
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి పౌరుడికి ఆరోగ్య హక్కు ఉండాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లు–2017 పేరుతో ఆయన ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లుతోపాటు శుక్రవారం ఆయన మరో రెండు ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. అవి చిత్రహింసల నివారణ బిల్లు– 2017, బలవంతపు అదృశ్యాల నివారణ బిల్లు–2017.