
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 813కు చేరింది. వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తంగా 24 మంది మరణించారు. ఇక కరోనా బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీ వివరాల ప్రకారం గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాటి కేసులకు సంబంధించిన మీడియా బులెటిన్ను విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తగా డిశ్చార్జ్ అయిన వారి వివరాలు(గడిచిన 24 గంటల్లో)
- మొత్తంగా 24 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
- గుంటూరు- 8
- అనంతపూర్- 5
- కడప- 4
- నెల్లూరు- 4
- కృష్ణ- 2
- విశాఖపట్నం- 1
కొత్తగా నమోదైన మరణాలు- 2(గుంటూరు జిల్లాలో)
కోవిడ్ పరీక్షల వివరాలు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5757 నమూనాలు పరీక్షించగా 56 మందికి పాజిటివ్గా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment