ఆత్మకూరు (కర్నూలు) : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ గ్రామలో పెద్దపులి సంచరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆత్మకూరు మండలంలోని నాగులూటిగూడెం సమీపంలో గత మూడు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం అటవీప్రాంతంలో మేకల మందపై దాడి చేయగా గ్రామస్తులు దానిని తరిమేశారు.
అలాగే బుధవారం రాత్రి గూడెంలోని ఓ ఇంటి ఆవరణలో ప్రవేశించగా గమనించి గట్టిగా కేకలు వేయటంతో అది పారిపోయింది. దీనిపై గురువారం ఉదయం అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా రెస్క్యూటీం అక్కడికి చేరుకుంది. బోను ఏర్పాటుచేసి, పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గ్రామంలో పెద్దపులి సంచారం
Published Thu, Jul 16 2015 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement