
‘అయ్యా.. నా బిడ్డ దివ్యాంగుడు. దివంగతనేత వైఎస్ హయాంలో ప్రతి నెలా వికలాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్ రావడం లేదు’ అంటూ దూద్ కృష్ణవేణి జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహానాడు రోడ్డులో జగన్కు వినతిపత్రం అందజేశారు. జన్మభూమి కమిటీల సిఫారసు లేదని, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలంటూ నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పింఛన్లు సకాలంలో అందేలా చూస్తానని జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment