అయ్యో...అవ్వ! | Shocking incident in Eluru One Town in Satyanarayanapet | Sakshi
Sakshi News home page

అయ్యో...అవ్వ!

Published Sat, Mar 29 2025 4:49 AM | Last Updated on Sat, Mar 29 2025 4:50 AM

Shocking incident in Eluru One Town in Satyanarayanapet

ఏలూరులో వృద్ధురాలి దారుణ హత్య 

కిరాతకానికి ఒడిగట్టిన యువకుడు  

ముఖంపై తీవ్రంగా దాడి..అక్కడికక్కడే అవ్వ మృతి 

ఆపై చేతులు, కాళ్లను కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి, పెట్రోల్‌ పోసి నిప్పంటించిన నిందితుడు  

ఏలూరు టౌన్‌: కూటమి ప్రభుత్వంలో ఒంటరి వృద్ధులకూ రక్షణ కరువైంది. ఎవరిని ఏం చేసినా పట్టించుకునే వారే లేకపోవడంతో అరాచకశక్తులు పేట్రేగి­పోతు­న్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏలూరు వన్‌టౌన్‌ సత్యనారా­యణపేటకు చెందిన చానాపతి రమ­ణమ్మ (65) అనే ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ప్రసాద్‌ అనే యువకుడు ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకుని 7.30 గంటల సమయంలో గొడవ పడ్డాడు. 9.30 గంటలకు మరోసారి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మెడలోని బంగారు గొలుసు, బీరువా­లోని కొంత నగదు తీసుకుని పరార­య్యాడు. 

తానే చంపానన్న అనుమానం వస్తుందని భావించి అర్ధరాత్రి ఆమె ఇంటికి మళ్లీ వచ్చాడు. ఆమె చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. పోలీసులు డాగ్‌ స్క్వాడ్, ఫింగర్‌ ప్రింట్స్‌ బృందంతో రంగంలోకి దిగి ఆధా­రాలు సేకరించారు. పోలీసులు నిందితు­డిని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement