పాలకొండ పోస్టాఫీస్ ఎదుట ఉన్న శ్రీసాయిగణేష్ జ్యూయలరీలో మంగళవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కొంతమేర బంగారంతో పాటు అరకేజీ వెండి
ఆభరణాల దుకాణంలో చోరీ
Dec 11 2013 4:18 AM | Updated on Sep 2 2017 1:27 AM
పాలకొండ, న్యూస్లైన్: పాలకొండ పోస్టాఫీస్ ఎదుట ఉన్న శ్రీసాయిగణేష్ జ్యూయలరీలో మంగళవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కొంతమేర బంగారంతో పాటు అరకేజీ వెండి అపహరణకు గురైందని దుకాణం యజమాని పొట్నూరు నాగేశ్వరరావు తెలిపారు. షాపు షట్టర్ను విరగ్గొట్టి..తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలిని డీఎస్పీ దేవానంద్శాంతో, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.హెచ్.విజయానంద్, ఎస్సై ఎం.వినోద్బాబు సందర్శిం చారు. దొంగతనంపై ఆరా తీశారు. అయితే రాత్రిపూట గస్తీ తిరుగుతుండగా అనంతరావు అనే హోంగార్డు దృష్టిలో నలుగురు యువకులు పడ్డారని..వారిని వెంబడించినా..తప్పించుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్లూస్ టీమ్ కూడా సందర్శించి వివరాలు సేకరించింది. కాగా నడిబొడ్డున పోస్టాఫీస్ రోడ్డులో ఆభరణాల దుకాణం చోరీకి గురవ్వడంతో వ్యాపార వర్గాల్లో అలజడి నెలకొంది.
Advertisement
Advertisement