అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి | man killed with Excessive alcohol | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

Published Sun, Nov 15 2015 7:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

సుండుపల్లి మండలంలోని చెన్నంరాజుగారిపల్లిలో నజీర్ అహమ్మద్ (59) అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి మృతి చెందాడు.

సుండుపల్లి మండలంలోని చెన్నంరాజుగారిపల్లిలో నజీర్ అహమ్మద్ (59) అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మడితాడు గ్రామానికి చెందిన నజీర్ రోజూ మద్యం సేవించడానికి చెన్నరాజుగారిపల్లి వస్తుంటాడు. రోజూ లాగే మద్యం సేవించాడు. ఆదివారం ఊరి చివరన అపస్మారక స్థితిలో గ్రామస్తులకు కనిపించాడు. నజీర్‌ను పరిశీలించగా మృతి చెందాడని అర్థమైంది. దీంతో స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement