వ్యక్తిపై మారణాయుధాలతో దాడి | Atempt to Murder | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై మారణాయుధాలతో దాడి

Published Mon, Jul 25 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

జలదంకి : మండలంలోని లింగరాజు అగ్రహారంలో ఆదివారం పాతకక్షల నేపథ్యంలో కూకటి ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు.

జలదంకి : మండలంలోని లింగరాజు అగ్రహారంలో ఆదివారం పాతకక్షల నేపథ్యంలో కూకటి ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ప్రసాద్‌ తన గొర్రెలను చెరువు సమీపంలో మేపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన మట్టెపు వెంకటేశ్వర్లు, తిరుమలరావు, రమేష్‌ విచక్షణ రహితంగా మారణాయుధాలతో ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రత్యర్థులు పరారీ అయ్యారు. పక్కన పొలంలో ట్రాక్టర్‌తో పనిచేసుకుంటున్న వారు ప్రసాద్‌ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. దీనిపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement