ముగిసిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం | mlcs take oath on monday | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Published Mon, Mar 30 2015 11:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

mlcs take oath on monday

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వీరభద్రస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి సోమవారం ఉదయం సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరూ సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి సమక్షంలో సభ్యులుగా ప్రమాణం చేశారు.
తెలంగాణ శాసనమండలి సభ్యునిగా ఎ.రామచంద్రరావు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సమక్షంలో ప్రమాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement