వడదెబ్బకు వృద్ధుడి మృతి | Elderly person dies with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడి మృతి

Apr 18 2015 3:19 AM | Updated on Sep 3 2017 12:25 AM

వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మం డల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పుత్తూరు రూరల్ : వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మండల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తడుకు హరిజనవాడకు చెందిన పీ.మునస్వామి(55) ఆరుబయట మల మూత్ర విసర్జనకు పొలాల్లోకి వెళుతూ వడదెబ్బ సోకడంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి చనిపోయాడు. మునస్వామి భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందగా, కోడలు జ్యోతి, ఆమె పిల్లలిద్దరినీ సంరక్షిస్తున్నారు. ఆయన మృతితో వారు అనాథలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement