ఓలా క్యాబ్ డ్రైవర్. ఈ నెల 5న కాప్రా పరిధిలోని రాధిక థియేటర్ చౌరస్తా వద్ద రాత్రి 10:50 గంటలప్పుడు ఓ మహిళ ఒంటరిగా బస్సు కోసం వేచిచూస్తోంది. అదే సమయంలో క్యాబ్లో అటుగా వచ్చిన నాగమధుకిరణ్ ఆమెను మాటల్లో పెట్టి సైనిక్పురి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ క్యాబ్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక దారి మళ్లించాడు. ఏఎస్రావునగర్ పార్కు వద్దకు తీసుకెళ్లి కారు డోర్లు లాక్ చేసి మహిళతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆమె అరుపులు, కేకలు వేయడంతో కారులోంచి దింపి అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. దీనిపై బాధితురాలు కుషాయిగూడ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా క్యాబ్ డ్రైవర్ను శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది అక్టోబర్ 17న కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. కౌకూర్ దర్గాకు బాలికను తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి లైంగికదాడికి యత్నించినట్లు అంగీకరించాడు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ గోనె సందీప్రావు, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనను ఓలా అధికార ప్రతినిధి ఖండించారు. ఇవి తమ సర్వీస్లో భాగంగా జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే డ్రైవర్ను ఓలా సర్వీస్నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తామని, ఎలాంటి సమాచారం కావాలన్నా అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. -
వీడిన హత్యకేసు మిస్టరీ
కదిరి అర్బన్: కదిరిలో కారు రిపేరీకి వెళ్లి హత్యకు గురైన నారాయణస్వామి నాయక్ కేసు మిస్టరీ వీడింది. ఐదుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటరమణ సోమవారం కదిరి పట్టణ సీఐ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నారాయణస్వామి నాయక్ కుమార్తెను ఈ ఏడాది మార్చి 30న జగదీష్, మహేష్, సురేష్, వీరమహేష్, తేజ్దీప్లు కిడ్నాప్ చేశారు. అనంతరం విశాపట్నం జిల్లా చింతపల్లి మండలం సంకడ గ్రామంలో ఉంచి అమ్మాయిపై జగదీష్ అత్యాచారం చేశాడు. దీంతో నారాయణస్వామి నాయక్ ఆ ఐదుగురిపైనా కదిరి పోలీస్టేషన్లో కేసు పెట్టాడు. అంతటితో ఆగకుండా మీ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో అందరం ఒక్కడి చేతిలో (నారాయణస్వామినాయక్) చచ్చేకంటే ఆ ఒక్కడ్ని మనమే చంపేస్తే సమస్య ఉండదని ఐదుగురూ ఒక నిర్ణయానికి వచ్చి హత్యకు కుట్ర పన్నారు. ఈ నెల 15న కదిరి మునిసిపల్ పరిధిలోని సైదాపురం సమీపాన గల ఐటీఐ వద్ద కారు రిపేరీ చేయించుకునేందుకు వచ్చిన నారాయణస్వామినాయక్ను ఐదుగురూ కలిసి పిడిబాకు, వేటకొడవలి, గొడ్డలితో దాడిచేసి మట్టుబెట్టారు. నిందితులలో నలుగురిని కదిరి కొండవద్ద పట్టుకుని, వారు ఉపయోగించిన మారణాయుధాలను స్వా«ధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. ప్రధాన నిందితుడు జగదీష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్నీ పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీధర్, పట్టణ ఎస్ఐ గోపాలుడు ఉన్నారు. -
షర్మిల కొడుకు కిడ్నాప్.. ఎవరి పని?
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఘటన జరిగిన తీరును బట్టి అది వారికి బాగా తెలిసిన వ్యక్తులు చేసినట్లుగా స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి బాలుడితో సహా కారును దుండగుడు ఎత్తుకెళ్లగా కారు వేగం తగ్గిన సమయంలో బాలుడు దూకేసిన విషయం తెలిసిందే. అయితే తెల్లవారు జామున వాహనాన్ని అగంతకుడు గోకవరంలో వదిలాడు. కారు ఉన్న ప్రదేశాన్ని వివరిస్తూ రాసిన లేఖను గురువారం ఉదయం ఆరు గంటలకు షర్మిలా రెడ్డి నివాసం వద్ద వదలడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షర్మిలా రెడ్డి ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి తన కుమారుడితో నూతన ఇన్నోవా వాహనంలో ఇంటికి వచ్చారు. కుమారుడిని కారులోనే ఉంచిన ఆమె తన కుమార్తెను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లారు. వెంటనే అగంతకుడు బాలుడితో సహా కారును ఎత్తుకెళ్లాడు. నగరంలోని ఎపెక్స్ ఆస్పత్రి వద్ద వాహన వేగం తగ్గడంతో బాలుడు కిందకు దూకేశాడు. నగదు కోసం బాలుడుని కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు పక్కా ప్రణాళికతో వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని స్పృహతప్పే విధంగా చేయడం, బాలుడు కిందకు దూకేస్తుంటే అడ్డుకోకపోవడం, కారు డోర్లు లాక్ చేసే అవకాశం ఉన్నా చేయకపోవడం వల్ల అగంతకుడు బాలుడుని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని ఘటన జరిగిన తీరు తెలుపుతోంది. నిన్ను ఏం చేయనంటూ నిందితుడు బాలుడితో చెప్పడం, కారులో నుంచి దూకుతుంటే అడ్డుకోకపోవడం అతను బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని పోలీసులు అంచనాకు వస్తున్నారు. కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు ఒక్కడే రాడని పలువురు బృందంగా వచ్చేవారని భావిస్తున్నారు. కావాలనే చేశారా...? తెల్లవారితే దీపావళి పండుగ నేపథ్యంలో రాజకీయ నేత అయిన షర్మిలా రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిపారా అన్న అనుమానాలకు ఘటన జరిగిన తీరు, అనంతరం పరిణామాలు బలపరుస్తున్నాయి. షర్మిలా రెడ్డి కుటుంబం అంటే పడని బంధువులు, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండగ రోజున ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే తెలిసిన వారు ఈ పని చేశారని నగరంలో చర్చ జరుగుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి షర్మిలారెడ్డి కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి ఇలా జరగడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అగంతకుడి కోసం ముమ్మర గాలింపు... అగంతకుడి కోసం ఒకటో పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఐ రవీంద్ర పర్యవేక్షణలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలిస్తున్నాయి. అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఈ కేసును సవాల్గా తీసుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని సీఐ రవీంద్ర చెప్పారు. కారు వదిలి.. లేఖ రాసి... బాలుడు దూకేసిన తర్వాత కారుతో వెళ్లిపోయిన అగంతకుడు వాహనాన్ని గోకవరం సమీపంలో వదిలాడు. ఆ విషయాన్ని గురువారం తెల్లవారు జామున ఆరు గంటలకు ఓ లేఖలో వివరిస్తూ దానవాయిపేటలోని షర్మిలారెడ్డి ఇంటి ముందు వదిలాడు. బుధవారం రాత్రి ఘనట జరిగిన తర్వాత తెల్లవారు జాము 3 గంటల వరకు ఆమె ఇంటి వద్ద పలువురు రాజకీయ నేతలు, నగర ప్రముఖులు ఉన్నారు. పోలీసులు 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అయినా ఆరు గంటలకు అగంతకుడు అక్కడ లేఖను వదలడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తెలిసిన వారు అక్కడే ఎవరో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే జన సంచారం లేని సమయం చూసి ఖచ్చితంగా అదే సమయానికి అక్కడికి ఎలా వస్తాడన్నది ప్రశ్నగా మారింది. లేఖను అక్కడ అగంతకుడు వదిలాడా? లేక అతనికి సంబంధించిన వారు వదిలారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కొనుగోలు చేసిన రూ.18 లక్షల విలువైన తెలుపురంగు ఇన్నోవా కారును తీసుకెళ్లి మళ్లీ గంటల వ్యవ్యధిలో నగరం బయట వదిలి ఆ సమాచారం చేరవేయడంతో అతను దొంగ కాదని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని వదిలివేయడంతో అతను కిడ్నాపర్ కాదని, రూ.18 లక్షల విలువైన కారును తిరిగి వారికి అప్పగించేలా లేఖలో సమాచారం ఇవ్వడంతో దొంగ కాదన్న విషయం స్పష్టమవుతోంది. -
ఉపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం
చిత్తూరు, కలకడ : పట్ట పగలు దుండగులు విశ్రాంత ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. రూ.10 లక్షలు వెంటనే ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తర్వాత రోడ్డుపై వదిలేశారు. ఈ సంఘటన బుధవారం కలకడ మండలం కోన గ్రామంలో జరిగింది. బాదితుడు, పోలీసుల కథనం మేరకు.. కోనకు చెందిన గుడ్ల రాజన్న(75) విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆయనకు బుధవారం గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. బొప్పాయి పంటను కొనుగోలు చేస్తామని బుధవారం ఉదయం 8 గంటలకు కోనలోని పొలం వద్దకు రావా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన రాజన్నను దుండగులు మాటల్లో పెట్టి కారులో బలవంతంగా ఎక్కించారు. కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గుర్రంకొండకు, అక్కడి నుంచి చెర్లోపల్లె వద్దకు తీసుకువచ్చారు. దీంతో హతాశుడైన రాజన్న నగదు కలకడ బ్యాంకులో ఉందని, అక్కడికి తీసుకెళితే ఇస్తానని చెప్పాడు. కలకడ సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్దకు చేరుకోగానే తమ గ్రామానికి చెందిన వ్యక్తి నగదు తీసుకువచ్చాడని రాజన్న చెప్పడంతో దుండగులు వాహనం నిలపకుండా చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలోని మహల్ క్రాస్ వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు అతన్ని దించేశారు. తాము తిరిగి గురువారం వస్తామని, నగదు సిద్ధంగా ఉంచాలని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు తన కుమారులకు సమాచారం అందించగా పోలీసులు ఫిర్యాదు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్నాయుడు, కలకడ ఎస్ఐ చాన్బాష కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఏపీ నర్సు కిడ్నాప్?
కేకే నగర్ (చెన్నై): తమిళనాడులోని నీలాంగరైలో విహార యాత్రకు వెళ్లిన ఓ నర్సు అదృశ్యం కావడంతో ఆమె అపహరణకు గురైందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలకు చెందిన మెర్సీసాయి (23) చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న హాస్టల్లో బస చేసి ఉంటోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హాస్టల్లో బసచేసిన యువతులు 90 మంది ముట్టుకాడు తదితర ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారిలో మెర్సీ కనిపించలేదు. వెంటనే కానత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వీడిన గుంటూరు బాలుడి కిడ్నాప్ మిస్టరీ
-
అమ్మా వచ్చేస్తున్నా...
♦ కిడ్నాపైన బాలుని కథ సుఖాంతం పూసపాటిరేగ(నెల్లిమర్ల): పోరాం గ్రామంలో కిడ్నాపైన బాలుడు మాదేష్ విశాఖ జిల్లా నక్కపల్లిలో పోలీసులకు లభ్యమయ్యాడు. బాలుడు తండ్రి శేషపు సంతోష్కుమారే కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఎస్ఐ జి.కళాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు. బాలుడు తండ్రి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా నక్కపల్లిలో టవర్ లొకేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కిడ్నాప్ అయిన బాలుడు మాదేష్(3) ఒక ఇంట్లో వున్నట్లు ఆచూకీ లభ్యమైంది. బాలుడును పట్టుకొనేలోపు సమీపంలో వున్న తండ్రి శేషపు సంతోష్కుమార్ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకొన్నట్లు ఎస్ఐ కళాధర్ తెలిపారు. నక్కపల్లిలో తప్పించుకొన్న సంతోష్కుమార్ కో సం అక్కడ పోలీసులు సహకారంతో గాలి స్తున్నట్లు ఫోన్లో ఎస్ఐ సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా కొడుకు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తల్లి స్రవం తి, బంధువులు బాలుడు ఆచూకీ లభ్యమవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకి లభ్యం
తమిళనాడులో పోలీసులకు లొంగిపోయిన కిడ్నాపర్ దంపతులు తిరుపతి క్రైం: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం వద్ద ఇటీవల కిడ్నాప్కు గురైన తొమ్మిది నెలల బాలుడు చెన్నకేశవుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దంపతులు తమిళ నాడులోని వేలకుర్చి పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు శుక్రవారం తిరుపతిలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం సాయిపురానికి చెందిన చెన్నకేశవుడును ఈ నెల 14న తిరుమలలో గుర్తుతెలియని దంపతులు కిడ్నాప్ చేయడం తెలిసిందే. బాలుడి ఆచూకీకోసం పోలీసులు 23 బృందాల్ని ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో జల్లెడ పట్టారు. వివిధ మార్గాల్లో పోలీసులు నిందితుల కోసం గాలించగా ఒత్తిడికి గురై కిడ్నాపర్లు భయపడి వేలకుర్చి పోలీస్స్టేషన్లో లొంగిపోయారని ప్రభాకర్రావు తెలిపారు. వారిని తమిళనాడులోని నమ్మకల్ జిల్లాలోని శింగనందాపురం వాసులైన అశోక్, తంగవి దంపతులుగా గుర్తించినట్టు తెలిపారు. తిరుమలలో చెన్నకేశవుడి తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉండగా అశోక్, తంగవి దంపతులు పిల్లాడ్ని కిడ్నాప్ చేశారని, తర్వాత నేరుగా ఆర్టీసీ బస్సులో తమిళనాడు వెళ్లారని వివరించారు. ఇదిలా ఉండగా అశోక్కు ఇద్దరు భార్యలని, వారిద్దరికీ ఆడపిల్లలే పుట్టడంతో మగపిల్లాడి కోసమే రెండో భార్య తంగవితో కలసి చెన్నకేశవుడ్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. -
తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం
-
తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం
తిరుమల : ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని అపహరించిన దంపతులు తమిళనాడులోని నమ్మకల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. కాగా తమకు పిల్లలు లేని కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. పోలీసులు బాబును తిరుమల తీసుకు వస్తున్నారు. కాగా తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్ను గమనించగా.. బాబును ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8), శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు. దర్శనం పూర్తిచేసుకున్న వారు రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చెన్నకేశవా.. కనిపించవా?
► కిడ్నాపర్ ఎవరు? ► అగంతుకులా? బిడ్డల్లేనివారా? ► తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసుశాఖ ► నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు సాక్షి,తిరుమల : తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఘటనలో పాల్గొన్నవారు అగంతుకులా? బిడ్డల్లేని వారా? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ ఇలానేనా?: నిద్రిస్తున్న తల్లిదండ్రులను వీడి దోగాడుతూ వచ్చిన బాలుడిని ఓ వ్యక్తి గుర్తించాడు. అతను మగ బిడ్డగా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. పైగా కన్నవారికి నలుగురు బిడ్డలు ఉన్నట్టు గుర్తించి, వారిని నిశ్చితంగా పరిశీలించాడు. ఆలయం ముందు నిద్రిస్తున్న వారిని రాత్రంతా కాపుకాచాడు. కుటుంబం నుంచి వేరుపడిన బాలుడిని ఒంటరిగానే ఎత్తుకెళ్లాడు. వెంటనే అతని భార్యగా భావిస్తున్న మహిళ కూడా వెనుకే వెళ్లి, కొంత దూరం తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. ఆ ఆలోచనతోనే కిడ్నాప్ చేశారా? కిడ్నాపర్ల చేతిలో పూర్తి స్థాయి లగేజీ ఉంది. చంటి బిడ్డ వయసురీత్యా ఏడు నెలలే. కన్నవారిని తప్ప మరొకరిని గుర్తించే అవకాశం తక్కువ. రోజులు గడిస్తే కన్నవారిని కూడా ఆ పసికందు మరచిపోయే అవకాశం ఉంది. ఆ ఆలోచనతోనే నేలపై దోగాడుతున్న బిడ్డ కోసమే ఆ దంపతులు వేచి ఉన్నట్టు తెలుస్తోంది. అదునుచూసి ఆ బిడ్డను అపహరించుకుని ఊరుదాటిపోయారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అగంతుకులు కూడా ఇలాంటి తెలివితేటలతోనే దంపతుల తరహాలోనే వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు శ్రీవారి సాక్షిగా పసికందు చెన్నకేశవ కిడ్నాప్ కేసును తిరుపతి అర్బన్జిల్లా ఎస్పీ జయలక్ష్మి తీవ్రంగా పరిగణించారు. దీనిపై ఆమె ప్రత్యేక బృందాలు నియమించారు. ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలను నాలుగు రాష్ట్రాలకు పంపారు. వెయ్యి కళ్లతో ఎదురుచూపు అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండపంలో ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, భార్య రత్నమ్మ చిన్నకుమారుడు చెన్నకేశవ. కొడుకు దూరమవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె ప్రమీల(8), పెద్దకుమారుడు శ్రీనివాసులు (6), చిన్నకుమార్తె సువర్ణ (2)తో కలసి పోలీస్ రక్షణలో పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణంలోనైనా తమ బిడ్డ ఆచూకీ లభిస్తోందోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. -
తిరుమలలో చంటిబిడ్డ అపహరణ
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఏడు నెలల వయసున్న చంటిబిడ్డ అపహరణకు గురికావడం కలకలం రేపింది. తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న చిన్నారి బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లారు. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్ను గమనించగా.. చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8), శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు. దర్శనం పూర్తిచేసుకున్న వారు రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఐలవరం టూ జమ్మూకశ్మీర్
కిడ్నాపర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా భట్టిప్రోలు ఐలవరం గ్రామానికి చెందిన లిఖితను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు జమ్మూకశ్మీర్లో పేర్లు మార్చుకుని మకాం ఉండగా అరెస్టు చేసినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరు లకు ఆయన వివరాలు వెల్లడించారు. నిం దితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నా రు. కిడ్నాప్ తర్వాత 25వ తేదీ వరకూ వారి వివరాలు ట్రాక్ చేయగలిగామన్నారు. గతం లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసి 2011లో తొలగింపునకు గురయ్యాక ఐలవ రంలో ఆటో నడుపుకొంటున్నాడన్నారు. పిల్లలను లోబర్చుకొనే యత్నం... నాగేశ్వరరావు ప్రవర్తనకు విసిగిన భార్య అతని నుంచి దూరంగా ఉంటోందని డీజీపీ తెలిపారు. ఐలవరంలో ఓ టీచర్ సహా పలువురు మహిళలతో అతనికి వివాహేతర సంబంధాలున్నాయన్నారు. ఆటోలో స్కూల్ కు తీసుకెళ్లే పిల్లలను కూడా లోబర్చుకో వడానికి యత్నించేవాడన్నారు. లిఖితకు ఏడాది నుంచి మాయమాటలు చెప్పి దగ్గర య్యాడని వివరించారు. టీచర్కు ఫోన్తో ఆచూకీ లభ్యం.. ఏప్రిల్ 21న లిఖితను కిడ్నాప్ చేసి ఐలవరం నుంచి ఒంగోలు, అక్కడి నుంచి హైదరాబా ద్ మీదుగా ఢిల్లీ, కశ్మీర్లోని సాంబాకు తీసు కెళ్లినట్లు తెలిపారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా నాగేశ్వరరావు పనిచేయడంతో అక్కడ పరిచ యాలున్నాయని, అతని పేరును తేజగా, లిఖిత పేరును గీతగా మార్చి సెంట్రింగ్, కెమికల్ ఫ్యాక్టరీ, ఆయిల్ కంపెనీల్లో పనిచే స్తూ లిఖితపై పలుమార్లు లైంగికదాడి చేసి నట్లు చెప్పారు. ఐలవరంలోని టీచర్కు నాగేశ్వరరావు ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేయాలని కోరడంతో ఆచూకీ లభ్యమైందని వివరించారు. -
సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు
► సినిమా ప్రచారంలో విభేదాలు ►వ్యక్తి కిడ్నాప్, చిత్రహింసలు ►కేసు ఛేదించిన ఖాకీలు ఇది సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు. డైరెక్టర్ సినిమా తెలివితేటలను నిజ జీవితంలో ఉపయోగించాడు. తన చిత్రానికి ప్రచార బాధ్యతలు చూస్తున్న వ్యక్తిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి మూడురోజులు హింసించిన నేరానికి కటకటాల పాలయ్యాడు. ఇలా అనుకోకుండానే తన సినిమాకు ప్రచారాన్ని సంపాదించుకున్నాడనడంలో సందేహం లేదు. జయనగర: సినిమా (అడ్వర్డైజింగ్) ప్రకటనల విభాగం డైరెక్టర్ పరమేశ్ను కిడ్నాప్ చేసిన ‘వేగ’ సినిమా డైరెక్టర్తో పాటు ఐదుగురిని బెంగళూరు మాగడిరోడ్డు పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. శనివారం ఆయన మీడియా భేటీలో వివరాలను వెల్లడించిన మేరకు... వేగ అనే కన్నడ సినిమాకు డైరెక్టర్ చలపతి ఎరడు. అతను కనసు సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన మదన్ సలహా మేరకు సినిమా ప్రచారం బాధ్యతలను పరమేశ్ అనే వ్యక్తికి అప్పగించి రూ.16 లక్షల అందజేశాడు. కాని పరమేశ్ ప్రచారం సక్రమంగా నిర్వహించలేదని గొడవకు దిగిన డైరెక్టర్ చలపతి రూ.8 లక్షలు తిరిగి ఇవ్వాలని పరమేశ్ను అడిగాడు. ప్రచారం కోసం ఇప్పటికే రూ.13 లక్షలు ఖర్చు అయిందని అతను సమాధానమిచ్చాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. తోటలో బంధించి గొడవలో తీవ్రకోపోద్రిక్తుడైన చలపతి తన అనుచరులైన కృష్ణరాజపురం నివాసి కిరణ్, శెట్టిగెరె కు చెందిన మూర్తి, మోహన్, కాడయరప్పనహళ్లి నివాసి మదన్ అనే నలుగురితో పరమేశ్ కిడ్నాప్నకు పథకం వేశాడు. 24వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో బసవేశ్వరనగర పుష్పాంజలి థియేటర్ వద్ద పరమేశ్ను కారులో కిడ్నాప్ చేసి దేవనహళ్లి సమీపంలోని కాడయరప్పనహళ్లిలో ఉన్న తోటలోకి తీసుకెళ్లి గదిలో బంధించారు. మూడురోజుల పాటు పరమేశ్వర్ను తీవ్రంగా కొట్టి రూ.8 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండురోజుల పాటు పరమేశ్ ఆచూకీ కనబడకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం మాగడిరోడ్డు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మాగడిపోలీస్స్టేషన్ సర్కిల్ ఇన్స్స్పెక్టర్ హరీశ్ పోలీస్బృందం తీవ్రంగా గాలించి తోటలోని ఇంటిపై దాడిచేసి పరమేశ్ను విడుదల చేయించారు. వేగ సినిమా డైరెక్టర్ చలపతి, మూర్తి, మోహన్, మదన్, కిరణ్ అనే ఐదుగురిని అరెస్టుచేసి, ఒక క్వాలిస్కారు, 5 సెల్ఫోన్లును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. -
నడుస్తున్న చరిత్ర
ఏ పోరాటమైనా మొదలైనప్పుడు దానికో అంతం ఉంటుంది. లక్ష్యం ఆ అంతానికి ఆది. లక్ష్యం మెండుగా ఉంది. పోరాటం గురి తప్పలేదు. కాని ఎందుకో పోరాటానికి అంతం రావడంలేదు. వివక్ష పోవాలని అందరూ కోరుకుంటున్నారే తప్ప అంతం చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న వివక్షకు పంచభూతాల సాక్షిగా నిలుస్తున్న కథలు ఇవి. అంతా యథార్థమే... నడుస్తున్న చరిత్రే!! జయ విజయం సాధించేనా? ఆమె పేరు జయ. పేరులో తప్ప బతుకులో జయం లేదు. భర్త అర్ధంతరంగా చనిపోయాడు. ఆరుగురు ఆడపిల్లలు. భర్త చెమట చిందించి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమి తప్ప ఏమీ లేవు. మామ కూడా లేడు. అత్తది అగ్రకులం. ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు. పోలీసుల అండతో, కులం బలంతో జయపై దాడి చేయించింది. జయ బిడ్డను కిడ్నాప్ చేయించింది. అనేక రకాల హింసలు పెట్టింది. జయ భయపడలేదు. అన్న సహాయంతో కోర్టులో కేసు వేసింది. ప్రాణభయం ఉన్నా లెక్క చేయలేదు. పిల్లల్ని చదివించుకుంటూ న్యాయం కోసం పోరాడుతోంది. ఒక బిడ్డ పెళ్లి చేయగలిగింది. కుల సంఘాలని కదిలించింది. అగ్రకులం, అధికారం, పోలీసులు ఒకవైపు.. మొక్కవోని ధైర్యంతో తనే ఒక సైన్యంగా జయ ఒకవైపు! మరి రేపటి న్యాయం ఎటువైపు? తాను పుండై.. తనువు పండై ఆమె అరుణ. కులం మాదిగ. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయినా పట్టుదలతో ఇంజనీరింగ్ వరకు వచ్చింది. కానీ పూర్తి చేయలేకపోయింది. పేదరికం వల్ల చదువు ముందుకు సాగలేదు. మధ్యలోనే తిరిగి తన ఊరు చేరుకుంది. ఏదైనా ఉద్యోగం చూసుకుని కుటుంబానికి ఆసరాగా నిలబడాలను కుంది. తన ఊరికి దగ్గరలోనే పోలీసు శాఖ వారు కానిస్టేబుల్ శిక్షణ ఇస్తుంటే చేరింది. ఒకనాడు ఇంటిదగ్గర దించుతానంటే సాటి మనుషులే కదా అని ఆ మగాళ్లను నమ్మి బండి ఎక్కింది. అంతే. ఊరవతలకు వెళ్లగానే వాళ్లు మృగాళ్లయ్యారు. ఆ ముగ్గురికి బలైపోయింది. వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతామని బెదిరించారు. అవమానం భరించలేక అమ్మమ్మ ఊరుకు పోయి చచ్చిపోవాలనుకుంది. మేనమామ ఆపాడు. విషయం తెలుసుకున్నాడు. నిందితులు దొరికారు. అప్పటికే వీడియోలు బయట పడ్డాయి. చేతులు మారాయి. అంతా అరుణనే తప్పు పట్టారు. తిరుగుబోతు అన్నారు. పేపర్లు, టీవీలు, దళిత సంఘాల వారు మొత్తుకున్నా న్యాయం జరగలేదు. అరుణ జీవచ్ఛవమై బతుకుతోంది. అంటరాని ఒంటరి పోరు ఈమె రేణుక. 20 ఏళ్ల వయసు. పెళ్లి కాలేదు. అంటరాని కులంగా అగ్రవర్ణాలు ముద్రేసిన మాదిగగా పుట్టింది. ఊరు ఆమెను ఎన్నడూ పట్టించుకోక పోయినా ఆమె ఊరును పట్టించుకుంది. పచ్చని పల్లెటూరిలో విషం చిమ్మే ఫ్యాక్టరీ వచ్చి చిచ్చుపెట్టింది. రేణుక ఊరందరినీ ఏకం చేసి ఫ్యాక్టరీకి ఎదురు తిరిగింది. జనాన్ని కూడదీసి అమ్ముడు పోయిన పెద్దలను నిలదీసింది. ఫ్యాక్టరీ తీసేయాలని పోరాడింది. ఫలితంగా దాడులు, అవమానాలు, కేసులు! అరోగ్యం పాడైపోయింది. ఊరంతా భయపడి వెనక్కి తగ్గింది. దాడులు వల్ల అయిన గాయాలు మిగిల్చిన పక్కటెముకల్లోని నొప్పితో రేణుక మాత్రం ముందుకే నడిచింది. అయినా ఆమె బలం సరిపోలేదు. అందుకే ఫ్యాక్టరీ నిర్మాణమైంది. దుర్గంధాన్ని వెదజల్లుతూ దర్జాగా నడుస్తోంది. లంచాలు తిని ఊరిని తాకట్టు పెట్టిన పెద్దలు ధీమాగా తిరుగుతున్నారు. ఈ ఒంటరి పోరాటంలో అవమానాలతో రేణుక అలసి పోయింది. పిల్లి తరిమిన కోడి పిల్లలాగా ఊరు దిగాలుగా చూస్తోంది. దళిత తల్లికి ఎంత కష్టం ఎంత కష్టం సమ్మక్క... చిన్నప్పుడే పెళ్లయింది. నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. కొడుకు ఒక్కడే మిగిలాడు. 23 ఏళ్లు వచ్చాక కొడుకు రెండు కిడ్నీలు పాడైపోయాయి! భర్త ఒక కిడ్నీ ఇచ్చినా కొడుకును బతికించుకోలేకపోయారు. భర్త కూడా దక్కలేదు. నలభై ఏళ్ల వయసులోనే అందరినీ కోల్పోయి ఒంటరిదైపోయింది సమ్మక్క. కష్టాలు అక్కడితో ఆగలేదు. ఆమెకు యాక్సిడెంట్ అయింది. తొమ్మిదినెలలు మంచం మీద నుంచి లేవలేదు. ఇల్లు అప్పులతో మునిగిపోయింది. నిలువ నీడ లేక తిరుగుతుంటే రైల్వేస్టేషన్లో ఒక వ్యక్తి సమ్మక్కను చూసి టాయిలెట్లు కడిగే పని ఇప్పించాడు. చాలీ చాలని డబ్బులతో నిండని కడుపును నీళ్లతో నింపుకుంటోంది. ఉండడానికి ఒక చూరు రాయించమని కన్నీళ్లతో అందరి కాళ్లావేళ్లా పడుతోంది సమ్మక్క. కలల పునాదుల మీద కొడుకు సమాధి ఆమె రాధిక. పుట్టింది దళిత మాల కుటుంబంలో. పెరిగింది వడ్డెరకులంలో. పెంచిన తల్లి ఉద్యోగస్తురాలు. ఆమెకు, ఆమె పిల్లలకు పుట్టెడు చాకిరీ చేస్తూ పెరిగింది. చిన్న వయసులోనే వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిగింది. భర్తకు తన కులం తెలిసినప్పటి నుంచి నరకం మొదలైంది. భరించలేక విడాకులు తీసుకుంది. కుట్టు మిషన్ కుడుతూ ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచింది. బిడ్డకు వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిపించింది. పెద్దకొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడని మురిసిపోయింది. పేదరికానికి స్వస్తి పలకొచ్చని ఆశపడింది. కానీ తన ఉసురు పోసుకున్న కులమే తన కొడుకు ప్రాణాలనూ తీసింది. అతడే రోహిత్ వేముల. తల్లి గుండె పగిలింది. కులం రాజకీయమైంది. ఒంటరి జీవితం అవమానాల, అనుమానాల పరం అయింది. అయినా ధైర్యం తెచ్చుకుని.. అనారోగ్యం, దుఃఖం వెంటాడుతున్నా కూడా తన కొడుకు లాగా మరొక బిడ్డ బలి కాకూడదని కులప్రభావ ప్రవాహానికి ఎదురీదుతోంది. పెంచుకున్న తల్లి లేదు. పంచుకున్న భర్త లేడు. కని పెంచిన కొడుకు లేడు. అయినా మనోనిబ్బరంతో కులాల కుళ్లుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది రాధిక. -
‘రూ.2 లక్షలు ఇవ్వకుంటే కిడ్నాప్ చేస్తాం’
⇒అగంతకుల నుంచి మెసేజ్ ⇒పోలీసులను ఆశ్రయించిన తల్లి ⇒నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన నిజామాబాద్ క్రైం (నిజామాబాద్అర్బన్) : రూ.2 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ అగంతకులు ఓ తల్లిని బెదిరించిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆందోళన చెందిన ఆ తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. ఐదో టౌన్ ఎస్సై ఉపేందర్రెడ్డి కథనం ప్రకారం.. సీతారాంనగర్ కాలనీకి చెందిన ప్రియకు పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త స్విడాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, సోమవారం రాత్రి ఆమె సెల్ఫోన్కు అగంతకుడి నుంచి మెసేజ్ వచ్చింది. తనకు రూ.2 లక్షల ఇవ్వాలని, లేకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామని ఆ మెసేజ్ సారాంశం. మెసేజ్ చూసి తీవ్రంగా కలత చెందిన ప్రియ స్థానికుల సలహాతో ఐదో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ను ఛేదించేందుకు యత్ని స్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి పేరిటే ఆ నెంబర్ రిజిస్టర్ అయి ఉందని తెలిసింది. మరోవైపు, మంగళవారం కూడా ఆమె ఫోన్కు మళ్లీ మెసేజ్ రావడం గమనార్హం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
గుంటూరులో బాలుడు నిఖిల్ కిడ్నాప్
-
వారికి శిక్ష పడే వరకు సినిమాల్లో నటించను
నేరస్తులకు శిక్ష పడే వరకు నేను సినిమాల్లో నటించనని నటి భావన శపథం చేశారు. తన మాజీ కారు డ్రైవర్ సహా ఆరుగురు నటి భావనను కిడ్నాప్నకు పాల్పడిన సంఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి స్నేహ సహా పలువురు నటీమణులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భావన కిడ్నాప్ సంఘటన గురించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికరవైున అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే కిడ్నాప్నకు పాల్లడ్డ వ్యక్తుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్ల ద్వారా భావన కిడ్నాప్ సంఘటనలో ఒక ప్రముఖ నటుడు, ఒక రాజకీయనాయకుడి ఇద్దరు కొడుకులు వారితో పలుమార్లు మాట్లాడినట్లు, నేరస్థుల వాగ్మూలంలో ఈ సంఘటనకు రూ.50 లక్షలు బేరం జరిగినట్లు బయట పడింది. ఈ వ్యవహారంలో ఓ మలయాళ నటుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నటి భావన కిడ్నాప్ కేసులో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు. అయితే ఆ మళయాళ నటుడి మాజీ భార్యకు నటి భావనకు మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. భర్తతో తనకు ఎదురైన చేదు అనుభవాలను భావనతో పంచుకున్నారని, భావన ఈ విషయాలను ప్రముఖ నటులకు, కొందరు రాజకీయనాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేలా పోరాడినట్లు ప్రచారం జరిగింది. దీంతో 2014 తరువాత ఆమెకు మలయాళంలో అవకాశాలు లేవు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన భావన అక్కడ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.దీంతో మళ్లీ మలయాళంలో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్కు జంటగా ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే తనను కిడ్నాప్ చేసిన దోషులకు తగిన శిక్ష పడేవరకూ తాను సినిమాల్లో నటించనని భావన శపథం చేసినట్లు నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా నటి భావనను లైంగికంగా వేధించిన దృశ్యాలను సెల్ఫోన్ లో చిత్రీకరించిన వ్యక్తులు వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
ప్రేమజంట బలవన్మరణం
బావతో వివాహం చేశారని ప్రియుడితో కలసి బాలిక అఘాయిత్యం బొంరాస్పేట: ప్రేమికుల దినోత్సవానికి ముందురోజు విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని, బావతో వివాహం చేశారని మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రియుడితో కలసి ఆత్మ హత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల శివారులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ నందిగామ మండలం పిట్టల గూడేనికి చెందిన గంగిశెట్టి సత్తయ్య రెండో కుమారుడు మధు(23) స్థానికంగా ఓ కూర గాయల నర్సరీ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వన్పలి చెన్నయ్య, నిర్మల దంపతుల ఏకైక కూతురు అఖిల(16) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్లో మధు తమ కూతురును కిడ్నాప్ చేశాడని అఖిల కుటుంబీకులు కేసు పెట్టడంతో 40 రోజుల పాటు అతడు జైలుశిక్ష అనుభ వించాడు. అఖిల కుటుంబీకులు అదే గ్రామానికి చెందిన ఆమె మేనబావ గంగిశెట్టి మల్లేశ్కు ఇచ్చి డిసెంబర్లో పెళ్లి చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మధు, అఖిల బైక్పై బయలుదేరి వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల శివారులోని కృష్ణగిరి ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటలకు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మా ప్రేమను కాదంటున్నందుకు ఇద్దరం పారిపోయి వచ్చాం.. ఇక్కడ ఆత్మహత్య చేసుకుం టున్నాం..’అని చెప్పారు. ఇద్దరూ తమతో తీసుకొచ్చిన గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదే హాలను కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. -
తల్లిదండ్రుల చెంతకు నవ్యశ్రీ
కిడ్నాప్ కథ సుఖాంతం సమాచారం ఇచ్చిన యాదయ్యకు అవార్డు అందజేస్తామన్న డీఎస్పీ మహబూబ్నగర్ క్రైం: అపహరణకు గురైన బాలిక నవ్యశ్రీ మంగళవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. జనవరి 29న తిరుపతిలో ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్కు గురైన నవ్యశ్రీ సోమవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో దొరికిన విషయం విదితమే. మహబూబ్నగర్లో డీఎస్పీ భాస్కర్ కథనం ప్రకారం.. ఆనంతపురం జిల్లా తుమ్మచేర్ల గ్రామానికి చెందిన మహాత్మ, లక్ష్మిలు కూతురు నవ్యశ్రీతో కలసి తిరుపతి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో నిద్రించారు. అదే సమయంలో నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలస్వామి అపహరించాడు. చిన్నారిని స్వగ్రామమైన అంతారం గ్రామానికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు పాప ఎక్కడిదని యాదయ్యను నిలదీశారు. దీంతో అతను బాలికను శ్రీశైలంలో వదిలిరావాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి మిడ్జిల్ మీదుగా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే తోటి ప్రయాణికుడు యాదయ్య పరిస్థితిని గమనించి నవ్యశ్రీ గురించి వివరాలు ఆరా తీశాడు. బాలస్వామి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు బాలస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నవ్యశ్రీని తిరుపతిలో అపహరించి తీసుకువచ్చానని ఒప్పుకున్నాడు. మహబూబ్నగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో నవ్యశ్రీని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నవ్యశ్రీ ఆచూకీని తెలిపిన యాదయ్యకు డీజీ చేతుల మీదుగా రివార్డు ఇస్తామని డీఎస్పీ తెకలిపారు. -
నవ్యశ్రీ క్షేమం...
తిరుపతిలో కిడ్నాపైన నవ్యశ్రీ మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో లభ్యం బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న మిడ్జిల్ పోలీసులు మిడ్జిల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి కిడ్నాప్నకు గురైన చిన్నారి నవ్యశ్రీ (4)ని నిందితుడు తరలిస్తుండగా మహబూబ్నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడు బాలస్వామి బస్సులో జడ్చర్ల మీదుగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వైపు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని, చిన్నారి ని తమవద్దే ఉంచారు. వివరాలు.. అనంతపు రం జిల్లా కనగానిపల్లి మండల పరిధిలోని తగరకుంటకి చెందిన నవ్యశ్రీ తండ్రి మహం త, తల్లి వరలక్ష్మి, తమ్ముడు హర్షతో కలిసి తిరుపతి వెళ్లింది. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానం ఆవరణలో నిద్రి స్తున్న నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొం డపల్లి మండల పరిధిలోని అంతారానికి చెందిన వడ్డె బాలస్వామి ఎత్తుకొచ్చాడు. అదేరోజు రాత్రి తిరుపతి నుంచి జడ్చర్లకు వచ్చాడు. సోమవారం జడ్చర్ల నుంచి తన సొంత గ్రామానికి బస్సులో వెళ్తుండగా.. వారు కూర్చున్న సీటు వెనుకభాగంలో దేవరకొండకు చెందిన యాదయ్య కూర్చున్నా డు. చిన్నారి మధ్యమధ్యలో ‘మా అమ్మ ఏదీ.. ఎక్కడుంది’.. అంటూ మారాం చేస్తుండడం తో యాదయ్యకు అనుమానం వచ్చింది. ఈ పాప ఎవరని పలుమార్లు బాలస్వామిని ప్రశ్నించాడు. కానీ అతను మా పాపే అంటూ బుకాయించాడు. అతని ప్రవర్తనపై అనుమా నం రావడంతో మిడ్జిల్ పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. బస్సు మిడ్జిల్ దగ్గరికి వెళ్లగానే పోలీసులు ఆపి.. ఆ చిన్నారిని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో విచారణ జరుపుతుండగా, చిన్నారి తనను మా అమ్మ చనిపోయిందని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. అయితే, ఆ చిన్నారిని పెంచుకునేందుకు కిడ్నాప్ చేసిన్నట్లు నిందితుడు బాలస్వామి పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. నవ్యశ్రీ తగరకుంటలోని రోహిత్ ఇంగ్లిష్ మీడియంలో ఎల్కేజి చదువుతున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఎస్ఐ సైదులను వివరణ కోరగా చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు బాలస్వామి, చిన్నారి, తమ అధీనంలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడికి మతిస్థిమితం లేదా? నిందితుడు బాలస్వామి తల్లిదండ్రులు చనిపోయారు. ఇతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. గ్రామంలో కట్టెలు కొట్టేందుకు కూలికి వెళ్తాడని, ఆ డబ్బులతో దేవస్థానాలు తిరుగుతాడని గ్రామస్తులు తెలిపారు. ఇతను ఈ పాపను ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియడం లేదని చెబుతున్నారు. కాగా, గతంలో ఇతనిపైనే ఎలాంటి కేసులు లేవని తెలిసింది. -
తిరుమలలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
-
తిరుమలలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ప్రత్యేక బృందాలతో గాలింపు సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్నకు గురైంది. అనంత పురం జిల్లా కనగనపల్లి మండలం తుముచెర్లకు చెందిన మహాత్మ, వర లక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ (5), కుమారుడు హర్ష వర్దన్ (3)తో కలసి శని వారం తిరుమల వచ్చా రు. గదులు లభించకపో వడంతో మాధవం యాత్రిసదన్లోని ఐదో నంబరు హాలులో 1016 లాకర్ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికెళ్లి ఆదివారం ఉదయం 6కు తిరిగి యాత్రిసదన్కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్యశ్రీ(5)పై దుప్పటి ముసుగేసి కిడ్నాప్ చేశాడు. ఉదయం 8 తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్కుగురయ్యారు. యాత్రిసదన్ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించ లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్–2లోని సీసీ కెమెరా రికార్డు లను పరిశీలించారు. ఉదయం 7.40కు పసుపురంగు టీ షర్ట్, నీలిరంగు జీన్స్ ప్యాంటు ధరించిన ఆగంతకుడు ముఖం కనిపించకుండా ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు గుర్తించారు. ఆ చిత్రాలను మీడియాకు విడుదల చేశారు.నవ్యశ్రీ కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తిరుమల డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. -
కిడ్నాప్ హైడ్రామా..!
ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం 3 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు పోలీస్స్టేషన్లో ఉండి పర్యవేక్షించిన సీపీ స్నేహితుడే కిడ్నాపర్గా గుర్తింపు అబిడ్స్: ఇంజనీరింగ్ విద్యార్ధిని కిడ్నాప్ నగరంలో కలకలంరేపింది. కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని రాత్రి వరకు ఇంటికి రాకపోగా ఆమె ఫోన్తోనే రూ.30 లక్షలు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపుతామంటూ బెదిరింపు కాల్ రావడంతో నగర పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లోనే మకాం వేసి కిడ్నాప్ కేసును చేధించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని బేగంబజార్ బేదర్వాడికి చెందిన విద్యార్ధిని(20), శాలిబండ ప్రాంతానికి చెందిన అభిషేక్(20) బండ్లగూడ మహవీర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని రాత్రి 10 గంటల దాటినా ఇంటికి చేరుకోలేదు. అదే సమయంలో ఆమె ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశానని, వెంటనే రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిచో చంపేస్తానంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక కాలేజీలో గాని, పోలీస్స్టేషన్లో గానీ ఫిర్యాదు చేస్తే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో విద్యార్ధిని తండ్రి, బాబాయి షాహినాయత్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందడంతో నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి రాత్రి 11 గంటల సమయంలో షాహినాయత్ గంజ్ పోలీస్స్టేషన్కు వచ్చి దర్యాప్తును పర్యవేక్షించారు. వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు, టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బంది కిడ్నాపర్ ఆచూకీ కోసం 3 గంటల పాటు శ్రమించారు. మంగళవారం తెల్లవారుజామున కిడ్నాపర్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను శాలిబండ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు అభిషేక్తో పాటు విద్యార్ధినిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధిని స్నేహితుడే కిడ్నాపర్ కావడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఉరుకులు పెట్టించిన ఫోన్ నెంబర్... కిడ్నాపర్ అభిషేక్ ముందుగా సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో సాయంత్రం గదిని అద్దెకు తీసుకోవడంతో పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ 3 గంటల పాటు ఉండి అభిషేక్, ఆ విద్యార్ధినితో లాడ్జ్ ఖాళీ చేసి మెహిదీపట్నం చేరుకున్నాడు. మెహిదీపట్నంలో ఫోన్ నెంబర్ ఆధారంగా టాస్క్ఫోర్స్, ఇతర పోలీసులు అక్కడకు వెళ్లగా వారి ఆచూకీ లభించకపోవడంతో అక్కడి నుంచి చార్మినార్ వెళ్లారు. చార్మినార్ సమీపంలోని శాలిబండ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ డ్రామా నడిపిన విద్యార్ధి అభిషేక్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్) : బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని బుధవారం మూడో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నగర సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని హమల్వాడికి చెందిన మాదాస్ రాజు అనే యువకుడు కొద్దిరోజుల క్రితం దుబ్బా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం నిజామాబాద్కు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు రాజుపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం రాజుపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
బాలికపై 5 నెలలుగా అత్యాచారం
పాలంపూర్(గుజరాత్): అపహరణకు గురై ఆ తరువాత రూ.80 వేలకు అమ్ముడుపోయి ఐదు నెలలుగా అత్యాచారానికి లోనైన 13 ఏళ్ల బాలికను సోమవారం రాత్రి పోలీసులు గుజరాత్లోని బానస్కాంత జిల్లాలోని మాన్పురా గ్రామంలో కాపాడారు. ఆమెను రేప్చేసిన వ్యక్తితో సహా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్కు చెందిన బాలిక కుటుంబం గుజరాత్లోని బానస్కాంత జిల్లాలోని రూపాపుర గ్రామానికి వలసొచ్చింది. 5 నెలల క్రితం ఆమెను ముగ్గురు కిడ్నాప్ చేసి వేరొకతనికి రూ.80 వేలకు అమ్మారు. అతడు బాధితురాలిని ఓ పొలంలో బందీగా ఉంచి 5నెలలకాలంలో పలుమార్లు రేప్ చేశాడు. తన కూతురు కనిపించకుండా పోవడంతో బాధితురాలి తండ్రి సిహోరీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు పరిష్కారమైంది. -
ఇరాక్లో తెలంగాణ వాసి కిడ్నాప్
కోరుట్ల(సిరిసిల్ల రాజన్న): బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన సిరిసిల్ల జిల్లా వాసి గుర్తు తెలియని దుండగుల చేతిలో కిడ్నాప్కు గురయ్యాడు. వివరాలివీ.. ఇబ్రహీంపట్నం మండలం కొజాన్కొత్తూర్ గ్రామానికి చెందిన బి.రవి ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అతడుండే ప్రాంతంలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు రెండు రోజుల క్రితం రవిని ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని తోటి వారు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. ప్రస్తుతం రవి పొరుగునే ఉన్న టర్కీ దేశంలో ఉన్నట్లు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. అతడి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
కిడ్నాప్ కలకలం
అనంతపురం సెంట్రల్ : అప్పు తీసుకున్న వ్యక్తిని కాల్మనీ నిర్వాహకులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. గుత్తికి చెందిన రవీంద్ర బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి గంగాధర్కు రూ.10లక్షల వరకు అప్పు ఉన్నాడు. కొద్ది రోజులుగా రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి ఆచూకీ కనుగొన్న గంగాధర్, అతని బంధువులు రవీంద్రను గుత్తి నుంచి అనంతపురానికి ఓ వాహనంలో తీసుకువచ్చారు. నగరంలో వడ్డీ వ్యాపారంతో పైకొచ్చినట్లు విమర్శలు ఎదుర్కొనే ఓ ప్రజాప్రతినిధి కుమారుడి వద్ద పంచాయితీ చేసేందుకు ప్రయత్నించారు. వివాదం పెద్దది కాకుండా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రూరల్ సీఐ కృష్ణమోహన్ మార్గం మధ్యలోనే వారితో చర్చించి సమస్యను సద్దుమణిగించారు. ఈ విషయంపై సీఐని వివరణ కోరగా.. అది కిడ్నాప్ కాదని, డబ్బు బాకీ ఉండడంతో పంచాయితీ కోసం అనంతపురం పిలుచుకొచ్చారని తెలిపారు. విషయం తెలియడంతో వారిని స్టేషన్కు పిలించినట్లు వివరించారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. న్యాయం జరగలేదని భావిస్తే గుత్తి పోలీస్స్టేషన్ను కానీ, కోర్టును కానీ ఆశ్రయించాలని సూచించినట్లు చెప్పారు. -
కిడ్నాప్ చేస్తానని బెదిరించిన యువకుడి అరెస్టు
గిద్దలూరు : కిడ్నాప్ పేరుతో బెదిరింపులకు పాల్పడిన యువకుడిని గిద్దలూరు పోలీసులు మంగళవారం చాకచక్యంగా అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీహరిబాబు ఆ కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన దూదేకుల మస్తాన్ స్థానిక కాశినాయననగర్లో మార్బుల్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు నలుగురు పిల్లలు కాగా, నంద్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్లో తల్లి వద్దే ఉంచి చదివిస్తున్నాడు. మస్తాన్ పిన్నమ్మ కుమారుడు దూదేకుల నాగేంద్రబాబు ఇతరుల సిమ్కార్డులు, సెల్ఫోన్లను వినియోగించి ఁనీ పిల్లలను కిడ్నాప్ చేస్తున్నా* అంటూ మస్తాన్కు వాట్సాప్ మెస్సేజ్లు పెట్టి భయపెట్టాడు. రెండు రోజులకోసారి కొత్త కొత్త నంబర్లతో వాట్సాప్ ద్వారా టెస్ట్, వారుుస్ మెస్సేజ్లు చేస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మస్తాన్.. ఈ నెల 13వ తేదీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు వారాలుగా దర్యాప్తు చేసి నిందితుడు వాడిన సెల్ఫోన్లు, సిమ్ల ఆధారంగా వలపన్ని పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడిని పట్టుకున్న గిద్దలూరు, కొమరోలు ఎస్సైలు ఆర్.రాంబాబు, ప్రభాకర్రెడ్డి, కానిస్టేబుల్లను ఎస్పీ త్రివిక్రమవర్మ ఫోన్లో అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీరాం, ఎస్సై మల్లికార్జున, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంగ్లీష్ కోసం అమెరికన్ ని కిడ్నాప్ చేయించిన దేశాధ్యక్షుడు?
సియోల్: ఒక దేశాధ్యక్షుడు తన పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం అమెరికన్ ను కిడ్నాప్ చేయించాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర కొరియా మాజీ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ ఈ పని చేసినట్లు అంతర్జాతీయంగా రిపోర్టులు వస్తున్నాయి. తన పిల్లలకు ఇంగ్లీష్ భాషను నేర్పించాలనే కోరికతో చైనా సాయం తీసుకుని బర్మా విహారయాత్రకు వచ్చిన ఓ అమెరికన్ విద్యార్ధిని 2004లో ఇల్ కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది. ఇల్ కిడ్నాప్ కు పాల్పడినట్లు వస్తున్న వార్తలు నిజమేనని దక్షిణకొరియా అంటుండగా.. కిడ్నాప్ ఉదంతాన్ని అమెరికా ఖండించింది. సియోల్ కు చెందిన ఆచూకీ లేకుండాపోయిన వారి వివరాల యూనియన్ అధ్యక్షుడు చోయ్ సంగ్ యాంగ్ కిడ్నాపైన యువకుడు ఇప్పటికీ ప్యోంగ్ యాంగ్ లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. అతని అసలు పేరు డేవిడ్ స్నెడన్ (36)కాగా, యూన్ బోంగ్ సో(కొరియన్ పేరు)గా మార్చుకున్నట్లు తెలిపారు. కిమ్ ఉన్ హేయీ అనే యువతిని డేవిడ్ వివాహం చేసుకున్నాడని, అతని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు చోయ్ పేర్కొన్నారు. పిల్లలకు(ప్రస్తుత ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్) ఇంగ్లీష్ ను భాషను సాధారణ వ్యక్తితో బోధించడంతో కన్నా.. మాతృభాషగా కలిగిన వ్యక్తితో బోధిస్తే బాగుంటుందని ఇల్ అభిప్రాయపడ్డారని అందుకు స్నెడెన్ ను కిడ్నాప్ చేయించినట్లు రిపోర్టుల్లో ఉంది. దీంతో అధ్యక్షుడి ఆదేశాలతో సైనికులు బ్రింగ్ హామ్ యంగ్ యూనివర్సిటీలో చదువుతున్న స్నెడన్ ను కిడ్నాప్ చేసి ఉత్తరకొరియాకు తీసుకువెళ్లారు. తమ కుమారుడు ఆచూకీ కనిపించకుండాపోవడంతో తండ్రి రాయ్ స్నెడన్ చాలా చోట్ల వెతికిచూశారు. చివరకు చనిపోయి ఉంటాడని భావించి వదిలేశారు. అయితే, నాలుగేళ్ల క్రితం డేవిడ్ స్నెడన్ ప్యోంగ్ యాంగ్ లో ఉన్నట్లు వారికి సమాచారం అందింది. డేవిడ్ ఆచూకీలేకుండాపోవడంలో ఉత్తర కొరియా పాత్ర ఉందనడంలో అర్ధం లేదని వారు భావించారు. కొద్ది రోజుల తర్వాత చైనాలోని బీజింగ్ లో కనిపించిన డేవిడ్ కొరియన్ మహిళతో కనిపించాడు. తన పిల్లలకు కొరియన్ భాషను నేర్పించాలని ఆమె డేవిడ్ ను కోరింది. దీంతో పాటు డేవిడ్ స్నేహితుడు ఒకరు ఉత్తర కొరియాకు దగ్గరలోని యాంజీ పట్టణంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. స్నేహితుడితో కలిసి డేవిడ్ చైనా నుంచి ఉత్తరకొరియాకు అక్రమంగా తరలివెళ్లే వారి సాయం చేస్తున్నట్లు రిపోర్టులు కూడా వచ్చాయి.కిమ్ జోంగ్ ఇల్ నేతృత్వంలో జపనీయులు, రోమేనియన్లు, లేబనీయులను కిడ్నాప్ చేయించినట్లు పలుమార్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
నడిరోడ్డుపై రియల్టర్ కిడ్నాప్
లంగర్హౌస్: ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు కూత వేటు దూరంలో నడిరోడ్డుపై కొందరు దుండగులు బుధవారం సాయంత్రం ఓ రియల్టర్ను కిడ్నాప్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... లంగర్హౌస్ పద్మానాభనగర్ కాలనీ నివాసి దావూద్(35) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మొఘల్నగర్లో ఉండే స్నేహితుడు ఇల్యాజ్తో కలిసి సొంత పనిపై టోలిచౌకీ వెళ్లాడు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా.. నానల్నగర్ వద్ద టోలిచౌకీ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ కు ఎదురు రోడ్డులో వేగంగా దూసుకు వచ్చిన రెండు కార్లు వీరి కారుకు అడ్డంగా నిలిచాయి. కార్లలోంచి దిగిన కొందరు దావూద్పై దాడి చేసి పెప్పర్ స్పే్ర చల్లారు. అనంతరం దావూద్ను కిడ్నాప్ చేసి తమ కారు (ఏపీ 28 డీసీ 4392)లో తీసుకెళ్లారు. దావూద్ స్నేహితుడు ఇల్యాజ్ను తీవ్రంగా కొట్టి రోడ్డుపై పడేశారు. నడిరోడ్డుపై జరిగిన ఈ కిడ్నాప్ను చూసి వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి కోలుకున్న ఇల్యాజ్ స్థానికుల సహాయంతో లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించారు. ఇల్యాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిఫ్నగర్ ఏసీపీ గౌస్మొహినుద్దీన్ ఆధ్వర్యం లో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి వెంటనే గాలింపు ప్రారంభించారు. కిడ్నాపర్ దావూద్ పెదనాన్న కుమారుడు ముజాఫర్గా అనుమానిస్తున్నట్లు ఇల్యాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందరినీ కిడ్నాప్ చేస్తా... కిడ్నాప్ చేసింది ఎవరని పోలీసులు విచారణ చేస్తుండగా మరి కొందరు బాధితులు లంగర్హౌస్ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. రియల్టర్ దావూద్ను అరెస్టు చేశానని, తనకు డబ్బు ఇవ్వకుపోతే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చే స్తానని ఓ వ్యక్తి బెదిరిస్తున్నట్లు భాదితులు పేర్కొన్నారు. గతంలో ముజాఫర్ తమతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడన్నారు. -
చెంచాతుర్యం... దాని మహత్యం!
హ్యూమర్ ‘‘ఒరేయ్... చెంచాను కాస్త చిన్న చూపు చూశారేమోనని అనిపిస్తోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు స్పూన్తో అన్నం ప్లేట్లో కూర పెట్టుకుంటూ. ‘‘చెంచాకు చిన్నచూపు ఏమిట్రా?’’ అడిగాను నేను అయోమయంగా. ‘‘చెంచాగాడు అనే మాట విన్నావా?’’ అడిగాడు వాడు. ‘‘విన్నాను’’ జవాబిచ్చాను. ‘‘మరి... ఆ మాట తప్పుకదా. నమ్మకమైన సహచరుడినీ, ఎప్పుడూ వెంట వెంట ఉండే అనుచరుణ్ణీ అలా చెంచాతో పోల్చి చెంచాగాడు అని కించపరచడం సరికాదు కదా’’ అన్నాడు వాడు. దాంతో రాంబాబుగాడు చెప్పే మాట కూడా లాజికల్గా కరక్టే కదా అనిపించి ‘‘అవును రా’’ అన్నాను. ‘‘అంతేకాదు రా... పాశ్చాత్యులు ఏదో స్పూన్ పట్టుకు తింటుంటారనీ, మనం స్పూన్తో తినం అనీ అంటుంటారు గానీ... నిజానికి స్పూన్ కనిపెట్టింది కూడా మనమేరా. విదేశీయులు మన స్పూన్ను కిడ్నాప్ చేశారు’’ అన్నాడు వాడు. ‘‘అదేమిట్రా. మనం చేత్తోనే కదా తింటాం. వాళ్లే కదా చెంచాను మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదెలా నిజం?’’ అడిగాను. ‘‘ఒరేయ్... ఉగ్గుపాలతో పెట్టిన విద్య అనే సామెత విన్నావ్ కదా. అంటే మనవాళ్లు పాలు పట్టడానికి ప్రత్యామ్నాయంగా ఉగ్గు కనిపెట్టారు. అలాంటప్పుడు చెంచాను మనం కనిపెట్టినట్టే కదా’’ ‘‘చెంచాకూ, ఉగ్గుకూ సంబంధం ఏమిట్రా?’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... చిన్న ఉగ్గుగిన్నెకు కాస్త పొడవైన కాడ పెట్టామనకో. అది స్పూనే అవుతుంది. అలా మనం కనిపెట్టిన చెంచాను పాశ్చాత్యులు కొట్టేసి, దానికి పేటెంట్ పట్టేశారు. ఉగ్గుపాలు పట్టడం అనే మాటను స్పూన్ ఫీడింగ్ అని వాళ్లు ట్రాన్స్లేటింగ్ చేసుకున్నారు. అంతేకాదు. నీలాంటి అమాయకుల చేత దాన్ని తామే కనిపెట్టినట్లుగా అనిపిస్తున్నారు. చూశావా... వాళ్ల అతితెలివితేటలూ!’’ అన్నాడు వాడు. ‘‘నిజమేరా. నువ్వు చెప్పాక తెలుస్తోంది’’ అన్నాను నేను. ‘‘ఆ... కరక్టే కదా. గంటె, గరిటె, చిల్లు గంటె, జల్లిగంటే అనే పెద్ద పెద్ద వాటికే మన వంట ప్రక్రియలో స్థానం ఉన్నప్పుడు... స్పూన్ను వాళ్లు కనిపెట్టడానికి ఆస్కారమే లేదు కదా. పైగా పాయసంలో గరిటలా పాడు బతుకు వద్దు అనే సామెత మనకు ఎప్పుడో ఉంది. ఎన్నో రకాల గరిటెలూ, గంటెలూ మన దగ్గర ఉన్నప్పుడు స్పూన్ను వాళ్లు కనిపెట్టి, దాన్ని మన దగ్గరకు వాడకంలో తెచ్చి ఉద్ధరించారనడానికి ఆస్కారమే లేదు. మనం ఈ విషయం కనిపెడతామేమోనని, అది వాళ్లదేనని చెప్పడానికి ఇంగ్లిష్లో కొన్ని సామెతలు కూడా సృష్టించే కుట్ర చేశారు’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటా కుట్ర?’’ అడిగా. ‘‘నోట్లో వెండి చెంచాతో పుట్టడం అన్న సామెత ఇంగ్లిష్లోనే ఉందనీ, దాన్ని మన వారు కాపీ కొట్టారనీ భ్రమింపజేశాడు ఇంగ్లిష్ వాడు’’ అన్నాడు వాడు కోపంగా. ‘‘నిజమేరోయ్’’ అన్నాను. ‘‘అసలు... చెంచా అన్నమాట ఎలా పుట్టిందో తెల్సా నీకు?’’ అడిగాడు. ‘‘తెలియదు రా’’ ‘‘నోట్లో చెంచా పెట్టుకొని అందులో గోలీ పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఆడే ఆట చూశావు కదా. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ గోలీ కిందపడిపోతుంది. అది ‘చంచలమైనది’ అంటూ చెబుతూ ముందు రెండక్షరాలనూ తీసుకొని చెంచా అనే మాటను సృష్టించారురా మన తెలుగువాళ్లు. అలా చెంచా అనే మాట పుట్టిందన్నమాట. అంతేకాదు... పొడవు, బరువు, టైమ్లకు ఫిజిక్స్లో లెంగ్త్, మాస్, టైమ్ అనే ప్రధానమైన డైమన్షన్లు ఉన్నట్లే స్పూన్కు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాల్రా! ఈ విషయం చెంచా అనే కొలతకు తగిన స్థానం కలిగించమంటూ వరల్డ్ ఫిజిక్స్ అసోసియేషన్ వారికీ, సైంటిస్టులకూ ఓ విజ్ఞాపన ఇద్దామని అనుకుంటున్నా’’ అన్నాడు వాడు. ‘‘అదెలా... లెంగ్త్, మాస్, టైమ్... ఈ మూడే కదా ప్రధానమైన అంశాలు. చెంచాకూ వాటికీ సంబంధం ఏముంది’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... పొడవు, పదార్థమూ, సమయాలలాగే చెంచా కూడా ప్రత్యేకమైన కొలతే! అందుకే ఫలానా మందు ఎంత తీసుకోవాలి అని అడిగితే ఒక టీ స్పూను తీసుకోవాలంటారు. అలాగే వంటలో ఫలానా దినుసు ఎంత వాడాలంటే ఒక టేబుల్ స్పూన్ అంటారు. మరి అలాంటప్పుడు అది కూడా ఒక యూనిట్టే కదా. ఆలోచించు’’ అన్నాడు వాడు. ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘సరే రా. నువ్వు లెటర్ రాయి. దానికి అవసరమైన స్టాంపులు నేను అంటిస్తాను’’ అన్నాను వాడితో. ‘‘నువ్వురా నాకు అసలు సిసలైన చెంచాగాడివి’’ అంటూ ప్రశంసించాడు వాడు. - యాసీన్ -
సన్నాఫ్ స్పీకర్.. వాటాల కోసం గూండాగిరీ
కోడెల ‘పెదబాబు’ దాష్టీకం... - రైల్వే కూలీలు, ఉద్యోగులపై అనుచరుల దాడి - పనుల వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను పీకేసి దౌర్జన్యం - మూడు లారీలు, ఒక రైల్వే ఉద్యోగి కారు ధ్వంసం - డ్రైవర్, సూపర్ వైజర్ల కిడ్నాప్ - పర్సంటేజీ ఇవ్వకుండా పనిచేస్తారా అంటూ వార్నింగ్ - ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయకపోతే తగలబెడతామంటూ బెదిరింపులు సాక్షి, గుంటూరు : ‘‘పెదబాబుకు చెప్పకుండా.. ఆయన అనుమతి లేకుండా.. పనులు చేయడానికి మీకెంత ధైర్యంరా...’’ అంటూ రైల్వే కూలీలు, ఉద్యోగులపై కొందరు గూండాలు విచక్షణారహితంగా దాడి చేయడం ఆదివారం గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది.. అధికార పార్టీ నేతల గూండాగిరికి ఇదో మచ్చుతునక.. ఎక్కడ ఏ పని జరిగినా అందులో వాటా ఇవ్వాల్సిందేనంటూ ‘తమ్ముళ్లు’ సాగిస్తున్న దౌర్జన్యకాండకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ‘పెదబాబు’ అంటే స్పీకర్ కోడెల శివప్రసాదరావు పెద్దకుమారుడు శివరామకృష్ణే అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఎవరినడిగినా చెబుతారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన సుమారు 35 మంది శివరామకృష్ణ అనుచరులు పెదనెమలిపురి గ్రామ పరిధిలో నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు చేస్తున్న ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న వారితోపాటు, పనులు చేస్తున్న కూలీలపై విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారు నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న షెడ్లను, అక్కడ పనులు నిర్వహిస్తున్న టిప్పర్ వాహనాలను, అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఓ డ్రైవర్తోపాటు, సైట్ సూపర్వైజర్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.దీంతో కూలీలు, రైల్వే ఉద్యోగులు, తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. తమకు వాటా ఇవ్వకుండా పనులు నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడెల తనయుడు గతంలోనే రైల్వే కాంట్రాక్టరును పలుమార్లు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోవడంతో రెండు నెలల క్రితం రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతంలో దాడి చేశారు. అయినా దారికి రాకపోవడంతో రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్, కూలీలపై మరోమారు ఆదివారం దాడులకు తెగబడ్డారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్రలు, రాడ్లతో దాడి ఆదివారం మధ్యాహ్న సమయంలో మూడు కార్లు, పలు ద్విచక్ర వాహనాలలో సుమారు 35 మంది దుండగులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. ఇక్కడ పనులు నిలిపివేయకుంటే ప్రాణాలు తీస్తాం, షెడ్లను తగలబెడతామంటూ బెదిరింపులకు దిగారు. కూలీలు ఉండే రేకుల షెడ్లను పీకేశారు. మూడు టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే శాఖకు చెందిన బొలేరో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే సిబ్బందిగా ఉన్న డ్రైవర్ కృష్ణ, సూపర్వైజర్ ఎమ్డీ ఉస్మాన్లను కొట్టుకుంటూ తమ వాహనాల్లో ఈడ్చి పడేసి కిడ్నాప్ చేశారు. కర్రలతో, రాడ్లతో కార్మికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. తీవ్రంగా భయపడిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత తేరుకున్న కూలీలు రైల్వే శాఖ ఉద్యోగులకు సమాచారం అందించి, స్వల్ప గాయాలైన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనపై పలువురు సిబ్బంది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు స్థానిక నాయకులు వాటాలు అడుగుతూ అడ్డు తగలడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పనులు నిలిపివేస్తామన్నారు. వాటా కోసం కాంట్రాక్టర్పై ఒత్తిడి... రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు గత ఐదు నెలలుగా జరుగుతున్నాయి. పెదనెమలిపురి నుంచి రొంపిచర్ల వరకు 16 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే నష్టపరిహారం అందించి భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రతి పనికి పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న కోడెల తనయుడు తన వాటా పంపాలంటూ సదరు కాంట్రాక్టర్కు పలు మార్లు కబురు పంపారని తెలుస్తోంది. అయితే వాటిని కాంట్రాక్టరు పట్టించుకోకపోవడంతో కోడెల తనయుడి అనుచరులు రెండు నెలల క్రితం దాడి చేసి టిప్పర్లు, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసులతో బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పట్లో దీనిపై సదరు కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పంచాయతీ కూడా పెట్టాడని సమాచారం. అయితే ఎవరు చెప్పినా తన వాటా ఇవ్వనిదే పనులు కొనసాగనిచ్చేందుకు అంగీకరించని కోడెల తనయుడు తన అనుచరులతో ఆదివారం రైల్వే పనులు చేపడుతున్న కార్మికులపై దాడికిదిగారు. షెడ్లు ఖాళీ చేయకుంటే తగలబెడతామన్నారు పది నిమిషాల్లో షెడ్లు ఖాళీ చేయాలని, లేకుంటే తగలబెడతాం అని రాళ్లతోను, ఇనుప రాడ్లతోను కూలీలపై ఎగబడ్డారు. అధికార పార్టీ నాయకులకు చెప్పకుండా పనులు చేస్తారా, మేమంటే లెక్కలేదా అంటూ దుర్భాషలాడారు. -జి రవికుమార్, సైట్ ఇంజనీర్ పది నిమిషాల్లో బీభత్సం పనులు వెంటనే నిలిపివేసి పదినిమిషాల్లో ఈప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ తెలుగుదేశం నాయకులు బీభత్సం సృష్టించారు. పెదబాబుకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా పనులు చేయడానికి మీకు ఎంత ధైర్యంరా... అంటూ మాపై ఎగబడ్డారు. అడ్డు వచ్చిన వారిని చితకబాదారు. -బి ప్రవీణ్రెడ్డి, సైట్ సూపర్వైజర్ స్థానిక నేతలకు చెప్పే పనిలేదా పనులు ప్రారంభించే సమయంలో అధికార పార్టీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీకి చెప్పే పనిలేదురా.. అంటూ దుర్భాషలాడారు. మా నాయకుడిని ఎదిరించే ధైర్యం మీకెవరిచ్చార్రా.... క్షణాల్లో ఖాళీ చేయకపోతే జీపులు, టిప్పర్లు తగలబెడతాం అంటూ బెదిరించారు. -జి రామిరెడ్డి, సైట్ సూపర్వైజర్ -
చెవి దుద్దుల కోసం చిన్నారి కిడ్నాప్..
నల్లకుంట: ఐదేళ్ల చిన్నారిని అగంతుకురాలు కిడ్నాప్ చేసి.. చెవి దుద్దులు తీసుకొని విడిచి పెట్టింది. నల్లకుంట ఇన్స్పెక్టర్ యాదగిరి రెడ్డి కథనం ప్రకారం... అడిక్మెట్ వడ్డెర బస్తీలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో వంటమనిషిగా పని చేస్తున్న వి.దివ్యకు కుమార్తె వి.హర్షిత (5), కుమారుడు భానుప్రసాద్ (7) సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో హర్షిత ఒకటో తరగతి, భానుప్రసాద్ రెండో తరగతి చదువుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న హర్షిత అన్నతో కలిసి అక్కడే ఆడుకుంటుండగా... ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని మహిళ వారి వద్దకు వచ్చింది. చాక్లెట్లు కొనిపెడతానని హర్షితను తీసుకెళ్లింది. ఆకలి వేస్తుండటంతో కొద్ది సేపటికి భాను ప్రసాద్ తల్లి వద్దకు వెళ్లాడు. చెల్లి ఎక్కడ ఉందని తల్లి అడగగా... చీరకట్టుకొని వచ్చిన ఓ అక్క చాక్లెట్ కొనిపెడతానని చెల్లిని తీసుకెళ్లిందని చెప్పాడు. వెంటనే తల్లి పాఠశాల వద్దకు వెళ్లి ఆరా తీయగా హర్షిత ఆచూకీ తెలియకపోవడంతో మధ్యాహ్నం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని ఠాణాలకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా... హర్షితను కిడ్నాప్ చేసిన మహిళ ఆ చిన్నారి చెవులకు ఉన్న గ్రాము బంగారు దుద్దులు తీసుకుని మధ్యాహ్నం అంబర్పేట మహంకాళి ఆలయం వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని స్థానికులు అంబర్పేట ఠాణాలో అప్పగించారు. అప్పటికే నల్లకుంట పీఎస్లో చిన్నారి మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసి అంబర్పేట పోలీసులు వారిని సంప్రదించి.. ఈ బాలికే అక్కడ అదృశ్యమైన హర్షితగా నిర్థారించుకున్నారు. అనంతరం నల్లకుంట పోలీసులు హర్షితను తీసుకెళ్లి తల్లి దివ్యకు అప్పగించారు. కాగా, బాలికను కిడ్నాప్ చేసిన అగంతకురాలి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
కిడ్నాప్..దోపిడీ కేసులో 9 మందికి జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కిడ్నాప్లు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ప్రాసిక్యూటర్ రజిని కథనం ప్రకారం... కాటేదాన్ టీఎన్జీఓ కాలనీ నివాసి శ్రీనివాస్కు జూబ్లీహిల్స్కు చెందిన రాహుల్ తన వద్ద అతీతశక్తులు గల పురాతన రైస్పుల్లర్ ఉందని నమ్మించాడు. శ్రీనివాస్ ఆ రైస్పుల్లర్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2009 మే 14న శ్రీనివాస్, తన మిత్రుడు కృష్ణారెడ్డితో కలిసి తన ఇంటి వద్ద ఉండగా.. అక్కడికి రాహుల్ స్కార్పియో వాహనంలో వచ్చాడు. వాహనంలో అతడి మిత్రులు వెంకటదుర్గారావు, శ్రీధర్, శ్రీనివాస్రెడ్డి, రాజేంద్రప్రసాద్, ధనుష్కుమార్, పోతరాజు, రామలింగప్రసాద్, శ్రీనివాస్రెడ్డి కూడా ఉన్నారు. రైస్పుల్లర్ చూపిస్తామని శ్రీనివాస్, ఆయన మిత్రుడు కృష్ణారెడ్డిని తమ వాహనంలో జూబ్లీహిల్స్ తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించారు. దాడి చేసి వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో పాటు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో శ్రీనివాస్ రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి వారి నుంచి తప్పించుకుని మిత్రుల సహాయంతో శివరాంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొగల్పురా పోలీస్ స్టేషన్లో మరో కేసులో నిందితులుగా ఉండి అరెస్టయిన ఈ తొమ్మిది మందినీ కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గాంధీ.. నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
కంచికచర్ల : మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు సహకరించిన మరోవ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి నందిగామ కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ కె.ఈశ్వరరావు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు మండలంలోని గనిఆత్కూరుకు చెందిన 15ఏళ్ల మైనర్బాలికను అదే గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా ఈ నెల 8న కిడ్నాప్ చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అతనికోసం వెతుకుతున్నామని, శుక్రవారం కరీముల్లాతో పాటు అతనికి సహకరించిన చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన షేక్ బాషాలు గనిఆత్కూరు రోడ్డులో సంచరిస్తుండగా పట్టుకున్నామని అరెస్టు చేసి నందిగామ కోర్టుకు పంపామని ఎస్ఐ తెలిపారు. -
భర్త కబురు లేక కలవరం
కొలిక్కిరాని కిడ్నాప్ ఉదంతం రెండు రోజులపాటు నైజీరియా గవర్నమెంట్కు సెలవులు విశాఖపట్నం : రోజులు గడుస్తున్నా నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీరు సాయిశ్రీనివాస్ జాడ కానరావడం లేదు. ఎనిమిది రోజులు గడిచినా కబురు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. ఇంట్లోని సెల్ మోగగానే చల్లని కబురు వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. తీరా శ్రీనివాస్ ఆచూకీ కోసం బంధువులు ఫోన్ చేశారని తెలిసి నీరశించిపోతున్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లకుండా అమ్మతోనే ఉంటూ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస్ భార్య లలిత అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా కిడ్నాప్పై నైజీరియాలోని భారత హైకమిషన్ చేపడుతున్న చర్యలు తెలుసుకుంటున్నారు. నేడు, రేపు అంటూ కాలయాపన జరుగుతుందే తప్ప పురోగతి ఉండడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు. మరో రెండు రోజుల తర్వాతే... రంజాన్ సందర్భంగా నైజీరియా గవర్నమెంట్కు రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయని అక్కడి భారత హైకమిషన్ నుంచి సమాచారం వచ్చిందని శ్రీనివాస్ భార్య లలిత తెలిపారు. దీంతో మరో రెండు రోజుల తర్వాతే కిడ్నాప్ ఉదంతం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భారత హైకమిషన్ మాత్రం ఆందోళన చెంద వద్దని, సెలవుల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి సురక్షింతంగా శ్రీనివాస్ను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారని, దీంతో ఆశగా ఎదురు చూస్తున్నామని లలిత చెబుతున్నారు. -
మౌనిక కేసులో తండ్రే నిందితుడు
* లైంగికదాడికి యత్నం.. హత్య * వీడిన మౌనిక హత్య మిస్టరీ * నిందితుడి అరెస్టు * 24 గంటల్లో ఛేదించిన పోలీసులు కోరుట్ల/మేడిపల్లి : నవవధువు మౌనిక(19) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కన్నతండ్రే ఆమెపై లైంగికదాడికి యత్నించి ఆ విషయం ఎక్కడ బయటకు చెబుతుందోనని హత్యచేశాడని కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు తెలిపారు. నిందితుడిని కోరుట్ల పోలీస్ స్టేషన్లో సోమవారం అరెస్ట్ చూపారు. సీఐ కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన భూమల్ల నడిపిమల్లయ్య(45)కు భార్య లక్ష్మి, కుమార్తె మౌనిక(19), కుమారుడు మనోజ్(10) ఉన్నారు. ఉపాధి నిమిత్తం మల్లయ్య మూడేళ్లుగా దుబాయ్ వెళ్లొస్తున్నాడు. గత ఏప్రిల్ 4వ మౌనిక నిశ్చితార్థం మేనబావ మొత్కురావుపేటకు చెందిన మహేశ్తో జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పుడు మల్లయ్య దుబాయ్లోనే ఉన్నాడు. అదే రోజు కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 27న మౌనిక పెళ్లి నిర్ణయించి నడిపి మల్లయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో పెళ్లికి పదిరోజుల ముందే స్వగ్రామానికి వచ్చాడు. రూ.5 లక్షల వరకట్నం ఒప్పుకుని వివాహం జరిపించారు. అంతకుముందు మల్లయ్య భార్య లక్ష్మి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు అప్పుచేసింది. కూతురు పెళ్లికి మరో రూ.5లక్షలు అప్పు చేశారు. రూ.9లక్షల అప్పు కావడంతో మల్లయ్య భార్య, కూతురుతో చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఆషాఢమాసం మొదలవుతుండడంతో మౌనికను పుట్టింటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శనివారం సాయంత్రం 5.30గంటలకు మల్లయ్య ద్విచక్రవాహనంపై మోత్కురావుపేటకు వెళ్లాడు. అక్కడే మద్యం తాగి కూతురును తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. గోవిందారం శివారుకు రాగానే రాత్రి 8:15 గంటలకు వర్షం కురిసింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న మామిడి చెట్టు కింద కొద్దిసేపు ఆగారు. అక్కడికి సమీపంలో ఉన్న తన పొలం ఉండడంతో విద్యుత్ మోటార్ ఆన్ చేద్దామని వాన తగ్గాక కూతురును తీసుకుని వెళ్లాడు. అక్కడ విచక్షణ కోల్పోయిన మల్లయ్య ఒక్కసారిగా కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. నివ్వెరపోయిన మౌనిక తండ్రిని దూషిస్తూ ప్రతిఘటించింది. ఈ క్రమంలో తేరుకున్న మల్లయ్య లైంగిక దాడి విషయాన్ని కూతురు బయటకు చెబుతుందేమోనని భయపడ్డాడు. ఆమె చీరకొంగును గొంతుకు బిగించి హత్య చేశాడు. కిడ్నాప్ కట్టుకథ.. మౌనికపై లైంగికదాడికి యత్నించి విఫలమై హత్య చేసిన మల్లయ్య ఆ తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో దేశాయిపేటకు వెళ్లాడు. ఇద్దరు ముసుగు వ్యక్తులు మోటార్సైకిల్పై వచ్చి తనపై మత్తుమందు చల్లి కూతురును ఎత్తుకెళ్లారని గ్రామస్తులకు చెప్పాడు. ఆ వెంటనే గ్రామస్తులు మేడిపల్లి ఎస్సై రవికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మౌనిక కోసం గాలించారు. నడిపి మల్లయ్యతో కలిసి మోతుకురావుపేట, దేశాయిపేట, గోవిందారం పరిసరాల్లో రాత్రంతా వెతికారు. తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం మళ్లీ గాలించగా దేశాయిపేట శివారులోని నడిపి మల్లయ్య పొలం వద్ద మృతదేహం కనిపించింది.పట్టించిన సెల్ఫోన్.. మౌనికను ఇద్దరు ముసుగు దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పిన నడిపి మల్లయ్య, తన సెల్ఫోన్ ఎక్కడో పోయిందని తెలిపాడు. అయితే కూతురు ఫోన్మాత్రం తండ్రివద్ద ఉండడంతో పోలీసులకు అనుమానంవచ్చింది. శనివారం రాత్రి మౌనిక ఆచూకీ కోసం వెతికే సమయంలో మృతదేహం ఉన్న తన పొలం వద్దకు కాకుండా గోవిందారం గుట్టల్లోకి దుండగులు వెళ్లారని చెప్పడం, ఇతర ప్రాంతాల్లో వెతికేలా పోలీసులను మళ్లించడంతో ఈ అనుమానం మరింత బలపడింది. మౌనిక అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆదివారం రాత్రి నడిపి మల్లయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలితో విచారణ చేశారు. దీంతో నిందితుడు అనిన విషయాలు చెప్పాడు. తానే మౌనికపై లైంగికదాడికి యత్నించి హత్య చేసినట్లు అంగీకరించాడు. సోమవారం కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు, ఎస్సై రవి నిందితుడిని అరెస్ట్ చూపారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన హెడ్కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ శ్రీనివాస్ను సీఐ అభినందించారు. -
కిడ్నాప్ అయిన మౌనిక శవమైతేలింది
మేడిపల్లి: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన నవవధువు మౌనిక కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. ఆదివారం దేశాయిపేట శివారులో మౌనిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులే హత్యచేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి తన తండ్రితో బైక్పై వెళ్తున్న మౌనికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దేశాయి పేటకు చెందిన మౌనికకు మోత్కురావు పేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితమే వివాహం అయింది. ఈ క్రమంలో తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు.. తండ్రిని కొట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆమె ఆచూకి కోసం దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఆమె మృతదేహం లభించింది. పోలీసులు నిందితులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నా భర్తను కిడ్నాప్ చేశారు
పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు ప్రొద్దుటూరు క్రైం: తన భర్త గోసుల మురళీని కిడ్నాప్ చేశారని నాగసువర్ణ అనే మహిళ బుధవారం సాయంత్రం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు ఆర్ట్స్ కాలేజి రోడ్డుకు చెందిన గోసుల మురళీ ఓ వాహనానికి యాక్టింగ్ డ్రైవర్గా వెళుతుంటాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం రాత్రి కడప నుంచి ఒక వ్యక్తి మురళీకి ఫోన్ చేసి డ్రైవర్ కావాలని అడిగాడు. పంపిస్తానని చెప్పడంతో కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులు ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని మురళీ ఇంటి వద్దకు వచ్చారు. డ్రైవర్ను చూపించి వస్తానని అతను భార్య నాగసువర్ణతో చెప్పి వారితో కలిసి వెళ్లాడు. అయితే ఆ రాత్రి ఇంటికి రాలేదు. భర్త తన వద్ద రెండు ఫోన్లు ఉండగా ఒక ఫోన్ ఇంటిలో పెట్టి యూనినార్ నెంబర్ గల ఫోన్ను వెంట తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం కడప నుంచి తమకు వచ్చిన నెంబర్కు ఫోన్ చేసింది. తన భర్త గురించి అడుగుగా ఎవరో తన ఫోన్ తీసుకుని మీకు ఫోన్ చేసి ఉంటారని, వారి వివరాలు తెలియవని ఆమెకు జవాబు ఇచ్చాడు. దీంతో ఆమె చేసేదేమి లేక బుధవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువుండాలని..
ఆంట్యానెన్యారివొ: 17 ఏళ్ల యువతి జెన్నీ(పేరు మార్చాం)కి ఫేస్బుక్లో ఎక్కువ మంది మిత్రులుండాలని కోరిక. ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వారి సంఖ్య 310. ఎలాగైనా ఇంకా ఎక్కువ మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండాలని భావించి.. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసింది. అంతే కిడ్నాప్కు గురై రెండు నెలలపాటు లైంగికదాడిని ఎదుర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికాలోని మడగాస్కర్కు చెందిన జెన్నీ ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి చేతిలో కిడ్నాప్కు గురైంది. ఫేస్బుక్లో ఆరునెలల పాటు చాటింగ్ చేసిన 28 ఏళ్ల వ్యక్తి కలుద్దామని చెప్తే నమ్మి వెళ్లి.. అతని ఇంట్లో బందీగా మారింది. రెండు నెలల పాటు తీవ్రమైన లైంగిక దాడిని ఎదుర్కొంది. బందించిన అనంతరం రెండు వారాల పాటు స్పృహలోనే లేకుండా ఆమెకు డ్రగ్స్ ఎక్కించాడు నిందితుడు. తరువాత సైతం తప్పించుకోవాలని చూసిన ప్రతీసారీ మత్తుపదార్థాలను ఆమెపై ప్రయోగించి అణచివేశాడు. నిందితుడి పొరుగింటి వారు జెన్నీని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అతడి బండారం బయటపడింది. పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం జెన్నీ కోలుకుంటున్నా.. మితిమీరిన డ్రగ్స్ ప్రయోగించడం వల్ల ఆమె జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎక్కువ మంది ఉండాలన్న తన కోరికే తన ఈ స్థితికి కారణమని జెన్నీ పోలీసుల వద్ద వాపోయింది. -
సినీనటుడి కిడ్నాప్ కేసులో పురోగతి
హైదరాబాద్: సినీ నటుడు కాలె శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో నగర పోలీసులు మంగళవారం పురోగతి సాధించారు. గత నెల 31వ తేదీన శ్రీనివాసరావును కిడ్నాప్ చేసిన అగంతకులు... రూ. 2 లక్షలు చెల్లిస్తే వదిలేస్తామని అతడి కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేసి.... కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న జలీల్, స్టూడియో9 ఛానెల్లో రిపోర్టర్గా పని చేస్తున్న జగదీశ్వర్ కిడ్నాపర్లుగా సెల్ ఫోన్ల ద్వారా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
పోలీసులమంటూ కిడ్నాప్.
రూ.2 లక్షలు డిమాండ్ పోలీసులను ఆశ్రయించిన ఓ సినీ నటుడు బంజారాహిల్స్: పోలీసులు, మీడియా చానెల్ ప్రతినిధులమంటూ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు ఓ సినీ నటుడిని కిడ్నాప్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్లో నివసించే కాలెపు శ్రీనివాసరావు(48) సినిమాలలో నటిస్తుంటాడు. గతనెల 31న ఉదయం 10.30కి ఐదుగురు యువకులు, ఇద్దరు యువతులు తాము పోలీసులమని, ఓ న్యూస్ చానెల్ ప్రతినిధులమంటూ ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. ‘‘వ్యభిచార గృహం నడిపిస్తున్నావు.. నీపై చాలా కేసులున్నాయి’’ అని బెదిరించారు. ఆయన వద్ద ఉన్న రూ.10,800 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆయనను కొట్టి, కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. ఏటీఎం కార్డు ద్వారా రూ.2500 డ్రా చేశారు. కారులో ఆయనను నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. ‘‘రూ.2 లక్షలు ఇస్తే బతుకుతావు, లేదంటే ఎన్కౌంటర్ చేస్తాం’’ అని బెదిరించారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు దుండగులంతా చింతల్లోని ఓ ఇంట్లోకి వెళ్లగా.. వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు తప్పించుకున్నారు. వారి భయానికి మూడు రోజుల పాటు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న ఆయన శనివారం రాత్రి తనను కిడ్నాప్ చేయడమే కాకుండా చంపుతామని బెదిరించారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చిన వారిలో జలీల్, జగదీష్, రాజు, మధు, సంజయ్రెడ్డి, లక్ష్మి, దుర్గ తదితరులు ఉన్నారని, వీరందరినీ తాను గుర్తుపడతానని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 448,323, 384, 363, 506 కింద కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
నా భర్తను విడిపించండి
► మగ్గాల నిర్వాహకుడి భార్య వేడుకోలు ►24 గంటలు గడిచినా తెలియని జింకా రామాంజనేయులు ఆచూకీ ► రంగంలోకి స్పెషల్, టాస్క్ఫోర్స్ పోలీసులు ధర్మవరం: నా భర్తను విడిపించండి.. అంటూ ధర్మవరంలో కిడ్నాప్నకు గురైన జింకా రామాంజనేయులు భార్య జింకా లక్ష్మిదేవి కన్నీటి పర్యంతమైంది. రామాంజనేయులును కిడ్నాప్ చేశామంటూ వాట్సప్ ద్వారా వీడియో పంపి డబ్బులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రామాంజనేయులు కిడ్నాప్ జరిగినప్పటి నుంచి వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాప్ సంఘటన వెలుగులోకొచ్చి 24 గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదు. ధర్మవరం పోలీసులు, అనంతపురం స్పెషల్ టాస్క్ఫోర్స పోలీసులు రంగంలోకి దిగి మమ్ముర గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి దాకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. విచారంలో కుటుంబ సభ్యులు : రామాంజనేయులు, లక్ష్మిదేవికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి అభిశ్రీ, తనుశ్రీ కుమార్తెలు ఉన్నారు. రామాంజనేయులు శారదానగర్లో 8 మగ్గాలు ఏర్పాటు చేసుకొని కూలీల ద్వారా పట్టు చీరలు తయారు చేస్తుండేవాడు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, వివాదరహితుడని, ఎలాంటి దురలవాట్లు లేవని స్థానికులు చెప్తున్నారు. అయితే శనివారం సాయంత్రం కిడ్నాప్ సంగతి పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు, పట్టణ వాసులు రామాంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. -
యువతిని కిడ్నాప్ చేసిన పూజారి అరెస్ట్
పూజల పేరుతో పరిచయం పెదకాకాని : పూజల పేరుతో యువతికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని శివాలయంలో చదలవాడ కిషన్కుమార్ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను వెంట బెట్టుకుని ఆలయానికి పూజల కోసం వెళుతుండేది. ఈ క్రమంలో పరిచయమైన కిషన్ కుమార్ అలియాస్ కిషోర్ పూజా కార్యక్రమాల పేరుతో మహిళతో పరిచయం పెంచుకుని ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తెకు మాయ మాటలు చెప్పి ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి తీసుకువెళ్ళాడు. అదే రోజు రాత్రి మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నామంటూ పోలీసు స్టేషన్కు వచ్చారు. అయితే, పూజారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో మాయమాటలు చెప్పి యువతిని కిడ్నాప్ చేసిన కేసులో కిషన్కుమార్ను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు సీఐ సీహెచ్ చంద్రమౌళి తెలిపారు. నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
రజనీకాంత్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడా?
సూపర్స్టార్ రజనీకాంత్ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడా? అవుననే అంటున్నారు సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ. ఆయన చిత్రాల మాదిరిగానే ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. రామ్గోపాల్వర్మలో ధైర్యం ఎక్కువనే చెప్పాలి. వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కాగా ఆయన ఇటీవల గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఇతివృత్తంతో కిల్లింగ్ వీరప్పన్ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. దీన్ని సంతోష్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రామ్గోపాల్వర్మ చాలా పరిశోధించారు. వీరప్పన్ను స్వయంగా ఇంటర్య్వూ చేసిన వారు, పోలీసు అధికారుల నుంచి పలు వాస్తవాలను సేకరించి కథను తయారు చేశారు. వీరప్పన్ కన్నడ సూపర్స్టార్ రాజ్కుమార్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటన అటు కన్నడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి పెను సవాల్గానే మారింది. అదే భాణీలో మన సూపర్స్టార్ రజనీకాంత్ను కిడ్నాప్ చేయాలనుకున్నారట. దీని గురించి రామ్గోపాల్వర్మ తెలుపుతూ కొత్తగా సంచలనానికి తెర లేపారు. వీరప్పన్ జీవితం ఎంత మర్మమాయమో ఆయన ఎన్కౌంటర్ విషయంలోనూ అంతగా నమ్మశక్యం కాని విషయం దాగి ఉందని రామ్గోపాల్వర్మ పేర్కొన్నట్టు మీడియాలో ప్రచారం అవుతోంది. -
వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు
కేకే.నగర్(తమిళనాడు): వివాహితను ప్రేమించిన పోలీసు అధికారి కుమారుడు ఆమెను కిడ్నాప్ చేసిన సంఘటన కృష్ణగిరి జిల్లాలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలో గల తలిపట్టి గ్రామానికి చెందిన అరసకుమరన్ కూలీ. ఇతని కుమార్తె తమిళరసి(20) బీఎస్సీ పూర్తి చేసిన తమిళరసికి ధర్మపురి జిల్లా పాలకోడు సమీపంలోని పొత్తలం గ్రామానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమిళరసి దగ్గర బంధువు హఠాన్మరణం చెందడంతో అంత్యక్రియలకు ఆమె హాజరైంది. ఆ తరువాత ఆమె ఇంటికి రాలేదు. తమిళరసి ఇంటికి వెళ్లకపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె బంధువులు ఊరంతా వెతికారు. ఆ సమయంలో కొంతమంది తమిళరసిని రామూర్తి కుమారుడు సత్యనాథన్ కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తెలిపారు. దీంతో తమిళరసి తండ్రి అరస కుమరన్ నాగరసంపట్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి రామమూర్తి కుమారుడు సత్యనాథన్ (23) తన కుమార్తె తమిళరసిని కిడ్నాప్ చేశాడని ఆమెను రక్షించాలని కోరారు. రామమూర్తి ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరపగా సత్యనాథన్ ఇంటిలో లేడని తెలిసింది. సత్యనాథన్, తమిళరసి గతంలో ప్రేమించుకున్నారని, ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తమిళరసి వేరే వ్యక్తితో వివాహం జరిపించారని పోలీసు విచారణలో తేలింది. ప్రేమించిన తమిళరసిని మరచిపోలేక సత్యనాథన్ ఆమెను కిడ్నాప్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన సత్యనాథన్, తమిళరసిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
చర్చి ఫాదర్ ను చితక బాదిన అగంతకులు
ఓ చర్చి ఫాదర్ను కిడ్నాప్ చేసి చితకబాది తరువాత విడుదల చేసిన సంఘటన ఖాజీపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. కడపలోని ఆర్సీఎం చర్చి బిషప్ ప్రసాద్ సోమవారం కరుణగిరి తిరునాళ్లకు హాజరయ్యారు. ఆయన తిరిగి వస్తుండగా ఖాజీపేట సమీపంలో చిల్లకం వద్ద సోమవారం అర్ధరాత్రి అగంతకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం ఆయన్ని బాగా చితకబాది తెల్లవారు జామును వదిలేశారు. తీవ్రంగా గాయపడిన బిషప్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేట్రేగుతున్న బ్లేడ్ బ్యాచ్
విద్యార్థి కిడ్నాప్కు యత్నం పెనమలూరు : బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయి. ఇప్పటివరకు దాడులకు పాల్పడుతున్న వారు ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన డిగ్రీ విద్యార్థి పరిమి మధుబాబు (22) విజయవాడలోని అమ్మమ్మ ఇంటికి కొద్ది రోజుల కిందట వచ్చాడు. మేనత్త వద్ద రూ.3 వేలు తీసుకుని తిరిగి తణుకుకు సోమవారం రాత్రి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను విజయవాడ బస్టాండ్ వద్ద బీరు తాగాడు. ఆ తరువాత ఆటో అతనిని పిలిచి మంచి హోటల్కు తీసుకెళ్లమన్నాడు. ఆటో బయలుదేరుతుండగా అందులో బ్లేడ్ బ్యాచ్కు చెందిన ఇద్దరు యువకులు ఎక్కారు. వారు మధుబాబును బెదిరించి ఆటోను పెదపులిపాక కరకట్ట వద్దకు తీసుకువచ్చారు. అతని జేబులో ఉన్న సెల్ఫోన్, సొమ్మును దౌర్జన్యంగా లాక్కున్నారు. జేబులో నుంచి బ్లేడ్లు తీసి చంపుతామని బెదిరించారు. భయాందోళనకు గురైన మధుబాబు వారితో పెనుగులాడి తప్పించుకుని సమీపంలోని పంట పొలాల్లోకి పారిపోయి దాక్కున్నాడు. బ్లేడ్బ్యాచ్ సభ్యులు అతని కోసం చీకట్లో గాలించి దొరకకపోవడంతో ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఆటోలో వచ్చిన వ్యక్తి సెల్ఫోన్ పెనుగులాటలో కిందపడి పోయింది. దీనిని మధుబాబు తీసుకుని పోలీసులకు అప్పగించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. పెనమలూరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. -
కావలిలో బాలుడి కిడ్నాప్
► రూ.10లక్షలు డిమాండ్ చేసిన దుండగుడు ► ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి చొరవతో కిడ్నాపర్ ఆటకట్టు ► పోలీసుల అదుపులో జులాయి కావలి: పట్టణానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ ఉదంతం గురువారం సాయంత్రం ప్రజలను కలవరపెట్టింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని జనతాపేటకు చెందిన బుర్లా శ్రీధర్రెడ్డి కుమారుడు జయవర్ధన్రెడ్డి స్థానికంగా ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. ముసునూరుకు చెందిన కుందుర్తి చౌసిల్ ఉదయం పాఠశాలకు వెళ్లి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి వారి తల్లిదండ్రులు జయవర్ధన్రెడ్డిని తీసుకురమ్మన్నారని స్కూలు ఉపాధ్యాయులకు చెప్పాడు. నిందితుడి మాటలు విన్న టీచర్లు బాలుడిని అతనికి అప్పగించారు. ఆటోలో ఎక్కించుకున్న బాలుడిని పట్టణమంతా తిప్పుతూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చౌసిల్ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు నేరుగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో మాట్లాడారు. దీంతో కావలి పోలీసులను అప్రమత్తం చేసి బాలుడిని కాపాడగలిగారు. పోలీసుల హడా వుడితో కిడ్నాపర్ పట్టణంలోనే వెంగళరావునగర్ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్లాడు. కిడ్నాప్నకు గురైన బాలుడు ఇంటికి చేరుకుని జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వైస్సార్సీపీ స్థానిక నేతలతో చర్చించి న తరువాత బాలుడిని వెంటబెట్టుకుని ముసునూరుకు తీసుకెళ్లారు. ముసునూరులో కిడ్నాపర్ ఇంటికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గరే ఉన్న కిడ్నాపర్ చౌసిల్ను బాలుడు గుర్తుపట్టాడు. వెంటనే నిందితుడిని పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్నకు పాల్పడిన కుందుర్తి చౌసిల్ బీటెక్ మధ్యలోనే వదిలి జులాయిగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. అతను పట్టణంలో ఓ షాపులో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్రెడ్డి పక్కనే ఉన్న తన స్నేహితుడి షాపు వద్దకు వెళ్తుండేవాడు. శ్రీధర్రెడ్డి ఆస్తిపాస్తులపై ఆరా తీసిన చౌసిల్ డబ్బులు రాబట్టేందుకు ఆయన కుమారుడిపై కన్నేసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. చౌసిల్ని అరె స్ట్ చేసి విచారిస్తున్నారు. -
అతడిని శిలువ వేశారేమో..!
- ఇండియన్ ప్రీస్ట్ ను కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ - గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేసి ఉంటారని అనుమానం ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన ఇండియన్ ప్రీస్ట్ ను గుడ్ ఫ్రైడే నాడు.. శిలువ వేసి ఉంటారనే ఆనుమానాలు బలపడుతున్నాయి. యెమెన్ లో మార్చి 4న ఒక రిటైర్డ్ మెంట్ హౌస్ పై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఫాదర్ టామ్ ఉజునలిల్ ను ఎత్తుకెళ్లారని భావిస్తున్నారు. అతి కిరాతకంగా.. దాడిచేసిన తీవ్రవాదులు.. ఓ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ పై దాడి చేసి.. నలుగురు క్రైస్తవ సన్యాసినులతో సహా.. 16 మందిని చంపేశారు. దాడి తర్వాత అదే హొం లో బస చేస్తున్న ఫాదర్ టామ్ జాడతెలియడం లేదు. గత ఆదివారం ఓ క్రైస్తవ సన్యాసిని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫాదర్ టామ్ పై జరగనున్న హింసకు సంబంధించి ఒక మెసేజీ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రకారం గుడ్ ఫ్రైడే నాడు ఫాదర్ ను శిలువ వేసే అవకాశం ఉనట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు దాడికి ముందు ముగ్గురు ఇథియోపియన్ క్రిస్టియన్ యువకులు హోమ్ లోకి హడావుడిగా వచ్చి.. ఐఎస్ఐఎస్ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చారని. తర్వాత కొద్ది సేపటికే.. మారణ హోమం జరిగిందని. అప్పుడే ఫాదర్ ని కిడ్నాప్ చేశారని ఓ సన్యాసిని చేతిరాతతో ఉన్న నోట్ హోమ్ లో లభించిందని పేర్కొంటూ అలెటియన్ అనే క్రిస్టియన్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. భారత్ లోని బెంగళూరు నగరంలోని డాన్ బాస్కోకి చెందిన సలేషియన్ సిస్టర్స్ సభ్యులు మాట్లాడుతూ.. ఫాదర్ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. హోమ్ పై దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే యెమెన్ అధికారులు మాత్రం ఇది ఐఎస్ఐఎస్ దుశ్చర్యే అని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అల్ ఖైదా కు కూడా పట్టు ఉండంతో.. వారు చేసి ఉంటారని కొంత మంది విస్తున్నారు. -
డిటో...
2009లో ఖాద్రీ... 2016లో అభయ్ కారణాలు వేరైనా ఒకే నేర విధానం రెండూ జరిగింది బుధవారమే దక్షిణ మండల పరిధిలోని శాలిబండ ప్రాంతంలో 2009లో జరిగిన ఖాద్రీ... పశ్చిమ మండల పరిధిలోని షాహినాయత్గంజ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకున్న అభయ్... ఈ రెండు ఉదంతాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. వీరి అపహరణలు జరగడానికి కారణాలు వేరైనా... హత్యలు జరిగిన విధానం మాత్రం ఒక్కటే. ఈ కేసుల్లోనూ ముగ్గురేసి చొప్పునే నిందితులు ఉండగా... బుధవారమే కిడ్నాప్లు, అదే రోజు హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నాల్లో రాష్ట్రం దాటిన వారే. ఈ రెండు కిడ్నాప్, హత్యల మధ్య సారూప్యతలు ఇలా... - సాక్షి, సిటీబ్యూరో హతుడు ⇒ సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రి (10) నివాసం ⇒ పాతబస్తీలోని శాలిబండలో ఉన్న ఖాజీపుర జరిగింది: 20.05.2009 (బుధవారం) నిందితులు ⇒ వ్యాపార భాగస్వామి, బాలుడి తండ్రైన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాద్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను మోసం చేస్తున్నాడని భావించిన అనీసుద్దీన్ కిడ్నాప్ ఇలా ఖాదర్ ఇంట్లో చనువు ఉన్న అనీస్... ఖాద్రీకి బైకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్తూ వల్లో వేసుకున్నాడు. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని డ్రైవింగ్ నేర్పుతాన ంటూ తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. హతమైందిలా శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో జతకట్టిన మిగిలిన ఇద్దరు నిందితులూ... ఖాద్రీని మారుతీ వ్యాన్లోకి మార్చారు. మార్గం మధ్యలో పోలీసుల చెక్పోస్ట్ ఉండటంతో వారి కంట పడకూడదని భావించారు. దీనికోసం అప్పటికే గొడవ చేస్తున్న ఖాద్రీని ఆ పాయింట్ దాటే వరకు నోరు మూసి వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించిన నిందితులు... పొరపాటున నోరు కూడా మూసేయడంతో చనిపోయాడు. మృతదేహాన్ని ఏం చేశారంటే చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఖాద్రీని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో షాద్నగర్ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ చేసిన గంటలోపే బాలుడిని చంపేసిన దుండగులు ఆపై బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్కార్డులు వినియోగించి అతడి తండ్రికి ఫోన్లు చేసి,ఎస్సెమ్మెస్లు ఇచ్చి డబ్బు డిమాండ్ చేశారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన అనీస్ నేరం చేశాక తెలివిగా వ్యవహరించాడు. అరెస్టుకు ముందు శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకునేసరికి... తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో తానే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడించాడు.హైదరాబాద్ నుంచి పరారైన నిందితులు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ల్లో తిరిగారు. ఎట్టకేలకు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. హతుడు ⇒ అభయ్ మోదాని (15) నివాసం ⇒ షాహినాయత్గంజ్ పరిధిలోని జ్ఞాన్బాగ్కాలనీ జరిగింది: 16.03.2016 (బుధవారం) నిందితులు ⇒ ఇందుగుగమల్లి శేషుకుమార్ అలియాస్ సాయిరామ్, పొందర రవి, నంబూరి మోహన్ కారణం ⇒ సినిమాల్లో చేరేందుకు నటనా పాటవంతో పాటు డబ్బు కూడా అవసరమని భావించిన ముగ్గురు నిందితులు కిడ్నాప్ ఇలా అభయ్ ఇంటికి సమీపంలోని ఇంట్లో పని చేసిన సాయికి బాలుడితో చనువు ఉంది. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్ను లిఫ్ట్ ఇవ్వమని కోరి అతడి వాహనం పైనే కిడ్నాప్ చేసి రూమ్కు తీసుకువెళ్లాడు. హతమైందిలా బాలుడిని హిందీనగర్లోని తమ ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అతడు వద్దని చెప్పడంతో గలాభా చేస్తారని భయపడ్డారు. అలా కాకుండా ఉండాలని చేతులకు, నోటికి ప్లాస్టర్ వేయడానికి ఉపక్రమించారు. ఆ ప్లాస్టర్ పొరపాటున నోటితో పాటు ముక్కుకూ పడటంతో అభయ్ చనిపోయాడు. పది నిమిషాల తర్వాత నిందితులు ఈ విషయాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఏం చేశారంటే ఫ్రిజ్కు చెందిన అట్టపెట్టే, ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్లో పార్శిల్ చేసి ఆటో ట్రాలీ, ప్యాసింజర్ ఆటోల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు తీసుకువెళ్లారు. రైలులో వదిలేద్దామని భావించినా... సాధ్యంకాకపోవడంతో ఆల్ఫా హోటల్ వద్ద విడిచిపెట్టేశారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ జరిగిన గంటలోనే అనుకోకుండా హత్య జరగడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కిన దుండగులు రైలు నుంచే బేరసారాలు మొదలెట్టారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన ప్రధాన నిందితుడు సాయి... పరారైన నాటి నుంచి మీడియాను గమనిస్తూ పోలీసుల కదలికలు తెలుసుకున్నాడు. ఎలాగైనా దొరికిపోతానని భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు పారిపోయిన నిందితులు పొరుగున ఉన్న ఒడిశాలోకీ ఎంటర్ అయ్యారు. టాస్క్ఫోర్స్ బృందాలకే చిక్కారు. -
ఆరు నిమిషాల్లోనే...
ఇదీ వృద్ధుడి అపహరణ ‘దృశ్యం’ సీసీ కెమెరాలో రికార్డైన ఆధారాలు సిటీబ్యూరో: తొమ్మిది మంది దుండగులు... ఆరు నిమిషాల నిడివి... తలుపులు పగులకొట్టి అపహరణ... స్థూలంగా ఇదీ ఒంటరి వృద్ధుడు బాలకృష్ణరావును కిడ్నాప్ చేసిన సీన్ ఈ దృశ్యాలు సైనిక్పురిలోని బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గత నెల 25 తెల్లవారుజాము 5.32 గంటల నుంచి 5.39 గంటల మధ్య నమోదైన ‘దృశ్యాలు’ ఇలా... సీన్-1 1. ఓ చేతిలో కొన్ని పత్రాలు, మరో చేతిలో తలుపు పగుల కొట్టే ఆయుధంతో ఒకడు, అతడి వెంట మరొకడు మొదటి అంతస్తులోని బాలకృష్ణ ఇంటికి వెళ్తున్నారు. 2. వీరి వెనుకే ముసుగులు ధరించి ముగ్గురు... మామూలుగా మరో నలుగురు ఇంటి మొదటి అంతస్తులోని ఇంటి వద్దకు చేరుకున్నారు. సీన్-2 3. బాలకృష్ణ ఇంటి తలుపులు పగులకొట్టడం పూర్తయిన తర్వాత... ఏడుగురు ఇంట్లోకి వెళ్లగా... మరో ఇద్దరు వాహనం సిద్ధం చేయడానికి కింది వచ్చారు. 4. అర్ధనగ్నంగా ఉన్న బాలకృష్ణను కాళ్లు చేతులు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్న కిడ్నాపర్లు. రివార్డ్స్ ప్రకటించిన సీపీ... బాలకృష్ణ కిడ్నాప్ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మల్కాజిగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ను కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామితో పాటు ఎస్సై రాములు, సిబ్బంది వెంకటేశ్వర్, శ్రీరాములు, ఎన్.శ్రీనివాసులు, బ్రహ్మం, కె.శ్రీధర్బాబు, వెంకట్రెడ్డి, దిలిప్రెడ్డిలకు కమిషనర్ ప్రత్యేక రివార్డులను ప్రకటించారు. ఫిర్యాదు చేస్తే వారి పైనా కేసు... బాలకృష్ణకు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో ఉన్న 2400 గజాల స్థలంపై కన్నేసిన మరో వర్గం మేకల శ్రీనివాస్యాదవ్ తదితరులపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వీరంతా ఆ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించారని బాధితుడు చెప్తున్నారని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్
నూజివీడు : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా ఐదురుగు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
బాలిక కిడ్నాప్కు యత్నం
► బైక్పై తరలించుకెళ్లిన ముగ్గురు యువకులు ► రహదారిపైనే బాలిక కోసం తగువులాట ► దుండగుల కళ్లు కప్పి తప్పించుకున్న బాధితురాలు నాగసముద్రం(చెన్నేకొత్తపల్లి) : తనను కిడ్నాప్ చేసిన దుండగుల చెర నుంచి ఓ బాలిక చాకచక్యంగా తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే... నాగసముద్రానికి చెందిన సుధారాణి, ఓబులేసు దంపతుల కుమార్తె యశస్విని స్థానిక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లిన బాలికను ముగ్గురు యువకులు బెడ్షీట్ కప్పి ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లారు. ఎన్ఎస్గేట్కు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత బాలిక కోసం ముగ్గురూ గొడవపడ్డారు. ఆ సమయంలో బాలిక తప్పించుకుని పారిపోయింది. ఆమెను వెంబడించిన దుండగులు కొద్ది దూరంలో బైక్పై వ్యక్తి వస్తుండడం గమనించి అక్కడి నుంచి జారుకున్నారు. యశస్విని పరుగును గమనించిన ద్విచక్ర వాహన చోదకుడు శివయ్య(ఎన్ఎస్గేట్ నివాసి), తన వాహనాన్ని ఆపి బాలికతో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం ఆమెను ఎన్ఎస్గేట్ పోలీస్ ఔట్పోస్టుకు తీసుకెళ్లి, విషయాన్ని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శేఖర్ అక్కడకు చేరుకుని బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అనంతరం బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థుల కిడ్నాప్నకు టీచర్ యత్నం
అచ్చంపేట: మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ నలుగురు విద్యార్థినుల కిడ్నాప్కు యత్నించాడు. పోలీ సుల కథనం ప్రకారం.. అచ్చంపేటలో ఎంఎస్ఎన్ స్కూల్కు చెందిన టీచర్ జీవన్ అలియాస్ బాలకుమార్ స్కూల్లోనే ట్యూషన్ ఉందని నాలుగో తరగతికి చెందిన నలుగురు అమ్మాయిలను ఆదివారం సాయంత్రం వారి ఇళ్ల వద్ద నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అయితే, పాఠశాలకు వెళ్లకుండా దారి మారడంతో గమనించిన ఓ విద్యార్థిని తన తల్లికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని జేఎంజే పాఠశాల పక్కన గెస్టుహౌస్ వద్ద కారు కనిపించింది. అక్కడ సదరు ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కారులో బిర్యానీ ప్యాకెట్లు, ప్యాక్ ముక్కలు, కురుకురేలు, ల్యాప్టాప్, యేసుక్రీస్తు బొమ్మలు లభ్యమయ్యాయి. వెంటనే అతనిని పోలీస్స్టేషన్లో అప్పగించారు. మతమార్పిడికి వచ్చినట్లు అతని మాటలబట్టి తెలిసిందని ఎస్ఐ అనుదీప్ విలేకరులకు తెలిపారు. -
విద్యార్థి ఆచూకీ లభ్యం
♦ తీవ్ర గాయాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షం ♦ కిడ్నాప్ చేసి.. కాల్చారని వాంగ్మూలం హుజూర్నగర్: నల్లగొండ జిల్లా హుజూర్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అదృశ్యమైన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆచూకీ లభించింది. శనివారం కాలిన గాయాలతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేళ్లచెరువు మండలం తమ్మారం కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి హుజూర్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. నాగార్జునరెడ్డి రూ. 500 దొం గిలించాడని సహచర విద్యార్థులు ఆరోపిం చారు. తాను ఆ చోరీ చేయలేదని, తనపై నింద వేయడంతో పురుగుమందు తాగి చని పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తనను కిడ్నాప్ చేసి తగులబెట్టారని న్యాయమూర్తికి నాగార్జునరెడ్డి వాంగ్మూ లం ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. 18న పాఠశాల వద్ద ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారని, శనివారం ఉదయం చిల్లకల్లు పెట్రోల్బంక్ సమీపంలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. అనంతరం వారే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచి వెళ్లారన్నాడు. పోలీసుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివెళ్లారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత.. హుజూర్నగర్లో నాగార్జునరెడ్డి చదువుకుంటున్న ప్రైవేట్ పాఠశాల వద్ద బంధువులు, గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొన్నారు. కాగా, నాగార్జునరెడ్డి అదృశ్యం మిస్టరీగానే మారింది. -
బాలుడి కిడ్నాప్ ’విషాదాంతం’
-
ఔను.. మా వాళ్లు కిడ్నాప్ అయ్యారు
బాగ్దాద్: అమెరికా పౌరులు ఇటీవల ఇరాక్లో కిడ్నాప్కు గురయ్యారు. ఈ విషయాన్ని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం దృవీకరించింది. 'పలువురు అమెరికన్లు కిడ్నాప్కు గురయ్యారు. వారు ఎక్కడున్నారో గుర్తించి, రక్షించడానికి ఇరాక్ అధికారుల సహకారంతో ముందుకుపోతున్నాం' అని రాయబార కార్యాలయ అధికారి ప్రకటించారు. అయితే ఎంతమంది కిడ్నాప్కు గురయ్యారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ముగ్గురు అమెరికన్ కాంట్రాక్టర్లు, ఓ ఇరాకీ ట్రాన్స్లేటర్ బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో శుక్రవారం కిడ్నాప్కు గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా పౌరుల రక్షణ, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ కిడ్నాప్కు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం
జోగిపేట: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం జోగిపేట పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్లాదుర్గం మండలానికి చెందిన దుర్గయ్య, పోచమ్మలు చౌటకూర్లో ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి 13 ఏళ్ల వయస్సు ఉన్న కుమార్తె ఉంది. చౌటకూర్ గ్రామంలోని కొన్యాల యాదయ్య, రాజులు నివాసం ఉండే ఇంటి ముందు గుడిసెను ఏర్పాటు చేసి నివాసముంటున్నారు. మైనర్ బాలికపై రాజు (35) కన్ను పడింది. ఈ క్రమంలో రాజు మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని తన సోదరుడు యాదయ్యతో కలిసి బాలిక తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు అంగీకరించలేదు. గత నెల 28వ తేదిన తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మాయమాటలు చెప్పి అమ్మాయిని రాజు వెంట తీసుకొని వెళ్లాడు. అమ్మాయిని మొదట హత్నూర, దౌల్తాబాద్ ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆమె వద్ద నున్న వెండి కడియాలను అమ్మేసి.. ఆ డబ్బులతో బట్టలు, ఇతర సామాన్లు కొనుక్కొని నర్సాపూర్లోని ఒక ఇంట్లో కాపురం పెట్టాడు. జనవరి 1వ తేదీన తన కూతురు కిడ్నాప్ అయినట్లు తండ్రి దుర్గయ్య పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి స్థానిక ఎస్సై సత్యనారాయణ రాజు అతడి కుటుంబ సభ్యులపై నిఘా పెట్టి నర్సాపూర్లో ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం పుల్కల్ పోలీసులు నర్సాపూర్ వెళ్లి రాజు, మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సహకరించిన సోదరుడు యాదయ్యలను కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజుపై మైనర్ బాలికపై కిడ్నాప్, అత్యాచారం, పలు సెక్షన్లతో పాటు సహకరించినందుకు యాదయ్యపై కూడా కేసు నమోదు చేసారు. జోగిపేట మున్సిఫ్కోర్టుకు నిందితులను తరలించారు. కోర్టు ఆదేశాలతో వారిని రిమాండ్కు పంపారు. మైనర్ బాలికను చికిత్సల నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి పంపారు. -
హైదరాబాద్లో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్
-
బొమ్మ పిస్టల్తో బెదిరించి..
హైదరాబాద్ : డబ్బు డిమాండ్ చేస్తూ బొమ్మ పిస్టల్తో బెదిరించి బిల్డర్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడో దుండగుడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం....జూబ్లీహిల్స్ రోడ్నెం-10లో బంజారాహిల్స్ రోడ్నెం-12కు చెందిన బిల్డర్ మనీష్ అగర్వాల్ ఇల్లు నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు ఆయనకు పిస్టల్ ఎక్కుపెట్టి డబ్బు డిమాండ్ చేస్తూ తనతో రావాలని కిడ్నాప్కు యత్నించాడు. ఈ దృశ్యం చూసి అక్కడే పని చేస్తున్న కార్మికులంతా పెద్దగా అరుస్తూ పరుగు పరుగున అతని వద్దకు వచ్చారు. ఒక్కసారిగా 30 మంది వర్కర్లు పరిగెత్తుకు రావడంతో దుండగుడు మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీశాడు. డైమండ్ హౌస్ వద్ద ఆటో ఎక్కి పరారవుతున్న క్రమంలో పిస్టల్ కిందపడి రెండు ముక్కలైంది. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బిల్డర్ వద్ద రూ.25 లక్షల వరకు డిమాండ్ చేసేందుకు నిందితుడు వచ్చాడని ఇవ్వకపోతే కిడ్నాప్ చేయడమే లక్ష్యంగా పథకం వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బొమ్మ పిస్టల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాంధీ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం
-
'తండ్రి వస్తేనే కొడుకును వదులుతాం..'
తమ చెరలో ఉన్న ఇస్సాక్ను విడుదల చేయాలంటే అతని తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టుల చేతిలో బందీలైన పాస్టర్లను ఆదివారం రాత్రి మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు, ఏం మాట్లాడారు, ఇస్సాక్ను చూపించారా, ఎలాంటి హెచ్చరికలు చేశారనే దానిపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే, తాము ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్లు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన అనంతరం కొడుకుని విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇస్సాక్ భవితవ్యం ఇక అతని తండ్రిపైనే ఆధారపడి నట్లయింది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇస్సాక్ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు. -
ఏడు రోజులుగా మావోయిస్టుల చెరలోనే..
నెల్లిపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురంలో గత నెల 30న మావోరుుస్టులు అపహరించిన చర్చి పాస్టర్ కన్నయ్య కుమారుడు ఇస్సాక్కు ఇంకా విముక్తి లభించలేదు. కన్నయ్య కోసం సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి, ఆయన లేకపోవటంతో పెద్ద కుమారుడు ఇస్సాక్ను తీసుకెళ్లారు. కన్నయ్య తమ వద్దకు వస్తేనే ఇస్సాక్ను విడిచి పెడతామని హెచ్చరించారు. కాగా పాస్టర్ కన్నయ్య ఆ రోజు నుంచి ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకోవటంతో ఇస్సాక్కు మావోయిస్టులు ఏదైనా ఆపద తలపెట్టి ఉంటారేమోనని అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మత బోధన చేసుకునే తమ కుటుంబానికి అపకారం తలపెట్టడం మావోయిస్టులకు ధర్మం కాదని, ఇస్సాక్ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. ఇస్సాక్ను విడిచి పెట్టేలా చూడాలని ప్రభుత్వ అధికారులను, పోలీసులను, మానవహక్కుల సంఘాల నేతలను అభ్యర్థిస్తున్నారు. కాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. -
సికింద్రాబాద్లో బాలుడు కిడ్నాప్
-
పాస్టర్ కుమారుడిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ చర్చి పాస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఫాదర్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్న ఊకే కన్నయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు వంద మంది సాయుధ మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు ఆయుధాలతో పగులగొట్టి కొందరు లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న యువకులను నిద్ర లేపి.. పాస్టర్ కన్నయ్య ఎవరని ప్రశ్నించారు. కన్నయ్య దేవుని సువార్త చెప్పడానికి ఛత్తీస్గఢ్లోని సుకుమా ప్రాంతానికి వెళ్లారని వారు చెప్పారు. మావోయిస్టుల్లో ఒకరు ఓ యువకుడిని కన్నయ్య పెద్ద కుమారుడు ఇస్సాకు అని గుర్తించారు. ఇస్సాకు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టి వెంట తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను పక్కకు నెట్టి, కన్నయ్యను తమ వద్దకు రమ్మని చెప్పాలని హెచ్చరించారు. ఈ ఘటనతో లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నయ్య అలియాస్ ఏలియా 13 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లోని మైత ప్రాంతం నుంచి లక్ష్మీపురం వలస వచ్చి, న్యూ బెతస్త ట్రైబల్ మినిస్ట్రీని స్థాపించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 52 చర్చిలు ఏర్పాటు చేసి గిరిజనులకు క్రీస్తు బోధనలు చేస్తున్నారు. గిరిజనుల మత మార్పిడులపై మావోయిస్టులు పలుమార్లు కనకయ్యను హెచ్చరించారు. గత ఏడాది కూడా కనకయ్యను అపహరించడానికి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అప్పట్లో కనక్క మావోయిస్టులకు దొరక కుండా తప్పించుకుని పారిపోయారు. దీంతో మరో సారి మావోయిస్టులు కనకయ్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కుమారుడిని పట్టుకుపోయారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాగా మతమార్పిడుల కారణంగానే కన్నయ్యపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసిందని పోలీసులు కూడా చెపుతున్నారు. -
పోలీస్ కానిస్టేబులే ఆ అమ్మాయికి మత్తు ఇచ్చి కిడ్నాప్ చేసి..
-
కిడ్నాపర్కు సినిమా చూపించిన బుడతడు
సిచుహాన్(చైనా): సినిమాల్లో చూసిన సీన్ల ఆధారంగా ఓ బుడతడు కిడ్నాపర్ ను బోల్తా కొట్టించాడు. కిడ్నాపర్ నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా.. ఆ దుండగుడిని పోలీసులు పట్టుకునేలా చేసి.. భేష్ అనిపించుకున్నాడు. ఈ సంఘటన చైనాలోని సిచుహాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్కూల్ వెళుతున్న సమయంలో క్సియోహీ(13) అనే బాలుడు సెప్టెంబర్ 24న కిడ్నాప్ కు గురయ్యాడు. అతన్ని అపహరించిన దుండగుడు ఒక మారుమూల గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో బంధించాడు. ఆ ఇంట్లో క్సియోహీని తాళ్లతో కట్టేసి, కళ్లకి గంతలు కట్టి, మాట్లాడకుండా మూతికి టేప్ అతికించాడు. కొన్ని రోజుల తర్వాత కిడ్నాపర్ బాలుని తండ్రికి ఫోన్ చేసి.. మీ కొడుకు మీకు దక్కాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో బాలుడు కిడ్నాపర్ బయటికి వెళ్లాడేమోనని భావించి తాళ్లను విప్పుకొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బయటే ఉన్న కిడ్నాపర్ కంట పడ్డాడు. ఏముంది అతన్ని మళ్లీ తీసుకువచ్చి మరింత పటిష్టంగా తాళ్లతో బంధించి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలుడు తప్పించుకోవడానికి మరో పక్కా ప్లాన్ వేశాడు. ఈసారి అతడు తప్పించుకోవడానికి ముందు రెండు సార్లు బిగ్గరగా అరిచాడు. ఎలాంటి బదులు రాకపోవడంతో అతను అక్కడినుంచి వెళ్లాడని భావించాడు. కుర్చీకి కట్టిన తాళ్లని విప్పుకొని ఎలాగోలా రోడ్డు పైకి వచ్చాడు. అయితే అతని రెండు చేతులు తాళ్లతో గట్టిగా కట్టి, మోహానికి ప్లాస్లిక్ బ్యాగు చుట్టి ఉంది. ఆ అవతారంలో అగమ్యగోచరంగా రోడ్డుపై ఉన్న ఆ బాలున్ని అదృష్టం కొద్ది స్థానికుడొకరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుని తండ్రి దగ్గర డబ్బు వసూలు చేసే పనిలో ఉన్న కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైం సినిమాల్లో హీరోలు దుండగులనుంచి తప్పించుకోవడాన్ని చూసి ఆ ట్రిక్స్ ను ఇక్కడ అప్లై చేశానని బాలుడు చెప్పాడు. కిడ్నాపర్ కు సహకరించినట్టే ఉండి..అతన్ని నమ్మించి సమయం దొరికితే టక్కున తప్పించుకోవాలని సినిమాల ద్వారానే నేర్చుకున్నానని.. 22 రోజులు కిడ్నాపర్ చెరలో ఉండి తప్పించుకున్న ఆ బాలుడు తెగ సంబరంతో చెబుతున్నాడు. -
బాలుడి కిడ్నాప్ కలకలం
-
ప్రేమకోసమై వలలో పడితే..
చెన్నై, సాక్షి ప్రతినిధి : డబ్బు కోసం ఓ తల్లి తన కుమార్తెనే ఎరవేసి ప్రేమపేరుతో వలవిసిరింది. ‘ప్రేమకోసమై వలలో పడితే పాపం పసివాడు..’ అనే చందంగా ఓ యువకుడు కిడ్నాప్నకు గురై అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డాడు. పరారైన ప్రేమికురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై పోయస్గార్డెన్కు చెందిన రవిసుందరం హోల్సేల్ వ్యాపారి కుమారుడు అభిషేక్ (19) చెన్నై సమీపంలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం వరకు చదివాడు. చదువుపై అభిషేక్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో తండ్రి ఇటీవల తన వ్యాపారంలోనే ఉంచేశాడు. స్నేహితుని పుట్టినరోజు సంబరాలకు వెళ్లివస్తానని గత శనివారం బైక్పై ఇంటి నుంచి వెళ్లిన అభిషేక్ ఆపై తిరిగి ఇంటికి రాలేదు. ‘రూ.5 కోట్లు చెల్లించి అభిషేక్ను తీసుకెళ్లు, పోలీస్కు సమాచారం ఇచ్చావంటే కొడుకుని ప్రాణాలతో చూడవు’ అంటూ ఆదివారం ఉదయం అభిషేఖ్ తల్లిని అతని సెల్ఫోన్ ద్వారానే అగంతకులు బెదిరించారు. కొడుకును కిడ్నాప్ చేశారని తెలుసుకున్న తండ్రి రవిసుందరం నగర పోలీస్ కమిషనర్ జార్జ్కు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించేందుకు ఐదుగురితో కూడిన పోలీస్ బృందం రంగంలోకి దిగింది. ఆదివారం అంతా ఫోన్ చేయని అగంతకులు సోమవారం తెల్లవారుజాము 2 గంటలకు ఫోన్చేసి డబ్బుతో కాశిమేడుకు రావాలని చెప్పారు. రవిసుందరం కాశీమేడుకు వెళ్లగా అగంతకులు ఆవడికి రావాలని అన్నారు. ఆవడికి వెళ్లితే ఇక్కడ కాదు తేనాంపేటకు రావాలని చెప్పారు. తేనాంపేట సిగ్నల్ వద్ద అగంతకులు రవిసుందరాన్ని కలుసుకుని ‘డబ్బును మీ వెనుక వచ్చేవారు తీసుకుంటారు, కుమారుడిని విడిచిపెడుతున్నాం’ అన్నారు. నా కుమారుడిని ప్రత్యక్షంగా చూస్తేనే డబ్బు ఇస్తానని రవిసుందరం వాదించాడు. వీరి మధ్య సంభాషణ సాగుతుండగానే రవిసుందరం కార్ల వెనుక అగంతకులతో అనుసరిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో సద్దాంహుస్సేన్ (27), అహ్మద్ బతక్ (25) ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చెన్నై విమానాశ్రయం వద్ద అభిషేక్తో మరికొందరు నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసుల బృందం విమానాశ్రయానికి వెళ్లగా వీరి రాకను గమనించిన అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సైతం వారివెంటపడడంతో భీతిల్లిన కిడ్నాపర్లు పల్లవరం పాన్స్కంపెనీ సమీపంలో అభిషేక్తో సహాకారును వదిలిపెట్టి పారిపోయారు. పారిపోయిన నిందితుల్లో రిజ్వాన్ (26) అనే మరోవ్యక్తిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. మొత్తం వ్యవహారంలో రవిసుందరం కారు డ్రైవరు, సహాయకులుగా పోలీసులే వ్యవహరించారు. ప్రేమపేరుతో పథకం ప్రకారం వల ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రేమపేరుతో తన కుమార్తెనే ఎరవేసి కిడ్నాప్నకు పాల్పడి కటకటాలపాలైంది ఆ తల్లి. చెన్నై సమీపం ఊరపాక్కంకు చెందిన ఖుర్షిత్ (40) అనే మహిళ భర్తను విడిచిపెట్టి వేరుగా ఉంటోంది. ఈమె కుమార్తె గిండీలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భర్తలేక పోవడంతో ఖుర్షిత్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రవిసుందరం ఇంటికి వాటర్క్యాన్ సరఫరా చేసే శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన సలహాతో అభిషేక్ కిడ్నాప్ పథకం పన్నింది.ఖుర్షిత్ తన కుమార్తె భానుకు అభిషేక్ సెల్ఫోన్ నెంబరు అందజేసి మిస్డ్కాల్ ఇమ్మంది. తల్లి సలహాతో నెలరోజులుగా మాటలతోనే అతనిలో ప్రేమను రగిల్చిన భాను ఎలాగైనా నేరుగా చూడాలనే తపన స్థాయికి అభిషేక్ను తీసుకువచ్చింది. శనివారం మోటార్బైక్పై అభిషేక్ భానును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కారులో సరదాగా ప్రయాణిస్తుండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి కారును మరోకారులో వెంబడించి కిడ్నాప్నకు పాల్పడ్డారు. విమానాశ్రయం వద్ద డబ్బుముట్టగానే అభిషేక్ను విడిచిపెట్టాలని భావించారు. అయితే ఇంతలో కథ అడ్డం తిరిగింది. కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన పోలీసులు ఖుర్షిత్ను అరెస్ట్ చేయగా, ప్రేమవల విసిరిన కుమార్తె భాను పరారైంది. -
కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ: నాలుగురోజుల క్రితం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొమ్మల రామారం గ్రామానికి చెందిన సుమన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సుమన్ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలుడు ఉన్నడని విషయం తెలియడంతో... అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల చెరలో ఉన్న సుమన్ని పోలీసులు విడిపించారు. ఈ రోజు నిందితులను భువనగిరి పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల నుంచి ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దళిత బాలికపై అత్యాచారం
-
దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య
మెక్సికో: కిడ్నాప్ లు, హత్యలు ఎక్కువగా జరిగే మెక్సికోలో మరో విషాదం చోటు చేసుకుంది. సంచలన చిత్రాల దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ కు తీరని విషాదం మిగిలింది. ఈ నెలారంభంలో కిడ్నాప్ అయిన ఆయన తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారు. వెరాక్రూజ్ రాష్ట్రంలోని నగరంలో శనివారం సాయంత్రం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వాటిని అలెజాండ్రో కుటుంబీకుల మృతదేహాలుగా ఆదివారం ధ్రువీకరించారు. అలెజాండ్రో తండ్రి, సోదరుడిని కొంతమంది దుండగులు ఈ నెల 4న కిడ్నాప్ చేశారు. దుండగులు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించినప్పటికీ వారిని విడిచిపెట్టలేదని, చివరికి వారిని పొట్టన పెట్టుకున్నారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. -
అనంతపురం జిల్లాలో దారుణం