నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy to be attend marriage in madanapally | Sakshi
Sakshi News home page

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌

Published Sat, Feb 4 2017 8:31 AM | Last Updated on Wed, Apr 4 2018 9:31 PM

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌ - Sakshi

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌

మదనపల్లిలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం
పులివెందుల నుంచి కదిరి మీదుగా రాక

మదనపల్లి (చిత్తూరు జిల్లా) :
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు. మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి కుమార్తె కరిష్మా దేశాయ్, వరుడు లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఉన్న వైఎస్‌ జగన్‌ సాయంత్రం 3 గంటలకు అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు, తనపల్లి, ములకలచెరువు మీదగా మదనపల్లి చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ  నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో భారీ స్వాగతానికి తంబళ్లపల్లి ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ప్రముఖులు మదనపల్లి బయలుదేరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement