అమరావతిలో ఆడియో విడుదల చేయడం సంతోషం | Jai simha audio launch at amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతిలో ఆడియో విడుదల చేయడం సంతోషం

Published Mon, Dec 25 2017 2:58 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Jai simha audio launch at amaravathi - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తను నటించిన జై సింహా చిత్రం ఆడియోను అమరావతిలో విడుదల చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు, ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఆదివారం విజయవాడలో జరిగింది.

మంత్రి నారా లోకేశ్‌ ఈ చిత్రం పాటల సీడీని ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా తీస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇప్పుడు పేర్లు మారుస్తున్నారన్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర కథానాయికలు హరిప్రియ, నటాషా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చిరంతన్‌ భట్, నటులు చలపతిరావు, శివాజీరాజా, ఎల్‌బి.శ్రీరామ్, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement