హన్మకొండ చౌరస్తా, న్యూస్లైన్ : ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం, ప్రజల ఆకాంక్షను గుర్తించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలే రని ఆయన స్పష్టం చేశారు. డీసీసీ భవన్లో ఆది వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాహుల్ను ప్రధానిని చేయాలని సోనియాగాంధీ ఎప్పుడు ఆలోచించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రకు ఎలాంటి నష్టం వాటిల్లదని వివరించారు. పీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కానుగంటి శేఖర్, శ్రీనివాసచారి, సమ్మిరెడ్డి, తుల రమేష్, కామిడి సతీష్, సీత శ్యాం, జాఫర్ పాల్గొన్నారు.