MLCs
-
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!
సాక్షి,ఢిల్లీ: గవర్నర్కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్పాల్ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్ఫండ్స్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
వైఎస్ఆర్ సీపీ MLCల ప్రెస్ మీట్
-
కూటమి సర్కారుపై YSRCP ఎమ్మెల్సీల ప్రశ్నల వర్షం
-
బడ్జెట్పై చర్చ పక్కదారి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం బడ్జెట్పై జరిగిన చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాము మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, బొమ్మి ఇజ్రాయెల్, సిపాయి సుబ్రమణ్యం, పీవీవీ సూర్యనారాయణరాజు, వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. మంత్రులందరూ అడ్డుకున్నారు..మండలిలో బడ్జెట్పై మాట్లాడుతుంటే వాస్తవాలు భరించలేని అధికారపక్ష నేతలు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. టారిఫ్ పెంచబోతున్నారా అని ఎనర్జీ మీద ప్రశ్నోత్తరం ఇచ్చాం? కానీ, దానిపై చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఒక్కో యూనిట్కు రూ.1.50 పైసలు పెంచుతున్నారు.ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే దీనిని భరించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ నెట్టుకొచ్చి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే లోకేశ్ చర్చను తప్పుదారి పట్టించారు. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇలా వ్యవహరిస్తున్నారు. – తోట త్రిమూర్తులుప్రజలను ప్రభుత్వం మోసం చేసింది..ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బడ్జెట్లో జరిగిన తప్పులను లేవనెత్తడం ప్రతిపక్షంగా మా బాధ్యత. మా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుతగులుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయాలంటే రూ.74 వేల కోట్లకు పైగా అవసరమవుతాయి. కానీ, అందుకు తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్కటే ఇచ్చారు.. మరో 2 సిలిండర్ల మాటేంటి? రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వడంలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా? అరకొర బడ్జెట్ కేటాయించి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలుచేస్తారు? మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. – వరుదు కళ్యాణిఈరోజు మండలి చూస్తే బాధేసింది..ఈరోజు మండలిలో జరిగిన పరిస్థితులను చూస్తే బాధేసింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాప్తి, మరణాలపై ప్రశ్నోత్తరం ఇచ్చాం. జిల్లాలో డయేరియా వ్యాప్తి వాస్తవమేనా అంటే వైద్య మంత్రి లేదన్నారు. మొత్తం 14 మరణాలు సంభవిస్తే డిప్యూటీసీఎం పవన్ 10 మంది చనిపోయారని.. చంద్రబాబు 8 మంది చనిపోయారన్నారు. నిన్న మంత్రి సభలో నలుగురు చనిపోయారంటున్నారు. సభ్యుల ఆవేదన చూస్తే ముచ్చటేస్తోందని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బాధాకరం. –పీవీవీ సూర్యనారాయణ రాజుబాబు పాలనంతా తిరోగమనమే..సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. కానీ, బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు మాత్రమే చూపించారు.. ఇది మోసం కాదా? బాబు పాలనంతా తిరోగమనమే. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. – బొమ్మి ఇజ్రాయెల్ విపక్షాల గొంతు నొక్కుతున్నారు..మండలిలో ప్రస్తుతం మేం మెజార్టీ సభ్యులం. అయినా కూడా సభా పద్ధతులు పాటించకుండా టీడీపీ మంత్రులు గందరగోళం సృష్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు. సూపర్ సిక్స్లో ప్రతీ రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంటే 11 వేల కోట్లు.. కానీ, కేటాయించింది వెయ్యి కోట్లే. ఇది మోసం కాదా? ఇక ఉచిత బస్సు ఏమైంది? – సిపాయి సుబ్రహ్మణ్యంసమయం కూడా ఇవ్వలేదు..నాకు కేటాయించిన సమయం ఇవ్వకుండానే సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎంతో విలువైన 4 గంటలు వృథా అయిపోయాయి. మాలాంటి కొత్త ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. కనీసం రేపైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు నిత్యం మోసం, దగా చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు. – వంకా రవీంద్రనాథ్ -
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
శాసన మండలిలో టీడీపీకి ఊహించని దెబ్బ
-
వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..⇒ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ స్పీకర్ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు. ⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ హైకోర్టులో మనం వేసిన పిటిషన్పై కౌంటర్ వేయడానికి కూడా స్పీకర్ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. ⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి. ⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు. ⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. ⇒ వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా. ⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. -
ప్రశ్నిస్తామన్న భయంతో ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం.కాని కౌంటర్కు స్పీకర్ సమాధానం ఇవ్వడంలేదు.అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.కాని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడంలేదు: ప్రతిపక్ష హోదాను అంగీకరిస్తే, మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అధికారపక్షం అంగీకరించడంలేదు.ప్రతిపక్ష నాయకుడుకి హక్కుగా మైక్, సమయం లభిస్తుంది.అలా ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా ముందుకు రావడంలేదు.40శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులు మాట్లాడతారు.అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదేరీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం.పూర్తి వివరాలు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.ఇవన్నీకూడా ప్రతి మండలి సభ్యుడికీ పంపిస్తాం.ఆధారాలు చూపిస్తూ..ప్రభుత్వాన్ని నిలదీయండి..ప్రశ్నించండి.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.ప్రశ్నిస్తే..బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు.అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే బడ్జెట్ పత్రాల ద్వారా చెప్పారు.దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్రవివరాలను ప్రెస్మీట్ద్వారా నేను వివరిస్తాను.చంద్రబాబు చెప్పేవన్నీ మోసం అని, అబద్ధం అని ఇప్పటికే తేలిపోయింది.ఈ ఆరునెలల కాలంలోనే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారు.ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.కష్టాలు అనేవి శాశ్వతం కాదు .వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం.కచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం.జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం.వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.గట్టిగా ప్రశ్నిస్తే..కేసులు పెడతారన్న భయాందోళనలు అనవసరం.నేను మీకు అండగా ఉంటాను.నా వయసు చిన్నదే.మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తాను.మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం.ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజినీరింగ్ చేశాం.ఎక్కడాలేని మార్పులు తీసుకు వచ్చాం.కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను తప్పకుండా గుర్తిస్తారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్సీలు మహేశ్కుమార్గౌడ్, ఎం.ఎస్.ప్రభాకర్రావు, శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా అభినందించడంతోపాటు వారికి గుర్తింపు పత్రం, మండలి నియమావళిని అందజేశారు. అనంతరం మండలి చైర్మన్, మంత్రులతో కలసి కోదండరాం, అమీర్ అలీఖాన్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.పెద్దల సభకు ఉద్యమ సారథికోదండరాం సార్గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావుతో కలిసి పని చేశారు.ఓయూలో ప్రొఫెసర్గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్లో న్యూస్ ఎడిటర్గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్లో జన్మించిన అమేర్ అలీ ఖాన్కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
TG: గవర్నర్కోటా ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీం గ్రీన్సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
weekly roundup: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. బీఆర్ఎస్లో గుబులు!
బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్తో సహా ఏడుగురు కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. పార్టీ మారటం లేదు..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు. -
కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. -
99 శాతం వాగ్దానాలు అమలు చేశాం...వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్..
-
టీడీపీ-జనసేన హనీమూన్ నడుస్తోంది.. కొంతటైమిచ్చి పోరాడుదాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.జగన్ రాష్ట్ర పర్యటనత్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్కు ఉన్నాయి’’ అని వివరించారు. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్ ఛాన్స్
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్పై శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. -
సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి హౌజ్లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్ ఐదుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. సభ ప్రారంభంలోనే గందరగోళం ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి అవకాశం కల్పించారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్ఎస్కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. -
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్కుమార్ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్లు నిర్ణయించుకున్నారు. -
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ల ప్రమాణం చేయడానికి వీల్లేదు!. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్ విచారణ తేలెంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు వాళ్లు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్రావు, ఫారూక్ హుస్సేన్ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్కి న్యూస్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. -
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్గా ఎం. మహేందర్రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు ‘కౌన్సిల్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మాత్రం విచిత్రమైన స్థితిని ఎదుర్కోనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో 37 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు కాగా కేవలం ముగ్గురు (బీఆర్ఎస్ను వీడిన ఇద్దరితో కలిపి) మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మూడు ఖాళీలు మాత్రమే స్వల్ప సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. 2025 మార్చి లోపు ఏ కోటాలోనూ రిటైర్ అయ్యే సభ్యులు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో సభ్యులు మండలిలో అడుగు పెట్టేందుకు ఏడాదిన్నర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల కోటాలో 14 స్థానాలు ఉండగా 2028లో 18 మంది రిటైర్ అవుతారు. ప్రస్తుతం మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన వారే ఉండటంతో శాసనస భ ఆమోదించే తీర్మానాలు, బిల్లులు మండలిలో నెగ్గడం బీఆర్ఎస్పైనే ఆధారపడి ఉంటుంది. ముగ్గురు తోడయ్యే చాన్స్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఈ ఏడాది ఆగస్టులో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నారనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఈ రెండు ఖాళీల్లో ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి (నాగర్కర్నూల్) కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ను వీడారు. కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మండలిలో జీవన్రెడ్డి, దామోదర్రెడ్డి మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు కసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) కూడా ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికవడంతో మండలిలో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. వీరిలో పల్లా రాజేశ్వర్రెడ్డి గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానంలో కొత్తగా వచ్చే వారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మండలిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావడంతో కాంగ్రెస్కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం పార్టీ ఎంపిక చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గవర్నర్ కోటాలో ఇద్దరు, ఎమ్మెల్యే కోటాలో ఒకరే కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. బీఆర్ఎస్ తరహాలో వలసలు? తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని మండలిలో బలోపేతమైంది. ఇప్పుడదే తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందా? అన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. -
గూండాలు, సైకోల్లా టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసన సభలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గూండాలు, సైకోల్లా వ్యవహరించారని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. వారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు సభ ప్రారంభంలోనే చేసిన రచ్చను తీవ్రంగా తప్పుబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తగిన ఫార్మాట్లో వస్తే ఎంతసేపైనా చర్చిద్దామని చెబుతున్నా వినిపించుకోకుండా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ను చుట్టుముట్టి, ఆయనపై కాగితాలు విసిరి, మానిటర్ను, గ్లాసును పగులగొట్టి టీడీపీ సృష్టించిన గందరగోళం సభా కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో మీసం మెలేసి, తొడగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సభ్యుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే.. రచ్చకోసమే అసెంబ్లీకి.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి పారిపోతున్నారు. సభలో రేపు స్కిల్ డెవలప్మెంట్ పైన చర్చిస్తున్నాం. 26న ఫైబర్ నెట్, 27న ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్చ ఉంది. ధైర్యం ఉంటే టీడీపీ చర్చకు రావాలి. సభలో బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు. – ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ ముందు కాదు టీడీపీ సభ్యులు సభలో గూండాలు, సైకోల్లా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి అరుస్తూ పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారు. మానిటర్, మంచి నీటి గ్లాస్ పగులగొట్టారు. శాసన సభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నాడేమో. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడు. ఏ రోజూ ప్రజా సమస్యలను ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లల్లో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు. తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. బాలకృష్ణా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం వంటి జగన్ ముందు కాదు. బాలకృష్ణకు తెలిసిందల్లా షూటింగ్లకు వెళ్లడం... ఈవెంట్లలో ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడటం. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి ఆధారాలను పెద్ద స్క్రీన్లపై చూపిస్తామనే భయంతోనే టీడీపీ రివర్స్ డ్రామా ఆడింది. దమ్ము, ధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధం. సెంట్రల్ జైలు చంద్రబాబు కట్టిందేనని వాళ్లే చెబుతున్నారు. అంటే ఇన్నాళ్లూ అక్కడ ఖైదీలకు ఏ సదుపాయాలూ లేకపోయినా పర్లేదు కానీ చంద్రబాబుకు ఉండాలా?. – మంత్రి ఆర్కే రోజా బాబుకు తప్పించుకునే అవకాశం లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబుకు తప్పించుకొనే అవకాశం లేదు. చంద్రబాబు అనేక పాపాలు, నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ని, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు. ఒక ఎమ్మెల్సీని కొంటూ దొరికారు. మీడియా బలంతో బయట పడ్డారు. చివరికి చట్టానికి దొరికారు. కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు. వారు కూడా నేరం జరగలేదని అనటంలేదు. టెక్నికల్ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పాపాలను ఒప్పుకోవాలి. దొంగను పట్టుకుంటే సానుభూతి రాదు. నకిలీ సర్వేలతో సానుభూతి పొందాలని చూస్తే ఉపయోగం లేదు. – మంత్రి అంబటి రాంబాబు స్కామ్ జరగలేదని చెప్పరేం? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని టీడీపీ చెప్పడంలేదు. స్పీకర్ చర్చిద్దామని చెబుతున్నా టీడీపీ ముందుకు రావడంలేదు. చంద్రబాబును అరెస్టు చేయకూడదని అంటున్నారే తప్ప స్కిల్ స్కామ్ గురించి మాట్లాడటంలేదు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫైబర్ నెట్ కేసులో కూడా అవినీతి జరిగింది. ఈ ఐదు రోజుల్లో చంద్రబాబు అవినీతిపై చర్చించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో కూర్చుని సత్య హరిశ్చంద్రుడిని అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను దోచుకున్నాడు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యలపై చర్చించాడా? తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆయనపై చెప్పులు వేయించినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైంది? కక్ష సాధించాలంటే చంద్రబాబును ఎప్పుడో అరెస్టు చేసే వాళ్లం. – ఎమ్మెల్సీ పోతుల సునీత సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించారు సభలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. బాలకృష్ణ సినిమాల్లో మాదిరిగా తొడలు కొడుతూ, మీసాలు తిప్పడం దురదృష్టకరం. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవ్ సెల్ ఫోన్తో చిత్రీకరించాలని చూశారు. సభ నుంచి బయటకు వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ వారు మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టీడీపీ సభ్యులకు భయం చంద్రబాబు అవినీతిపై చర్చ అంటే టీడీపీ సభ్యులకు భయం. వారు చంద్రబాబు అరెస్టు పైనే మాట్లాడు తున్నారు. స్కిల్ స్కామ్పై చర్చిద్దామంటే పారిపోతున్నారు. స్కామ్పై చర్చిస్తే దొరికిపోతామన్నది వారి ఆందోళన. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చించి నిజనిజాలను ప్రజల ముందుంచుతాం. – ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు -
8 మంది నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 8 మంది కొత్త సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (వైఎస్సార్ జిల్లా), మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా), కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ (పశ్చిమ గోదావరి జిల్లా), కుడిపూడి సూర్యనారాయణరావు (తూర్పు గోదావరి జిల్లా), నర్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు జిల్లా), డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు జిల్లా) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, శాసనమండలి ఓఎస్డీ సత్యనారాయణరావు, ఉప కార్యదర్శి విజయరాజు పాల్గొన్నారు. తోడేళ్ల మందలా దాడి సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై కుట్రపూరితంగా ప్రజా ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారన్నారు. నిజాయతీ, విశ్వసనీయతకు నిదర్శనమైన సీఎం జగన్కు, అబద్ధానికి, మోసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు, తోడేళ్ల మందకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెత్తందార్ల పక్షాన నిలిచిన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాతో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు బరితెగింపు, అక్రమాలకు ఆయన కరకట్ట నివాసం నిదర్శనమని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ల కుట్ర రాజకీయాలను సీఎం జగన్ సమాధి చేస్తున్నారు కాబట్టే ఈ కుట్రదారులు వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రం అని మాట్లాడుతున్నారని చెప్పారు. -
AP: ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
-
ఏపీ స్థానిక సంస్థల కోటా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పిపికె.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి,నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ(Meriga) మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు,శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు,రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామాత్యులు మేరుగు నాగార్జున,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట శాసన సభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు,రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి,మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్,ఎంఎల్ఏ వరప్రసాద్,పలువురు ఎంఎల్సిలు పాల్గొన్నారు.ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి ఓఎస్డి సత్యానారాయణ రావు,శాసన మండలి ఉప కార్యదర్శి విజయ రాజు ఇంకా పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్.. -
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు అంబటి , కారుమురి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది ఎమ్మెల్సీలు.. మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇస్రాయిల్, జయ మంగళ వెంకటరమణ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మ. చదవండి: ‘జగనన్నే మా భవిష్యత్తు’.. అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు.. -
మండలిలో ఏడు ఖాళీలు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మే నెలలోగా శాసనమండలిలో ఏడుగురు సభ్యులు రిటైర్కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్ కోటాలో ఇద్దరు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో ఒక్కో సభ్యుడు చొప్పున తమ ఆరేళ్ల పదవీ కాలపరిమితిని పూర్తి చేసుకోనున్నారు. వివిధ కోటాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో అవకాశం కోసం పలువురు ఔత్సాహికులు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది చివరలో శాసనసభకు ఎన్నికలు జరగనుండగా.. ఆ లోపే మండలిలో ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కె.నవీన్కుమార్, వి.గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్రెడ్డిల పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్రావు, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ మహ్మద్ అమీనుల్ జాఫ్రీలు మే 27న రిటైర్అవుతారు. జనార్ధన్రెడ్డి ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్నగర్’ఉపాధ్యాయ కోటా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న జనార్ధన్రెడ్డి మరోమారు బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. స్థానిక కోటాలో ఎంఐఎం బీఆర్ఎస్తో అవగాహనలో భాగంగా గతంలో హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎంఐఎం నుంచి అమీనుల్ జాఫ్రీ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలోనూ ఈ స్థానాన్ని ఎంఐఎంకు అప్పగించడమా లేక పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడమా అనే అంశంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ సభ్యులున్న ఎంఐఎంకే తిరిగి అప్పగించే అవకాశ మున్నట్లు సమాచారం. గవర్నర్ కోటాలో మైనారిటీ వర్గానికి చెందిన రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్ పదవీ విరమణ చేయనుండగా, ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ కేసీఆర్ అవకాశమిచ్చే సూచనలు ఉన్నాయి. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో నవీన్కుమార్కు రెండో పర్యాయం దక్కనుండగా వి.గంగాధర్ గౌడ్ స్థానంలో కొత్తవారిని అదృష్టం వరించే అవకాశముంది. గతంలో బీజేపీలోకి వెళ్లి సొంతగూటికి తిరిగి వచ్చిన మండలి మాజీ చైర్మన్ వి.స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి కేసీఆర్ అవకాశమిస్తారని సమాచారం. -
టీడీపీ చిడతల బ్యాచ్ పై ఫైర్ అయిన మంత్రులు
-
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్.రమణ (కరీంనగర్), పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్నగర్), డాక్టర్ వి.యాదవరెడ్డి (మెదక్)లతో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎల్.రమణ ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. నూతన ఎమ్మెల్సీలకు వేముల ప్రశాంత్రెడ్డి రూల్స్ బుక్, గుర్తింపు కార్డు అందజేశారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్రెడ్డి మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటాలో మండలికి ఎన్నికైన మరో ఐదుగురు సభ్యులు దండె విఠల్ (ఆదిలాబాద్), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ) ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి. -
మర్యాద పూర్వకంగా గవర్నర్ను కలిసిన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: నూతనంగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో గవర్నర్ వీరితో ముచ్చటించారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్కు వివరించారు. అలాగే పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఏపీ విద్యాశాఖ మంత్రి
అమరావతి: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు.. అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. -
నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం: సజ్జల
అమరావతి: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసి, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోను అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తుచేశారు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. అలానే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇలానే సామాజిక న్యాయం పాటిస్తున్నామని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్ ఎంత కచ్చితంగా నిలబడతారో ఇదే నిదర్శనమని గుర్తుచేశారు. శాసన మండలిలో టీడీపీ అడ్డంకులు ఇక ఉండవని, ప్రభుత్వ పాలసీల అమలు ఇక నుంచి సులభతరం అవుతుందని అన్నారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన పెండింగ్లో ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్రెడ్డిది అని అన్నారు. పార్టీ జెండా మోసిన నమ్మకాస్తులకు అవకాశాలు ఇచ్చే నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.2006లో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారని, 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకే తనకు సీఎం జగన్ దేవుడు లాంటివారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తొలిసారి తమ నాయుకుడు, సీఎం జగన్ శాసన మండలిలో అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు.అన్ని సామాజికవర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ మోషేన్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని అన్నారు.బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా దక్కేలా చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. కడప జిల్లాలో తొలిసారి బీసీ యాదవ వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు. సమాన్యుడైన తనను చట్టసభలుకు పంపింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు -
ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్రాజు, రమేష్ యాదవ్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీల నేపథ్యం: ► లేళ్ల అప్పిరెడ్డి: గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి వైస్ జగన్ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► మోషేన్రాజు: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్రాజు.. వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్ జగన్తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ► తోట త్రిమూర్తులు: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ► రమేష్యాదవ్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్యాదవ్ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ రికార్డ్: ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ -
వైఎస్సార్సీపీకి మండలిలో పూర్తి మెజార్టీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో టీడీపీ బలం తగ్గిపోయింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 21 కాగా టీడీపీ బలం 15కి తగ్గింది. శుక్రవారంతో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియగా వారిలో టీడీపీకి చెందిన ఏడుగురు, వైఎస్సార్సీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, పప్పుల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్ధా నాగజగదీశ్వరరావుల పదవీకాలం ముగిసింది. గత నెల 24వ తేదీన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సైతం పదవీ విరమణ చేశారు. వాకాటి నారాయణరెడ్డి బీజేపీలో చేరడం, చదిపిరాల శివనాథ్రెడ్డి పార్టీకి దూరం కావడంతో టీడీపీ బలం 15కి తగ్గిపోయింది. బిల్లులను అడ్డుకోవటమే లక్ష్యంగా... సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మండలిలో ఇటీవల వరకు ఉన్న ఆధిక్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్లుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించింది. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు మోకాలడ్డింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో విద్యనందించే బిల్లును సైతం కుట్రతో అడ్డుకుంది. సలహాలివ్వాల్సిన పెద్దల సభను రాజకీయ వేదికగా మార్చుకుని అడ్డంకులు సృష్టించింది. అయితే శాసనమండలిలో ఇప్పుడు వైఎస్సార్సీపీ పూర్తి మెజారిటీ సాధించింది. మరింత పెరగనున్న అధికార పార్టీ బలం.. మండలిలో వైఎస్సార్సీపీ తరఫున 18 మంది (గవర్నర్ నామినేట్ చేసిన నలుగురితో కలిపి) సభ్యులున్నారు. కొద్దిరోజుల క్రితం టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీకి దూరంగా ఉన్న శివనాథ్రెడ్డి కూడా వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అధికార పార్టీ బలం 21కి పెరిగింది. ఇవికాకుండా ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వాయిదా పడింది. అవి ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీనే గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఆ కోటాలోని 11 ఎమ్మెల్సీలూ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలిలో ఆధిపత్యంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్ -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేట్.. ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. ప్రభుత్వ సిఫారసుల మేరకు జకియాఖానం, పండుల రవీంద్రబాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ►ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పండుల రవీంద్రబాబు స్పందిస్తూ.. ‘2011లో వైఎస్సార్సీపీని స్థాపించిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. నేను జగన్ వీరాభిమానిని. 2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాను. మొట్టమొదట సారిగా ఇన్ని రోజులకు వైఎస్ జగన్తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నా అనుభవం అంతా ఉపయోగించి శాయశక్తులా పార్టీ అభివృద్దికి కృషి చేస్తాను. వైఎస్సార్సీపీ అనగానే దళిత, బలహీన, మైనార్టీల పార్టీ అని ఇవాళ మరోసారి రుజువైంది’ అని రవీంద్రబాబు పేర్కొన్నారు. ►జకియా ఖానం స్పందిస్తూ.. ‘యావత్ మైనార్టీల తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు. మమ్మల్ని నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదించినందుకు గవర్నర్కు ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను' అని జకియా ఖానం తెలిపారు. -
చైనా వెళ్లొచ్చా.. అయితే ఇప్పుడు కాదులే
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో శనివారం కరోనా వైరస్పై ఆసక్తికర చర్చజరిగింది. స్వల్పకాలిక చర్చలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కరోనా వైరస్పై మాట్లాడుతూ సభలో నవ్వులు పూయించారు. ఆయన స్థానంలో నిలబడి ‘నేను చైనా వెళ్లొచ్చాను’అనగానే పక్కనే ఉన్న సహచర ఎమ్మెల్సీలు ‘ఎప్పుడూ?’అంటూ ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే ఆయన ‘‘ఇప్పుడే కాదులే మూడు, నాలుగేళ్ల క్రితం వెళ్లొచ్చాను. నిన్న, మొన్న మీతోటే ఉన్న కదా’అని సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా గొల్లున నవ్వారు. ‘చైనాకు పోయుంటే సక్కగా హాస్పిటల్కే పోయేటోడిని’అని మల్లేశం బదులిచ్చారు. తాతల కాలంలో గత్తరొచ్చి పెద్దసంఖ్యలో చనిపోయినట్టు విన్నామే తప్పించి, ఈ విధమైన జబ్బు గురించి ఎన్నడూ వినలేదు. చూడలేదన్నారు. బడ్జెట్ సమావేశాలను కూడా వాయిదా వేస్తారనే అనుమానమొచ్చిందన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్ మాట్లాడుతూ..ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారికి కోవిడ్ సోకే అవకాశం లేదని, ఇప్పుడు హిందూ మహిళలు, విద్యార్థినులు కూడా ముఖం కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకుంటున్నందున వారికి కూడా అది రాదన్నారు. వారికి గూండాలు, పోకిరీల బెడద కూడా ఈ రకంగా తీరిందన్నారు. తాను పాతబస్తీలో ఒక బట్టలషాపులో వస్త్రాలను పరిశీలిస్తుండగా, ఆ దుకాణం యజమాని తనవద్దకొచ్చి దగ్గుతూ ‘కరోనా అంటే ఏమిటి’? అని తనను ప్రశ్నించగానే ఏదో ఫోన్ వచ్చినట్టుగా ‘హలో.. హలో’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయానని ఫారుఖ్హుస్సేన్ వ్యాఖ్యానించగానే కౌన్సిల్లో నవ్వులు విరిశాయి. సభలో రామచంద్రరావు, చిన్నపరెడ్డి, జీవన్రెడ్డి ఇతర సభ్యులు జోరుగా ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే ఒక్కముక్క కూడా అర్థం కావడం లేదని, రాబోయే రోజుల్లో అందరూ తెలుగు,ఉర్దూలకు దూరమయ్యేట్టు కనిపిస్తోందన్నారు. ఇంతలో కొందరు సభ్యులు ఫారుఖ్హుస్సేన్ను ఉద్దేశించి ‘కరోనాను తెలుగులో ఏమంటారు?’అంటూ ప్రశ్నించడంతో తడుముకోవడం ఆయన వంతైంది. -
టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు!
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఢిల్లీలో ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టాలనుకున్న ప్రజాచైతన్య యాత్రలపైనా తర్జనభర్జన పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా చేయాలని సూచించినట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్సీలకు అమిత్ షా ఝలక్
సాక్షి, విజయవాడ : ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (మండలి రద్దును ఆమోదించండి) -
జిల్లాలో ఈ నలుగురి పదవులు పోయినట్లే
సాక్షి, విజయనగరం: శాసన మండలిని పెద్దల సభ అని పిలుచుకుంటుంటాం. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుంచి ప్రతినిధులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మేధావులు కొలువు తీరే సభ రాష్ట్ర ప్రభుత్వానికి పాలనలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. అయితే, ఆ లక్ష్యం నెరవేరనీయకుండా రాజకీయ అవసరాలకు సభను రాష్ట్ర ప్రతిపక్షపార్టీ వాడుకోవాలని చూడడంతో అసలకే మోసం వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాలనా వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలనా బిల్లుకు మద్దతు తెలపకుండా రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ వేసిన ఎత్తుగడ వారి పతనానికి దోహదపడింది. సలహాలు, సూచనలు ఇవ్వకుండా రాజకీయాలు చేసే సభ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని గుర్తించిన ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. లోక్సభ, రాజ్యసభతోపాటు రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే శాసనమండలి పూర్తిగా రద్దవుతుంది. వీరి పదవులు పోయినట్లే..! శాసన మండలి రద్దుతో జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్సీలు పదవులు కోల్పోనున్నారు. జిల్లా నుంచి స్థానిక సంస్థలు కోటాలో పార్వతీపురానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో సాలూరుకు చెందిన గుమ్మడి సంధ్యారాణి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా జిల్లాలోని భోగాపురానికి చెందిన పాకలపాటి రఘువర్మ కొనసాగుతుండగా, చినమేరంగికి చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా కోటాలో ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తున్నారు. వీరిలో రఘువర్మ తటస్థ సభ్యులుకాగా మిగతా ముగ్గురూ టీడీపీకి చెందిన నాయకులు. వీరి ముగ్గురి పదవీ కాలం మరో ఏడాదిన్నర వరకూ ఉంది. కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ పదవీకాలం ఏడాది మాత్రమే అయింది. ఇంకా ఆయనకు ఐదేళ్లు ఉంది. ఇకపోతే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా విశాఖకు చెందిన మాధవ్కు నాలుగేళ్లు పదవీకాలం ఉంది. శాసనమండలి రద్దుకు రాష్ట్ర పతి ఆమోదముద్ర వేసే వరకు కొనసాగుతారు. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) దెబ్బతీసిన ప్రతిపక్ష కుటిల రాజకీయాలు.. శాసనమండలిని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో పునరుద్ధరించారు. మేధావుల సూచనలు, సలహాలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అవసరమని ఆయన గుర్తించి ఈ పని చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా పని చేసిన 2014 నుంచి 2019 వరకు ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది. మేధావులు, నిపుణులను పక్కన పెట్టి తన రాజకీయ అవసరాలు తీర్చే వారిని పెద్దలు సభకు పంపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని తన కుమారుడు లోకేష్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కట్టడబెట్టారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి రూల్ 71ను సమర్థిస్తూ ఓటు వేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిపై వీరి ప్రభావం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకుంది. బాబు తీరుతో ఎమ్మెల్సీలు పదవులు కోల్పోయారు. చదవండి: శాసనమండలి రద్దు -
టీడీపీ భేటీకి ఎమ్మెల్సీల డుమ్మా
సాక్షి, కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. కడప నగరం రామాంజినేయపురంలోని సాయిశ్రీనివాస కళ్యాణ్ మండపంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బిటెక్ రవి, శివనాథరెడ్డిలు సమావేశానికి హజరు కాలేదు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ప్రొద్దుటూరు నేత వరదరాజులు రెడ్డి, బద్వేలు విజయమ్మ, సుగవసి ప్రసాద్ అలాగే రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం టీడీపీ సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు. -
ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన మూడు పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల నుంచి లిఖితపూర్వక వాదనలు స్వీకరించిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కె.యాదవరెడ్డి, ఎస్.రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ ఆ ముగ్గురినీ ఎమ్మెల్సీలుగా అనర్హులని ప్రకటించారు. అయితే.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారంటూ ఆ ముగ్గురూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పదో షెడ్యూల్ 8వ పేరాను సమీక్షించాలి : భూపతిరెడ్డి భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ.. 10వ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు ఏకపక్ష అధికారాలు ఉన్నాయని, దీంతో వారు ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పిటిషనర్ను మండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించారని, ఈ చర్యను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వాదించారు. అనర్హత వేటు చట్ట వ్యతిరేకం : యాదవరెడ్డి యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలు లేవన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని, మేడ్చల్ సభలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారని తెలిపారు. తెలంగాణ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పడానికే సోనియా, రాహుల్లను పిటిషనర్ కలిశారని వివరించారు. పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు చూపడంలేదని, పత్రికల్లో వచ్చిన ఫొటోలనే ఆధారాలుగా భావించడం చెల్లదన్నారు. ఫిరాయింపు వేరు ఒక జాతీయ నేతను కలవడం వేరు అని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించకుండానే రాజ్యాంగ విరుద్ధంగా అనర్హత వేటు వేశారని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి పార్టీతో పనిలేదు : రాములు నాయక్ రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ.. సామాజిక సేవకు గుర్తింపుగా పిటిషనర్ను గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని నివేదించారు. దీనికి పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, సోనియాగాంధీలను కలిస్తేనే పార్టీ ఫిరాయించారనే అభియోగంతో వేటు వేశారన్నారు. నామినేట్ చేసిన పత్రాల్లో ఏ పార్టీకి చెందని వ్యక్తి అని ఉందని.. ఆ పత్రాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇవ్వలేదని వివరించారు. నాలుగు వారాల సమయం ఇస్తే తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తామని చెప్పినా మండలి చైర్మన్ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు చెప్పారు. బహిరంగసభలో పార్టీ ఫిరాయించారు : అదనపు ఏజీ మండలి చైర్మన్ తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. పిటిషనర్లు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. మేడ్చల్లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. ఓ నేత ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్గాంధీలను కలిసినట్లు పత్రిక, టీవీల్లో వార్తలు వచ్చాయని, వాటిని పిటిషనర్లు ఖండించలేదని తెలిపారు. ఒక పార్టీ తరఫు ఎమ్మెల్సీగా ఉంటూ మరో పార్టీకి కొమ్ముకాయడం క్యారెక్టర్కు సంబంధించిన వ్యవహారమన్నారు. ఆ క్యారెక్టర్ కోల్పోయిన నేపథ్యంలో చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేశారు. రాములు నాయక్కు ఎప్పటి నుంచో పార్టీ సభ్యత్వం ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి తరఫున న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశారని వివరించారు. రాములు నాయక్కు పార్టీ సభ్యత్వం ఉండగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారని, మండలి చైర్మన్ ఎదుట వాదనల్లో పార్టీ సభ్యత్వం ఉందని కూడా నాయక్ అంగీకరించారన్నారు. నామి నేట్ అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక పార్టీలో చేరితో ఫిరాయింపు అవ్వదని, ఎప్పటి నుంచో రాములు నాయక్కు టీఆర్ఎస్ పార్టీ సభ్య త్వం ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు వేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వెలువరించిందని నివేదించారు. కాగా, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 8వ పేరాకు రాజ్యాంగబద్ధత ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఎన్.హరినాథ్రెడ్డి స్పష్టంచేశారు. ధర్మాసనం లేవనెత్తిన సందేహాలివీ.. ‘‘ప్రత్యేకాధికారాలున్న రాష్ట్రపతి సైతం అనేక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని కూడా తప్పుపట్టవచ్చా? పత్రికల్లో వార్తలు వచ్చాయని చెబుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. నిజానికి కూడా సాక్ష్యం కావాలి. ఆరోపణలకు వాస్తవిక ఆధారాలు ఉండాలి. సేవా రంగంలోని వ్యక్తిని గుర్తించి గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దానికి పార్టీ ఫిరాయింపు ఎలా వర్తిస్తుంది. క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఇచ్చారా’’అని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. మండలి చైర్మన్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ క్వాసీ జ్యుడీషియల్ సంస్థ కాదని, ఆ ట్రిబ్యునల్కు సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లు వర్తించకపోయినా సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు, వీడియోలు ఇవ్వాలని ఆదేశించింది. -
ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తరఫున ఎన్నికై అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి ఫిరాయిం చిన ముగ్గురు శానసమండలి సభ్యులపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం ఎస్. రాములు నాయక్, ఆర్. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డిలను మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హత ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి, నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి చైర్మన్కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసిన చైర్మన్... దశలవారీగా విచారణ జరిపారు. జనవరి 12న ముగ్గురి అనర్హత పిటిషన్పై విచారణ పూర్తి చేశారు. అన్నింటినీ పరిశీలించి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలోని ఖాళీల సంఖ్య ఏడుకు చేరింది. 16 స్థానాలకు ఎన్నికలు... తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఒకేసారి 16 స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. దీంతో పదవికి రాజీనామా చేశారు. ఇలా నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా అనర్హత వేటుతో మరో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. శాసనమండలి శాశ్వతసభ. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడింట రెండో వంతు స్థానాలకు పదవీకాలం పూర్తవుతుంది. ఈ లెక్కన మార్చి ఆఖరు వరకు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ(టీఆర్ఎస్), మహమ్మద్ సలీం (టీఆర్ఎస్), టి. సంతోష్ కుమార్ (టీఆర్ఎస్), మహమ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్రెడ్డి (కాంగ్రెస్), హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం. ఎస్. ప్రభాకర్రావు (టీఆర్ఎస్), కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె. స్వామిగౌడ్ (టీఆర్ఎస్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి(టీఆర్ఎస్), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్ (స్వతంత్ర) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. దీంతో ఏకంగా 16 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని స్థానాలు ఖాళీ అవుతుండటంతో టీఆర్ఎస్లోని ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పలువురికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఎమ్మెల్సీ పదవి హామీ పొందిన వారికి ఈసారి అవకాశం రానుంది. -
హైకోర్టును ఆశ్రయించిన టీ కాంగ్రెస్ నేతలు
-
స్వామిగౌడ్తో షబ్బీర్ అలీ భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనం చేయడంపై టీ కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ సుత్రాలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు స్వామిగౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రాములు నాయక్ మండలి ఛైర్మన్ను కలిశారు. కాంగ్రెస్లో చేరడానికి గల కారణాలను ఆయనకు వివరించారు. ఇటీవల రాములు నాయక్కు టీఆర్ఎస్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. -
రీజినల్ పార్టీలో నేషనల్ పార్టీ విలీనమా?
సాక్షి, హైదరాబాద్: అధికార బలంతో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫహీం మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ బులిటెన్ విడుదల చేయడం దారుణమన్నారు. శనివారం ఫహీం మీడియాతో మాట్లాడుతూ.. మండలి ఛైర్మన్కు అసలు రాజ్యాంగం గురించి తెలుసా అని ప్రశ్నించారు. స్వామిగౌడ్ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేషనల్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేస్తూ ఆయన జారీచేసిన బులిటెన్ సరికాదన్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొందని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమకు అనుమానులున్నాయని కాంగ్రెస్ నేత మానవతారాయ్ ఆరోపించారు. ఎన్నికల అధికారిని రీకాల్ చేసే అవకాశం ఉన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృత్తం అవుతాయనే భయంతో కేంద్రం టీఆర్ఎస్కు మద్దతిస్తోందన్నారు. -
ఆ నలుగురిపై మండలి చైర్మన్కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మండలి చైర్మన్ను స్వామిగౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై వేటు వేయాల్సిందిగా టీఆర్ఎస్ నాయకులు చైర్మన్కు నేడు విజ్ఞప్తి చేశారు. స్వామి గౌడ్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పొతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు ఉన్నారు. -
అంతా మొక్కుబడి తంతు
♦ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరిది ♦ హాజరుకాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం మొక్కుబడి తంతుగా మారాయి. ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఓ ఎమ్మెల్యే మినహా మిగిలిన వారెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం కోసం పాట్లు పడ్డారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన గురువారం జరిగింది. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు అధ్యక్షతన మూడో స్థాయి సంఘ సమావేశానికి చివరి నిమిషంలో రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. తెనాలి జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మీ మాట్లాడుతూ అమృత హస్తం అభాసుపాలవుతోందన్నారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య మాట్లాడుతూ మంగళగిరి ప్రాంత గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని, అంగన్వాడీ సెంటర్లలో ఐదారు మందికి మించి పిల్లలు లేరని చెప్పారు. పంటలకు నీళ్లివ్వరా ? దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ కెనాల్స్ ఆధునికీకరణ పనులు సరిగా లేవని, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పొలాలకు నీరిచ్చే పరిస్థితి లేకపోవటం బాధాకరమన్నారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లలో సమన్వయ లోపం ఉందని తెలిపారు. 2016–17 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతం కూడా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి పంచాయతీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. పల్నాడు ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతోపాటు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు రాయితీ రుణాలు ముందుకు కదలడం లేదన్నారు. సాగు, తాగునీరు, వైరల్ ఫీవర్లు, విద్యాశాఖలో నెలకొన్న నిర్లిప్తత, పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తూతూ మంత్రంగా చర్చ జరిగింది. ఒక వైపు జ్వరాలు... మరోవైపు నీటి ఎద్దడి... ప్రస్తుతం వైరల్ ఫీవర్లు జిల్లాను వణికించేస్తున్నాయి. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రమే రావడం గమనార్హం. సమావేశంలో జెడ్పీ సీఈవో బి.నాగార్జునసాగర్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గంగాధర్గౌడ్, కాటేపల్లి జనార్దన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వారిచేత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్ నగర్– హైదరాబాద్– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్రెడ్డి రెండో మారు కౌన్సిల్లో అడుగుపెట్టనున్నారు. అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ కూడా రెండో సారి కౌన్సిల్కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. -
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
శాసన మండలి దర్బారు హాల్లో కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురు వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్ నగర్– హైదరాబాద్– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్రెడ్డి రెండో మారు కౌన్సిల్లో అడుగుపెట్టనున్నారు. అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ కూడా రెండో సారి కౌన్సిల్కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు గురువారం ఉదయం పదిన్నర గంటలకు శాసన మండలి దర్బారు హాల్లో జరిగే కార్యక్రమంలో శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి ఎం రమేశ్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నలుగురితో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. -
బ్యాంక్ ఖాతాల వివరాలు బయటపెట్టగలరా?
విపక్ష ప్రజాప్రతినిధులకు లక్ష్మణ్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఆయా రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నవంబర్ 1 నాటి నుంచి తమ బ్యాంకు ఖాతాల వివరాలను బయటపెట్టగలరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నానావత్ బిక్కునాద్ నాయక్, మజ్దూర్సెల్ అధ్యక్షుడిగా బి.చంద్రశేఖర్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నవంబర్ 8 తర్వాత నిర్వహించిన బ్యాంకు లావాదేవీల వివరాలను పార్టీకి సమర్పించాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారన్నారు. ఈ ప్రయత్నాన్ని కొన్ని పార్టీలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. గురువారం నుం చి అన్ని జిల్లాలు, మండలాల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ఫిరాయింపులపై కాంగ్రెస్ ఆందోళన
వలసలకు అడ్డుకట్టపై నేడు నేతల భేటీ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడిపోతుండటంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది. వల సలను నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి ఆ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీలోని కమిటీహాలులో సమావేశం కానుం ది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిరాయింపులపై సీఎల్పీని ఏఐసీసీ వివరణ అడిగినట్టుగా సమాచారం. దీంతో సీఎల్పీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది. -
నేరంగా చూడొద్దు
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్ - జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర కీలకం - జీతాలు పెంచుకుంటే ప్రజాధనాన్ని తింటున్నట్లుగా భావించొద్దని వ్యాఖ్య - సభ్యుల జీతాల పెంపు బిల్లుకు సభ ఆమోదం సాక్షి, హైదరాబాద్: జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర కీలకమైందని, అలాంటి వారి జీతాల పెంపును నేరంగా చూడడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎన్నో ఖర్చులుంటాయని, వాటి కోసం అప్పులు చేసేవారూ ఉన్నారని చెప్పారు. అందుకే చట్టసభల సభ్యు ల జీతాలు పెంచాలని నిర్ణయించామని... దీనిని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను పెంచుతూ.. ‘తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొల గింపు సవరణ బిల్లు’కు మంగళవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజాధనాన్ని దోచుకుంటున్న తరహాలో కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచారని, తమకూ పెరగకపోతే ఎలాగని పేర్కొన్నారు. మాజీ సభ్యుల పింఛన్ను మరింత పెంచాలని, వాహన రుణం పరిమితి, ఇంటి అద్దెభత్యాన్ని కూడా పెంచాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. సభ్యుల జీతాల పెంపుపై వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. పాత్రికేయులు, పత్రికల అధిపతులు కూడా వాటిని గుర్తించాలని, వ్యతిరేకంగా స్పందించడం మానుకోవాలని సూచించారు. భారం తక్కువే.. గతంలో ఎంపీల జీతాలు పెంచినప్పుడు టీవీ చర్చల్లో దారుణంగా మాట్లాడారని, వాటిని వింటే బాధ కలిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెంపు ద్వారా అదనంగా పడే భారం రూ.42 కోట్లని, మొత్తం బడ్జెట్ కేటాయింపుతో పోల్చేంత మొత్తం కాదని స్పష్టం చేశారు. ‘‘జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర చాలా కీలకమైంది. అవినీతిరహితంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని. అప్పుడు నాకు చెల్లించే మొత్తం రూ.500. అందులో నీటి బిల్లు కోసం రూ.110 మినహాయించి రూ.390 చేతికి ఇచ్చేవారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఓసారి గండిపేటలో సమావేశం పెట్టినప్పుడు నేను మౌనంగా కూర్చున్నా. ‘బ్రదర్ మౌనమెందుకు.. మాట్లాడు’ అని ఆయన అన్నారు. నేను మాట్లాడితే ఇబ్బందిగా అనిపిస్తుందేమోనని అంటూనే ఎమ్మెల్యేల బాధలపై మాట్లాడిన. నా నియోజకవర్గ కేంద్రం సిద్దిపేట, జిల్లా కేంద్రం సంగారెడ్డి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అన్నీ దూరంగా ఉన్నవే. ఓ ఎమ్మెల్యే 150కిపైగా కమిటీల్లో సభ్యుడిగా ఉంటాడు, 30 వరకు ప్రభుత్వపర సమావేశాలకు హాజరుకావాలి. అసెంబ్లీ, ఇతర అవసరాలకు హైదరాబాద్ చుట్టూ తిరగాలి. నిత్యం సందర్శకులు, ఆరోగ్య సమస్యలతో వచ్చేవారు ఉంటూనే ఉంటారు. ఆసుపత్రి బిల్లుల కోసం సాయం అడిగితే... దగ్గర డబ్బుల్లేక అప్పు చేసి ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎమ్మెల్యేల దగ్గర బాగా డబ్బు ఉందనుకుంటారు. మొదట్లో నా కారును ఆరు నెలలు నేనే నడిపా, ఏదో టెన్షన్లో ఉంటం.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా? డ్రైవర్ను పెట్టుకోవాలి, సెక్యూరిటీ సిబ్బంది ఉంటరు. ఇలా ఖర్చులెన్నో. ఇలాంటప్పుడు జీతం పెంచితే నేరంగా, ప్రజాధనాన్ని తింటున్నట్టు అనుకోవడం సరికాదు..’’ అని కేసీఆర్ చెప్పారు. పలువురు సభ్యులు మరిన్ని సూచనలు చేశారని, వాటిపై తదుపరి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు తమ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు చెప్పారు. మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే మాలం మల్లేశం తదితరులు మంగళవారం శాసనసభకు వచ్చి సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మా పొట్టగొట్టారు అసెంబ్లీ లాబీలో విలేకరులను కలసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వేతనాలు పెరిగాయి కదాని విలేకరులు ప్రస్తావించగా... ‘‘చంద్రబాబు మా పొట్టగొట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు కనీసం రూ.3.50 లక్షల వరకు పెరుగుతుందని అంతా ఆశించారు. కానీ ఏపీలో అక్కడి సీఎం చంద్రబాబు కేవలం రూ. 2 లక్షల వరకే వేతనాలు పెంచాలని నిర్ణయించడంతో ఇక్కడ రూ.2.30 లక్షలతో ఆపేశారు..’’ అని పేర్కొన్నారు. రెండేళ్లుగా కోరుతున్నారు: హరీశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈసారి వేతనాలు పెంచకుంటే తీవ్ర నిరాశ చెందేవారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వేతనాల పెంపు కోసం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గత రెండేళ్లుగా లేఖలు ఇస్తున్నారని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండేళ్లుగా అంతా కలుస్తున్నారు. వేతనాలు పెంచుతారా లేదా అని అడిగారు. ఓ ఎమ్మెల్యేకు ఉండే ఖర్చులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణతో బయట కూడా ఏదో అడ్డగోలుగా వేతనాలు పెంచామన్న అభిప్రాయం లేకుండా అయింది..’’ అని పేర్కొన్నారు. -
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
-
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లూరులో జరిగిన ఈ వివాహానికి వెళ్లేందుకు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివాహం అయిన తర్వాత టీడీపీ నేతలు రేణిగుంట నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకుతో మంత్రి నారాయణ కుమార్తె వివాహం జరిగింది. -
ఎవరైనా మాజీ కాక తప్పదు: హరీష్
హైదరాబాద్ : రాజకీయాల్లో ఎవరైనా మాజీ కాక తప్పదని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయంగా లేదా రిజర్వేషన్ పరంగా అయినా మాజీలు కావొచ్చు అని, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల వేతనాలు, మాజీల ఫించన్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కర్ణాటక తరహాలో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా పాల్గొన్నారు. -
23 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ఉభయ సభలూ ఉదయం 10కి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు లేఖల ద్వారా సమాచారం అందించారు. ‘శాసనసభ, మండలి మూడో సెషన్లో రెండో సమావేశాలు ఈ నెల 23న ఉదయం పది గంటలకు మొదలవుతాయి ..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించేదీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఈ సమావేశాలను కనీసం ఆరు రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 23, 24 తేదీల్లో సభ నిర్వహించి వరుసగా నాలుగు రోజుల పాటు (25, 26, 27, 28 తేదీల్లో) సెలవుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో నాలుగు రోజులు సభ జరిపే వీలుందని తెలుస్తోంది. పది రోజుల పాటు సభ జరపాలన్న చర్చ కూడా జరిగిందని, ఇందులో కనీసం మూడు రోజుల పాటు రైతుల ఆత్మహత్యలు, రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని కూడా అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలన్న అంశంపై తొలి రోజున బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. -
‘పోలవరం’పై కేంద్రానికి నివేదిక
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీజేపీ ప్రతినిధి బృందం తెలిపింది. బృందం శనివారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్ రమేష్బాబు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. పోలవరం స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను మంత్రులు తెలుసుకున్నారు. ఈ బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా నిర్వాసితులు అడ్డుకున్నారు. పాత ఇళ్ల విలువ అంచనాల్లో అధికారులు తమకు అన్యాయం చేశారని కోండ్రుకోట నిర్వాసితులు ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని చెప్పారు. తమకు డి-ఫారం పట్టాభూములు ఉన్నాయని, డైవర్షన్ రోడ్డు నిర్మాణంలో ఆ భూములు తీసుకున్నారని, నష్టపరిహారం ఇస్తామనిచెప్పి ఇవ్వలేదని చేగొండిపల్లి నిర్వాసితులు మంత్రులకు వివరించారు. ఆర్టీసీ బస్సులు డైవర్షన్ రోడ్డుపై నుంచి తిరగడం లేదని, తాము గ్రామాల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని కొందరు చెప్పారు. అన్ని రాయితీలు ఇస్తే గ్రామాలు విడిచి వెళ్లిపోతామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని రామయ్యపేట నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ’ప్రత్యేకం’పై అధ్యయనం కంభంపాటి హరిబాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కల్పించే విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు. నివేదిక వచ్చిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అద్యక్షుడు శ్రీనివాసవర్మ, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.మాలతిరాణి, కార్యదర్శి బి.నిర్మలాకిషోర్, జిల్లా అధ్యక్షురాలు ఎస్.సుభద్రాదేవి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ఎంవీ బెనర్జీ, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ గణపతిరాజు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ ముళ్లపూడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయం ఎంత కావాలో గుర్తిస్తాం కొవ్వూరు టౌన్ : అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు కొవ్వూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి కేంద్ర సహాయం ఏ మేరకు కావాలో గుర్తిస్తామని చెప్పారు. మొదటి విడతగా శనివారం తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని, ఆదివారం విజయనగరం, తోటపల్లి ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రానికి నిధులకై నివేదిస్తామని పేర్కొన్నారు. -
అంతా మీరే,మరి మా మాటేంటి?
-
నేడు స్పీకర్ను కలవనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
తొలగించిన వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును శుక్రవారం కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వారు ఆయనను అసెంబ్లీలో కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు గత నెల 31న శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణరావు ఛాంబర్లో ధర్నా చేశారు. రెండు రోజుల్లోగా ఫొటోను ఏర్పాటు చేస్తామని అప్పట్లో వారికి కార్యదర్శి హామీ ఇచ్చారు. కానీ గడువు ముగిసినా ఫొటోను ఏర్పాటు చేయకపోగా, ఈ నెల 11న స్పీకర్ అధ్యక్షతన జరిగిన కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశంలో వైఎస్ ఫొటో ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడ మళ్లీ వైఎస్ ఫొటోను ఉంచాల్సిన అవసరం లేదని సమావేశానంతరం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు.. వచ్చే శాసనసభా సమావేశాల ప్రారంభంలోగా వైఎస్ ఫొటోను తొలగించిన చోటే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పది రోజులు గడిచినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో శుక్రవారం స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసి తమ డిమాండ్ను ఆయన ముందుంచాలని శాసనసభాపక్షం నిర్ణయించింది. -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో సంస్థాగతంగా ఆధిపత్య పోరు సాగుతోందా..? అధికార పార్టీ హోదాతో తమకేదో జరిగిపోతుందని ఆశపడిన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారా..? పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, జిల్లాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమధానం ఇస్తున్నాయి! గడిచిన పధ్నాలుగేళ్లుగా ఒకే పార్టీలో సహచరులుగా కొనసాగిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు సమాచారం. వీరిలో కొందరికి ఉన్నత పదవులు దక్కడం, మరికొందరికి ఏవో కొన్ని పదవులు దక్కినా ప్రోటోకాల్ ప్రకారం వెనకపడడం వంటివి నేతల మధ్య అంతరాలకు కారణంగా చెబుతున్నారు. ఫలితంగా ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా నేతలను అనుసరిస్తున్న కార్యర్తలూ రెండు వర్గాలు విడిపోయారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, వారిని అనుయాయులకు, పాత వారి మధ్య సఖ్యత కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా జిల్లాల్లో నాయకులు ఎవరికి వారుగా రాజకీయం నడుపుతున్నాని విశ్లేషిస్తున్నారు. మంత్రులదే హవా.. మెజారిటీ జిల్లాల్లో మంత్రులదే ఇష్టారాజ్యంగా నడుస్తోంద న్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామమాత్రంగా మారారని, ప్రతీ పనికి మంత్రి ఆమోదం ఉంటే కానీ సంబంధిత అధికారులు పలకడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా అంతోఇంతో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలకూ మంత్రులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లాల్లో ఆధిపత్య పోరు తక్కువగా ఉన్నా.. ఒకే మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లో అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎంత కాదని చెబుతున్నా.. చెరువుల పూడిక తీత కోసం మొదలు పెట్టిన మిషన్ కాకతీయ పథకంలో అత్యధిక పనులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులకు, వారు చెప్పిన వారికే దక్కాయి. కానీ కొందరు మంత్రులు అడ్డం పడిన చోట మాత్రం ఇది సాధ్యం కాలేదు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ తన కార్యకర్తలకు ఒకటీ, అరా పనులు ఇప్పించుకున్నారు. ఇది అక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గిట్టలేదు. మిషన్ కాకతీయ పనులు ఎట్టి పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్సీ అనుచరులకు ఇవ్వొద్దని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. చివరకు ఈ పంచాయితీ సాగునీటి శాఖ మంత్రి పేషీకి చేరినా ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం. తలలు పట్టుకుంటున్న ద్వితీయ శ్రేణి నేతలు రాష్ట్రస్థాయిలోనే ఇద్దరు మంత్రులు రెండు వర్గాలుగా ఉంటున్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. ఈ ఇద్దరికీ అనుచరులు వేర్వేరుగా ఉన్నారు. ఈ ప్రభావం కింది స్థాయి దాకా ఉందని, నాయకుల మధ్య సయోధ్య లేక పోవడం తమకు ఇబ్బందిగా మారిందని, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒక మంత్రి తన సహచరులకు, చివరకు తన సొంత నియోజకవర్గం వారికీ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ఇబ్బందులను పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోలేక, కార్యకర్తలకు సర్ది చెప్పుకోలేక సతమతమవుతున్నామని నాయకులు వాపోతున్నారు. చివరకు జిల్లాల్లో పార్టీకి కొత్త కార్యవర్గాలనూ నియమించలేని పరిస్థితి ఉంది. ‘రాష్ట్ర స్థాయిలోనే కమిటీలను వేయలేదు. జిల్లాలో అవసరమా’ అని పార్టీ మొత్తాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, జిల్లా అధ్యక్షులు కూడా నామమాత్రంగా మారారని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. -
కలాం సేవలు చిరస్మరణీయం
మాజీ రాష్ట్రపతికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం ఘనంగా నివాళులర్పించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని కమిటీ హాలు (నెంబర్-3)లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు కలాం సేవలను స్మరించుకుని శ్రద్ధాం జలి ఘటించారు. వైఎస్సార్సీఎల్పీ ఉప నేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, ఆర్.రోజా తొలుత కలాం చిత్రపటం వద్ద పూలుజల్లి నివాళి అర్పించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కలాంకు నివాళి ఘటించారు. అబ్దుల్ కలాం అమర్ రహే... అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కొరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, సుజయ్కృష్ణ రంగారావు, మేకా ప్రతాప అప్పారావు, పాలపర్తి డేవిడ్రాజు, పోతుల రామారావు, కళత్తూరు నారాయణస్వామి, ఎన్.అమర్నాథ్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, వై.సాయిప్రసాద్రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, పాలుబోయిన అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ పి.సునీల్, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, పాశం సునీల్కుమార్, కిలివేటి సంజీవయ్య, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్తుముల అశోక్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, షేక్ చాంద్బాషా, షేక్ బేపారి అంజాద్ బాషా, ఎస్వీ మోహన్రెడ్డి, టి.జయరాములు, మణి గాంధీ, వరుపుల సుబ్బారావు, గిడ్డి ఈశ్వరి, గుమ్మనూరు జయరామయ్య, ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి, సి.నారాయణరెడ్డి ఉన్నారు. -
ఎమ్మెల్సీలుగా సోమిరెడ్డి, బీద
ఆమోదం తెలిపిన గవర్నర్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీలుగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పేర్లను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో పాటు ఎన్నికల సంఘం సైతం పచ్చజెండా ఊపడంతో జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ నాయకులు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఇద్దర్ని ఎమ్మెల్సీలుగా ప్రకటించడం విశేషం. శాసనమండలి చైర్మన్ సమక్షంలో రెండు, మూడు రోజుల్లో సోమిరెడ్డి, బీద మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం ఇదే మొదటి సారి. జిల్లా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం టీడీపీ శ్రేణులు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా పార్టీ అధినేత ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో మొదటిసారిగా ఆయన శాసనమండలికి వెళ్లనున్నారు. 20 ఏళ్లుగా టీడీపీలో విస్తృత సేవలందించిన బీద రవిచంద్ర మొట్టమొదటిసారిగా పెద్దల సభకు ఎంపికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించినా, ఆయనకు అవకాశం దక్కలేదు. బీద సేవలను గుర్తించి మొదటిసారిగా చట్టసభలకు ఎంపిక చేయడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ శాసనమండలికి...తప్పని ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలు ఎన్నిక ద్వారా భర్తీ కానున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను బరిలో ఏడుగురు అభ్యర్ధులు ఉండడంతో ఎన్నిక అనివార్యమని తేలిపోయింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణల గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు ఎవరూ విత్డ్రా చేసుకోలేదు. గడువు ముగిశాక మండలి ఎన్నికల అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదరాం అభ్యర్ధుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒక వేళ ఆరుగురు అభ్యర్ధులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ, టీఆర్ఎస్ అయిదో స్థానంపై కన్నేసి అభ్యర్ధిని పోటీకి దింపడంతో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లయ్యింది. అయిదో స్థానం కోసం... టీఆర్ ఎస్ వ్యూహం ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్ధికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకు తోడు, ఆంగ్లో ఇండియన్ (నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే 76 అవుతున్నాయి. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ కలిపితే టీఆర్ఎస్ చేతిలో ఉన్న ఓట్ల సంఖ్య 83 అవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లున్నాయి. అయిదో ఎమ్మెల్సీ పదవినీ దక్కించుకోవాలంటే టీఆర్ఎస్కు మరో ఏడు ఓట్లు అవసరం అవుతున్నాయి. దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. బీజేపీ మద్దతు ఇస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్ధి గెలవాలంటే మరో రెండు ఓట్లు అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్ధికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రభోదం మేరకు ఓట్లేయాలని ఇప్పటికే ప్రకటనలు మొదలు పెట్టింది. బేర సారాలు షురూ ! ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్ఎస్కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి ఆశ చూపెడుతున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్లు టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్ఎస్కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. అయిదో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా గులాబీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే, తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్కు హాజరు కాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్కు హారు కావొద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా.. అయిదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల అధికార టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. -
ఐదుగురు ఏపీ ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సోమవారం మండలి కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన నలుగురు, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఒకరు ఉన్నారు. ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికైనవారు కాగా ఇద్దరు టీడీపీ నేతలు, ఒకరు టీడీపీ మద్దతుతో ఎన్నికైనవారు ఉన్నారు. శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరితో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించా రు. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన పిల్లి సుభాష్చంద్రబోస్ (తూర్పుగోదావరి), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం) దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రాంగణమంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్సీల అనుచరులతో కోలాహలంగా మారింది. ‘జై...జగన్..!, వైఎస్సార్ జిందాబాద్..’ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్సీ వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తనకు ఇది రాజకీయ పునర్జన్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు సుజయ్కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ముఖ్యనేతలు పెన్మత్స సాంబశివరాజు, బేబినాయన, శత్రుచర్ల పరీక్షిత్రాజు, సుంకరి రమణమూర్తి, మైనారిటీ నేత మహ్మద్ నాసిర్, తూర్పు గోదావరి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వి.వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. స్వామికి రాజమౌళి గుప్త సన్మానం ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త.. ఎమ్మెల్సీ వీరభద్రస్వామికి శాలువా కప్పి అభినందించారు. పలువురు స్వామి అభిమానులు కూడా ఆయన్ని సత్కరించారు. బోస్ ప్రమాణం చేయగానే ఆయన అనుచరులు ఆయన్ని అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల నినాదాలతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఇది గమనించిన పోలీసులు రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు. టీడీపీ సభ్యుల ప్రమాణం ఎమ్మెల్సీలుగా ఎన్నికైన టీడీపీ నేతలు వి.వి.వి.చౌదరి, గుమ్మడి సంధ్యారాణి, ఆ పార్టీ మద్దతుతో ఎన్నికైన ఎ.ఎస్.రామకృష్ణలతో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. చౌదరి, సంధ్యారాణి ఎమ్మెల్యేల కోటాలో, రామకృష్ణ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరఫున ఎన్నికైన గుండుమల్ల తిప్పేస్వామి తన సమీప బంధువు మరణంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. 16న ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 16న సమావేశం కానుంది. సోమవారం కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, సభ్యుడు కె.రామకృష్ణ హాజరయ్యారు. సమాచారలోపం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కాలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ఆర్.కె.రోజా స్పీకర్పై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం, ఒక అధికారిపై సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ అంశాలపై ఈనెల 16న జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. -
ముగిసిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వీరభద్రస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి సోమవారం ఉదయం సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరూ సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి సమక్షంలో సభ్యులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ శాసనమండలి సభ్యునిగా ఎ.రామచంద్రరావు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సమక్షంలో ప్రమాణం చేశారు. -
మొండి చెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎమ్మెల్సీ పదవులపై జిల్లాలో ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే కోటా లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఉన్నప్పటికీ జిల్లాలో సీనియర్ నాయకులకు మాత్రం చోటు దక్కలేదు. జిల్లా నుంచి మాజీ మంత్రు లు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఎమ్మె ల్సీ పదవుల కోసం చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించారు. శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలు కావడంతో కనీసం ఎమ్మెల్సీ సీటునైనా దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో చివరి వరకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ సైతం రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్సీ పదవి వేటలో గల్లా అరుణకుమారి, గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మధ్య అధిపత్యపోరు సాగింది. ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసి భారీగా లాబీయింగ్ సైతం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వారు గ్రూప్లుగా విడిపోయి ఎవరికి వారు బాబు వద్ద మెప్పు కోసం ప్రయత్నించారు. తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఇప్పటి వరకు ఆశల పల్లకిలో ఊరేగారు. ఇలాంటి తరుణంలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వీవీ చౌదరి, సంధ్యారాణి, తిప్పేస్వామిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించడంతో జిల్లా నాయకుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రు లు గాలి, గల్లా వర్గీయులు సైతం చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై పార్టీ శ్రేణులు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామంటూనే ఇలా తమ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వర్గాలతో సతమతమౌతున్న దేశం పార్టీలో మరిన్ని గ్రూపులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమం త్రి సొంత జిల్లానే పార్టీ గ్రూపులుగా విడిపోతే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని అధిష్టానం సైతం ఆందోళన చెం దుతోంది. ముఖ్యంగా ఎమ్మె ల్సీ పదవుల విషయంలో ముఖ్యమంత్రి ఒకరికి అవకాశం కల్పిస్తే ఇంకొక వర్గం నుంచి ఆగ్రహం చవిచూడక తప్పదనే భావనతో ఇద్దరినీ పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్:ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ సోమవారం ఖరారు చేసింది. శాసనసభ కోటా నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ జాబితాలో వివి చౌదరి(తూర్పుగోదావరి), తిప్పేస్వామి( అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి(విజయనగరం) పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. అయితే దీనిపై కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. కాగా, బాలయ్య సూచించిన పేర్లకు బాబు నో చెప్పారు. అబ్దుల్ ఘని, అంబికా కృష్ణల పేర్లను బాలయ్య సూచించినా వారి పేర్లను బాబు పరిగణలోకి తీసుకోలేదు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిల్లి, కోలగట్ల
హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్ర స్వామి పేర్లను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. -
అట్టహాసంగా
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం ⇒ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ⇒ కార్యకర్తల సమక్షంలో నేతల సభ్యత్వ స్వీకరణ ⇒ సెగ్మెంట్కు 30 వేలు తగ్గకుండా నమోదు లక్ష్యం ⇒ వేదికపై విప్ గోవర్ధన్, కార్యకర్త రాజు జన్మదినం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు.. కేసీఆర్కు ప్రశంసలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిజామాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని కొంపల్లిలో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై దిశానిర్ధేశనం చేసి న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలోని భారతి గార్డెన్స్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. మొదటగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మంత్రి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రి ఎంపీ కవితకు సభ్యత్వం అందించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అడ్హక్ కమిటీ సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇదే రోజు విప్ గంప గోవర్ధ న్ పుట్టినరోజు కూడా కావడంతో వేదికపై కే క్ కట్ చేశారు. ఇంకా ఎవరిదైనా పుట్టినరో జు ఉంటే వేదికపైకి రావాలని ఎంపీ కవిత కోరడంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన రాజు అనే కార్యకర్త వేదిక పైకి వచ్చారు. దీంతో విప్తోపాటు రాజు కు జన్మదిన వేడుకలు జరిపి అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రసంగించిన పలువురు నేతలు ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పించారు. అదే సమయం లో సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురి పించారు. సెగ్మెంట్కు 30 వేలు తగ్గకుండా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్రెడ్డి, షకీల్ అహ్మద్ ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 30 వేలకు తగ్గకుండా చేయాలని సభ్యులను చేర్పించాలని కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. 5 వేల క్రియా శీల, 25 వేల సాధారణ సభ్యులు తప్పనిసరిగా చేరే లా చూడాలని కోరారు. టీఆర్ఎస్ పటిష్టం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందూరులో ఇప్పటికే ఘన విజయం అందుకున్న పార్టీకి, సభ్యత్వ నమోదులోనూ రాష్ట్రంలో రికార్డు దక్కేలా చేయాలన్నారు. ఈ నెల 20 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయలని, మార్చి ఒక టి నుంచి గ్రామ కమిటీలు వేసుకోవాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 12 మందితో అడహక్ కమిటీని వేసి,సభ్యుల పేర్లను మంత్రి వెల్లడించారు.మండలాలోనూ తాత్కాలిక కమిటీలను వేసుకుని గ్రామస్థాయిలో కమిటీలు వే యాలన్నారు. త్వరలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సమావేశంలో మాట్లాడిన పలువురు నేతలు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాబోయే కా లంలో జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు నాయకులు, కార్యకర్తలు మిగలరన్నా రు. ఇతర పార్టీల కండువాలు ఉండవని, టీఆర్ఎస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులకు స్థానం లేదని, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఉంటే, టీఆర్ఎస్లో చేరాలన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి పుట్టగతులు ఉండవని వారు దుయ్యబట్టారు. కేసీఆర్ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశారని, ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. విదేశాలలోనూ కేసీఆర్కు పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. అలాంటి నేత నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, గులాబీ కండు వా కింద పనిచేసే ప్రతి ఒక్కరికి కేసీఆర్ న్యా యం చేస్తారన్నారు. చురుకుగా పని చేసి సభ్య త్వ నమోదును పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశె ట్టి, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, మేయర్ అకుల సుజాత, నాయకులు ఈగ గంగారెడ్డి, ముజీబుద్దీన్ తది తరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు భద్రత పెంచి మాకు కుదిస్తారా?
హైదరాబాద్: ఎమ్మెల్సీలకు భద్రత కుదించడంపై తెలంగాణ శాసనమండలిలో శుక్రవారం గందరగోళం చెలరేగింది. ఒకే జిల్లాలో ఎమ్మెల్యేలకు భద్రతకు పెంచి ఎమ్మెల్సీలకు కుదిస్తారా అంటూ సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీల ఆందోళనతో సభలో గందరగోళం తలెత్తింది. ఎమ్మెల్సీల సెక్యురిటీపై సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీయివ్వడంతో సభ్యులు శాంతించారు. తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది. -
'ఆంధ్రజ్యోతి పేపర్ మమ్మల్ని కించపరిచింది'
హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్ ఆరోపించారు. అమరులకు అన్యాయం చేస్తూ తమ జీతాలు పెంచారంటా తప్పుడు వార్త ప్రచురించిందని వారు శనివారమిక్కడ అన్నారు. ఎమ్మెల్సీలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కాగా తనకు నోటీసు అందిన తర్వాత పరిశీస్తానని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. -
9 మంది ఎమ్మెల్సీలకు నోటీసులు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి. ఆ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ఎమ్మెల్సీలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు. టీఆర్ఎస్ లో చేరిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మదన్ లాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కనకయ్యలు నోటీసులు అందిన వారిలో ఉన్నారు.