
ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నివాసమైన యజుర్వేద మందిరాన్ని ఇకపై ప్రజలు సందర్శించ వచ్చని సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ రాజు వెల్లడించారు. 2015 ఏప్రిల్ 23 నుంచి ఈ మందిరాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతి ఇస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
మంగళవారం పుట్టపర్తిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 118 గ్రామాలకు తాగునీటి పథకం పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని రత్నాకర్ రాజు వెల్లడించారు.