రోడ్డున పడిన జీవితం! | Family Harassment on Women And Baby in Palamaner Chittoor | Sakshi
Sakshi News home page

రోడ్డున పడిన జీవితం!

Jan 31 2020 12:10 PM | Updated on Jan 31 2020 12:10 PM

Family Harassment on Women And Baby in Palamaner Chittoor - Sakshi

నీళ్లకుంట అంగన్‌వాడీ సెంటర్‌ వద్ద తలదాచుకుంటున్న శోభ

పలమనేరు: తన భర్త, అత్తమామలు తనతో గొడవ పడి ఇంటి నుంచి గెంటేశారని ఓ మహిళ తన పసిబిడ్డతో విలపిస్తోంది. తలదాచుకునేందుకు స్థలం లేక తన సామగ్రితో అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరింది. గురువారం ఈ సంఘటన  మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటలో వెలుగుచూసింది. తన గోడును బాధితురాలు అంగన్‌వాడీ వర్కర్‌ రాధకు నివేదించడంతో ఆమె మీడియా దృష్టికి తీసుకువచ్చింది. వివరాలు..పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద కాపురమున్న శోభతో బొమ్మిదొడ్డికి చెందిన గోవిందురాజులతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏదాడి వయస్సున్న బాబున్నాడు. అయితే తల్లిమాట వింటూ భర్త తరచూ తనను వే«ధిస్తున్నాడని శోభ తెలిపింది. ఈనేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఇంటినుంచి బయటకు పంపేశారని, దీంతో ఏం చేయాలో అర్థంగాక  అంగన్‌వాడీ ముందు తలదాచుకుంటున్నానని తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement