కాంగ్రెస్ను నిందించటం తగదు: గుత్తా | Don't blame congress: MP Gutta sukhendar reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ను నిందించటం తగదు: గుత్తా

Published Mon, Sep 16 2013 8:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Don't blame congress: MP Gutta sukhendar reddy

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీని నిందించటం తగదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే తెలంగాణ ప్రకటన చేసిందనటం అవాస్తవమన్నారు. విభజన విషయంలో ఇతర పార్టీలు మాటతప్పి కాంగ్రెస్ను నిందించటం సరికాదని గుత్తా వ్యాఖ్యానించారు.

సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఓపికతో ఉండాలని అధిష్టానం పెద్దలు చెప్పారని.... అందుకే అప్పటి నుంచి ఓపిగ్గా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, నీటి పంపిణీ విషయాలపై ఓ కమిటీ ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో త్వరలో కార్యచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement