ఏజెన్సీలో ప్రశాంతంగా మావోయిస్టుల బంద్ | maviost party band at AOB | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ప్రశాంతంగా మావోయిస్టుల బంద్

Feb 20 2015 4:35 PM | Updated on Mar 28 2019 5:07 PM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.

విశాఖపట్టణం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.

అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల కోసం ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంత సర్వీస్‌లను నిలిపివేసింది.
(పాడేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement