గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు | Pregnants Facing Problems Due To Floods In East Godavari | Sakshi
Sakshi News home page

గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు

Published Sun, Aug 4 2019 5:37 PM | Last Updated on Sun, Aug 4 2019 5:53 PM

Pregnants Facing Problems Due To Floods In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో వరదల కారణంగా గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్నారు. వీఆర్‌ పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోకి అధికంగా వరద నీరు చేరింది. అంతేకాకుండా కల్లేరు గ్రామాన్ని పూర్తిగా వరదనీరు చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఓ గర్భిణి చింతూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరినా  ఇంకా ప్రసవ సమయంల రాలేదని అక్కడి వైద్యులు ఆమెను ఇంటికి పంపించేశారు. నొప్పులు అధికం కావటంతో స్థానిక అంగన్వాడి కార్యకర్త సహాయంతో ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం లాంచీపై కల్లేరు గ్రామానికి వెళ్లిన వైద్యులు తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. కాగా ఒకవైపు వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement