జోరందుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మంతనాలు | Seemandhra Congress leaders meeting at Anam ram narayana reddy house | Sakshi
Sakshi News home page

జోరందుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మంతనాలు

Oct 1 2013 11:10 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆపార్టీ సీమాంధ్ర నేతల మంతనాలు పోటీ పోటీగా జోరందుకున్నాయి.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి.  ఆపార్టీ సీమాంధ్ర నేతల మంతనాలు  పోటీ పోటీగా  జోరందుకున్నాయి. ఓ వైపు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి, వట్టి వసంత్కుమార్, బాలరాజు, సి. రామచంద్రయ్య, రఘువీరారెడ్డి భేటీ కాగా..... మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మంత్రులు శైలజానాథ్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు.

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయటంతో పాటు... మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఏమాత్రం సడలకపోవటంతో ఆ ప్రాంత నేతలు భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం కూడా మంత్రి సి. రామచంద్రయ్య నివాసంలో పలువురు నేతలు, మంత్రులు భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement