మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సబ్ కలెక్టర్ కృతికా బాత్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 200 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి గాను కేవలం 60 మంది కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని.. ఈ రూపేణా కోటి రూపాయల మేర అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.