క్యూలైన్లో స్పృహ కోల్పోయిన చిన్నారి | child lost consciousness on the VIP line | Sakshi
Sakshi News home page

క్యూలైన్లో స్పృహ కోల్పోయిన చిన్నారి

Published Sun, Oct 18 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

child lost consciousness on the VIP line

ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తడంతో.. వీఐపీ క్యూ లైన్లో ఓ చిన్నారి స్పృహతప్పింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భారీగా అనధికార వీఐపీలు పోటెత్తారు. ఆసహనానికి గురైన ఆలయ ఈవో వేణు వీఐపీ క్యూలైన్ గేట్లకు తాళాలు వేశాడు. ఇదే సమయంలో మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(8) స్పృహతప్పింది. ఆమెను వెంటనే ప్రధమ చికిత్సాకేంద్రానికి తరలించారు.


ఈవో చర్య వల్ల అర్చకులు సైతం గేట్లు దూకి గర్భగుడిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నానికి 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.100, రూ.250 టికెట్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement