కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష | Mother started silence protest for Son at Chittoor | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష

Published Sun, Jun 15 2014 9:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది.

చిత్తూరు: తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది. మౌన దీక్ష చేపట్టిన ఉమామహేశ్వరి అనే గృహిణికి ఆమె భర్తకు మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కుమారుడిని తండ్రి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే తన నాలుగేళ్ల కొడుకును తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉమామహేశ్వరి దీక్ష చేపట్టింది. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఉమామహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement