నగరానికి చేరిన క్రికెట్‌ జట్లు | Indian Cricket Team Reached Visakhapatnam | Sakshi
Sakshi News home page

నగరానికి చేరిన క్రికెట్‌ జట్లు

Published Tue, Oct 23 2018 7:43 AM | Last Updated on Tue, Oct 30 2018 2:05 PM

Indian Cricket Team Reached Visakhapatnam - Sakshi

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ) : వైఎస్సార్‌ స్టేడియంలో బుధవారం జరగనున్న రెండో వన్డేలో ఆడే భారత, వెస్టిండీస్‌ జట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ రెండు జట్ల ఆటగాళ్లు విశాఖ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బస్సు వద్దకు చేరుకున్న భారత క్రికెటర్లను చూసి కేరింతలు కొట్టారు. వారిని సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసి ఉత్సాహపడ్డారు. ప్రత్యేకించి కోహ్లీ, ధోనీ, రోహిత్‌ శర్మ తదితరులు కనిపించినప్పుడు అభిమానులు తెగ సందడి చేశారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు నోవాటెల్‌ హోటల్‌కు, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఫోర్‌ పాయింట్‌ హోటల్‌కు వేరువేరు బస్సుల్లో చేరుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement