మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తుందుర్రులో రిలే నిరాహార దీక్షలను గ్రామస్తులు ప్రారంభించారు.
ఆక్వా ఫుడ్ బాధితుల దీక్షలు
Sep 11 2017 3:39 PM | Updated on Sep 19 2017 4:22 PM
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు వద్ద తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తుందుర్రులో రిలే నిరాహార దీక్షలను గ్రామస్తులు సోమవారం ప్రారంభించారు. అయితే వీరికి టెంట్లు, కుర్చీలు వంటివి ఇవ్వొద్దని పోలీసులు ఆంక్షలు విధించడంతో బాధితుల దీక్షలకు టెంట్లు, కుర్చీలు దొరకలేదు. దీంతో రామాలయం ప్రాంగణంలో రిలే దీక్షలను ప్రారంభించారు.
Advertisement
Advertisement