'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు' | People demanding resignations, kiran kumar reddy says no for it: Kavuri Sambasiva rao | Sakshi
Sakshi News home page

'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు'

Published Thu, Sep 26 2013 12:01 PM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM

'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు' - Sakshi

'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు'

న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి అంటున్నారని.... అయితే రాజీనామాలు చేయాలని ప్రజలంటున్నారని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అవసరం అయినప్పుడు రాజీనామాలు చేస్తామన్నారు.

పార్టీలు సిద్ధాంతాలు వదిలేయటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కావూరి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాల ఆమోదంపై స్పీకర్పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. భేటీకి కేవీపీ రామచంద్రారవు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement