'మహా సంకల్పం' బస్సు ఢీకొని ఇద్దరి మృతి | bus accident in maha sankalpam | Sakshi
Sakshi News home page

'మహా సంకల్పం' బస్సు ఢీకొని ఇద్దరి మృతి

Published Mon, Jun 8 2015 10:28 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలితీసుకుంది.

మచిలీపట్నం (కృష్ణా జిల్లా): మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలితీసుకుంది. బాధితుల బంధువుల కథనం మేరకు... కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన అనిరాజు వీరాంజనేయులు(29), వెంకటనారాయణపురానికి చెందిన తమ్ము ఏడుకొండలు (29) స్నేహితులు. వీరు బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగివస్తున్నారు.

అదే సమయంలో మచిలీపట్నం నుంచి టీడీపీ కార్యకర్తలతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న మహాసంకల్పం బహిరంగ సభకు వెళుతున్న బస్సు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు, ఏడుకొండలను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement