ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ముంపు ప్రాంత నియోజకవర్గాలైన పాలకొల్లు, నరసాపురం, భీమవరంలలో 65 కి.మీ మేర ఆయన పర్యటించనున్నారు. ఉద యం 9 గంటలకు దిండి రిసార్ట్నుంచి బయలుదేరి యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిమీదుగా జిల్లాలో ప్రవేశిస్తారని పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. యలమంచిలిలో పొలాలను చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం ఊటాడ-కాజతూర్పుమీదుగా బ్రిడ్జివరకు చేరుకుని అక్కడ పొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత పెదమామిడిపల్లి మీదుగా దిగమర్రు, నరసాపురం-మత్స్యపురిరోడ్డు బ్రిడ్జిమీదుగా చినమామిడిపల్లి, శరపల్లి, లిఖితపూడిమీదుగా కొప్పర్రు, భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి, తుందుర్రు ప్రాంతాల్లో పొలాలను పరిశీలించి పంట స్థితిగతులపై రైతులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటారు. అనంతరం భీమవరం టౌన్ నుంచి ఉండి, చెరుకువాడ, ఆకివీడు మీదుగా ఉప్పటేరు బ్రిడ్జి నుంచి చంద్రబాబు కృష్ణాజిల్లాలో ప్రవేశిస్తారని ఆమె వివరించారు.
Breadcrumb
చంద్రబాబు జిల్లా పర్యటన ఇలా
Published Tue, Nov 26 2013 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Related news by tags
-
ఆషాఢంలో అల్ల నేరేడు
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, ఆషాఢంలో ఎండ వేడిమి తగ్గి, శరీరం నుంచి చెమట రూపంలోనూ, మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్లో నేరేడు పండు తినడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో పాఠాలుగా చదువుకుంటాం. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, వాతావరణంలోని మార్పులకు దేహం సరయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడుని ఔషధంలా ఉపయోగించాలని, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే విషపదార్థాలను బయటకు పంపించడానికి నేరేడు మంచి మందనీ. దానిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ గ్రహించాలి. నేరేడు మనకు ఇంకా ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ⇒ చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.⇒పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.⇒రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.⇒మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.⇒నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.⇒వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.⇒జిగట విరేచనాలతో బాధపడే వారు నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో΄ాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.⇒కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.⇒ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.⇒జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.⇒మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.⇒పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.వీరు తినకూడదు..అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో΄ాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. -
పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు : కొవ్వును కరిగిస్తుంది కూడా
మన వంటకాల్లో పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ లేనిదే పని జరగదు. అయితే పచ్చి మిర్చితో కేవలం గూబ గుయ్యిమనే కారం, వంటకు రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే. పచ్చిమిర్చితో బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందట. అవేంటో ఈ కథనంలో చూసేద్దామా! ఆరోగ్యానికి అద్భుతాలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి పచ్చి మిరపకాయలు కేవలం 100 గ్రాముల పచ్చిమిర్చిలో 109.1 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే. పొటాషియం కూడా లభిస్తుంది. పచ్చిమర్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. వీటిల్లోని బయోయాక్టివ్ రసాయనం ‘క్యాప్సైసిన్’ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు, తద్వారా గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.గట్ హెల్త్కు మంచిది క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ఆరోగ్యానికి సహజ నివారణగా చేస్తుంది.బరువు తగ్గడంలో గేమ్-ఛేంజర్లా పనిచేస్తుంది. క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతంచేసి కేలరీల బర్న్ను ప్రోత్సహిస్తుంది.విటమిన్ సీ, బీటా-కెరోటిన్తో నిండిన పచ్చి మిరపకాయ యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్రొఫైల్, ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబు , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుందిసహజమైన 'ఫీల్-గుడ్' కెమికల్ పచ్చిమిర్చి. క్యాప్సైసిన్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక విటమిన్ సి మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మార్చి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందివయస్సు-సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి మిరపకాయల్లో యాంటీమైక్రోబయల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ చర్మ వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా చేస్తాయి. క్యాప్సైసిన్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మెరుపునిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, పచ్చి మిరపకాయలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యమవుతుంది.పచ్చి మిరపకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి.కనుక వి ఇనుము గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. -
చిరు జల్లులు: వేడి వేడి మొక్కజొన్నపొత్తులు, ఈ విషయాలు తెలుసా?
సన్నని చిరు జల్లులు.. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. కమ్మగా కాల్చిన వేడి వేడి మొక్క జొన్నపై కాస్తంత నిమ్మరసం, ఉప్పుచల్లుకొని తింటే ఆహా.. అనుకోవాల్సిందే. మరి సీజనల్గా లభించే మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలగురించి ఎపుడైనా ఆలోచించారా?మొక్కజొన్న లేదా కార్న్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన తృణధాన్యాలలో ఒకటి. సెంట్రల్ అమెరికాకు చెందిన గడ్డి కుటుంబంలోనిది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని రకాల్లో పెరుగుతుంది. సాధారణంగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు వంటి అనేక ఇతర రంగులలో కూడా లభిస్తుంది. ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంలాంటి ఖనిజాలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల మూలం మొక్కజొన్న. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది , ప్రేగుల క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఇనుము ఉంటుంది. ఇది ఇనుము లోపం అనీమియాను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందిస్తాయి. మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని లుటిన్ , జియాక్సంతిన్ కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫోలేట్, పొటాషియం , ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు ఎముకలను బలోపేతం చేస్తాయి తద్వారా ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సీతోపాటు , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో మన శరీరం , చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను అడ్డుకుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్ను సంప్రదించడం మంచిది -
ఆవాలతో ప్రయోజనాలు: చిన్నగా ఉన్నాయి కదాని లైట్ తీసుకోవద్దు!
షుగర్ లేదా మధుమేహం(Diabetes) ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కారణంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే లక్షలాదిమంది ప్రీడయాబెటిస్తో జీవిస్తున్నారు. అయితే రోజూ వ్యాయామంతోపాటు కొన్ని ఆహార జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాల వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన వంట ఇంట్లో సులువుగా లభించే ఆవాలతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఆవాలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం చాలా శక్తివంతమైనవి. మన ఆహారంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ పోపు దినుసుగా వాడటంతోపాటు, మన ఆహారంలో భాగమైన ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఆవ పిండిని బాగా వాడతాము. కొన్ని ప్రాంతాలో ఆవకూర, ఆవనూనెను కూడా బాగా బాడతారు.ఆవాలు ఆరోగ్య ప్రయోజనాలుపుష్కలంగాపోషకాలు: ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలకు ఆవాలు మంచి మూలం.ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఆవపిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఆవాలు లేదా ఆవాల నూనెతో శరీరంలో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆవలోని సెలీనియం ఎముకలకు బలాన్నిస్తుంది.జుట్టు, దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఆవాలు సహాయపడతాయి. ఆవాలులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే ఆవాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం ఆవాల వినియోగం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ,వారి కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముగ్గురికి గ్లూకోజ్ స్థాయిలు 46శాతం తగ్గాయి. కొలెస్ట్రాల్ స్థాయి సగటున 10శాతం తగ్గింది. చిగుళ్ళు, ఎముకలు, దంతాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి ఈ గింజలు. చర్మానికి కాంతినిస్తాయి. పైల్స్ నొప్పి నివారణలో కూడా ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనె కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు.
Related News by category
-
తుపాకీతో భార్య కాల్చివేత
మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే.రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి. -
హైదరాబాద్: యువకుడి ప్రాణం తీసిన బైక్ స్టంట్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. హయత్నగర్లో బైక్ స్టంట్లు యువకుడి ప్రాణాలు తీశాయి. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.వర్షం కురుస్తున్న సమయంలో కేటీఎం బైక్పై ఇద్దరు యువకులు స్టెంట్లు చేస్తుండగా.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. చేతికందిన కుమారుడు మృతిచెందాడన్న వార్త జీర్ణించుకోలేక ఆ కన్నతల్లి పెట్టిన రోదన అక్కడివారిని కలిచివేయించింది. -
మీ ఇంటికీ వస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని భవనాల జీఐఎస్ మ్యాపింగ్ కోసం డోర్ టు డోర్ సర్వే త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకుగాను జీహెచ్ఎంసీతోపాటు సర్వే చేసేందుకు ఎంపికైన కాంట్రాక్టు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓవైపు డ్రోన్ సర్వే ప్రారంభం కాగా.. మరోవైపు త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఇంటింటి సర్వే వల్ల జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.వెయ్యి కోట్లకు పైగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. జీహెచ్ఎంసీలో 20 లక్షలకు పైగా ఆస్తులు (భవనాలు) ఉన్నప్పటికీ, ఆస్తిపన్ను చెల్లింపు జాబితాలో మాత్రం దాదాపు 19 లక్షలున్నాయి. ఇంటింటి సర్వే ద్వారా సరైన లెక్కలతో పాటు భవనాల వాస్తవ విస్తీర్ణాలకనుగుణంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ప్రస్తుతం చాలా భవనాల వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం నమోదై ఉండటంతో జీహెచ్ఎంసీకి రావాల్సినంత ఆస్తిపన్ను ఆదాయం రావడం లేదు. మరోవైపు అదనంగా పెరిగిన అంతస్తుల నుంచి కూడా ఆస్తిపన్ను రావడం లేదు. శాటిలైట్, డ్రోన్, డోర్ టు డోర్ సర్వేల ద్వారా మ్యాపింగ్తో కచి్చతమైన వివరాలతో పాటు ప్రతి ఇంటికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించనున్నందున ఓవైపు జీహెచ్ఎంసీ ఆదాయం పెరగడంతో పాటు వివిధ అవసరాలకు ఉపయోగపడనుంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత యంత్రాంగం త్వరితంగా చేరుకునేందుకు కూడా ఉపకరిస్తుంది. రెండు సర్కిళ్లలో పూర్తయిన డ్రోన్ సర్వే ఇప్పటికే డ్రోన్ సర్వే ప్రారంభమైంది. పటాన్చెరు, కూకట్పల్లి సర్కిళ్లలో పూర్తయిందని జీహెచ్ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం శేరిలింగంపల్లిలో సర్వే జరుగుతోంది. త్వరలోనే ఇంటింటి సర్వే కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలు సర్వేకు సహకరించేందుకు వీలుగా ముందస్తు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటారు. సోషల్మీడియా ద్వారానూ ప్రచారం నిర్వహించాలనే యోచనలో అధికారులున్నట్లు సమాచారం. యాప్లో నమోదు ఇంటింటి సర్వేలో భాగంగా ఇళ్లకు సంబంధించిన వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. ఇళ్ల యజమానుల ఫోన్ నెంబర్లను కూడా నమోదు చేయనున్నారు. ఇళ్ల నమోదులో భాగంగా నివాస భవనమా.. వాణిజ్య భవనమా.. అపార్ట్మెంటా.. ఇండిపెండెంట్ భవన మా? వంటి వివరాలతో పాటు భవనం విస్తీర్ణం, చిరునామా, పోస్టల్ కోడ్ తదితర వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనాల వివరాలను సైతం సర్వే చేస్తారు. భవనం ఎత్తు, అక్కడున్న రోడ్ మెయిన్ రోడ్డా? సబ్ రోడ్డా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు. భవనం ఫొటోలు తీస్తారు. భవనాల్లో ఇంకుడుగుంతలు, సివరేజి లైన్లు, సోలార్ ప్యానెల్ వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. జియో ఫెన్సింగ్ వల్ల భవనం ఏ వార్డు పరిధిలో ఉన్నది ఆటోమేటిక్గా నమోదవుతుంది. ఎన్ని అంతస్తులు, భవన వినియోగం, వాటర్, విద్యుత్ కనెక్షన్ల వివరాలు తదితరాలను సైతం నమోదు చేస్తారు. వాణిజ్య భవనాలైతే జరుగుతున్న వ్యాపారం, ట్రేడ్లైసెన్స్ వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. వీటితో పాటు ఇంకా పలు వివరాలు యాప్లో నమోదు చేయనున్నారు. యాప్ పనితీరు పరిశీలన కోసం దాదాపు 15 ఇళ్ల వివరాలు యాప్లో నమోదు చేసినట్లు సమాచారం. -
సనత్నగర్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
సనత్నగర్: సనత్నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచి్చన మహిళతో చాటింగ్ చేస్తూ అసభ్యకర మెసేజ్లు పంపించడంపై ఇన్స్పెక్టర్పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు నెలల క్రితం సనత్నగర్ ఇన్స్పెక్టర్గా పురేందర్రెడ్డి బదిలీపై వచ్చారు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ నేపథ్యంలో పురేందర్రెడ్డి ఆమెతో ఫోన్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ‘నువ్వు అందంగా ఉన్నావు.. నేను చెప్పిన చోటికి రావాలి’ అంటూ అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అభ్యంతరకరంగా చేసిన చాటింగ్ సందేశాలను ఆధారాలతో కమిషనర్కు ఆమె చూపించారు. దీంతో ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో దుష్ప్రవర్తనను సహించేది లేదన్న బలమైన సందేశాన్ని సీపీ పంపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పౌరులకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేలా ఒక భరోసా కలిగించేలా సీపీ చర్యలు తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన ఇన్స్పెక్టర్గా శ్రీనివాసులు.. సనత్నగర్ పోలీస్స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా కె.శ్రీనివాసులును నియమిస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు.. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శనివారం సాయంత్రం సనత్నగర్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.