విజయవాడ : దస్తావేజు లేఖరుల ఆందోళనతో జిల్లాలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. దస్తావేజు లేఖరులు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో లావాదేవీలు నిలిచిపోయాయి.
విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు తదితర ప్రాంతాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టవద్దని, ఆన్లైన్ వల్ల తాము జీవనోపాధి కోల్పోతామని దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తంచేశారు.
తమ నిరసన కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుందని దస్తావేజు లేఖరుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, విజయవాడ నగర నాయకుడు నేరెళ్ల నారాయణరావు తెలిపారు. తొలిరోజు తమ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని చెప్పారు.
Breadcrumb
రిజిస్ట్రేషన్లు బంద్
Published Sat, Oct 18 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Related news by tags
-
ఆ విషయం నేను చెప్పను.. చివాట్లు పడతాయి: పుష్ప-2పై అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ.. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్ట్-1లో తనదైన నటనతో మెప్పించిన అనసూయ సీక్వెల్లోనూ మెప్పించనున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలా ఉండగా.. అనసూయ భరద్వాజ్ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. జగపతిబాబు, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్న సింబా చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనసూయ మీడియా ప్రతినిధుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే పుష్ప-2 షూటింగ్ గురించి ప్రశ్న ఎదురవ్వగా.. తెలివిగా తప్పించుకున్నారు.పుష్ప-2లో మీ పార్ట్ షూటింగ్ అయిపోయిందా? అని అనసూయను ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. 'ఈ విషయాన్ని మీకు చెప్పొచ్చని ఎవరైనా చెప్పారా? అని అడిగింది. ఈ విషయం బయటికి చెప్పాలంటే నాకు భయం.. నేను చెప్పను.. నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. కాగా.. సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. నాకు చీవాట్లు పడతాయి మా సార్ నుంచి..Actress @anusuyakhasba's hilarious reply to media, when asked about her character in #Pushpa2TheRule!! 😂#AlluArjun #Sukumar #AnasuyaBharadwaj #TeluguFilmNagar pic.twitter.com/B3EUC2XKW5— Telugu FilmNagar (@telugufilmnagar) July 24, 2024 -
మేకప్కే నాలుగు గంటలు.. శరీరంపై దద్దుర్లు వచ్చాయి: ‘తంగలాన్’ హీరోయిన్
విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు ప్రెస్ మీట్ నిర్వహించారు. (చదవండి: విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ)ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ.. ‘తంగలాన్’ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజూ సెట్స్లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని అన్నారు. పార్వతి తిరువోతు మాట్లాడుతూ.. ‘పా.రంజిత్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’ అని తెలిపారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఏ రంగంలో అడుగుపెట్టేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. టీ షాపు పెట్టేదాన్ని అని సమాధానం ఇచ్చింది పార్వతి. ‘వృత్తి ఏదైనా సరే మరాద్య, గౌరవంతో పని చేయాలనుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ చక్కగా పెట్టగలను. అందుకే ఒకవేళ నటిని కాకపోయి ఉంటే..కచ్చితంగా ఓ టీ షాపు పెట్టేదాన్ని’అని పార్వతి చెప్పుకొచ్చింది. తనకు విజువల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి వెళ్లేదాన్ని అని పార్వతి బదులిచ్చింది. -
ఓటీటీలో మరో క్రేజీ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో ఎలాంటి సినిమాలొచ్చినా చూస్తారు కానీ ఓటీటీల్లో మాత్రం చాలావరకు థ్రిల్లర్స్ని చూసేందుకు జనాలు ఇష్టపడతారు. అందుకు తగ్గట్లే అన్ని భాషల్లోని దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ తీస్తుంటారు. అలా టైమ్ ట్రావెల్ అనేది మంచి కాన్సెప్ట్. హాలీవుడ్లో ఈ తరహావి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు హిందీలోనూ ఇలాంటి ఓ క్రేజీ వెబ్ సిరీస్ని రెడీ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)గ్యారా గ్యారా (11:11) పేరుతో తీసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. 1990లోని ఓ పోలీస్, 2001లోని అంటే భవిష్యత్ కాలంలోని పోలీస్తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. ఇది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇలానే వీళ్లు మర్డర్ మిస్టరీలని పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన వాటిలో 'డార్క్' అనే వెబ్ సిరీస్ నం.1 అని చెప్పొచ్చు. 'గ్యారా గ్యారా' ట్రైలర్ చూస్తుంటే.. 'డార్క్' సిరీస్ని స్ఫూర్తిగా తీసుకుని ఇది తీశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నట్లు 'గ్యారా గ్యారా' కూడా 1990, 2001, 2016 టైమ్ లైన్స్లో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది. తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించినట్లు మా అసోసియేషన్ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, డాక్టర్ ట్రోల్స్, ట్రోలింగ్ పోరడు, అప్డేట్ ట్రోల్స్, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్ ఛానల్స్ను బ్లాక్ చేయించారు.ఈ సందర్భంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్ నుంచి అలాంటి కంటెంట్ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. On behalf of #MAA, we urge all YouTubers and social media trollers to take a note. We are preparing to report defamatory troll videos to Cyber Crime office. Kindly remove such content from your channels and profiles to avoid complications.#RespectOurArtists— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.We have blocked an additional 18 channels that spread harmful content.Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024 -
ఆ యాంగిల్లో తీయొద్దని చెప్పా: జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీకపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మాహీతో అలరించిన ముద్దుగుమ్మ మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్తగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తాను చెప్పిన విషయాన్ని గుర్తు ఉంచుకుని పాటిస్తున్నారని జాన్వీ వివరించింది.గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ క్యాప్షన్లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది.కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
Related News by category
-
‘నీట్’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం
కోల్కతా: నీట్ పరీక్షను రద్దు చేయబోమని, పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు పరిణామల అనంతరం నీట్ పరీక్ష కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.తాజాగా, తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్ చేరింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము అఖిల భారత పరీక్షలకు (నీట్) ఎప్పుడూ అనుకూలంగా లేమని, అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఒప్పించారని అన్నారు.#Breaking | West Bengal govt passes anti-NEET Resolution after the 'No Re-Test' Verdict of SC The anti-NEET resolution was passed after two days of discussion...: @pooja_news shares more details with @Swatij14 #NEETExam pic.twitter.com/R7vT0ATkv9— TIMES NOW (@TimesNow) July 24, 2024 నీట్లాంటి పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం తీసుకునే సమయంలో మేం వ్యతిరేకించాం. నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించకూడదని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన అన్నారు. అయినప్పటికీ నీట్ లాంటి పరీక్షలను కేంద్రమే నిర్వహిస్తోందికానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థలోని లోపాలు విద్యా వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టే మేం పాత నీట్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్!.. క్వాలిటీ టెస్ట్లో షాకింగ్ విషయాలు
దగ్గుకు వాడుతున్న సిరప్లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.పరీక్షించిన చాలా సిరప్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.గాంబియాలో చిన్నారుల మరణాలుఅక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద, నిఫ్టీ 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, టెక్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా మోటార్స్ మొదలైన కంపెనీలు చేరాయి. బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మొదలైనవి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలు తగ్గింపు
రూపే డెబిట్ కార్డ్లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.గత ఏడాది బడ్జెట్లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?బడ్జెట్లో కేంద్రం విడుదల చేసే డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక నిధులు ఫిన్టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్పార్టీ పేమెంట్ యాప్లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement