'చిల్లర వ్యవహారాలు మానుకోండి' | Chandrababu should get Clean Chit from CBI, says parthasaradhi | Sakshi
Sakshi News home page

'చిల్లర వ్యవహారాలు మానుకోండి'

Sep 29 2014 6:07 PM | Updated on Sep 2 2017 2:07 PM

'చిల్లర వ్యవహారాలు మానుకోండి'

'చిల్లర వ్యవహారాలు మానుకోండి'

చిల్లర వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని టీడీపీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి సూచించారు.

విశాఖపట్నం: జయలలితకు పడిన శిక్ష వైఎస్ జగన్ కు పడుతుందనడం అవగాహనారాహిత్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. రాజ్యాంగపరమైన పదవులు జగన్ అనుభవించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. చిల్లర వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని సూచించారు.

ఐఎంజీ తదితర కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో విజయమ్మ కోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు భయపడి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. సీబీఐ లేదా అలాంటి సంస్థలతో దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ ఎందుకు తెచ్చుకోలేదని పార్థసారథి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement