మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు..
గుంటూరు: మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొండి వైఖరి వీడాలని కోరారు. అంతకు ముందు గుంటూరులో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ నెల 27 లోపు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ అమరావతి వచ్చేస్తాయని తెలిపారు.