
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు ఆయన అనుచరులు తమపై దాడులకు దిగి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుదవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళనకు దిగి.... తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలో జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య కాలనీకి చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.