హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థులు సోమవారం రాజ్భవన్ ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వీరిని అడ్డకునేందుకు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ కు తరలించారు. అంతక ముందు హైదరాబాద్లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ తెలంగాణ విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఈ సందర్బంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
రాజ్ భవన్ ముట్టడిని విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిగా మార్చారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లాలనుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేయగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.