Prasad
-
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ సెవెన్ డైవర్షన్స్..
-
తల్లులకు వందనం లేదు.. అన్నదాతకు సుఖీభవ లేదు
-
బాబు, లోకేష్ కన్నింగ్ ఫెయిల్.. ఆఖరికి పవనే దిక్కు..
-
టీటీడీలో దోపిడీ దందా.. పక్కా ఆధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత
-
Big Question: తొక్కిసలాట వెనుక జనసేన కార్యకర్తలు.. ప్రజా శక్తిలో సంచలన వార్త!
-
సర్వదర్శనం ఎందుకు రద్దు చేశారు..! హిందూ మేధావులు నోరు ఏమైంది ?
-
బైక్ స్టంట్లు చేయమంటావా.. అన్యాయంగా ఇద్దరిని చంపేశావ్.. నీతులు చెప్తాడు.. పాటించడు..
-
Big Question: బండి సంజయ్ తోలు తీసేశాడు
-
ఏం పవన్.. తోలు తీస్తావా.. మురళీమోహన్ పూనాడా?
-
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్లో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్లో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.అసభ్యంగా తాకుతూ..ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. -
Big Question: ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీళ్ల డ్రామాలెందుకు చెల్లెమ్మా
-
చెల్లెమ్మా ఇంత పనిచేస్తావా..! జగనన్న మనసు నీకు తెలియదా ?.. చంద్రబాబు ఉచ్చులో పడి..!
-
రాజకీయ వేదికగా తిరుమల.. బోర్డులు ఎత్తేస్తున్నారు.
-
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేశారు.ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్, గణబాబు గానీ హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విస్తృతంగా తనిఖీలుద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.హెల్మెట్ ధారణ తప్పనిసరిహెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్, విశాఖ -
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
భలే మంచి 'చౌక' బేరం!
పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే ముఠాకు అండగా నిలిచి కాలు కదపకుండా కోట్ల రూపాయలు కూడబెట్టుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పథకం రచించారు. ఈ మేరకు రేషన్ బియ్యం తరలించే ముఠా సభ్యులతో బేరం కుదిర్చే పనిని తన మామకు అప్పగించారు. ఆయన రంగంలోకి దిగి అనంతపురం టౌన్లో బియ్యం కొనుగోలు చేసి వాటిని గోదాములకు చేర్చి, జిల్లా సరిహద్దులు దాటించి నల్లబజారులో అమ్ముకునేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఠా సభ్యులకు భరోసా ఇస్తున్నారు. తమను కాదంటే కేసులు పెట్టించి లోపలేయిస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్వయాన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మామ గంగారాం చౌక బియ్యాన్ని కార్డుదారులు, డీలర్ల నుంచి సేకరించి నల్లబజారుకు తరలించే ముఠాకు సహకరిస్తున్న ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. – అనంతపురం క్రైంఈ ఆడియోలోని సంభాషణ ఇలా...ఎమ్మెల్యే మామ: ఏమ్మా మీరు ఒకసారి ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చి రేటు మాట్లాడుకుని వెళ్లండి. మీరు మొత్తం నలుగురు ఉన్నారు కదా? రేపు ఆఫీసుకు నలుగురు కలిసి రావాల్సి ఉంటుంది. మహిళ: అన్నా.. అప్పుడే(కౌంటింగ్ అయిన తర్వాత) పరిటాల సునీతమ్మక్క ఇంటి వద్దకు రమ్మంటే వెళ్లాము. సోమందేపల్లి వాళ్లు అక్కడే మాట్లాడుకున్నారు. సరుకు వాళ్లు కదా తీసుకెళ్లేది! మీరు వాళ్లతోనే మాట్లాడండి. మాతో ఎందుకు? ఎమ్మెల్యే మామ: అలా కాదు... అనంతపురం అర్బన్లోని రేషన్ షాపులు వారందరికీ మేం అప్పుడే అలర్టు చేసినాం. మా ఆ«దీనంలోనే ఉన్నాయి. ఇక్కడ మీరు సరుకు నిల్వ ఉంచుకుని పంపుతున్నారు. కావున మీరు మాతో మాట్లాడాలి. అలాకాదని పరిటాల సునీత, శ్రీరాము, బాలాజీ... అంటే ఎలా? పైగా నేను కూడా బాలాజీకి బావే. బాలాజీతో నేను మాట్లాడతాను. సోమందేపల్లి, పెనుకొండ మంత్రి సవితమ్మ ఎవరైనా కానీ.. మీ సరుకు వెళ్లాలంటే అనంతపురం నగరంలో మా అనుమతి తప్పనిసరి. నువ్వు, సుబ్బు, రామకృష్ణ, జయపాల్రెడ్డి, జగదీష్ కలసి సాయంత్రం మూడు గంటలకు ఆఫీసుకు రండి. మీరు చాలా కరెక్టు మనిషి అని మా పిల్లలు చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నా. మహిళ: నేను ఒక్కదాన్నే రావాలా అన్నా? ఎమ్మెల్యే మామ: వద్దు.. మీరు నలుగురు కలిసి రండి. అప్పుడే మాట్లాడతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పకుండా సరుకు పంపొద్దు. సోమందేపల్లి వాళ్లు, పెనుకొండ వాళ్లు వచ్చినా వారికి సరుకు ఇవ్వొద్దు. అలా ఇచ్చారంటే మీ ఇష్టం. చాలా సీరియస్ అవుతుంది. లేదు.. మేము చేసుకుంటామంటే మాత్రం అందరినీ లోపలేపిస్తాం. మహిళ: లేదులే అన్న మాకేముంది? లోకల్లో ఎవరొచ్చినా సరుకు ఎత్తిచ్చేవాళ్లము కదా? ఎమ్మెల్యే మామ: అలా కాదు... మీరు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ వ్యాపారం బాగా చేసుకోవాలంటే నేను ఫుల్ ష్యూరిటీ ఇస్తున్నా. మీకెలాంటి ఇబ్బందీ రానివ్వను. చాలారోజులుగా మీ విషయం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వచ్చి ‘మామ ఇంక అదేందో నువ్వే వాళ్లని పిలిపించుకుని మాట్లాడు’ అంటే నేను బాధ్యత తీసుకున్నా. మీ అందరి గురించి తెలుసుకుని నంబర్లు తీసుకునేలోపు లేటయ్యింది. సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య రండి. మహిళ: సరే సార్ వస్తాం. ఎమ్మెల్యే మామ: ఇదే కాదు... భవిష్యత్లో కూడా పరిటాల, సవితమ్మ, ఇంకా పార్టీ లీడర్లు... ఇలా ఎవరి నుంచి ఏ ఇబ్బందీ రాకుండా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో మా కమ్మాస్ అతనే సీఐ సాయినాథ్ అని వస్తున్నాడు. కావాలనే మనం తీసుకుంటున్నాం. ఇంకా ఎస్ఐలు కూడా మా వాళ్లే వస్తారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. డీఎస్పీ నుంచి సీఐలు, ఎస్ఐలు అంతా మా వాళ్లే ఉండాలని తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో వస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వము. అనంతపురం టోటల్ జిల్లాలో మిమ్మల్ని మాట్లాడించే వారుండరు. అలా ఎవరైనా మాట్లాడితే నాతో ఫోన్లో మాట్లాడించండి. నేను చూసుకుంటాను. ఎంతటి వారినైనా వదిలిపెట్టం.మహిళ: ఇంతకుముందు మా నుంచి ఎవరూ తీసుకోలేదు అన్నా! ఎమ్మెల్యే మామ: మీరు ఇంకొకరి గురించి చెప్పొద్దు. అలా ఊరికే ఇడిసిపెట్టేది ఉండదు. వాళ్లు వదిలి పెట్టారని మేము ఎలా విడిచి పెడతాము? మీరేమో తప్పుడు పని చేస్తూ ఇంకొకరికి సరుకు ఇస్తున్నారు. మీ నుంచి మేము తీసుకోకూడదంటే ఎలా? వదిలే ప్రసక్తే లేదు. బయట ఎక్కడో మీరు మాట్లాడుకుని మమ్మల్ని ఎవరూ అడగలేదంటే ఎట్లా? ఆఫీసుకు రండి.. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. -
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
ఎక్కడ ఈ నిధులు..? బడ్జెట్ పై KS ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
-
మోదీ మైండ్ గేమ్ ఆ రాష్ట్రాలకే నిధులు..
-
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
ఏపీలో పచ్చ రాజ్యాంగం.. నారా వారి రాక్షస పాలన
-
సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్దిదారుల ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 65,18,496 మందికి పెంచిన మొత్తాన్ని ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ఇచ్చి న హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1న రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే జూన్కు సంబంధించిన ఎరియర్ల సొమ్ము నెలకు రూ.వెయ్యి చొప్పున మూడునెలల ఎరియర్స్ మూడువేలతో కలిపి మొత్తం రూ.7,000లను పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు, నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛను సొమ్మును పంపిణీ చేయాలని ఆయన సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలోలాగే ఎలాంటి మార్పులేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలన్నారు. 1వ తేదీనే పంపిణీఇక పెంచిన పింఛన్లను జూలై 1న రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది పింఛనుదారులకు ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని నీరబ్కుమార్ చెప్పారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల మంది పింఛనర్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రం వెలుపల ఉండే 0.43 లక్షల పింఛనర్లు.. బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1న ఉ.6.00 గంటల నుండి పింఛనర్ల ఇంటివద్దే పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలనూ వినియోగించుకోవాలని సీఎస్ చెప్పారు. అలాగే, ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారంకల్లా పూర్తిచేయాలన్నారు.సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని.. అవసరమైతే రెండోరోజు కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డి్రస్టిబ్యూషన్ సరి్టఫికెట్ కూడా జారీచేయాలని నీరబ్కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్
-
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
-
సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..
-
రారండోయ్.. వేడుక చూద్దాం.. (ఫోటోలు)
-
ఇష్టం లేని బలవంతపు పెళ్లి.. పవన్,చంద్రబాబు,మోదీపై KS ప్రసాద్ కామెంట్స్
-
బండరాయి టీడీపీ..గునపం బీజేపీ..
-
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ అడిస్తున్నాడు
-
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ ఆడిస్తున్నాడు
-
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్ మోసం చేశాడని ఓ యువతి..
కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన యువతిని కొడిమ్యాల మండలానికి చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేశాడు. దీంతో ఆ యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలిని పట్టణ ఎస్సై మన్మధరావు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవి చదవండి: పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. -
భర్తే శాసిస్తున్నాడా !..కేఎస్ ప్రసాద్ సంచలన కామెంట్స్
-
క్వాష్ పిటిషన్ రద్దు..షర్మిల ఎఫెక్ట్ ?
-
ముద్రగడ దారెటు ?..కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
-
గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి. తులసి తీర్థంతో మానసిక బలం ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. పరమాన్నం.. పరమ ఔషధం.. పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది. జ్వరాలు రాకుండా దద్దోజనం తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు పులిహోర.. బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చక్కటి ఔషధం చక్కెర పొంగలి బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది. -
రామ్ గోపాల్ వర్మపై కొలికపూడి వ్యాఖ్యలు..కేఎస్ ప్రసాద్ విశ్లేషణ
-
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్ను అడగగా స్వగ్రామం మాక్లూర్లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్మేన్గా చేశాను. ఎడిటింగ్లో నైపుణ్యం ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
జనసేనకు ఐదోతనం లేదని తేల్చేశారు..
-
ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే బెయిల్ తర్వాత... చంద్రబాబుకి అసలైన సినిమా..
-
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
చంద్రబాబు జీవితం ఓటమితో మొదలై ఓటమితో ముగియడం ఖాయం..!
-
సీఎంని రుషికొండకు వెళ్లొద్దంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ పిటిషనర్ను నిలదీసింది. రాజీకీయ పరిష్కారాలకు కోర్టుకు ఎందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్ను శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్కు పలు ప్రశ్నలు వేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ సీజేఐ ఘాటుగా స్పందించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ పరిష్కారాలకు కోర్టు వేదిక కారాదని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు, జాతీయ హరితట్రిబ్యునల్ ఆదేశాలపై సీజేఐ ఆరా తీశారు. ఈ తరహా కేసులను హైకోర్టు తేల్చగలదని అన్నారు. హైకోర్టు లేదా ఎన్జీటీలకు వెళ్లాలని పిటిషనర్కు సూచించారు. హైకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
బెయిల్ నిజం.. రోగం పచ్చి అబద్ధం
-
లోకేష్ ని వాడుకుంటున్న పవన్...అడ్డంగా బుక్కైన బాబు
-
లోకేష్ ను వాడుకుంటున్న పవన్ అడ్డంగా బుక్కైన బాబు
-
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
జనసేనకు ‘మేడా’ గుడ్బై
మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు జనసేనకు గుడ్బై చెప్పారని గుర్తుచేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్నవాడినన్నారు. తనను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్మెంట్ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయకత్వం వన్మ్యాన్ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. -
బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా అదే...
-
పంచాయతీరాజ్లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) గా, మరో 167 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు. కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్మెంట్ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి ఆమోదం తెలిపారు. ఈవోపీఆర్డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ సుధీర్కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్రావు, జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
సాక్షి డైరెక్టర్ పీవీకే ప్రసాద్కు పితృవియోగం
మంగళగిరి: సాక్షి దినపత్రిక డైరెక్టర్ పీవీకే ప్రసాద్ తండ్రి పాలడుగు మాధవరావు(92) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్లోగల కుమారుని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం కృష్ణాజిల్లా ముస్తాబాద. పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులో కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాధవరావు భార్య హైమావతి 2019లో కాలం చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శనివారం మంగళగిరిలో పాలడుగు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
టాలీవుడ్లో విషాదం.. క్యాన్సర్తో దర్శకుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్సార్ ప్రసాద్(49) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ‘సీతారామ్’ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్.. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘నిరీక్షణ’తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత శ్రీకాంత్తో ‘శత్రువు’, నవదీప్తో ‘నటుడు’ అనే చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కి’ విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశాడు. సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
కోల్ ఇండియా చీఫ్గా పీఎం ప్రసాద్!
రాంచీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బాధ్యతలకు తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక వ్యవహారాల బోర్డ్ (పీఈఎస్బీ) ఏడుగురు అధికారులను ఇంటర్వ్యూ చేసి పీఎం ప్రసాద్ పేరును సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రసాద్ ప్రస్తుతం రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా పనిచేస్తున్నారు. 2019లో ఆయన భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) సీఎండీగా కూడా ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఈ మైనింగ్లో గ్రాడ్యుయేటింగ్ తదుపరి 1984లో ఆయన సీఐఎల్లో తన కెరీర్ను ప్రారంభించారు. అటు తర్వాత అంచెలంచెలుగా విభిన్న హోదాల్లో పనిచేస్తూ, కోల్ ఫీల్డ్స్లోని వివిధ రంగాల్లో అపార అనుభవాన్ని గడించారు. -
ట్రోలింగ్ సామాజిక జబ్బు!
సాక్షి, హైదరాబాద్: సెలెబ్రిటీలకే కాదు. క్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సామాన్యులకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఎదుటి వారి ప్రతిష్టను సోషల్ మీడియాలో దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు శాడిస్టులు. మరికొందరేమో పిచ్చి, ‘పచ్చి..’వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తాము ఫేమస్ అయ్యేందుకు దిగజారుతున్నారు. వ్యూస్, లైక్, కామెంట్లు , షేర్లతో సొమ్ము చేసుకునేందుకు ఇంకొందరు సోషల్ మీడియా ట్రోలింగ్కు పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎదుటి వారికి ఎలాంటి సంబంధం లేని విషయాలను వారికి అంటగట్టి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా కొందరు డబ్బు ఖర్చు చేసి మరీ ఇతరులతో ట్రోలింగ్లకు పాల్పడుతున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎదుటివారు ప్రయోగించే ‘ట్రోలింగ్’అ్రస్తాన్ని ఎలా తిప్పికొట్టాలి..ఎలా ట్రోలింగ్ను ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన ఉండాలంటున్నారు సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డా.పాటిబండ్ల ప్రసాద్. ట్రోలింగ్ అంటే.. ఆన్లైన్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా కలవరపెట్టడాన్ని మనం స్థూలంగా ట్రోలింగ్ అనవచ్చు. ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాలను సైతం అంటగడుతూ వారి సామాజిక హోదాను దెబ్బతీయడం, తద్వారా వారిని తీవ్ర ఆందోళనలో నెట్టడమే ట్రోలింగ్చేసే వారి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ట్రోలింగ్ రకాలు... ఫ్లేమ్ ట్రోలింగ్ నిందారోపితమైన ఆరోపణలు, ద్వేషాన్ని, ఇతరులను కించపర్చే అంశాలపై ట్రోలింగ్. ఉదాహరణకు మతపరమైన విద్వేష పూరిత భావజాలం పెంచేలా ట్రోలింగ్. ఆఫ్–టాపిక్ ట్రోలింగ్ అసందర్భమైన వ్యక్తులను, ప్రదేశాలను, స్థలాలను వివాదాల్లోకి లాగేలా చేసే ట్రోలింగ్. ఉదాహరణకు..పాత తరం రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయాల్లోకి లాగడం..ప్రాంతాలు, మతపరమైన పాత వివాదాలు లేవనెత్తేలా ట్రోలింగ్. కన్సర్న్ ట్రోలింగ్ ఏదైన ఒక అంశాన్ని బా గా సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఆ విషయంపట్ల ఆందోళన చెందుతున్నట్టుగా నటిస్తూ వ్యాఖ్య లు.. ట్రోలింగ్ చేయడం.. ఉదాహరణకు.. మతపరమైన అంశాలపై మద్దతు పెంచడం, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేలా ట్రోలింగ్.. సోక్ పప్పెట్ ట్రోలింగ్... పెద్ద సంఖ్యలో ఫేక్ అకౌంట్లను సృష్టించి వాటి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చేలా లేదా కించపర్చేలా ట్రోలింగ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం.. ఉదాహరణకు..రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి, మతపరమైన అంశాల గురించి డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేయడం. ట్రోలింగ్ దుష్ప్రభావాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టి బాధించడం: మానసిక క్షోభకు ట్రోలింగ్ దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తెచి్చపెడుతుంది. నమ్మకాన్ని పోగొట్టడం: ట్రోలింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన, అర్థవంతమైన సంభాషణల్లోనూ పాల్గొనకుండా స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. చిల్లింగ్ ఎఫెక్ట్: ట్రోలింగ్ లేదా వేధింపులు భయాన్ని పెంచుతాయి. ట్రోలింగ్కు గురయ్యే వ్యక్తి ఆన్లైన్లో తన అభిప్రాయాలు స్వేచ్ఛ చెప్పడానికి భయపడే పరిస్థితికి వస్తాడు. తప్పుడు సమాచారం: ట్రోల్లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది ట్రోలింగ్కు గురయ్యే వ్యక్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే బాధితులు.. ట్రోలింగ్కు పాల్పడాలనుకునే వారు టార్గెట్ చేసుకునేది ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారిపైనే అందరిలో ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్పందించకపోవడమే అసలు మందు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రోలింగ్ పాల్పడే వారి లక్ష్యం ఒక్కటే మనల్ని అన్ని రకాలుగా వేధించడం. అందుకే ట్రోలింగ్లో చేసే వారి కామెంట్లు పట్టించుకోకపోవడం అనేది ఉత్తమం. వీలైనంత వరకు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. అది ట్రోలింగ్కు వాడే ప్రమాదం ఉంది. అలానే ట్రోలింగ్ శ్రుతి మించితే మాత్రం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వారికి ఫిర్యాదు చేసి, ఆ కంటెంట్ డిలీట్ చేయించవచ్చు. అదేవిధంగా ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేయడం, మ్యూట్ వంటి ఆప్షన్లు వాడాలి. ఇలా ఎదుర్కోవచ్చు... ట్రోల్ను తప్పక రిపోర్ట్ చేయాలి.. మనపై ట్రోలింగ్ చేస్తూ మనల్ని కించ పర్చే వ్యాఖ్యలు ఉంటే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వారికి ఫిర్యాదు చేసి ఆ కామెంట్లు డిలీట్ చేయించవచ్చు. ఈ టూల్స్ వాడొచ్చు.. సోషల్ మీడియా ఖాతాల్లో ఆయా ప్లాట్ఫామ్లు కొన్ని టూల్స్ ట్రోలింగ్ను ఎదుర్కొనేలా ఇస్తున్నాయి. ట్రోలింగ్ చేసే వారిని బ్లాక్ చేయ డం, మ్యూటింగ్ యూజర్స్ ఆప్షన్ పెట్టడం, ఫిల్టరింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వంటివి వాడుకోవాలి. -
కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈనాడు రామోజీ కంకణం కట్టుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న లేఖ, సెల్ఫోన్ను వెంటనే ఎందుకు పోలీసులకు స్వాధీనం చేయలేదనే అంశాన్ని ఏనాడైనా రాశారా రామోజీ? ఈ కేసులో తొలి నుంచీ ప్రతి విషయంలో మీ వక్రీకరణ కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా.. దానిని ప్రభుత్వానికి, ఎంపీ అవినాశ్రెడ్డికీ ముడిపెట్టి లేనిపోని విషయాలు కలిపి చెలరేగిపోతూ వండివార్చడమే మీరు పనిగా పెట్టుకోవడం నిజం కాదా? అసలు వివేకా కేసులో ఇంత గందరగోళానికి కారణం ఏమిటని ఏనాడైనా తొంగి చూశారా? వైఎస్ వివేకానందరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఆగంతకులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారు. తనను డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా గాయ పరచినట్టుగా ఆ లేఖలో వివేకా రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ రోజే అంటే 2019 మార్చి 15న ఉదయమే గుర్తించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని మొదటగా చూసింది ఆయనే. ఆ లేఖతోపాటు వివేకానందరెడ్డి సెల్ఫోన్ను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి మరణించిన సమాచారాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్రెడ్డిలకు ఫోన్ చేసి చెప్పారు. వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను కూడా వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే ఎవరికైనా అది హత్య అని సులువుగా తెలుస్తుంది. ఆ లేఖను తాము వచ్చే వరకు ఎవరికీ ఇవ్వొద్దని.. ఆ విషయం బయటకు చెప్పొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. దాంతో ఆ లేఖ విషయం ఆయన పోలీసులకుగానీ ఇతరులకుగానీ చెప్పనే లేదు. ఆ తర్వాత కాసేపటికే సమీప నివాసాల్లోని వారు, పార్టీ కార్యకర్తలువచ్చారు. అనంతరం వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో ఎంపీ అవినాశ్రెడ్డికి విషయం తెలిసింది. దాంతో ఎన్నికల ప్రచారానికని బయలు దేరిన ఆయన వెనుదిరిగి వివేకా నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి రాసిన లేఖ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి ఎవరికీ చెప్పనే లేదు. ఆ లేఖ విషయం అప్పుడే చెప్పి ఉంటే వివేకానందరెడ్డిది హత్య అని వెంటనే తెలిసేది. ఈ విషయం కదా తొలుత తేలాల్సింది. అది తేలితే తర్వాత కథ వేరుగా ఉండేది. ఈ విషయాలపై దర్యాప్తు సాగాలని ఏనాడైనా ఈనాడు రాసిందా? అంటే మీ ఉద్దేశం అసలు దోషులను తప్పించి.. ఇంకెవరినో ఇరికించాలనేగా! ఆ దిశగా దర్యాప్తు సాగేలా.. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు వండివార్చుతున్నది అందుకేగదా.. ఇది మీకు కనిపించలేదా? సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి ఆ రోజు అంటే 2019 మార్చి 15న మధ్యాహ్నం 12 – ఒంటి గంట మధ్య పులివెందులకు చేరుకున్నారు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను వారికి అందించారు. వారు దానిని సాయంత్రం 5 గంటల వరకు వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వాటిని కృష్ణారెడ్డి ద్వారా పోలీసులకు అందించారు. ఆ సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర డాటాను డిలీట్ చేసి మరీ పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. సహజంగా ఆ లేఖ విషయాన్ని వెంటనే చెప్పకుండా గోప్యంగా ఉంచిన పీఏ కృష్ణారెడ్డిని తొలుతే ఎందుకు ప్రశ్నించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆ లేఖ విషయాన్ని రహస్యంగా ఉంచారో ఎందుకు తెలుసుకోలేదని.. అందువల్లే ఈ కేసులో కీలకమైన చిక్కుముడి విడిపోవడం లేదని ఎందుకు మీ రాతల్లో కనిపించదు రామోజీ? విషయం అందరికీ తెలిశాక.. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారిని దోషులుగా చూపుతూ దుష్ప్రచారం చేయడం మీకే చెల్లింది. వివేకా హత్య జరిగిన రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి అవినాశ్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లానని ఉదయ్కుమార్రెడ్డి ఆ రోజూ చెప్పారు. ఈ రోజూ అదే చెబుతున్నారు. ఓ పని కోసం ఎంపీ ఇంటికి వెళ్లానని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా ఆరోజు, ఈ రోజు అదే చెబుతోంది. ఎంపీ ఇంటి వద్ద ఉన్నామని వాళ్లే స్వయంగా చెబుతున్నప్పుడు.. ఆ విషయం కొత్తగా కనిపెట్టినట్లు మీరు చెప్పడం ఏమిటో! ఉదయ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వండి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన్ను కడపలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే. -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్రెడ్డిని 2022 జూన్లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్ల ద్వారా మెసేజ్లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్ల ద్వారా..: ఈ మెయిల్స్లో లింక్లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్లతో: డేటింగ్ యాప్లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
ఏపీ స్ఫూర్తితో సాగుతాం :కేరళ మంత్రి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ ప్రశంసించారు. ఏపీ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్సీ) తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆర్బీకేల తరహాలో వన్స్టాప్ సొల్యూషన్ సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందడంపై వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్ కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరగనున్న సెమినార్ను ఏపీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, పి.ప్రసాద్, చందర్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దూసుకెళుతోందని ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి కొనియాడారు. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నామని, తమ రాష్ట్రంలోనూ ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఆలోచనల ఫలితమే ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలని సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా పాడి, మత్స్య,డెయిరీ, బ్యాంకింగ్ సేవలన్నీ అందిస్తున్నామన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నెలకొల్పామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉచిత పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), రైతు క్షేత్రం వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలు చేపట్టామన్నారు. రైతులను ఆదుకునేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్బీకే నమూనాతో పాటు వ్యవసాయ–అనుబంధ రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలను కళ్లకు కట్టినట్టుగా స్టాల్ ద్వారా ప్రదర్శించారు. సెమినార్కు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఏపీ స్టాల్ను సందర్శించి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మంత్రి కాకాణితో పాటు ఏపీ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీసీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీల అవసరం లేదు
సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు. విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’ -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా..
నవ్వించడం అందరికీ చేతకాదు.. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. చిన్న నవ్వు.. కష్టాలను, ఒత్తిడిని మర్చిపోయేలా చేసి స్వాంతన చేకూర్చుతుంది. కానీ అలా నవ్వించేవారి జీవితాల్లో ఎంతో విషాదం ఉంటుంది. అయినా దాన్ని పెదాల చాటునే బిగబట్టుకుని ఆపేస్తారు. వారి కష్టాలను కూడా కామెడీ చేసి నవ్విస్తారు. కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆ కోవలోకే వస్తాడు. ఓపక్క తనకున్న వ్యాధితో పోరాడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు. తాజాగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. కనీసం తనంతట తానుగా నాడవలేకపోతున్నాడు. ఇంతకీ పంచ్ ప్రసాద్కు వచ్చిన వ్యాధి ఏంటి? ఎంతకాలం నుంచి దానితో పోరాడుతున్నాడనే విషయాలను ఈ కమెడియన్ కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందులో ఆయన ఏమన్నాడంటే.. 'మాది లవ్ మ్యారేజ్. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కిడ్నీ సమస్య బయటపడింది. నాతో సహా మా ఇంట్లో వాళ్లు కూడా ఈ పెళ్లి వద్దని అమ్మాయికి నచ్చజెప్పాం. కానీ ఒక్కరోజు నాతో ఉన్నా చాలని చెప్పి అందరినీ ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మేము మణికొండలో అవినాష్ వాళ్ల ఇంటిపై పోర్షన్లో ఉండేవాళ్లం. ఓసారి పైన ఉన్నప్పుడు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడు నా భార్య గర్భవతి. ఆమెకు చెప్తే కంగారు పడుతుందని కిందకు వచ్చి కూర్చున్నా. నా ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడే అటుగా వచ్చిన గెటప్ శ్రీను నా భార్యను పిలిచి రూ.50 వేలిచ్చి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయేది. ఒకానొక సమయంలో ఈ ఖర్చులు, నొప్పి భరించడం నావల్ల కాదని చనిపోదామనుకున్నా. కానీ నాకు కిడ్నీ ఇవ్వడానికి కూడా నా భార్య సిద్ధమైంది. ఇప్పటికీ నా ఆరోగ్యం గురించి పూర్తిగా ఆవిడే చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. పంచ్ ప్రసాద్కు కిడ్నీలు పాడయ్యాయని తెలిసినా పెళ్లి చేసుకుని అతడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంటే ఆ ఇల్లాలు నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. చదవండి: నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్ పబ్లిక్గా అసభ్యంగా తాకాడు, అప్పుడు ఏం చేశానంటే: సుష్మితా సేన్ -
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు. కాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో ప్రసాద్ కమెడియన్గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచ్లతో ‘పంచ్’ ప్రసాద్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్లో వాడి అందరిని నవ్వించాడు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. చదవండి: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్? ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్ ప్రసాద్ ఇష్టం చూపించలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్కి సపోర్ట్ చేయాలని కోరాడు. -
రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
గుంతకల్లు: తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఠా కొంతకాలంగా కిడ్నాప్లతో హల్చల్ చేస్తోంది. స్థానిక యువతను ముఠాలో చేర్చుకోవడం, వారికి సమాచారం, సహకారం అందించడం, కిడ్నాప్లు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఈ ముఠా లక్ష్యం. దీనికి నాయకుడు సుంకర ప్రసాద్నాయుడు. ఎవరీ సుంకర ప్రసాద్? ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. క్రిమినల్ చరిత్ర చాలా పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. జైళ్లు, పోలీసులు, కేసులంటే లెక్కలేదు ఇతనికి. తాను చేసిన హత్యల గురించి ఒక్కొక్కటిగా విడమరిచి మరీ మీడియాకు వెల్లడించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది. ఇంతటి నేర చరిత్ర కల్గిన ఇతని కన్ను ఇటీవల గుంతకల్లు ప్రాంతంపై పడింది. గుంతకల్లు వాసులతో కలసి.. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సుంకర ప్రసాద్ జతకట్టాడు. వీరిలో ముఖ్యుడు జి.కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అతను ఇచ్చిన సమాచారం మేరకు జి.కొట్టాలకు చెందిన ఓ స్వామీజీని గత నెల 29న కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి రూ.26 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.10 లక్షలు వాటాగా జి.కొట్టాలకు చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. ఈ దందా బాగుందని భావించిన జి.కొట్టాల వాసి తన గ్రామానికే చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ వివరాలను సుంకర ప్రసాద్ ముఠాకు చేరవేశాడు. దీంతో సుంకర ప్రసాద్ ముఠా ఈ నెల 20న ఆకుల వ్యాపారిని కిడ్నాప్ చేసింది. అతని కుమారుడు సాయికుమార్కు ఫోన్చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. సాయంత్రంలోగా సమకూర్చకపోతే వెంకటేష్ను చంపుతామని బెదిరించింది. బెంబేలెత్తిన అతను గ్రామస్తుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇంటర్వ్యూలు చూసి.. ఇక సుంకర ప్రసాద్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో చూసి జి.కొట్టాలకు చెందిన వ్యక్తి అతన్ని సంప్రదించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన ఆ వ్యక్తికి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సుంకర ప్రసాద్ సహకారంతో తొలుత స్వామీజీని కిడ్నాప్చేసి విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో రెండో కిడ్నాప్కు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. ముఠా ఆటకట్టు ఇలా.. పోలీసుల సూచన మేరకు కిడ్నాపర్లకు సాయికుమార్ ఫోన్చేసి డబ్బులు సిద్ధం చేశానని, తమ గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో గ్రామానికి చేరుకున్న కిడ్నాపర్లు ఒక కారు ఏర్పాటుచేశామని, అందులో డబ్బు పెట్టాలని సాయికుమార్కు చెప్పారు. అదే సమయంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు కారు వదిలేసి పరారయ్యారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబ్నగర్ వద్ద వెంకటేష్ను కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జి.కొట్టాల వాసితోపాటు సుంకర ప్రసాద్, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. -
'నన్ను టీడీపీ నేతలు హతమార్చాలని చూశారు.. ఇవిగో ఆధారాలు'
సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలే దాడి చేశారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ నేతలే నాపై దాడి చేశారనేందుకు నా వద్ద ఆధారాలున్నాయని మీడియాకు చూపెట్టారు. టీడీపీ నాయకుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. నన్ను హతమార్చి రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూశారని వెంకట్రావు అన్నారు. మా నాయకుడు గంజి ప్రసాద్ కుటుంబానికి మా ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న పాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ మండిపడ్డారు. చదవండి: (గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం) -
గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, ఏలూరు: జిల్లాలో జరిగిన గంజి నాగప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బజారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసరపల్లి టోల్గేట్ వద్ద బజారయ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. హత్య కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై 120బి, 302 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, గంజి నాగప్రసాద్కు, గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారియ్యకు పాతకక్షలు ఉన్నాయి. వీరు పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవల బజారియ్య వర్గంలోని మండవల్లి సురేష్కు చెందిన మిఠాయి బండిపై కొందరు దాడిచేశారు. ఇది గంజి ప్రసాదే చేయించాడని సురేష్, అతని స్నేహితులు ఉండ్రాజవరపు మోహన్, శానం హేమంత్, మరికొందరు భావించారు. ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న నాగప్రసాద్ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సురేష్, మోహన్, హేమంత్ నిర్ణయించుకున్నారు. చదవండి👉 గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి ఈ నేపథ్యంలో.. శనివారం ఉ.7.30కు నాగప్రసాద్ పాల కోసం తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని జి.నాగరాజు అనే వ్యక్తి నిందితులకు సమాచారం అందించాడు. దీంతో సురేష్, మోహన్, హేమంత్లు బైక్పై నాగప్రసాద్కు ఎదురెళ్లి, పాఠశాల వద్ద అతడి వాహనాన్ని ఆపారు. అనంతరం ముగ్గురూ ఒక్కసారిగా నాగప్రసాద్పై కత్తులతో దాడిచేశారు. ముందుగా అతడి చేతిని నరికేశారు. ఆ తరువాత మెడపై, కాలిపై నరికారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక వారు ద్వారకా తిరుమల పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. చదవండి👉 వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య -
వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్ రాడ్తో కొట్టి..
సాక్షి, గాజువాక (విశాఖ): గాజువాకలోని గోపాలరెడ్డినగర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిని కిరాతకంగా హతమార్చారు. కారం, కత్తి, ఐరన్ రాడ్తో కొట్టి హత్య చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గోపాలరెడ్డినగర్కు చెందిన ఛత్రబోయిన ప్రసాద్ (32) సింగపూర్లో వెల్డర్గా పని చేసి వచ్చాడు. మరో వారం రోజుల్లో మస్కట్కు వెళ్లేందుకు వీసా సంపాదించాడు. కాగా, సమీప బంధువులైన శ్రీను, చిన్న, పోతురాజు వద్ద కొద్దికాలం క్రితం రూ.80వేలు అప్పుగా తీసుకున్నాడు. తమ అప్పు తిరిగి చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి చెల్లించేస్తానని ప్రసాద్ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రసాద్ మళ్లీ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న విషయం తెలుసుకొని శ్రీను, చిన్న, పోతురాజు మరింత ఒత్తిడి పెంచారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) ఆదివారం సాయంత్రం తమ కాలనీ సమీపంలో జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లిన ప్రసాద్ను ముగ్గురు వ్యక్తులు కారం, కత్తి, ఐరాన్ రాడ్తో హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులు ముగ్గురు మృతునికి దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వెంటనే నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. సోదరుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏడీసీపీ రాజ్కమల్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చదవండి: (వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..) -
సీనియర్ పాత్రికేయుడు ప్రసాద్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్ (88)కన్నుమూశారు. కొద్ది రోజులుగా లివర్ కేన్సర్తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మృ తిచెందారు. సోమవారం జూబ్లీహిల్స్లోని మ హాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రచార ఆర్భాటాలకు, పురస్కారాలకు దూరంగా ఉన్న ప్రసాద్ నడుస్తున్న నిఘం టువు వంటి వారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆయన విద్యాభాసమంతా మద్రాస్ లోనే జరిగింది. పాత్రికేయులుగా, ఆంధ్రప త్రిక ఎడిటర్గా పని చేసి, పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు. రోషనారా, అక్బర్, ఆర్య చాణక్య, పృథ్వీరాజ్, షాజహాన్ వంటి చారిత్రక నవలలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. మితభాషి అయిన ప్రసాద్ మృతితో ఒక మంచి రచయితను, గొప్ప పాత్రికేయుడిని కోల్పోయామని పలు వురు పాత్రికేయులు, సాహిత్యాభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
రైతు భరోసా పథకం భేష్
చింతలపూడి: ఏపీలో అమలవుతున్న రైతు భరోసా పథకం కాన్సెప్ట్ చాలా బాగుందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని తన బృందంతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సాగు పద్ధతులు, దిగుబడి, లాభనష్టాల గురించి రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి రైతులు రైతు భరోసా పథకం వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాల్ని కేరళ మంత్రికి వివరించారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్నిరకాల సేవలనూ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారని వివరించారు. దీంతో ఆయన రైతు భరోసా కేంద్రాలు, వాటి పనితీరును గురించి స్థానిక అధికారులను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలతో పాటు జిల్లాలోని నవధాన్యాలు, వరి, ఆయిల్పామ్ తోటలను కూడా పరిశీలించారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నారు. ఆయన వెంట స్టేట్ హెడ్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అంబేడ్కర్, జేడీఏ ఎం.జగ్గారావు, సర్పంచ్ పార్థసారథి, ఏడీ పీజీ బుజ్జిబాబు తదితరులు ఉన్నారు. -
కాకినాడ మేయర్ పావని తొలగింపు
సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టింగ్ మేయర్గా చోడిపల్లి డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘యాక్టింగ్ మేయర్’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్తోపాటు డిప్యూటీ మేయర్–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు. -
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విక్టర్ ప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. గతేడాది జనవరిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చదవండి: దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్ దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్గా కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది, దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసిన మారుమూడి విక్టర్ ప్రసాద్ను ప్రభు త్వం నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. విక్టర్ ప్రసాద్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొన సాగుతారు. -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
అతడి ఇంటికి 12 సార్లు గంజాయి సప్లై
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఎన్సీబీ అధికారులు. ఈ సందర్భంగా మరో తొమ్మిది రోజులు.. అక్టోబర్ 5వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. షోవిక్, రియా చక్రవర్తికి గంజాయి సప్లయ్ చేసిన వారితో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో శనివారం ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శుక్రవారం ప్రసాద్ ఇంట్లో జరిపిన సోదాలలో వాడిపడేసిన గంజాయి లభించినట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ( డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్ ) కాగా, డ్రగ్ డీలర్ సంకేత్ పాటెల్ విచారణలో ప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ ఇంటికి గంజాయి సప్లయి చేసినట్లు విచారణ సందర్భంగా పాటెల్ తెలిపాడు. మే నుంచి జులై వరకు దాదాపు 12 సార్లు ప్రసాద్ ఇంటికి గంజాయి పంపినట్లు, గంజాయి పంపిన ప్రతిసారి 3,500 రూపాయల డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు.