-
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్కు మహాయుతి కూటమి బారామతి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!
ముంబై: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆరు సీట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి. కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ కనీసం తొమ్మిది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్సీపీ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈసారి లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. -
ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్ పవార్ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్పై అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్ పవార్ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్ వర్గానికి సూచించింది. అజిత్ పవర్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్ పవార్ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్ వర్గం పేర్కొన్నారు. అజిత్ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు. శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్ వర్గం ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్ పవార్కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు. -
ఇప్పటివరకూ సలహాలే.. ఇకపై.. లోక్సభ బరిలో డిప్యూటీ సీఎం సతీమణి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్ను బారామతి లోక్సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. "మీరు ( బారామతి లోక్సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు. ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
శరద్ పవార్కు మరో షాక్.. ‘అజిత్దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
శరద్ పవార్కు బిగ్ షాక్
ఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం. -
‘రామ మందిరం: రాజీవ్గాంధీ హయాంలోనే వేడుక జరిగింది’
అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు. రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు. చదవండి: అటల్ సేతుపై ఆటో రిక్షా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు! -
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్గావ్లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్గావ్లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్లోని ఒక హోటల్కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
ఎన్సీపీ ఎంపీ ఫైజల్పై అనర్హత వేటు
తిరువనంతపురం: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్పై మరోసారి అనర్హత వేటు వేస్తూ కింద కోర్టు విధించిన తీర్పు ప్రకారం శిక్షను ఖరారు చేసింది కేరళ హైకోర్టు. కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ అల్లుడు మహ్మద్ సలేహ్ హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని మహ్మద్ ఫైజల్ హైకోర్టును కోరగా హైకోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. జనవరి 11న ఎంపీ ఫైజల్ ఈ కేసులో దోషిగా తేలిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్పై ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శిక్ష అమలుపై స్టే విధించాలన్నది ఫైజల్ డిమాండ్. ఇప్పటికే ఈ కేసులో కవరతి సెషన్స్ కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధికి ఏదైనా నేరంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే ఆయన చట్టసభల సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఇది కూడా చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే -
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశాలకు అజిత్ పవార్ గైర్హాజరవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సాధించాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ హాజరు కాకపోగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుకు ట్రబుల్ మొదలైందని చెబుతున్నాయి. ఎన్సీపీ రెబెల్ మంత్రులకి జిల్లా సహాయక మంత్రులుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అజిత్ పవార్ మరోసారి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన చంద్రకాంత్ పాటిల్కు పూణే జిల్లా సహాయక మంత్రిగాను దిలీప్ వాల్సే పాటిల్కు బుల్దానా జిల్లా, హాసన్ ముష్రిఫ్కు కొల్హాపూర్ జిల్లా, ధనుంజయ్ ముండేను బీడ్ జిల్లాకు సహాయక మంత్రులుగా ప్రకటించింది షిండే ప్రభుత్వం. తనవారికి మంత్రి పదవులు దక్కనందునే అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నరని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు విజయ్ వాడెట్టివార్. ఇదిలా ఉండగా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాత్రం అజిత్ పవార్ వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ట్రబుల్ మొదలయిందన్నారు.నిరాశలో ఉన్న వర్గం ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తమ అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం అందింది. హనీమూన్కు వెళ్లి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ప్రభుత్వంలో ముసలం మొదలైందని వార్త్లు వస్తున్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్సీపీ తిరుగువర్గంలో మరో ఎమ్మెల్యే ఛగన్ భుజ్బల్ మాత్రం అజిత్ పవార్ గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని కేబినెట్ సమావేశాలకు ఎలా హాజరవుతారని, ఢిల్లీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నిస్తూనే రాజకీయంగా మాకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. ఇది కూడా చదవండి: కుల్గామ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
ఎన్సీపీ పార్టీ గుర్తు ఆయనకే సొంతం
ముంబై: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తు ఎవరికీ ధారాదత్తం చేసేది లేదని పార్టీ గుర్తు మా వద్దే ఉంటుందని తేల్చి చెప్పారు. నాగ్పూర్లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు ఎన్సీపీ అంటే శరద్ పవార్.. శరద్ పవార్ అంటే ఎన్సీపీ అని. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ అంటే జయంత్ పాటిల్ అని కూడా అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారని ఈ పార్టీ గుర్తు ఎప్పటికీ ఆయనతోనే ఉంటుందని ఎవరికీ ఇచ్చేది లేదన్నారు. ఈ ఏడాది జులై ప్రారంభంలో ఎన్సీపీలో చీలిక తీసుకొస్తూ అజిత్ పవార్ అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ ఆయన అంతకుముందే జూన్ 30న ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఆ గుర్తు తమ వర్గానికే కేటాయించాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్ సమర్పించిన పిటిషన్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీల అఫిడవిట్లు కూడా ఎన్నికల కమిషన్కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయాన్ని అంగీకరిస్తూ అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు -
ఆదానీతో కలిసి శరద్ పవార్.. ఇదేం ట్విస్టు..?
అహ్మదాబాద్: గుజరాత్లో ఆదానీకి చెందిన ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విపక్షాల ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత ఆదానీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇందులో అభ్యంతరం ఏముంటుంది? అదానీ శరద్ పవర్ మంచి స్నేహితులని అన్నారు. జయంత్ పాటిల్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఇండియా కూటమి అన్ని సమావేశాలకు శరద్ పవర్ హాజరయ్యారు. నిస్సందేహంగా కూటమిలో ఎన్సీపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇక అదానీ శరద్ పవర్ ఇద్దరూ సన్నిహితులు. వారి మధ్య బంధం ఇప్పటిది కాదని అహ్మదబాద్లో ఆయన నిర్మించిన నూతన ఫ్యాక్టరీకి గౌరవ అతిధిగా ఆహ్వానించారు.పవార్ దానికి హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్సీపీ నేత శరద్ పవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఫోటోలతో పాటు శరద్ పవర్ రాస్తూ.. గుజరాత్ చంచార్వాడీ వాస్నాలో అదానీ గ్రూప్ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ఎక్సిమ్ పవర్ ప్లాంటును ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఈ ఫోటోలు బయటకు రాగానే రాహుల్ గాంధీ శరద్ పవార్ మధ్య వైరం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. It was a privilege to inaugurate India’s first Lactoferrin Plant Exympower in Vasna , Chacharwadi , Gujarat along with Mr. Gautam Adani pic.twitter.com/G5WH9FaO5f — Sharad Pawar (@PawarSpeaks) September 23, 2023 ఇది కూడా చదవండి: సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ -
మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్
ముంబై: కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ మా పార్టీకి చెందిన వారేనన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామన్నారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశామని సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారు? ఆయన ఇప్పటికీ మా పార్టీకి చెందినవారేనని అన్నారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. నేను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదు కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. శరద్ పవార్ కంటే ముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అని ఆయన ఇంకా మా పార్టీతోనే ఉన్నారని అన్నారు. ఇది కూడా చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు -
లక్షద్వీప్ ఎంపీకి ఎదురుదెబ్బ
ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ లోక్సభ ఎంపీ మొహమ్మద్ ఫైజల్కుMohammed Faizal ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కనపెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ.. ఆరువారాల గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో.. ఆ గడువులోగా(ఆరువారాల) లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్సభ ఎంపీని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్సభ ఎంపీగా నెగ్గారు. అనర్హత వేటు.. ఎత్తివేత అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం.. జనవరి 13వ తేదీన లోక్సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్సభ సెక్రటేరియట్కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్ విడుదల చేసింది. 35లో నలుగురు మాత్రమే.. ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘‘ఫైజల్కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. -
బీజేపీతో నడవాలని కోరుతున్నారు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న ఎన్సీపీలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ చేరాలని కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎన్సీపీ చేతులు కలిపే ప్రసక్తేలేదని పవార్ కుండబద్దలు కొట్టారు. అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా, శరద్ పవార్ సోలాపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్తో భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘అజిత్ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది?. ఒక ఇంట్లోని సీనియర్ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని అన్నారు. ఇదే సమయంలో ఎన్సీపీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపారు. కానీ, మా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బీజేపీతో కలవాలని కొందరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. మా పార్టీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదు. బీజేపీతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదు. ఈ విషయంపై ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఇది అందరికీ స్పష్టం చేస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఈ నెలాఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబైలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్..
ముంబై: గురువారం ముంబైలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన సీటులో కూర్చోవడంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ మనసులోని మాటను ఈ విధంగానైనా బయట పెట్టారంటున్నారు నెటిజనులు. మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు చేసిన నాటినుండి మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి సీను క్లైమాక్సును తలపిస్తూ సాగుతున్న అక్కడి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారు రాజకీయ ఔత్సాహికులు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్టీలో అధమస్థాయి ప్రాధాన్యతను తట్టుకోలేక తిరుగుబాటు పర్వానికి శ్రీకారం చుట్టి బీజేపీ- శివసేన సర్కారుకు జైకొట్టి అజిత్ పవార్ ఎలాగోలా డిప్యూటీ సీఎం కుర్చీ వరకు చేరుకోగలిగారు. తర్వాతి మెట్టు కోసం అజిత్ పవార్లో కోరిక లేకపోయినప్పటికీ ఆయన చేతల్లో మాత్రం ఆ కుతూహలం బయటపడుతుంటే రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ పవార్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఆయన మనసులో ఏముందో గానీ ఆయన ఏమి చేసినా కూడా అది అధికారం కోసమే అన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉండడడం విశేషం. తాజాగా ఎమ్మెల్యే నివాసాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన నేరుగా వెళ్లి సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అజిత్ రాకను గమనించి స్పీకర్ నర్వేకర్ కుర్చీకి అంటించి ఉన్న సీఎం పేరున్న స్టిక్కరును తొలగించారు. మొదట అజిత్ వేరే కుర్చీలో కూర్చున్నప్పటికీ సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోమని పక్కనున్నవారు అజిత్ ను ఆహ్వానించారు. ఇదే వేదికపై ఉన్న మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఈ సన్నివేశం జరగడం విశేషం. ఈ వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో మహాజోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎన్సీపీ వర్గాలు అజిత్ పవార్ నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం.. -
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement