నకిలీ పాస్ పుస్తకాల తయారీలో ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
అనంతపురం (తాడిపత్రి) : నకిలీ పాస్ పుస్తకాల తయారీలో ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో ఓ ముఠా భారీగా నకిలీ పాస్పుస్తకాలు తయారు చేసి పలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది. ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు.
అయితే తాడిపత్రికి చెందిన రంగనాయకులు రబ్బరు స్టాంపుల తయారీ షాపు నిర్వహిస్తున్నాడు. రంగనాయకులు కూడా ఈ కేసులో కీలకమైన నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని గురువారం అరెస్టు చేశారు.