
సాక్షి, ఉండి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఏఐసీసీ మెంబర్గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు, విజయనగరం కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదా రామారావు తదితరులు ఉన్నారు. బొబ్బిలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌజన్య కూడా ఇదే సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment