
మంత్రి మాట్లాడుతుండగా సమావేశం నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్న మహిళలు
మాకు ఆకలవుతోంది.. అందరూ వచ్చి కూర్చోండి’’ అని అనడంతో మహిళలు తిరిగి వచ్చి సీట్లలో కూర్చున్నారు. మంత్రి దురుసుగా మాట్లాడటంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి, తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా, మెప్మా సీఓలు, ఆర్పీలు బలవంతంగా ఉదయం తమను పిలుచుకొచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కావస్తోందని, తమ పిల్లలకు భోజనం పెట్టడానికిఇంటికి వెళతామంటే సీఓలు అడ్డుకున్నట్లు తెలిపారు. కాగా, మంత్రి మహిళలను కించపరుస్తూ మాట్లాడినప్పుడు వేదికపై ఉన్న టీడీపీ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం గమనార్హం.